ఒడిశాలో మరో దయనీయ ఘటన చోటుచేసుకుంది. జాజ్పూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ గిరిజన మహిళ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించగా, ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడంతో బంధువులు తోపుడు రిక్షాలో తీసుకెళ్లారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బంది ఏర్పాట్లు చేయలేదని, ప్రైవేట్ వాహానాలవారేమో 12 వేల రూపాయలు అడిగారని, తమ దగ్గర అంతడబ్బు లేదని, దీంతో తోపుడు రిక్షాలో తీసుకెళ్లాల్సివచ్చిందని బంధువులు చెప్పారు. కాగా ఈ ఘటనపై జాజ్పూర్ ఏడీఎంఓ షిబాషిస్ మహారాణా మాట్లాడుతూ.. మరణించిన మహిళ దగ్గర నలుగురు ఉన్నారని, మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ కావాలని ఒక్కరూ తమను అడగలేదని చెప్పారు.
మరో దయనీయ ఘటన..
Published Tue, Sep 20 2016 10:27 AM
Advertisement
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement