Sakshi News home page

చిరుత దాడిలో 20 గొర్రెలు మృతి

Published Sat, Feb 7 2015 4:37 PM

20 sheeps died in tiger's attack

అనంత పురం జిల్లా(శింగనమల, కమ్మదూరు): చిరుత గొర్రెల మందపై దాడి చేసి 20 గొర్రెలను చంపింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా కమ్మదూరు మండలంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. కమ్మదూరుకు చెందిన ఇమామ్ సాహెబ్ ఇంటిలో ఉన్న చేసింది. ఈ దాడిలో 20 గొర్రెలు మృతి చెందాయి. సుమారుగా రూ. లక్ష ఆస్తి నష్టం జరిగినట్లు సాహెబ్ చెప్పాడు.
గ్రామంలో చిరుత మృతదేహం...
మరో సంఘటనలో గ్రామంలో చిరుత మృతదేహం కలకలం సృష్టించింది. ఈ సంఘటన శింగనమల మండలం పెద్దమల్లుగొంది గ్రామంలో శనివారం జరిగింది. కాగా, గ్రామంలో ఉన్న చిరుతను వేటగాళ్లు చంపారా,లేక సహజ మరణమా అనేది తెలియడంలేదు. అటవీ అధికారులు పోస్ట్‌మార్టం చేసి నిజాలు నిర్ధారించాల్సి ఉంది.

Advertisement

What’s your opinion

Advertisement