ప్రభాస్ గెస్ట్‌హౌస్ స్ధలంపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక | Sakshi
Sakshi News home page

ప్రభాస్ గెస్ట్‌హౌస్ స్ధలంపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక

Published Mon, Dec 24 2018 12:56 PM

ప్రముఖ హీరో ప్రభాస్ భూమి వివాదం కేసులో  తెలంగాణ రెవెన్యూ శాఖ అధికారులు సోమవారం హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్‌ పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్‌ 5/3లో ప్రభాస్‌కు చెందిన 2,083 చదరపు అడగుల స్థలాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందో తమ కౌంటర్‌లో అధికారులు వివరించారు. కౌంటర్‌ను స్వీకరించిన హైకోర్టు ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. తన స్థలం విషయంలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాల్‌ చేస్తూ ప్రభాస్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement