Sakshi News home page

మట్టిపెళ్లలు పడి వ్యక్తి మృతి

Published Sat, Feb 7 2015 5:14 PM

man died of fall of stones

అనంతపురం జిల్లా: చెరువుమట్టి తెచ్చేందుకు వెళ్లిన ఒక వ్యక్తి మట్టిపెల్లలు మీదపడి మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా నల్లమాండ మండలం రెడ్డిపల్లి గ్రామంలో శనివారం జరిగింది. వివరాలు.. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన శివప్రసాద్(25), తన అన్నతో కలిసి ఊరిలోని చెరువులో మట్టి తేవడానికి వెళ్లారు. చెరువులో మట్టి తవ్వుతుండగా ఒక్కసారిగా మట్టిపెల్లలు జారి శివప్రసాద్‌పై పడటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియ రావాల్సి ఉంది.
(బుక్కపట్టణం)

 

Advertisement

What’s your opinion

Advertisement