ఫోన్లో వైద్యులను సంప్రదించిన వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

ఫోన్లో వైద్యులను సంప్రదించిన వైఎస్ జగన్

Published Thu, Apr 24 2014 9:46 AM

ys jagan mohan reddy enquires about shobha nagireddy health

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యం గురించి డాక్టర్ సోమరాజుతో పాటు ఇతర వైద్య ప్రముఖులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి తెలుసుకుంటున్నారు. ఆమె కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారికి ధైర్యం చెబుతున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాజమండ్రి నుంచి విమానంలో హైదరాబాద్ బయల్దేరారు.

శోభా నాగిరెడ్డి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసి వైఎస్ భారతి తక్షణం కడప నుంచి హైదరాబాద్కు బయల్దేరారు. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శోభా నాగిరెడ్డిని పరామర్శించేందుకు పలువురు పార్టీ నాయకులు, ఇతర పార్టీలకు చెందిన నాయకులు కూడా ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఎంవీ మైసూరారెడ్డి, నన్నపనేని రాజకుమారి తదితరులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement