లోధా సంస్కరణలతో గందరగోళమే | Sakshi
Sakshi News home page

లోధా సంస్కరణలతో గందరగోళమే

Published Wed, Dec 7 2016 7:38 AM

భారత క్రికెట్‌లో ప్రక్షాళనకు జస్టిస్ లోధా ప్యానెల్ సూచించిన ప్రతిపాదనలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ వ్యతిరేక వైఖరిని ఎంతమాత్రం వీడటం లేదు. తమకు వీలు చిక్కినప్పుడల్లా విమర్శల బాణాలు ఎక్కుపెడుతూనే ఉంది. తాజాగా ప్యానెల్ అమలు చేయాలంటున్న సంస్కరణలు భారత క్రికెట్‌కు ఎంతమాత్రం మేలు చేయవని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తేల్చి చెప్పారు. ఇది మొత్తం గందరగోళానికి దారితీస్తుందని సుప్రీం కోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల అనంతరం లోధా కమిటీ నుంచి తమకు ఎలాంటి సూచనలు అందడం లేదని ఆయన ఆరోపించారు. ‘కోర్టు సూచనలకు మేం కట్టుబడి ఉంటాం.

Advertisement
Advertisement