రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి

Published Fri, Sep 27 2013 2:17 AM

unfortunately one person felt down from the train and died

 వెల్దుర్తి, న్యూస్‌లైన్: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని రైల్వే గేటు వద్ద రైలు నుంచి జారి పడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. గురువారం ఉదయం పొలానికి వెళ్తున్న రైతులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి , డోన్ సీఐ డేగల ప్రభాకర్, ఎస్‌ఐ ధనుంజయ సంఘటన స్థలానికి చేరుకున్నారు.
 
 మృతదేహం వద్ద ఉన్న గుర్తింపు కార్డులను పరిశీలించగా వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందులకు చెందిన వీరాంజనేయులు(38)గా గుర్తించారు. బుధవారం రాత్రి ఎగ్మోర్ వెళ్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతుని బంధువులకు సమాచారం అందించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.  
 

Advertisement
Advertisement