Sakshi News home page

కృష్ణా నదిలో ఈతకెళ్లి ఇద్దరి గల్లంతు

Published Sun, Apr 26 2015 7:14 PM

two persons missed in krishns river

అమరావతి: కృష్ణా నదిలో ఈతకెళ్లి ఇద్దరు గల్లంతయ్యారు. ఈ సంఘటన ఆదివారం గుంటూరు జిల్లా అమరావతిలో కృష్ణా నది వద్ద జరిగింది. వివరాలు..గ్రామానికి చెందిన షేక్ నాగులమీరా, వీరేంద్ర, వంశీ, నాగులమీరాలు ఈత కెళ్లారు. ఈక్రమంలోనే నది వేగానికి నాగులమీరా, వీరేంద్రలు గల్లంతయ్యారు. దీంతో తోటి స్నేహితుడు వంశీ పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement