వీఆర్ఏలకు 15 వేల జీతం ఇప్పిస్తా | Sakshi
Sakshi News home page

వీఆర్ఏలకు 15 వేల జీతం ఇప్పిస్తా

Published Fri, Mar 24 2017 3:44 PM

మూడేళ్లుగా పోరాటం చేస్తున్న వీఆర్ఏలకు ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సంఘీభావం తెలిపారు. వచ్చే ఏడాది ఎటూ ఎన్నికల సంవత్సరమేనని, ఆ తర్వాత మనందరి ప్రభుత్వం ఏర్పడుతుందని.. ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే వీఆర్ఏలకు రూ. 15 వేల వేతనం కచ్చితంగా ఇప్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా వీఆర్ఏ నాయకులు, ఆందోళన చేస్తున్న వారు హర్షధ్వానాలతో నిరసన ప్రాంగణాన్ని హోరెత్తించారు.

Advertisement
Advertisement