ఒంగోలు అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహారశైలి హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ విమర్శించారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్లోని ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే కనీసం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు అమలుచేయకుండా విజన్-2029 పేరుతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు.
చివరకు శుక్రవారం తిరుపతిలో జరిగిన 14వ ఆర్థిక సంఘ సమావేశంలోనూ నవ్యాంధ్రకు కావాల్సిన నిధుల గురించి మాట్లాడకుండా అర్థంపర్థంలేని విజన్-2029 గురించే ప్రసంగించారని ధ్వజమెత్తారు. రాబోయే ఐదేళ్లకు సంబంధించిన ఆర్థిక సంఘం ఎదుట ఐదేళ్లపాటు పదవిలో ఉండే సీఎం.. ప్రస్తుత పరిస్థితులు, ఈ ఐదేళ్ల పాలన గురించి పట్టించుకోకుండా 15 ఏళ్లలో జరగబోయే దాని గురించి మాట్లాడటం అవసరమా అని సురేష్ ప్రశ్నించారు. గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్షనేతగా అనుభవం ఉన్న చంద్రబాబుకు రాజ్యాంగబద్ధమైన ఆర్థిక సంఘం ముందు ఎలా మాట్లాడాలో తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్తో పాటు వైఎస్ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అదే ఆర్థిక సంఘ సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డీఏ సోమయాజులు, ఎంపీ మిథున్రెడ్డి నవ్యాంధ్రకు నిధుల కోసం చక్కగా మాట్లాడారని సురేష్ పేర్కొన్నారు. నవ్యాంధ్రకు నిధుల కోసం వైఎస్ఆర్ సీపీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, టీడీపీ ప్రజాప్రతినిధులు నిజాయితీగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.
Breadcrumb
చంద్రబాబు తీరు హాస్యాస్పదం
Published Sun, Sep 14 2014 2:36 AM
Related news
-
జగన్.. రేపు నిన్ను చంపితే ఏమవుతుంది?: చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికల్లో వైఎస్ జగన్ను ఎదుర్కొనే సామర్థ్యం, ధైర్యంలేక కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబుకు కళ్ల ముందే ఓటమి స్పష్టంగా కనిపించడంతో చేసేదిలేక తీవ్ర నిరాశ, నిస్పృహలతో బహిరంగ సభల్లో ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం సభలో.. ‘జగన్మోహన్రెడ్డి.. రేపు నిన్ను చంపితే ఏమవుతుంది’.. అంటూ ఆయన బరితెగించి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలను ఆయన ఎటువైపు తీసుకెళ్తున్నారనే ఆందోళన సాధారణ ప్రజలు, మేథావులు, తటస్థులు వ్యక్తంచేస్తున్నారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయన్ను భౌతికంగా నిర్మూలించేందుకు చంద్రబాబు ఏదైనా కుతంత్రం పన్నుతున్నారేమోనని అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవలే తాడికొండలో జరిగిన సభలో ‘ఆ దున్నపోతును మనిషికి ఒక రాయి తీసుకుని, ఏది దొరికితే అది తీసుకుని కొట్టండి’.. అంటూ సీఎంపై దాడికి పురికొల్పేలా మాట్లాడారు. ఆ తర్వాతే విజయవాడ సింగ్నగర్లో బస్సుయాత్ర చేస్తున్న జగన్పై హత్యాయత్నం జరిగింది. ముఖ్యమంత్రిని దున్నపోతు అంటూ సంభోదించడం, రాయిపెట్టి కొట్టాలనడం ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని మేధావులు సైతం ప్రశ్నిస్తున్నారు. మరో సభలో.. గాజు గ్లాసు తీసుకుని పొడవమంటూ ఆయన సైగల ద్వారా చెప్పడం చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారు. ఇప్పుడు ఏకంగా జగన్ను నేరుగా ఉద్దేశిస్తూ నిన్ను చంపితే ఏమవుతుంది అని మాట్లాడడంతో చంద్రబాబు మనసులో దురుద్దేశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయన ఆ మాట అన్నారంటే జగన్పై ఎంత కసి, కక్ష ఉన్నాయో తెలుస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపేయాలని ప్రతిపక్ష నేత మాట్లాడడం తగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విషయంలోనూ వైఎస్ జగన్ను దీటుగా ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. సీఎంని పదేపదే వ్యక్తిగతంగా దూషించడం, దాడులకు ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేస్తుండడం, చివరికి ఇంకా దిగజారి చంపమని చెప్పడం బాబు మానసిక దౌర్భల్యాన్ని సూచిస్తోందంటున్నారు. ఆయన ప్రతి సభలోనూ, ప్రతి సమావేశంలోనూ జగన్పై విద్వేషం వెళ్లగక్కుతూనే ఉన్నారు. సీఎంను సైకో అంటూ దిగజారుడుగా సంభోదిస్తూ తన అక్కసు, కడుపుమంట చల్లార్చుకుంటున్నారు.బాబు తీరుతో టీడీపీ కేడర్లో ఆందోళన..అలాగే.. జగన్ తన పాలనలో మంచి జరిగిందనుకుంటేనే తనకు ఓటేయాలని కోరుతుంటే బాబు మాత్రం ‘చంపండి.. పొడవండి.. రాళ్లు విసరండి.. గాలిలో వస్తాడు, గాలిలో పోతాడు’.. అంటూ మాట్లాడడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్ తన పాలనలో తాను చేసిన పనులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి చక్కగా చెబుతున్నారని, చంద్రబాబు వైఫల్యాలు ఆయన గతంలో విడుదల చేసిన మేనిఫెస్టోను చూపించి దాన్ని అమలుచేయలేదని చెబుతున్నారని వీటిపై మాట్లాడకుండా అదే పనిగా తిట్టడంవల్ల ఉపయోగం ఉండదని భావిస్తున్నారు. జగన్ తన మేనిఫెస్టోను, టీడీపీ మేనిఫెస్టోను పోల్చిచూపడం, అందులోని అంశాలను వివరించి చెప్పే విధానం ప్రజల్లోకి బాగా వెళ్తోందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. తమ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను అమలుచేయలేదనే విషయాన్ని చాలా సూటిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, దీనికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి తమ పార్టీకి లేకుండాపోయిందనే వాపోతున్నారు.టీడీపీని రద్దు చేయాలి: ఎమ్మెల్యే ప్రసన్నబుచ్చిరెడ్డిపాళెంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కోవూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి సీరియస్ అయ్యారు. చంద్రబాబు తన పాలనా దక్షత కన్నా.. కుట్రలు, కుతంత్రాలు, హత్యలను నమ్ముకుని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుని చంద్రబాబుపై కేసు నమోదు చేసి, టీడీపీని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సుమోటోగా కేసు ఫైల్ చేయాలని కోరారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రాణాలకు హాని ఉందని చంద్రబాబు వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు.వేమిరెడ్డీ.. బాబు వ్యాఖ్యలను సమర్థిస్తున్నావా?బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో ఎంపీ, ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి దంపతులు పక్కనే ఉన్నప్పటికీ వారు వారించకుండా మౌనంగా ఉండిపోవడంపై నెల్లూరు జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నైతిక విలువలుంటే ఇలాంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బాబు పార్టీ నుంచి తప్పుకోవాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.దారుణంగా పడిపోయిన చంద్రబాబు ఇమేజ్సీఎం జగన్ హుందాగా మాట్లాడుతుంటే.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇంత నీచస్థాయికి దిగజారి మాట్లాడుతుండడం సాధారణ ప్రజానీకంలోనూ చర్చనీయాంశమైంది. ఇప్పటికే ప్రజల్లో, జాతీయ స్థాయి రాజకీయ పక్షాల దృష్టిలో నమ్మదగని నేతగా ముద్రపడిన చంద్రబాబు ఇమేజ్ దారుణంగా పడిపోయింది. ప్రజలే కాదు.. ఏ రాజకీయ పక్షం ఆయన్ను నమ్మే పరిస్థితిలేదు. ప్రస్తుతం ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నా ఆయన్ను బీజేపీ పెద్దలు నమ్మడంలేదని టీడీపీ నేతలు వాపోతున్నారు. చంద్రబాబు నిలకడలేని స్వభావం, అవకాశవాద వైఖరి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం ద్వారా తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఈ వైఖరే ఆయన్ను ప్రజల్లో మోసగాడిగా నిలబెట్టింది.ఓటమి భయంతోనే ఇలా..బాబు తన పాలన, తన విధానాల గురించి కాకుండా కేవలం ఎదురుదాడి చేయడం, దూషించడంవల్ల ఉపయోగం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఆయన ప్రసంగాలు ప్రజలకు నమ్మకాన్ని కలిగించేలా ఉండడంలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హద్దులు దాటిపోయి చేస్తున్న ఆరోపణలు, దూషణలు చంద్రబాబులో ఉన్న అసహనం, భయాన్ని చూపుతున్నాయని, ఓటమి భయంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారని తటస్థులు సైతం చెబుతున్నారు. తాను చేసిందేమీలేక చెప్పుకోలేకపోవడం, ఏం చేస్తానో చెప్పలేకపోవడం, ఆయన చెప్పే ఇతర విషయాలను జనం పట్టించుకోకపోవడంతో జీవిత చరమాంకంలో ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో ఆయన విద్వేషపూరిత ప్రసంగాలవల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య నెలకొనే పరిస్థితి ఏర్పడుతోంది. -
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
ఈ ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ విజయం ఖాయమని స్పష్టం కావడంతో చంద్రబాబు అండ్ గ్యాంగ్ బెంబేలెత్తుతోంది. ఎలాగైనా సరే ప్రజలను తప్పుదారి పట్టించాలని తప్పుడు మార్గాలు ఎంచుకుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ పచ్చ సోషల్ మీడియా రెచ్చిపోతోంది. స్పామ్ కాల్స్ పేరుతో జనాలకు ఫోన్లు చేసి విసిగిస్తోంది. ఫోన్ ఎత్తితే చాలు.. సీఎం జగన్పై అసభ్య పదజాలంతో దూషణలు వినిపిస్తోంది. నోటికి వచ్చిన మాటలతో తిట్ల దండకం అందుకుంటోంది. అబద్ధాలను ప్రచారం చేస్తూ బురద జల్లుతోంది. ఎవరో ఫోన్ చేస్తున్నారనుకుని ఆ ఫోన్ ఎత్తితే చాలు.. ఆ వాయిస్ కాల్లో సీఎం జగన్ను బండ బూతులు తిడుతున్నారు. పదే పదే కాల్స్ చేసి జనాలను సతాయిస్తున్నారు. ఈ క్రమంలో జనాలు అలాంటి స్పామ్ కాల్స్ను ఎత్తకపోవడంతో చివరికి ఎంతకు తెగించారంటే.. ఆ కాల్స్పై ట్రూకాలర్లో యువర్ జగన్, జగన్ లీడర్, మాస్ లీడర్ జగన్.. అంటూ పేర్లు వచ్చేలా చేసి.. జగన్ను అభిమానించే వారు ఫోన్లు తీసేలా చేస్తున్నారు. మరోవైపు షార్ట్ఫిలిమ్స్తో సీఎం జగన్, వైఎస్సార్సీపీ నేతలను దూషిస్తూ పోస్టులు పెడుతున్నారు.జగన్పై దు్రష్పచారం చేయడం, టీడీపీకి ఓటు వేయాలని కోరుతుండటంతో వాటిని టచ్ చేయాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. ఎలాగైనా వైఎస్సార్సీపీని మళ్లీ అధికారంలోకి రానీయకుండా అడ్డుకునేందుకు టీడీపీ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి.. దు్రష్పచారం చేస్తున్నాయి. ఈ విషయమై రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉండే మీడియా సర్టీఫికేషన్ ఆఫ్ మానిటరింగ్ కమిటీలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
సాక్షి, అమరావతి: ఈ ఎన్నికలు పెత్తందారులు, పేదలకు మధ్య పోటీ.. ఆర్థిక నేరగాళ్లతో నిండిన టీడీపీ కూటమికి.. పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా జైత్రయాత్ర చేస్తున్న ఈ ప్రభుత్వానికి మధ్య పోటీ.. ఈ ఎన్నికల్లో ఆర్థిక నేరగాళ్లకు చంద్రబాబు టికెట్లు కట్టబెట్టడమే కాకుండా..తన బినామీలను పక్క పార్టీలోకి పంపి అక్కడ కూడా వారిని బరిలో నిలిపారు. వ్యాపార వేత్తల ముసుగులో బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన ఈ వైట్కాలర్ ఆర్థిక నేరగాళ్లు సూచించిన వారికీ చంద్రబాబు టికెట్లిచ్చారు. రుణాల పేరుతో బ్యాంకులకు కన్నం పెట్టిన ఈ కేటుగాళ్లలో భీమిలి నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉండి నుంచి రఘురామకృష్ణరాజు టీడీపీ నుంచి పోటీ చేస్తుండగా.. 2019 వరకు టీడీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న సీఎం రమేశ్, సుజనా చౌదరిలను బీజేపీలోకి పంపిన చంద్రబాబు.. వారికి టికెట్లు దక్కేలా ప్లాన్ చేశారు. అనకాపల్లి పార్లమెంటు నుంచి సీఎం రమేశ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. ఈ నలుగురు బ్యాంకుల నుంచి సుమారు రూ.4,563 కోట్ల రుణాలు ఎగ్గొట్టి, సీబీఐ ఈడీ, బ్యాంకు జప్తు కేసులు ఎదుర్కొంటున్నారు. మోసాల్లో దిట్ట రఘురామకృష్ణరాజు రుణాల ఎగవేతలో విజయ్ మాల్యా, నీరవ్మోదీ సరసన నిలిచే కేటుగాడు రఘురామ కృష్ణరాజు. ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో రఘురామకృష్ణరాజు వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ.1,383 కోట్ల రుణాలు తీసుకున్నాడు. వీటిని కంపెనీ అవసరాలకు వాడకుండా వేరే ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసగించాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్–భారత్ థర్మల్ పవర్ పేరిట తీసుకున్న రూ.826.17 కోట్ల రుణాన్ని పక్కదారి పట్టించాడు. వడ్డీ కూడా చెల్లించలేదు. దీంతో బ్యాంకులు సీబీఐని ఆశ్రయించడంతో అతని మోసాలు వెలుగులోకి వచ్చాయి. తనఖాగా పెట్టిన భూముల్ని మోసపూరితంగా అమ్మేశాడని, 95 శాతం బొగ్గు తరిగిపోయిందని చెప్పి దాన్ని తగలబెట్టేశారని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. 2020 అక్టోబర్లో రఘురామకృష్ణరాజుకు చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో 11 సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహించి పలు ఫైళ్లు, హార్డ్ డిస్కులు స్వా«దీనం చేసుకున్నాయి. కంపెనీకి చైర్మన్గా ఉన్న రఘురాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె ఇతర డైరెక్టర్లపై కేసులు నమోదు చేశారు. ఇండ్–భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట విదేశాల్లో తీసుకున్న రుణాల్ని భారత్కు అక్రమంగా తరలించడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. 2011లో మారిషస్కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి రూ.202 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ నిధులు అందిన మరుసటి రోజే రూ.200 కోట్లను ఇండ్ – భారత్ ఎనర్జీ లిమిటెడ్(ఉత్కళ్)కు తరలించేశారు. ఈ వ్యవహారం మొత్తం ఫారెన్ ఎక్స్చేంజ్ మైయింటెనెన్స్ యాక్ట్(ఫెమా) దృష్టిలో పడింది. ఫెమా అధికారులు మారిషస్ కంపెనీ నుంచి రూ.202 కోట్లు ఇండ్ భారత్ సన్ ఎనర్జీకి అందినట్లు గుర్తించారు. మరుసటి రోజే బదిలీ చేసినట్లు నిర్ధారించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ రఘురామ కంపెనీకి రూ.40 కోట్లు పెనాల్టీ విధించింది. సుజనా చౌదరి.. ఎగవేతలో నంబర్ వన్ బ్యాంకుల నుంచి రూ. వేల కోట్ల రుణాలు తీసుకుని మోసగించిన ఘనుడు సుజనా చౌదరి. ఈ కేసులో ఈడీ దర్యాప్తుతో అతని మోసాలు వెలుగులోకి వచ్చాయి. రూ.1,289 కోట్ల జీఎస్టీ ఎగవేతతో పాటు రూ.700 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే రూ.1,289 కోట్ల ఇన్వాయిస్లు సుజనా కంపెనీలు తయారుచేశాయి.ఈ మొత్తంపై రూ.224 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నా్చ్ఠరు. దొంగ ఇన్వాయిస్లు చూపి బ్యాంకుల నుంచి రూ.700 కోట్ల రుణాలు తీసుకున్నారు. జీఎస్టీ విభాగం దర్యాప్తులో ఈ మోసం బయటపడటంతో గ్రూపునకు చెందిన డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. బ్యాంకు రుణాలు తీర్చడం లేదని నల్లగొండ జిల్లాలో ఉన్న స్టీల్ ప్లాంటును బ్యాంకులు సీజ్ చేశాయి. విదేశీ బ్యాంకులకు కూడా సుజనా టోపీ పెట్టారు. మారిషస్ బ్యాంక్ నుంచి రూ.100 కోట్ల రుణం తీసుకొని చెల్లించకపోవడంతో ఆ బ్యాంక్ హైదరాబాద్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కోర్టు ఏకంగా అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. బ్యాంకుల నుంచి రుణాలు ఎగ్గొట్టిన వారికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఇవ్వడానికి ప్రధాని మోదీ నిరాకరించినా చంద్రబాబు అతనికే ఇవ్వాలని పట్టుబట్టారు.బీజేపీ తీర్థం పుచ్చుకొని విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేస్తున్నారు. రూ. 500 కోట్లు ఎగవేతకు సంబంధించి ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)లో ఎస్బీఐ 2021లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన ఎన్సీఎల్టీ ఆ పిటిషన్కు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులిచి్చంది.బినామీ ‘బాబు’..సీఎం రమేశ్చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, బినామీ సీఎం రమే‹శ్.. అతని అక్రమ లావాదేవీలను ఆదాయపన్ను శాఖ వెలికి తీసింది. సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో పనులు చేయకుండానే చేసినట్లు చూపి రూ.800 కోట్ల నిధులు సొంత ఖాతాల్లోకి మళ్లించారు. పనులు చేయకుండానే చేసినట్లు బిల్లులు తీసుకుని వాటిని చిరునామా లేని కంపెనీల్లోకి మళ్లించి ఆ కంపెనీల నుంచి సీఎం రమే‹శ్ సంస్థ నగదును వెనక్కి తీసుకుంది. అతనికి చెందిన నిర్మాణ రంగ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు రూ.800 కోట్ల నిధులను వివిధ కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు ఐటీ శాఖ అధికారులకు ఆధారాలు లభించాయి. గత ఆరేళ్లలో ఎడ్కో(ఇండియా) అనే సబ్కాంట్రాక్టర్కు రూ.12 కోట్లు చెల్లించినట్లు పుస్తకాల్లో చూపారు. రికార్డుల్లో పేర్కొన్న నాలుగు చిరునామాల్లో ఆ కంపెనీ ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. రిత్విక్ ప్రాజెక్టులో అకౌంటెంట్గా పనిచేస్తున్న సాయిబాబా వద్ద ఎడ్కో కంపెనీకి చెందిన స్టాంపులు, సీల్ దొరకడంతో గుట్టు రట్టయ్యింది. దొంగ వ్యాపారాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని పార్టీకి ఇచ్చి వరుసగా రెండుసార్లు రాజ్యసభ సీటు దక్కించుకున్నారనేది అందరికీ తెలిసిందే. కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరి.. ఇప్పుడు ఆ పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు.. రూ.390.7 కోట్ల ఎగవేత టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి సుమారు రూ.390.7 కోట్ల రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో అతని ఆస్తులను స్వా«దీనం చేసుకోవడానికి బ్యాంకులు ఐదేళ్లుగా పోరాడుతున్నాయి. గంటాకు సంబంధించిన ప్రత్యూష గ్రూపు కంపెనీలు వివిధ బ్యాంకులకు వడ్డీతో కలిపి రూ.390.7 కోట్లకుపైగా రుణం తీసుకొని ఇంతవరకు ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. ఆస్తుల స్వాధీనానికి ఇండియన్ బ్యాంకు రంగంలోకి దిగింది. ఈ రుణానికి గంటా హామీ ఉండడంతో ఆయనకు చెందిన ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నట్లు పత్రికా ప్రకటనలు జారీ చేసింది. గత నెలలో ఇండియన్ బ్యాంకు విశాఖలోని బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని గంటా స్థలాన్ని వేలం వేసేందుకు పత్రికా ప్రకటన ఇచ్చింది. -
అలా చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు?.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మలివిడత ఎన్నికల ప్రచార భేరి మోగించారు.ఇక సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడం.. బస్సు యాత్ర చరిత్ర సృష్టించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్, నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్లో ఆదివారం జరిగిన సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. మరోవైపు, ఎక్స్ (ట్విటర్) వేదికగా చంద్రబాబు మోసాలను సీఎం జగన్ ఎండగట్టారు.‘‘అయ్యా చంద్రబాబూ.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టావు 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు...? వచ్చే ఎన్నికల్లో మన వైసీపి అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. అయ్యా చంద్రబాబు.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టావు. 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం. మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా… pic.twitter.com/lSAAuOO7zw— YS Jagan Mohan Reddy (@ysjagan) April 28, 2024 -
ఎగ్గొట్టేందుకే చంద్రబాబు అడ్డగోలు హామీలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: తమ మేనిఫెస్టో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించేదిలా ఉండదని.. ప్రజలకు ఏం చేస్తామో అదే చెప్పామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాయిళాలు ప్రకటించి ఓట్లు వేయించుకునే ఆలోచనలు తమకు ఉండవని.. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని నాశనం చేశారని సజ్జల మండిపడ్డారు‘‘2014-19 మధ్య చంద్రబాబు తన విశ్వరూపం చూపించారు. చంద్రబాబువి సభ్యసమాజంలో ఉండగలిగే వ్యక్తి మాటలులాగా లేవు. రాళ్ల దాడి చేయమని గతంలో చంద్రబాబు అన్నాడు.. అన్నట్టుగానే రాళ్లతో దాడి చేయించాడు. మేనిఫెస్టో అంటే విశ్వసనీయత ఉండాలి. మీ కుటుంబంలో మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్ అంటున్నారు. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేనే అలా అడగగలరు. అలా చంద్రబాబు ఎందుకు ఓటు అడగలేకపోతున్నారు. సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాల్లో మేలు జరిగింది. ఈ పథకాలతో రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా? అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు అంతకంటే ఎక్కువ పథకాలు తెస్తానని ఎలా చెప్తున్నారు’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.‘‘అమలు చేసే వారెవరూ అడ్డగోలు హామీలు ఇవ్వరు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉన్న వారే చేయగలిగిన హామీలు ఇస్తారు. చంద్రబాబు వలన వాలంటీర్ల వ్యవస్థ ఆగిపోయింది. పెన్షన్ల పంపిణీకి ఆటంకం కలిగించారు. ఇప్పుడు మళ్లీ ఇంటింటికీ ఉద్యోగులను పంపించి పెన్షన్లు ఇవ్వమంటున్నారు. పేదలంతా తమ కాళ్ల మీద తాము నిలపడేలా చూడాలన్నది జగన్ ఇద్దేశం. 70 వేల కోట్లతో జగన్ తన సంక్షేమాన్ని అమలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఏకంగా లక్షన్నర కోట్లు చేస్తానంటూ మాట్లాడుతున్నారు. రాష్ట్ర బడ్జెట్తో సంబంధం లేకుండా చంద్రబాబు అబద్ధాల హామీలు ఇస్తున్నారు’’ అని సజ్జల మండిపడ్డారు.‘‘ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా జగన్ మేనిఫెస్టో ప్రకటించారు. చంద్రబాబు లాగా ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వమని కొంతమంది మాతో కూడా అన్నారు.కానీ జగన్ ఎప్పుడూ చేయలేని పని చెప్పరు. ఇచ్చిన హామీ నుంచి వెనక్కి పోరు. ఎగ్గొట్టాలనుకునే చంద్రబాబు అడ్డమైన హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఉన్న వ్యవస్థలన్నీ నాశనం అవుతాయి. జన్మభూమి కమిటీలు మళ్లీ వస్తాయి. చంద్రబాబుకు ఎవరైనా ఓటేస్తే తమ ఓటును తాము వృథా చేసుకున్నట్టే. చంద్రబాబు తన పాలనలో ఏం చేశారో ఇప్పటికీ ఎందుకు చెప్పలేకపోతున్నారు?’’ అంటూ సజ్జల నిలదీశారు.‘‘జగన్ పాలనలో ఏం జరిగిందో ఎవరైనా చెప్పగలరు. కుప్పంతో సహా ఎక్కడైనా చెక్ చేసేందుకు సిద్దమే. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఇరవై ఇళ్లకు వెళ్లి అడిగే ధైర్యం ఉందా?. పోలవరం పాపం చంద్రబాబుదే. లోకేష్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఎందుకు ప్రజలకు కనపడటం లేదు?. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడు. చంద్రబాబు మాటలే పవన్ కూడా మాట్లాడతారు. సెక్రటేరియట్ ని కూడా తాకట్టు పెట్టామని కూడా పవన్ అన్నారు. రాజధానిలోని పొలాలను తాకట్టు పెట్టిందే చంద్రబాబు’’ అంటూ సజ్జల దుయ్యబట్టారు.
Related News by category
-
మే నెల పింఛన్ బ్యాంకు ఖాతాలో జమ
సాక్షి, అమరావతి: మే, జూన్ నెలల పింఛన్ డబ్బును ఈసారి లబ్ధిదారులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) విధానంలో లబ్ధిదారుల ఆధార్ నంబరు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా పింఛను డబ్బు జమ చేస్తుంది. అయితే, విభిన్న దివ్యాంగ లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్య కారణాలతో పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు మాత్రం గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పింఛను డబ్బు ఇస్తారు. ఈ రెండు నెలల్లోనూ ఒకటో తేదీ నుంచే పింఛను డబ్బు పంపిణీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఆదివారం ఆదేశాలు చేశారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మే ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి నిధులు విడుదల చేస్తుంది. అందులో 48,92,503 మంది (74.70 శాతం) లబ్ధిదారుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. లబ్ధిదారులకు ఒకటో తేదీనే డీబీటీ విధానంలో డబ్బులు జమ చేయగానే, ఆ సమాచారం బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్ రూపంలో అందుతుంది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు దాదాపు 16,57,361 మంది (25.30 శాతం)కి మే ఒకటి నుంచి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ జరుగుతుంది. పింఛన్ లబ్ధిదారులలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వారికి డబ్బు అందేలా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఎవరికి పింఛను డబ్బులు బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారు, ఎవరికి ఇంటి వద్దే పంపిణీ చేస్తారన్న వివరాలతో కూడిన జాబితాలను సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం గ్రామ, వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డులో కూడా ఉంచనున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
జగన్.. రేపు నిన్ను చంపితే ఏమవుతుంది?: చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికల్లో వైఎస్ జగన్ను ఎదుర్కొనే సామర్థ్యం, ధైర్యంలేక కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబుకు కళ్ల ముందే ఓటమి స్పష్టంగా కనిపించడంతో చేసేదిలేక తీవ్ర నిరాశ, నిస్పృహలతో బహిరంగ సభల్లో ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం సభలో.. ‘జగన్మోహన్రెడ్డి.. రేపు నిన్ను చంపితే ఏమవుతుంది’.. అంటూ ఆయన బరితెగించి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలను ఆయన ఎటువైపు తీసుకెళ్తున్నారనే ఆందోళన సాధారణ ప్రజలు, మేథావులు, తటస్థులు వ్యక్తంచేస్తున్నారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయన్ను భౌతికంగా నిర్మూలించేందుకు చంద్రబాబు ఏదైనా కుతంత్రం పన్నుతున్నారేమోనని అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవలే తాడికొండలో జరిగిన సభలో ‘ఆ దున్నపోతును మనిషికి ఒక రాయి తీసుకుని, ఏది దొరికితే అది తీసుకుని కొట్టండి’.. అంటూ సీఎంపై దాడికి పురికొల్పేలా మాట్లాడారు. ఆ తర్వాతే విజయవాడ సింగ్నగర్లో బస్సుయాత్ర చేస్తున్న జగన్పై హత్యాయత్నం జరిగింది. ముఖ్యమంత్రిని దున్నపోతు అంటూ సంభోదించడం, రాయిపెట్టి కొట్టాలనడం ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని మేధావులు సైతం ప్రశ్నిస్తున్నారు. మరో సభలో.. గాజు గ్లాసు తీసుకుని పొడవమంటూ ఆయన సైగల ద్వారా చెప్పడం చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారు. ఇప్పుడు ఏకంగా జగన్ను నేరుగా ఉద్దేశిస్తూ నిన్ను చంపితే ఏమవుతుంది అని మాట్లాడడంతో చంద్రబాబు మనసులో దురుద్దేశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయన ఆ మాట అన్నారంటే జగన్పై ఎంత కసి, కక్ష ఉన్నాయో తెలుస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపేయాలని ప్రతిపక్ష నేత మాట్లాడడం తగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విషయంలోనూ వైఎస్ జగన్ను దీటుగా ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. సీఎంని పదేపదే వ్యక్తిగతంగా దూషించడం, దాడులకు ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేస్తుండడం, చివరికి ఇంకా దిగజారి చంపమని చెప్పడం బాబు మానసిక దౌర్భల్యాన్ని సూచిస్తోందంటున్నారు. ఆయన ప్రతి సభలోనూ, ప్రతి సమావేశంలోనూ జగన్పై విద్వేషం వెళ్లగక్కుతూనే ఉన్నారు. సీఎంను సైకో అంటూ దిగజారుడుగా సంభోదిస్తూ తన అక్కసు, కడుపుమంట చల్లార్చుకుంటున్నారు.బాబు తీరుతో టీడీపీ కేడర్లో ఆందోళన..అలాగే.. జగన్ తన పాలనలో మంచి జరిగిందనుకుంటేనే తనకు ఓటేయాలని కోరుతుంటే బాబు మాత్రం ‘చంపండి.. పొడవండి.. రాళ్లు విసరండి.. గాలిలో వస్తాడు, గాలిలో పోతాడు’.. అంటూ మాట్లాడడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్ తన పాలనలో తాను చేసిన పనులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి చక్కగా చెబుతున్నారని, చంద్రబాబు వైఫల్యాలు ఆయన గతంలో విడుదల చేసిన మేనిఫెస్టోను చూపించి దాన్ని అమలుచేయలేదని చెబుతున్నారని వీటిపై మాట్లాడకుండా అదే పనిగా తిట్టడంవల్ల ఉపయోగం ఉండదని భావిస్తున్నారు. జగన్ తన మేనిఫెస్టోను, టీడీపీ మేనిఫెస్టోను పోల్చిచూపడం, అందులోని అంశాలను వివరించి చెప్పే విధానం ప్రజల్లోకి బాగా వెళ్తోందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. తమ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను అమలుచేయలేదనే విషయాన్ని చాలా సూటిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, దీనికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి తమ పార్టీకి లేకుండాపోయిందనే వాపోతున్నారు.టీడీపీని రద్దు చేయాలి: ఎమ్మెల్యే ప్రసన్నబుచ్చిరెడ్డిపాళెంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కోవూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి సీరియస్ అయ్యారు. చంద్రబాబు తన పాలనా దక్షత కన్నా.. కుట్రలు, కుతంత్రాలు, హత్యలను నమ్ముకుని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుని చంద్రబాబుపై కేసు నమోదు చేసి, టీడీపీని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సుమోటోగా కేసు ఫైల్ చేయాలని కోరారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రాణాలకు హాని ఉందని చంద్రబాబు వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు.వేమిరెడ్డీ.. బాబు వ్యాఖ్యలను సమర్థిస్తున్నావా?బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో ఎంపీ, ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి దంపతులు పక్కనే ఉన్నప్పటికీ వారు వారించకుండా మౌనంగా ఉండిపోవడంపై నెల్లూరు జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నైతిక విలువలుంటే ఇలాంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బాబు పార్టీ నుంచి తప్పుకోవాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.దారుణంగా పడిపోయిన చంద్రబాబు ఇమేజ్సీఎం జగన్ హుందాగా మాట్లాడుతుంటే.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇంత నీచస్థాయికి దిగజారి మాట్లాడుతుండడం సాధారణ ప్రజానీకంలోనూ చర్చనీయాంశమైంది. ఇప్పటికే ప్రజల్లో, జాతీయ స్థాయి రాజకీయ పక్షాల దృష్టిలో నమ్మదగని నేతగా ముద్రపడిన చంద్రబాబు ఇమేజ్ దారుణంగా పడిపోయింది. ప్రజలే కాదు.. ఏ రాజకీయ పక్షం ఆయన్ను నమ్మే పరిస్థితిలేదు. ప్రస్తుతం ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నా ఆయన్ను బీజేపీ పెద్దలు నమ్మడంలేదని టీడీపీ నేతలు వాపోతున్నారు. చంద్రబాబు నిలకడలేని స్వభావం, అవకాశవాద వైఖరి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం ద్వారా తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఈ వైఖరే ఆయన్ను ప్రజల్లో మోసగాడిగా నిలబెట్టింది.ఓటమి భయంతోనే ఇలా..బాబు తన పాలన, తన విధానాల గురించి కాకుండా కేవలం ఎదురుదాడి చేయడం, దూషించడంవల్ల ఉపయోగం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఆయన ప్రసంగాలు ప్రజలకు నమ్మకాన్ని కలిగించేలా ఉండడంలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హద్దులు దాటిపోయి చేస్తున్న ఆరోపణలు, దూషణలు చంద్రబాబులో ఉన్న అసహనం, భయాన్ని చూపుతున్నాయని, ఓటమి భయంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారని తటస్థులు సైతం చెబుతున్నారు. తాను చేసిందేమీలేక చెప్పుకోలేకపోవడం, ఏం చేస్తానో చెప్పలేకపోవడం, ఆయన చెప్పే ఇతర విషయాలను జనం పట్టించుకోకపోవడంతో జీవిత చరమాంకంలో ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో ఆయన విద్వేషపూరిత ప్రసంగాలవల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య నెలకొనే పరిస్థితి ఏర్పడుతోంది. -
ఓటుతో మోసగాళ్లకు వేటు: సీఎం వైఎస్ జగన్
డబ్బులు మీ అకౌంట్లోకి, మీ చేతికే పంపితే అది జగన్ పాలన! అదే డబ్బులు తన అకౌంట్లోకి, తన జేబులోకి, తన పెత్తందారీ స్నేహితుల జేబుల్లోకి వేసుకుంటే అది బాబు పాలన! చంద్రబాబుకు ఓటు వేస్తే ప్యాకేజీ స్టార్కు, రామోజీరావుకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, టీవీ 5 నాయుడికి, వదినమ్మకి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. బాబుది ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ 5లో మాత్రమే కనిపించే గ్రాఫిక్స్, మోసాల పాలన. రాష్ట్రాన్ని విడగొట్టిన వాళ్లు.. ఇంటింటి అభివృద్ధిని చెడగొట్టిన వాళ్లు.. అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా, కుట్రలు, వెన్నుపోట్లు నైజంగా, గుంపులు గుంపులుగా జెండాలు జత కట్టి వస్తున్నారు. ఈ పేదల వ్యతిరేకులు, మోసగాళ్లకు ఓటుతో పోలింగ్ బూత్లో బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా?– ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, అనంతపురం/సాక్షి, తిరుపతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరుకుట్రలు, వెన్నుపోట్లతో కూటమి కట్టి, జెండాలు జతకట్టి వస్తున్న మోసగాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ‘58 నెలల కాలంలో నేను ఏం చేశానో చెబుతా. నీ 14 ఏళ్ల పాలనలో ఏం మంచి చేశావో చెప్పగలవా చంద్రబాబూ? నీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథకమైనా ఉందా? జగన్ తెచ్చిన స్కీమ్లను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తానని చెప్పగలవా? నేను తెచ్చిన పథకాల గురించి మాట్లాడతావ్ ఏమిటయ్యా బాబూ? నేను రూపాయి ఇస్తే.. నువ్వు రెండు రూపాయలు ఇస్తానంటావ్ ఏంటయ్యా చంద్రబాబూ?’ అంటూ ధ్వజమెత్తారు. ఒక్కటంటే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకురాని ఆ మనిషిని నమ్మగలమా? అని సూటిగా ప్రశ్నించారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆదివారం ఉదయం అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించిన తొలి ఎన్నికల సభతో మలి విడత ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. మిట్ట మధ్యాహ్నం వేళ తిరుపతి జిల్లా వెంకటగిరిలో, సాయంత్రం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో పోటెత్తిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. ఆయా సభల్లో ఆయన ఏమన్నారంటే...బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపినట్లే!మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. ఇవి వచ్చే ఐదేళ్ల పాటు మన ఇంటింటి అభివృద్ధి, పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ యథాతథంగా కొనసాగుతాయి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికి ముగింపు, మళ్లీ మోసపోవటమే. ఇది చంద్ర బాబు గురించి చరిత్ర చెప్పిన సత్యం. చంద్రబాబు సాధ్యం కాని హామీలతో మీ ముందుకు వస్తున్నాడు. బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. వదల బొమ్మాళీ.. వదలా.. అంటూ ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఆహ్వానించడమే.మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడునాకు వీరిలా జెండాల పొత్తులు లేవు. నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతోనే. నా నమ్మకం ఆ దేవుడి దయపైనే. మేనిఫెస్టో హామీలను నూటికి 99 శాతం అమలు చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి మీ దీవెనలు, ఆశీస్సులు కోరుతున్నాడు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఏకంగా 130సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. రూ.2.70 లక్షల కోట్లు డీబీటీతో అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పారదర్శకంగా జమ చేశాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ఇంటింటికీ అందాయి. సచివాలయాల్లో నా తమ్ముళ్లు, చెల్లెళ్లుదశాబ్దాలుగా మన దగ్గర గవర్నమెంట్ ఉద్యోగాలు 4 లక్షలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో ఇచ్చింది ఏకంగా 2.31 లక్షల ఉద్యోగాలు. నా తమ్ముళ్లు, చెల్లెళ్లంతా ఈరోజు గ్రామ సచివాలయాల్లో కనిపిస్తున్నారు. మెరుగుపడిన ఆస్పత్రులు, బడుల్లో సేవలందిస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ నేను ‘‘నా..’’ అని ఆప్యాయంగా పిలిచే సామాజికవర్గాలకు ఇందులో ఏకంగా 80 శాతం ఉద్యోగాలు దక్కాయి.పౌర సేవలు.. విప్లవాత్మక వ్యవస్థలు ప్రజలకు అందించే సేవల డెలివరీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. ఎప్పుడూ జరగని విధంగా పౌర సేవలు, పథకాలను నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేశాం. నాడు – నేడుతో బాగుపడ్డ బడులు, ఇంగ్లీషు మీడియం చదువులు కనిపిస్తున్నాయి. మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు కనిపిస్తున్నాయి. ఇంటింటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఇంటికీ వస్తోంది. గ్రామాల్లోనే ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తున్నాడు. మన గ్రామంలోనే మహిళా పోలీసు కనిపిస్తోంది. రైతన్నచేయి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రం కనిపిస్తోంది. నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తున్నాయి. గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తోంది. ఇలాంటి వ్యవస్థలన్నీ మీ బిడ్డ 58 నెలల కాలంలోనే తెచ్చి మరోసారి మీ ఆశీస్సులు కోరుతున్నాడు.పేదల ఆత్మగౌరవం కాపాడుతూ..పేదల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటికే రూ.3 వేలు పింఛన్, రేషన్ అందజేస్తున్నాం. ఈరోజు ఇంటి వద్దకే క్యాస్ట్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ వస్తోంది. ఏది కావాలన్నా గడప వద్దకే వస్తున్న పరిస్థితులు మీరే చూస్తున్నారు. ఈ విప్లవాత్మక మార్పులను ఎవరైనా ఊహించారా? గవర్నమెంట్ డబ్బులు లంచాలు, వివక్ష లేకుండా అందుతాయని గతంలో ఎవరైనా చెబితే నమ్మేవారా? మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని చేసి చూపించాం.విద్యా విప్లవం..పేదింటి పిల్లల చదువుకునే ప్రభుత్వ బడుల్లో చదువులు, ఆహారం అత్యుత్తమంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. పిల్లలు ధరించే యూనిఫాం మొదలు పుస్తకాల దాకా అన్నీ సమకూరుస్తున్నాం. క్లాస్ రూముల్లో డిజిటల్ బోధన, ఐఎఫ్పీ ప్యానెల్స్, ట్యాబ్లు, మారిన కరిక్యులమ్తో విద్యా విప్లవాన్ని తెచ్చాం. ఇదే పాలన మరో పదేళ్లు కొనసాగితే ఇప్పుడు ఒకటో తరగతిలో ఉన్న మీ పిల్లలు 2035 నాటికి టెన్త్ పరీక్ష ఐబీలో పూర్తి చేసి ఐబీ సర్టిఫికెట్తో అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఎప్పుడూ చూడని విధంగా హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఎంఐటీ లాంటి ప్రఖ్యాత వర్సిటీలు అందించే ఆన్లైన్ కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానమవుతున్నాయి. మహిళా సాధికారతకు దన్నుగా‘అమ్మ ఒడి’ అనే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా విన్నారా? ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పూర్తి ఫీజులు చెల్లిస్తూ విద్యాదీవెన, ఖర్చుల కోసం వసతి దీవెన, పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు లాంటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా? దిశ యాప్, అక్కచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేయడం లాంటివి గతంలో విన్నారా?రైతన్నకు అండగా..రైతన్నకు పెట్టుబడి సాయంగా పంట వేసే సమయంలో రైతు భరోసా అందించడం గతంలో ఎప్పుడైనా చూశారా?. గ్రామాల్లోనే ఆర్బీకేలు, సున్నా వడ్డీకే పంట రుణాలు, 9 గంటలు పగటిపూటే ఉచిత విద్యుత్, ఇన్ పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా, దళారీలు లేకుండా పంటల కొనుగోలు, ఎంఎస్పీ లేని పంటలు సైతం కొనుగోలు లాంటివన్నీ చేసి ఈరోజు మీ బిడ్డ ప్రతి రైతన్ననూ మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నాడు.100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకేమొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి మీ బిడ్డ అర్థం చెప్పాడు. చేతల్లో చూపించాడు. నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు డీబీటీ, నాన్ డీబీటీలో ఏకంగా 75 శాతం పైచిలుకు లబ్ధి చేకూరింది. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేశాం. 68 శాతం మంత్రి పదవులు ఆ వర్గాలకే ఇవ్వడం ఓ చరిత్ర. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు కలిపి మొత్తం 200 స్థానాలకు గానూ ఏకంగా 50 శాతం అంటే 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించిన చరిత్ర గతంలో ఏ రాజకీయ పార్టీకైనా ఉందా? వలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుండాలన్నా, వ్యవసాయం, ఆస్పత్రులు మెరుగ్గా ఉండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుపై రెండు బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గకుండా గెలిపించాలి. మంచి చేసిన ఫ్యాను మీ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్లో ఉండాలి.జన్మభూమి కమిటీలు మళ్లీ తెస్తానని చెప్పగలవా?చంద్రబాబు జన్మభూమి కమిటీలను తీసుకొస్తే మీ జగన్ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలను తెచ్చాడు. నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ వాటిని తీసుకొస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు? ఆ విషయం చెప్పే ధైర్యం లేక నేను తెచ్చిన వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థలను కొనసాగిస్తానంటావేమిటి? నువ్వు వస్తే వలంటీర్లకు జీతం పెంచుతానంటావేమిటి? జగన్ స్కీమ్లను రద్దు చేస్తాననే ధైర్యముందా?అయ్యా చంద్రబాబూ.. నువ్వు 14 ఏళ్లు పరిపాలించావ్! నేను 58 నెలలే పరిపాలన చేశా. జగన్ అమ్మఒడి తీసుకొస్తే నువ్వు అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నావు. జగన్ చేయూత ప్రవేశపెడితే నువ్వు ఇంకా ఎక్కువమందికి ఇస్తానంటున్నావు. జగన్ రూపాయి ఇస్తే నువ్వు రెండు రూపాయలు ఇస్తానంటావ్! జగన్ తెచ్చిన స్కీమ్లను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబూ? జగన్ తెచ్చిన వలంటీర్, సచివాలయాల వ్యవస్థలను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? జగన్ తెచ్చిన రైతుభరోసా కేంద్రాలను తీసేస్తానని చెప్పే ధైర్యం ఉందా? రైతు భరోసా సొమ్ము రద్దు చేసే ధైర్యం బాబుకు ఉందా?మోసాల బాబు విఫల హామీలు⇒ 2014లో ఇదే చంద్రబాబు తాను సంతకం చేసి ప్రధాని మోదీ, దత్తపుత్రుడి ఫొటోలతో ముఖ్యమైన హామీలంటూ ప్రతి ఇంటికీ పంపిన పాంప్లెట్ గుర్తుందా? ఎల్లో మీడియాలో ప్రకటనలతో ఊదరగొట్టారు. మంగళ సూత్రం తెంపుతున్న చేతిని అడ్డుకుంటూ మరో చెయ్యి వస్తుంది. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం మీ ఇంటికి రావాలంటే బాబు రావాలన్న అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా? ⇒ రైతులకు రూ.87,612 కోట్ల రుణాలను మాఫీ చేశాడా? ⇒ రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? ⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశాడా? ⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో రూ.1.20 లక్షల నిరుద్యోగ భృతి ఎవరికైనా ఇచ్చాడా?⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. కనీసం ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా? ⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు. మరి అయ్యాయా? ⇒ ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? ⇒ సింగపూర్కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో ఎక్కడైనా కనిపిస్తోందా? ⇒ పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా? ⇒ అవే మూడు పార్టీలు మరోసారి కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కార్లు అంటూ మరోసారి మోసాలకు తయారయ్యాయి.మన అభ్యర్థులను దీవించండిఅనంతపురం ఎంపీ అభ్యర్థి శంకరణారాయణ, తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి ఎం. గురుమూర్తి, వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వై.విజయసాయిరెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ను మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా.మనం చేసిన మంచిలో మచ్చుకు కొన్ని..⇒ ఇంటి వద్దకే రూ.3 వేల పెన్షన్ అనగానే గుర్తుకొచ్చేది మీ జగన్. పూర్తి ఫీజులు చెల్లిస్తూ విద్యాదీవెన, ఖర్చులకు ఇబ్బంది పడకుండా వసతి దీవెన అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. అమ్మఒడి అంటే మీ జగన్. అక్క చెల్లెమ్మలకు తోడుగా చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, సున్నా వడ్డీ, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు, మహిళా సాధికారత, రైతు భరోసా, ఆర్బీకేలు, విస్తరించిన ఆరోగ్యశ్రీ, జీవనభృతికి ఇబ్బంది లేకుండా విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా, పేదవాడికి మందులు, టెస్టులు అందిస్తూ ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్.⇒ స్వయం ఉపాధికి ఊతమిస్తూ మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, వాహనమిత్ర, చేదోడు, తోడు, లా నేస్తం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ప్రతి గ్రామంలో సచివాలయం, ప్రతి 60–70 ఇళ్లకు ఒక వలంటీర్, ఇంటికే పౌరసేవలు, పథకాలు చూస్తే గుర్తుకొచ్చేది మీ జగన్. నాడు–నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడులు, గవర్నమెంట్ హాస్పిటళ్లు చూస్తే గుర్తుకువచ్చేది మీ జగన్. గ్రామంలోనే మహిళా పోలీస్, ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో దిశ యాప్ చూస్తే గుర్తుకొచ్చేది మీ జగన్.తాడిపత్రిలో అగ్రికల్చర్ కాలేజీఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి అన్న, ఎంపీ అభ్యర్థి శంకరన్నపై మీ చల్లని దీవెనలు ఉంచాలని సవినయంగా కోరుతున్నా. కాసేపటి క్రితం పెద్దారెడ్డి అన్న తాడిపత్రి నియోజకవర్గంలో అగ్రికల్చర్ కాలేజీ గురించి ప్రస్తావించాడు. తాడిపత్రిలో అగ్రికల్చర్ కాలేజీని మళ్లీ మన ప్రభుత్వం రాగానే కచ్చితంగా ఏర్పాటు చేస్తామని మాట ఇస్తున్నా. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మరికొన్ని కూడా ప్రస్తావించారు. అవన్నీ పెద్దారెడ్డి అన్నతో దగ్గరుండి మీకు మంచి చేస్తామని హామీ ఇస్తున్నా.ఇవన్నీ కొనసాగాలంటే మన పార్టీకి ఓటేయండి...నేను చంద్రబాబు మాదిరిగా సెల్ఫోన్ కనిపెట్టానంటూ బడాయిలు చెప్పడం లేదు. ఈ 58 నెలల పాలన ప్రోగ్రెస్ రిపోర్టు మీ ముందు ఉంచి మీరే మార్కులు వేయాలని మీ బిడ్డ అడుగుతున్నాడు. మీ జగన్కు మీరు అధికారం ఇవ్వడం వల్లే ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో కనీసం ఆరేడు విప్లవాత్మక కొత్త వ్యవస్థలు ఏర్పాటు చేయగలిగాడు. ఈ వ్యవస్థలన్నీ మీవద్ద ఉన్నాయో లేదో మీరే ఆలోచన చేయండి. అవన్నీ ఇలాగే కొనసాగాలంటే, మన పాలన బాగుందనుకుంటే మన పార్టీకి ఓటు వేయండని మీ బిడ్డ అడుగుతున్నాడు. అమ్మఒడి లాంటి పథకాల ద్వారా పిల్లల్ని ఇలాగే చక్కగా చదివించాలనుకుంటే మళ్లీ మీ అన్నకు అధికారం ఇవ్వండి. పిల్లలు ఇలాగే ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటూ ఈ మార్పులు కొనసాగాలంటే మీ బిడ్డకే, ఫ్యాన్కు ఓటు వేయాలి. నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు పథకాలు సజావుగా కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి మీ బిడ్డకు తోడుగా ఉండాలి. చంద్రబాబు మార్కు దోపిడీ, జన్మభూమి కమిటీల రాజ్యం మళ్లీ రాకూడదంటే ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి మరోసారి ఆశీర్వదించాలి.మీ బిడ్డ ఎలా చేయగలిగాడు? నాడూ నేడూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. అప్పులు కూడా అప్పటి కంటే ఇప్పుడే గ్రోత్ రేటు తక్కువ. మరి మీ బిడ్డ ఎలా బటన్లు నొక్కగలిగాడు? కనీ వినీ ఎరుగని స్కీములు ఎలా ఇవ్వగలిగాడు? అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ఎలా పంపించగలిగాడు? అనేది ఆలోచన చేయమని కోరుతున్నా. ఈ డబ్బంతా చంద్రబాబు పాలనలో ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ఆలోచన చేయండి. మన రాష్టానికి వచ్చిన పొత్తుల నాయకులను చూస్తుంటే సుమతీ శతకం ‘‘తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతీ’’ గుర్తుకొస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో తిరుగుతున్న చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ, ఈనాడు రామోజీ, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 నాయుడు వీళ్లలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా నివాసం ఉంటున్నారా? ఎన్నికలు వచ్చాయి కాబట్టే వీరంతా ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. ఓడిన వెంటనే వీళ్లంతా మళ్లీ హైదరాబాద్కు వెళ్లిపోతారు. ఇదీ వాళ్లకు మన రాష్ట్రంతో ఉన్న అనుబంధం. ఈ నాన్ లోకల్ కిట్టీ పార్టీలకు, వాటి సభ్యులకు, నయా ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు మన రాష్ట్రం, మన ప్రజలంటే కేవలం దోచుకునేందుకు.. దోచుకునేది పంచుకునే వనరుల లాంటివి. వీరిలో ఏ ఒక్కరికీ మన రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు. మేం చేసిన మంచి చూసి మాకు ఓట్లేయాలని అడిగే ధైర్యం లేదు. చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ అయితే, ఇంటింటికి చేసిన మంచిని సగర్వంగా చెబుతున్న పార్టీ మనది. ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంటికీ చేసిన మంచి ఇదీ అని మీ బిడ్డ సగర్వంగా చెబుతున్నాడు. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే తోడుగా, సైనికులుగా నిలవాలని కోరుతున్నా. -
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
వారందరివీ రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు.. ఒక్క రోజు పనిలోకి వెళ్లకపోతే పస్తులుండాల్సిన పరిస్థితి.. వారికి తెలిసిన విద్య చేపల వేట మాత్రమే.. వివిధ కారణాల వల్ల స్థానికంగా చేపలు లభించని రోజుల్లో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి.. సముద్రంలోకి వేటకు వెళితే ఇంటికి తిరిగి వచ్చే వరకు కుటుంబ సభ్యులకు కంటి మీద కునుకు కరువు.. వేట నిషేధం సమయంలో అయితే కటిక దరిద్రం తప్పదు.. ఇదంతా ఐదేళ్ల క్రితం.. ఈ ఐదేళ్లలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది.. అన్ని విధాలా మత్స్యకారులకు అండగా నిలిచి భరోసా కల్పిస్తోంది. రికార్డు స్థాయిలో దిగుబడులు..ఎగుమతులు మత్స్య ఉత్పత్తుల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రొయ్యల ఉత్పత్తి 1.74 లక్షల టన్నులు ఉంటే.. ఈ 5 ఏళ్లలో 7.47 లక్షల టన్నులకు పెరిగింది. మంచినీటి రొయ్యల దిగుబడులు 10.04 లక్షల టన్నులు, ఉప్పునీటి రొయ్యల దిగుబడులు 7.06 లక్షల టన్నులకు చేరాయి. జాతీయ స్థాయిలో 77.55 శాతం ఏపీలోనే ఉత్పత్తి అవుతోంది. గ్రోత్ రేట్ జాతీయ స్థాయిలో 19.37శాతం ఉంటే, ఏపీలో 23.28 శాతంగా నమోదైంది. 2018–19లో రూ. 16,825 కోట్ల విలువైన 3.13 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతి అయితే, 2022–23లో రూ.19,847 కోట్ల విలువైన 3.29 లక్షల టన్నులు ఎగుమతయ్యాయి. చినలక్ష్మి సంతోషం ఈమె పేరు కారే చినలక్ష్మి. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటకు చెందిన ఈమె కుటుంబానికి చేపల వేటే జీవనాధారం. వేట నిషేధ సమయంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేవలం రూ.2 వేలు మాత్రమే భృతిగా ఇచ్చేవారు. 2019లో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు దాన్ని రూ.4 వేలకు పెంచారు. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా ఆ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచింది. బోటులో ఆయిల్ నింపే ప్రతిసారీ సబ్సిడీ వస్తోంది. ఆమె కుమార్తెకు నాలుగేళ్లపాటు అమ్మఒడి అందింది. ఈ ఏడాది డిగ్రీలో చేరడంతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనకు దరఖాస్తు చేసింది. చేయూత కింద రూ.18,750, ఆసరా కింద రూ.10 వేలు చినలక్ష్మికి జమ అవుతోంది. భర్తకు మత్స్యకార పింఛన్ మంజూరైంది. పొన్నాడ జగనన్న లేఅవుట్లో సెంటున్నర స్థలమూ ఇచ్చారు. అక్కడ సెంటు రూ. 2 లక్షలకు పైగా పలుకుతోంది. ఇంటి నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. ఇలా గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ లబ్ధి పొందలేదని.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే తమకు మేలు జరిగిందని చినలక్ష్మి సంతోషంతో చెబుతోంది. కాకినాడ హార్బర్ ఓ ఉదాహరణ కాకినాడ ఫిషింగ్ హార్బర్లో 2018–19లో మెకనైజ్డ్, మోటరైజ్డ్, నాన్ మోటరైజ్డ్ బోట్లు 503 ఉండగా, వాటి సంఖ్య ప్రస్తుతం 578కు చేరింది. మెకనైజ్డ్ బోట్లు 398 నుంచి ఏకంగా 451కి పెరిగాయి. 2018–19 నాటికి వేటకు వెళ్లే వారి సంఖ్య 4,149 ఉంటే ప్రస్తుతం 4,763కు పెరిగింది. మెకనైజ్డ్ బోట్లపై వేటకు వెళ్లే వారి సంఖ్య 3,582 నుంచి 4,059 మందికి చేరింది. గతంలో బోట్లపై ఆధారపడి జీవనోపాధి పొందే వారి సంఖ్య 11,971 మంది ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 14,541 మందికి పెరిగింది. మత్స్య దిగుబడులు 2018–19లో రూ.677 కోట్ల విలువైన 22,592 టన్నులు వస్తే 2023–24లో రూ.890.12 కోట్ల విలువైన 25,153 టన్నులు వచ్చాయి. ఆక్వా రంగానికి జవసత్వాలు ఆక్వా రంగం నిలదొక్కుకోవడానికి సీఎం వైఎస్ జగన్ చొరవ, కృషి ఎంతగానో ఉపయోగపడింది. ధరలు పతనమైన సమయంలో ఏ ఒక్క ఆక్వా రైతు నష్టపోకుండా చర్యలు తీసుకున్నాం. ప్రాసెసింగ్ సంస్థలు 3 సార్లు పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను ఉపసంహరించేలా చేయగలిగాం. ప్రభుత్వం నిర్దేశించిన గిట్టుబాటు ధరకే రొయ్యల కొనుగోలు చేయించగలిగాం. జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ విద్యుత్ సబ్సిడీ వర్తింప చేసాం. –వడ్డి రఘురాం, వైస్ చైర్మన్, ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గంగపుత్రుల జాతకాలు మారిపోయాయి. గత ప్రభుత్వ కాలంలో వారు పడిన కష్టాలు తొలగిపోయాయి. ఈ ఐదేళ్ల కాలంలో వారింట అన్నీ మీన రాశులే. వ్యయాలన్నీ ఆదాయాలుగా మారాయి. అవమానాల స్థానంలో రాజపూజ్యాలు ఎదురయ్యాయి. ఆక్వా రైతుల జీవన ప్రమాణాలు సైతం మెరుగుపడ్డాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆటుపోట్లు ఎదుర్కొన్న మత్స్యకారులు, సంక్షోభంలో చిక్కుకున్న ఆక్వా రైతులకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. (పంపాన వరప్రసాద రావు, సాక్షి ప్రతినిధి, అమరావతి)ఐదేళ్లలో మత్స్యకారులకు రూ.4913 కోట్ల లబ్ధి చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన 175 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రూ.17.50 కోట్ల పరిహారాన్ని ఈ ప్రభుత్వం అందజేసింది. చంద్రబాబు పాలనలో 300 మందికి అందిన సాయం కేవలం రూ.11.43 కోట్లు మాత్రమే. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జీఎస్పీసీ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.78.22 కోట్లు, ఓఎన్జీసీ పైపులైన్ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది కుటుంబాలకు ఐదు విడతల్లో రూ.647.44 కోట్లు సాయాన్ని ప్రభుత్వం అందించింది. వివిధ పథకాల ద్వారా ఈ 5 ఏళ్లలో రూ.4913 కోట్ల లబ్ధి నేరుగా మత్స్యకారులకు అందించింది. అప్సడా చట్టాలతో ఆక్వా రైతుకు రక్షణ ఆక్వా కల్చర్ వ్యాపార కార్యకలాపాల పర్యవేక్షణ, నియంత్రణ, ప్రోత్సాహానికి వీలుగా ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ–2020, ఏపీ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్–2020(అప్సడా)లను అమలులోకి తీసుకొచ్చింది. ఇవి నేడు ఆక్వా రైతులకు రక్షణ కవచాలుగా నిలిచాయి. తీర ప్రాంత జిల్లాల్లో 35 ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటుతో ఇన్పుట్ టెస్టింగ్, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. తీర గ్రామాల్లోని ఆర్బీకేల్లో 732 ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సీడ్, ఫీడ్ సప్లిమెంట్స్, మందులు, వలలు, ఇతర ఇన్పుట్స్ పంపిణీ చేస్తున్నారు. ప్రతి 15 రోజులకోసారి సమీక్షించి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరల హెచ్చు తగ్గులను ‘అప్సడా’ ద్వారా మద్దతు ధర దక్కేలా చేస్తోంది. ఐదేళ్లలో 3 సార్లు కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను వెనక్కి తీసుకునేలా చేసింది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఆక్వా రైతులకు బీమా సౌకర్యం కలి్పంచింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్కు స్కోచ్ అవార్డుతో పాటు 2021–22, 2023–24లలో బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు దక్కాయి. ఆక్వా రైతుకు రెట్టింపు ఆనందం ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా సాగు విస్తీర్ణం, దిగుబడులు, ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. బాబు హయాంలో ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ పరిధి నోటిఫై చేయడంలో జరిగిన నష్టాన్ని ఈ ప్రభుత్వం గుర్తించి రీ సర్వే చేయించింది. దీంతో 3,56,278 ఎకరాల విస్తీర్ణం పెరిగింది. విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 54072కు చేరింది. జోన్ పరిధిలోకి వచ్చిన 10 ఎకరాలలోపు సాగుదారులందరికీ యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందించడంతో మెజార్టీ ఆక్వా రైతులకు లబ్ధి చేకూరింది. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన విద్యుత్ బకాయిలు రూ.340 కోట్లు సహా ఈ ఐదేళ్లలో రూ.3497 కోట్ల సబ్సిడీ అందుకున్నారు. దేశానికే ఆదర్శంగా ఫిష్ ఆంధ్ర స్థానిక వినియోగం పెంచడం లక్ష్యంగా ఫిష్ ఆంధ్రా బ్రాండింగ్తో డొమెస్టిక్ మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను హబ్ అండ్ స్పోక్ మోడల్లో 40–60 శాతం సబ్సిడీతో జిల్లా స్థాయిలో ఆక్వా హబ్లు(రూ.కోటి), వాటికి అనుబంధంగా మినీ రిటైల్ అవుట్లెట్స్ (రూ.3లక్షలు), డెయి లీ (రూ.10లక్షలు), సూపర్(రూ. 20లక్షలు), లాంజ్ (రూ.50 లక్షలు) యూని ట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్ప టికే జిల్లా స్థాయిలో 2 ఆక్వా హబ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2,630 మినీ, 113 డెయిలీ, 66 సూపర్, 31 లాంజ్, 76 త్రీ వీలర్, 179 ఫోర్ వీలర్ యూనిట్లు మంజూరయ్యా యి. ప్రత్యక్షంగా 6941 మందికి, పరోక్షంగా 13,146 మందికి ఉపాధి లభిస్తోంది. నర్సాపురం వద్ద దేశంలోనే మూడో మత్స్య యూనివర్సిటీ నర్సాపురం సమీపంలో రూ.332 కోట్లతో 40 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ మత్స్య యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. రూ.100 కోట్లతో పరిపాలనా భవనం, అకడమిక్ బ్లాక్, బాలుర, బాలికల హాస్టల్స్, రైతు శిక్షణ కేంద్రం, వైస్ చాన్సలర్ బంగ్లా, మలీ్టపర్పస్ బిల్డింగ్ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. యూనివర్సిటీ కోసం 140 పోస్టులు మంజూరు చేశారు. కార్యకలాపాలు 2023–24 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయి. దీనికి అనుబంధంగా బీఎఫ్ఎస్సీ కోర్సుతో 60 సీట్లతో కొత్తగా నర్సాపురం ఫిషరీస్ కళాశాలను ఏర్పాటు చేశారు. తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ముత్తుకూరు మత్స్య కళాశాలలో సీట్ల సంఖ్యను 40 నుంచి 60కి పెంచారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మ పేటవద్ద రూ.36.55 కోట్ల అంచనాతో 30 ఎకరాల్లో ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ (ఏక్యూ ఎఫ్సీ)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. చెన్నై నుంచి కార్యకలాపాలు నిర్వహించే కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (సీఏఏ) ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు. సిబాతో పాటు మరికొన్ని కేంద్ర కార్యాలయాలను కూడా ఏపీకి తీసుకొచ్చేందుకు అడుగులు వేశారు. -
ప్రజల మనిషి జగన్
‘రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే జగన్మోహన్రెడ్డి లక్ష్యం. నిరంతరం ప్రజల మనిషిగా నిలిచిపోవాలన్నదే ఆయన ఆకాంక్ష. గత ఎన్నికల సమయంలోనే ఆయనలో ఉన్న గొప్ప ప్రజాసేవకుడిని గుర్తించాను. ఆయన తన ఆకాంక్షలు అంచనాలకు మించి జగన్ పనిచేస్తున్నారు’ అని ప్రముఖ చలన చిత్ర నటుడు భానుచందర్ అన్నారు. జగన్ పాలనా దక్షతపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... నిస్సందేహంగా జగన్ ఒక బ్రిలియంట్ గై. ఆయన ఏది చేసినా ప్రజల గురించి చేస్తున్నారు. ఆయనో అసలు సిసలు యువ నేత. ఆయనది నవ యువ భావజాలం. ఆయన రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రతీ నిమిషం ఆలోచన చేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ ఎలాగైతే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్నారో... అలాగే జగన్ బాబు కూడా అదే ఆలోచనతోనే ప్రయాణం చేస్తున్నారు. ఆయన ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నారు. ప్రజల మేలు కోరి చేసే ఆయన ఆలోచనలు, ప్రణాళికలు... అన్నీ సాకారం కావాలని నేను కోరుకుంటున్నాను. వైఎస్సార్లాగా కాదు... అంతకు మించి ఈ భూమ్మీద ఎవరూ శాశ్వతం కారు. బతికినంత కాలం మనం నలుగురికి ఏం మంచి చేశామనేదే ముఖ్యం. కొన్ని తరాల పాటు మన పేరు ప్రజలకు గుర్తుండిపోవాలి. దివంగత వైఎస్సార్ విషయంలో అదే జరిగింది కదా. ఆరోగ్యశ్రీ అనే ఒక్క పథకం వల్ల వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇప్పటికీ జనం గుండెల్లో శాశ్వతంగా బతికున్నారు. అలాగే జగన్బాబు కూడా అంతకు మించి అనేక మంచి పనుల ద్వారా ప్రజలకు గుర్తుండిపోవాలి అని ఆశపడుతున్నారు. నిజంగా యుక్త వయసులోనే ఇలాంటి ఆలోచనా ధోరణి రావడం చాలా గొప్ప విషయం. అది సాధించే శక్తి కూడా ఆయనకు ఉంది. –సాక్షి, అమరావతి మంచికే మద్దతు పలకాలి మోదీ నుంచి జగన్ బాబు దాకా ప్రజలకు మంచి చేసే వారికి మద్దతివ్వాలి అనేది నా మనస్తత్వం. విమర్శలు చేసేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. మన దేశంలో గాం«దీజీ మీద కూడా విమర్శలు చేస్తారు. ఎవరి విమర్శల వెనక ఏముందో ప్రజలకు బాగా తెలుసు. అయితే అవన్నీ పక్కనబెట్టి మనం ప్రజలకు ఏం చేస్తున్నాం? మన వల్ల ప్రజలకు కలుగుతున్న లాభమేమిటి? అనేది జగన్ బాబుకు ముఖ్యం. తను నమ్ముకున్న అదే పంథాలో ఆయన వెళుతున్నారు.కచ్చితంగా ఆయనకు అంతా శుభమే జరగాలి. జరుగుతుంది కూడా. నేను గత ఎన్నికల ముందు కూడా జగన్ ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయని, ఆయన గొప్ప పాలన అందిస్తారని అప్పుడే చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతోంది. గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా జగన్ను నేను కలవలేదు. అయితే అది ముఖ్యం కాదు. ఆయన ప్రజలకు మంచి చేయడం నాకు ముఖ్యం. అలాంటి ముఖ్యమంత్రికి నాలా ప్రజల మంచి కోరుకునే ప్రతీ ఒక్కరూ మద్దతివ్వాలి. ఇస్తారనే నేను నమ్ముతున్నాను. తమకెవరు మంచి చేశారనేది ప్రజల్లో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. తమ గురించి నిరంతరం ఆలోచించే మంచి చేసిన వారినే జనం గెలిపిస్తారు. జనం గురించి ఎప్పుడూ ఆలోచించే నాయకుడు జగన్. నా ఉద్దేశం ప్రకారం మళ్లీ జగన్ గెలవడం... ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగడం ఖాయం.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement