రోహిత్‌ శేఖర్‌ తివారీది సహజ మరణం కాదు | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శేఖర్‌ తివారీది సహజ మరణం కాదు

Published Fri, Apr 19 2019 5:50 PM

అనుమానాస్పద స్థితిలో ఈ నెల 16న మృతిచెందిన మాజీ ముఖ్యమంత్రి ఎన్‌డీ తివారీ కుమారుడు రోహిత్‌ శేఖర్‌ తివారీది హత్యేనని ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఓ నిర్దారణకు వచ్చారు. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తులకు ఈ హత్యతో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు.  శవపరీక్ష ఆధారంగా రోహిత్ శేఖర్‌ మర్డర్‌ మిస్టరీ చేధించనున్నట్లు స్పెషల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌ఎస్‌ క్రిష్‌నియా తెలిపారు.  శవపరీక్షలో రోహిత్‌ శేఖర్‌ది సహజ మరణం కాదని, ఊపిరాడకుండా చేసి చంపినట్లు రిపోర్టు వచ్చిందని తెలిపారు.