మున్సిపాలిటీలకు పచ్చజెండా | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీలకు పచ్చజెండా

Published Sat, Nov 2 2013 1:35 AM

government accepted to develop as Municipalities

సాక్షి, రంగారెడ్డిజిల్లా :  జిల్లాలోని 35 పంచాయతీల భవితవ్యంపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. జిల్లాలో గ్రేటర్‌లో విలీనం చేద్దామనుకున్న పంచాయతీలన్నింటినీ నగర పంచాయతీలుగా మార్చేందుకే  ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో గ్రేటర్‌లో విలీనం చే స్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పలువురు పంచాయతీలుగానే కొనసాగించాలని కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం 35 పంచాయతీల విషయాన్ని త్వరగా తేల్చాలంటూ పట్టుపట్టింది.
 దాంతో అటు ప్రభుత్వం ఇటు స్థానికుల అభిప్రాయాలు తెరమరుగై మధ్యేమార్గంగా 35 పంచాయతీలను మొదటగా నగరపంచాయతీలు, తరువాత క్రమంలో మున్సిపాలిటీలుగా మార్చేందుకు ఎట్టకేలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ విలీనాన్ని తప్పించుకున్న 35 పంచాయతీలను ఎన్ని నగరపంచాయతీలు చేసే విషయమై మార్గదర్శకాలను సిద్ధం చేస్తామని అదికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement