Sakshi News home page

మృత్యువుతో పోరాడి ఓడాడు

Published Mon, Apr 18 2016 8:45 AM

జయభారత్‌రెడ్డి (ఫైల్) - Sakshi

సాక్షి, గుంటూరు: టెక్సాస్‌లో జరిగినరోడ్డు ప్రమాదంలో గాయపడి అక్కడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న గుంటూరు యువకుడు జయభారత్‌రెడ్డి ఆదివారం మృతిచెందాడు. గుంటూరులోని వెంకటరమణ కాలనీ 3వలైనులో నివసిస్తున్న మారెళ్ల సాంబశివారెడ్డి, సరోజనిదేవి దంపతుల మూడో కుమారుడు జయభారత్‌రెడ్డి (24) అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంఘటన తెలిసిందే. ఆస్పత్రిలో తొమ్మిదిరోజులుగా చికిత్సపొందుతున్న అతడికి రెండు శస్త్రచికిత్సలు చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమెరికా విభాగంతోపాటు, పలువురు విద్యార్థులు ఆర్థిక సహాయం చేయడంతోపాటు చికిత్సకు సహకరించారు. జయభారత్‌రెడ్డి మృతితో కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. వెంకటరమణ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని గుంటూరు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు  జయభారత్‌రెడ్డి తండ్రి సాంబశివారెడ్డి విలపిస్తూ చెప్పారు.

Advertisement

What’s your opinion

Advertisement