Sakshi News home page

కొనసాగుతున్న ఐసెట్ పరీక్ష

Published Fri, May 23 2014 10:43 AM

Integrated Common Entrance Test (ICET) begin

హైదరాబాద్ :  ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు ఐసెట్ ప్రవేశ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ జరిగే ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1,42,464 మంది అభ్యర్థులు హాజరు అవుతున్నారు. ఇందుకోసం అధికారులు 263 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా ఐసెట్ పరీక్షకు సెట్- బి ప్రశ్నాపత్రంను అధికారులు శుక్రవారం ఉదయం ఎంపిక చేశారు. ఈనెల 26న ఐసెట్ కీ విడుదల చేస్తారు. జూన్ 9వ తేదీన ఐసెట్ ఫలితాలు వెలువడతాయి.

 

Advertisement

What’s your opinion

Advertisement