Sakshi News home page

ఏపీలో 275 కరోనా పాజిటివ్‌ కేసులు

Published Wed, Jun 17 2020 2:04 PM

275 New Corona Cases Reported In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 15,188 నమూనాలు పరీక్షించగా 275 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,555కు చేరినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. కరోనా మహమ్మారి‌ కారణంగా గడిచిన 24 గంటల్లో రెండు మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 90 మంది మరణించారు. అయితే కరోనా నుంచి కోలుకొని 2,906 మంది డిశ్చార్జ్‌ కాగా.. ప్రస్తుతం 2,559 యాక్టివ్‌ కేసులున్నాయి. 

చదవండి: మంత్రి కొడాలి నానికి కరోనా నెగిటివ్

Advertisement

What’s your opinion

Advertisement