ఆంధ్రప్రదేశ్లో విద్యనభ్యసించిన విద్యార్థులు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సాయం మరచిపోలేరు అనడానికి ఈ కార్యక్రమమే ఒక నిదర్శనం. అందరూ ఉన్నత చదువులు చదువుకునే విధంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ఎంతోమంది విద్యార్థులకు మంచి జీవితాన్ని ప్రసాదించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు ఇంజినీరింగ్, మెడికల్ విద్య వరకూ చదువుకునేందుకు ఈ పథకం ద్వారా వైఎస్ అవకాశం కల్పించారు. ఈ పథకంతో ఉన్నత చదువులు చదువుకొని సౌదీ అరేబియాలోని పలు ప్రముఖ సంస్థల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తోన్న కొందరు ప్రవాసాంధ్రులు వైఎస్సార్ కుటుంబం మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మక్కాలో ఉండే కాబాలో ఫోటోలతో ప్రార్థన చేయడం నిషేధం ఉన్నా, ఆ రాజన్న ప్రవేశపేట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్తో చదువుకోని, జీవితంలో స్థిరపడ్డాము కాబట్టి గుండెల నిండా పెద్దాయనను నింపుకొని ప్రార్థనలు చేశాము అని 'జగన్ కోసం టీమ్' సభ్యుడు షేక్ సలీం చెప్పారు.
వైఎస్ జగన్ కు మద్దతుగా మక్కాలో ప్రత్యేక ప్రార్థనలు
Published Fri, Oct 13 2017 11:33 AM
Advertisement
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement