ఒకవైపు విషాదం.. మరోవైపు జాతీయతాస్ఫూర్తి.. వరదలు ముంచెత్తిన అసోంలో ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యమిది. భారీ వరదలు అసోంను అతలాకుతలం చేసినా.. ఆ రాష్ట్రంలో స్వాత్రంత్య దినోత్సవ స్ఫూర్తి చెక్కుచెదరలేదు. చుట్టూ మూగిన నీళ్లలోనూ, పుట్టెడు కష్టాల్లోనూ వీలున్న చోట జాతీయజెండాలు ఎగురవేసి అసోం ప్రజలు తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. పెద్ద ఎత్తున వరదనీళ్లు మూగిన ఓ స్కూల్ ఎదుట చిన్నారులు పీకల్లోతు నీళ్లలో నిలబడి జెండాకు సెల్యూట్ చేస్తున్న ఫొటోను నెటిజన్లను కదిలిస్తున్నది. వరదల్లోనూ వెనుకంజ వేయకుండా వినూత్నరీతిలో జెండాపండుగ చేసుకున్న అసోం వాసులు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒకరు ఇంటిపైకప్పు మీద జెండా ఎగురవేస్తే.. మరికొన్నిచోట్ల పడవలో నిలబడే ప్రజలకు మువ్వన్నెల జెండాలను ఆవిష్కరించారు. పుట్టెడు దుఃఖంలోనూ జాతీయతాస్ఫూర్తి కొరవడలేదని చాటుతున్నారు.
ముంచెత్తిన విషాదంలోనూ.. వెల్లువెత్తిన దేశభక్తి!
Published Wed, Aug 16 2017 8:36 AM
Advertisement
Bullet List Block
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
What’s your opinion
Advertisement