ఏలూరు (టూటౌన్) : ఈ ఆర్థిక సంవత్సరంలో 40 వేల హెక్టార్లల్లో బిందు సేద్యం పథకం అమలు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు ప్రాజెక్టు డెరైక్టర్ ఎంబీ రామారావు తెలిపారు. తక్కువ నీటితో ఎక్కువ ఫలితాలనందించే బిందుసేద్యం విధానం ఉత్తమమైనదని, దీని ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. ఆయన శనివారం బిందు సేద్యానికి సంబంధించిన పలు అంశాలను తెలియజేశారు.
పలు ప్రయోజనాలు
బిందుసేద్యంతో 50 శాతం నీరు ఆదా అవుతుందని, తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటను సాగు చేయవచ్చని రామారావు తెలిపారు. ఒకే సమయంలో తోట మొత్తం నీరు అందించవచ్చన్నారు. చెట్లు, పాదుల్లో తేమ ఎక్కువ, తక్కువ కాకుండా సరిపడేంతగా ఉండటం వల్ల బాగా పెరుగుతాయన్నారు. బిందు సేద్యం వల్ల 40 నుంచి 50 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుందన్నారు. రాత్రిపూట విద్యుత్ వచ్చినా సమృద్ధిగా తోటకు నీరు అందించే అవకాశం ఉందన్నారు.
నీటిపారుదల విధానాలు
బిందు సేద్యంలో ఇన్లైన్ రకం, ఆన్లైన్ రకం అనే రెండు పద్ధతుల్లో డ్రిప్ ఉంటుందని ఆయన తెలిపారు. వీటిని పంటల రకం మొక్క, చెట్ల మధ్య దూరాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలన్నారు. బోరు బావి, విద్యుత్ సౌకర్యం, నీటి మోటారు కలిగిన ఉద్యాన, వ్యవసాయ, కూరగాయ పంటలు, పూల తోటలు, చెరకు, మల్బరీ, ఆయిల్పామ్ రైతులు ఎవరైనా ఈ పథకానికి అర్హులన్నారు.
దరఖాస్తు చేసుకొనేది ఇలా
బిందు సేద్యం పథకంలో డ్రిప్, స్ట్రింక్లర్లు ఏర్పాటు చేసుకునేందుకు రైతులు రెండు పాస్పోర్టు సైజు ఫొటోలతో దగ్గరలోని మీ-సేవ కేంద్రంలో 1 బీఫారం లేదా టైటిల్డీడ్ నకళ్లు తహసిల్దారు సంతకంతో ఇవ్వాలన్నారు. టైటిల్ డీడ్ లేని పక్షంలో రిజిస్టర్ అయిన భూమి డాక్యుమెంట్ కాపీతో పాటు పదేళ్ల ఈసీ జత పరచాలన్నారు. ఎఫ్ఎంబీ కాపీని వీఆర్వోతో ధ్రువీకరించి ఇవ్వాలన్నారు. నీటి భాగస్వామ్య పత్రం వీఆర్వోతో సర్టిఫై చేయించి మట్టి, నీటి నమూనాల పరీక్షల విశ్లేషణ పత్రాన్ని జతపరుస్తూ మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తును రిజిస్టర్ చేయించుకోవాలన్నారు.
రాయితీలు
బిందు సేద్యం పథకంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు ఐదు ఎకరాలకు లోబడి రూ. లక్ష వరకు రాయితీ ఉంటుందన్నారు. చిన్నసన్నకారు రైతులకు ఐదు ఎకరాలు లోబడి యూనిట్ ధరలు రూ. లక్షకు 90 శాతం రాయితీ ఇస్తారన్నారు. ఐదు ఎకరాల నుంచి ఎంత భూమి ఉంటే అంతకు రైతులందరికి యూనిట్ ధరలో రూ. 2లక్షల వరకు 50 శాతం రాయితీ అమలవుతుందన్నారు. గతంలో రాయితీ పొందిన సర్వే నెంబర్లో ఉన్న పొలం కాకుండా అదే సర్వే నెంబరులో ఉన్న మిగిలిన పొలానికి కాని, మరొక సర్వే నెంబరులో ఉన్న పొలంలో కాని డ్రిప్, స్ట్రింక్లర్ల పరికరాలు ఏర్పాటు చేసుకునేందుకు రాయితీ పొందవచ్చన్నారు.
బిందు సేద్యంపై ప్రతిపాదనలు
Published Sun, Aug 9 2015 1:22 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement