ఆధార్ ఉంటేనే విమానయానం చేసేలా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ప్లాన్లను సిద్ధం చేస్తోంది. బెంగళూరు కెమ్పెగ్వాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధార్ ఆధారిత తొలి ఎయిర్పోర్టుగా ప్రాచుర్యంలోకి తీసుకు రాబోతుంది. ఆధార్ ఆధారిత ప్రవేశాన్ని, బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టమ్ ఈ ఎయిర్పోర్టుకు ఏర్పాటుచేస్తోంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ కొత్త ఆధార్ ప్రక్రియ కోసం 325 రోజుల డెడ్లైన్ను కూడా విధించింది. 2018 మార్చి నుంచి ఈ ప్రాజెక్టు అమల్లోకి రాబోతుంది. అంతర్జాతీయ విమానాల కోసం బోర్డింగ్కు వచ్చిన ప్రయాణికులు ఈ కొత్త ప్రక్రియను 2018 అక్టోబర్ నుంచి ఉపయోగించుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2018 డిసెంబర్ 31 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కాబోతుందని తెలుస్తోంది. భద్రతను మెరుగుపరుచుకునేందుకు, క్లియరెన్స్ను వేగవంతం చేయడానికి, ఎయిర్పోర్టులో ఆలస్యాలను తగ్గించడానికి ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడనుంది. అదనంగా ఎయిర్పోర్టు జర్నీలో పలు ప్రదేశాల్లో ఐడీలు, బోర్డింగ్ పాస్లు చూపించాల్సినవసరం లేకుండా ఈ ఆధార్ ప్రక్రియ వస్తోంది.
తొలి ఆధార్ ఆధారిత ఎయిర్పోర్టు ఇదే!
Published Tue, Oct 10 2017 6:59 AM
Advertisement
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement