అక్టోబర్ నుంచి క్రియాశీలక రాజకీయల్లోకి రానున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. ఉద్దానం సమస్యపై ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యలను రూపుమాపే వరకు నిరంతం పోరాటం చేస్తామన్నారు. ఈ సమస్యను రాజకీయాలకు అతీతంగా మానవతాకోణంలో చూడాలన్నారు. ఉద్దానం సమస్య వ్యక్తిగతంగా తనకు చాలా బాధ కలిగించిన విషయమని పేర్కొన్నారు. ఉద్దానం సమస్య గురించి మాట్లాడినప్పడు పరిష్కారానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ముందుకు వచ్చారని, రీసెర్చ్ సెంటర్ పెడితే కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపారని వెల్లడించారు. ఉద్ధానం సమస్య పరిష్కారానికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రభుత్వం డయాలసిస్తో ఆపకుండా చాలా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్ధానంలో అనాథలైన పిల్లలను ప్రభుత్వం దత్తత తీసుకోవాలని సూచించారు.
అది బాధ కలిగించిన విషయం: పవన్ కళ్యాణ్
Published Mon, Jul 31 2017 4:57 PM
Advertisement
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement