మరో దయనీయ ఘటన.. | Sakshi
Sakshi News home page

మరో దయనీయ ఘటన..

Published Tue, Sep 20 2016 10:27 AM

ఒడిశాలో మరో దయనీయ ఘటన చోటుచేసుకుంది. జాజ్పూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ గిరిజన మహిళ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించగా, ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడంతో బంధువులు తోపుడు రిక్షాలో తీసుకెళ్లారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బంది ఏర్పాట్లు చేయలేదని, ప్రైవేట్ వాహానాలవారేమో 12 వేల రూపాయలు అడిగారని, తమ దగ్గర అంతడబ్బు లేదని, దీంతో తోపుడు రిక్షాలో తీసుకెళ్లాల్సివచ్చిందని బంధువులు చెప్పారు. కాగా ఈ ఘటనపై జాజ్పూర్ ఏడీఎంఓ షిబాషిస్ మహారాణా మాట్లాడుతూ.. మరణించిన మహిళ దగ్గర నలుగురు ఉన్నారని, మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ కావాలని ఒక్కరూ తమను అడగలేదని చెప్పారు.