Sakshi News home page

దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి

Published Wed, Jul 5 2017 2:14 AM

దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి

కరీంనగర్‌ : తెలంగాణ తొలి ఆమరుడు దొడ్డి కొమురయ్య ఆశయసాధనకు పోరాడాల ని తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల పెంపకందారుల రాష్ట్ర అధ్యక్షుడు కాల్వ నర్సయ్యయాదవ్‌ అన్నారు. తెలంగాణ చౌక్‌లో జిల్లా అధ్యక్షుడు కడారి అయిలయ్య అధ్యక్షతన కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  నాయకులు గు ర్రాల మల్లేశం, జక్కం సంపత్, పైడిపల్లి రాజు, చెర్ల పద్మ, లక్ష్మినారాయణ, పూసాల సంపత్, రాజయ్య, వీరేశం తదితరులు పాల్గొన్నారు.

న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో...
సీపీఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో కొమురయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. డివిజన్‌ కార్యదర్శి మీసం లక్ష్మణ్‌ , భాస్కర్, కిషన్, రాజు, నర్సయ్య, సాయిలు, అంజయ్య, రాంచంద్రం,రాజు తదితరులు పాల్గొన్నారు.

గొల్ల కురుమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో...
గొల్లకురుమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకల చంద్రశేఖర్‌యాదవ్‌ ఆధ్వర్యంలో దొడ్డికొమురయ్యకు నివాళి అర్పించారు. జిల్లా అధ్యక్షుడు గాలి రమేశ్, వేంసాని అంజనేయులు, రాజు,కుమార్, సురేష్, రావ రాజు, సంతోష్,అనిల్, ఏ.అనిల్, తదితరులు పాల్గొన్నారు.

కురుమ సంఘం ఆ«ధ్వర్యంలో....
జిల్లా కురుమ సంఘం కార్యాలయంలో కొమురయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మీసా బీరయ్య, నాయకులు ఎల్కపల్లి లచ్చయ్య, చిగుర్ల శ్రీనివాస్, రాజేందర్, బీర్ల బీరయ్య తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement