Sakshi News home page

250వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Published Thu, Aug 30 2018 7:20 AM

YS Jagan 250th Day Prajasankalpayatra Started - Sakshi

సాక్షి, విశాఖ: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 250వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం అనకాపల్లి నియోజకవర్గంలోని తుమ్మలపాల శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి మర్టురు క్రాస్‌, బవులవాడ క్రాస్‌, త్రిముర్తుల నగర్‌  మీదుగా ధర్జీనగర్‌ వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగనుంది.

వైఎస్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement