Sakshi News home page

చారిత్రక టెస్టులో భారత్ ఘన విజయం

Published Mon, Sep 26 2016 1:02 PM

భారత్ క్రికెట్ జట్టు చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్ ను కనీసం డ్రాతో ముగిద్దామని న్యూజిలాండ్ శతవిధాలా ప్రయత్నించింది. ప్రత్యేకంగా గ్రీన్ పార్క్ స్టేడియంలో గోడ కట్టిన ఆటను కొనసాగించాలనుకుంది. చివరి రోజు ఆటకు ఆరు వికెట్లు న్యూజిలాండ్ చేతిలో ఉండటంతో ఆ జట్టు కాస్త ధీమాగా ఉండటానికి కారణం. అయితే ఆఖరి రోజు ఆట తొలి సెషన్లో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ప్రత్యేకంగా ఈ సెషన్ లో రవీంద్ర జడేజా ఒక వికెట్ తీస్తే, పేసర్ మొహ్మద్ షమీ రెండు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు తీసి కివీస్ను చావు దెబ్బకొట్టాడు. దాంతో న్యూజిలాండ్ కు ఘోర పరాజయానికి స్వాగతం పలకగా, భారత్ 'చారిత్రక' విజయం సాధించింది.

Advertisement

What’s your opinion

Advertisement