దత్తాత్రేయ, కిషన్రెడ్డిలకు టీఆర్ఎస్ ఎంపీ కవిత సవాల్
హైదరాబాద్: గ్రేటర్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రూ. 20 వేల కోట్ల ప్యాకేజీ తీసుకొస్తే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాను బీజేపీకే ఓటు వేస్తానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డికి సవాల్ విసిరారు. సోమవారం బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని సాగర్ సొసైటీ చౌరస్తాలో ఖైరతాబాద్ నియోజక వర్గం జీహెచ్ఎంసీ ఎన్నికల శంఖారావంతో పాటు మహిళా గర్జన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మహిళలనుద్దేశించి కవిత మాట్లాడుతూ రూ.వేలాది కోట్లను కేంద్రం నుంచి తెస్తున్నామని కేంద్రమంత్రి దత్తన్నతోపాటు కిషన్రెడ్డి కూడా అంటున్నారని మరి ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని ఆమె ప్రశ్నించారు.
జీవో 59 కింద కొంత మందికి నోటీసులు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని వారు ఏ మాత్రం ఆందోళన చెందవద్దని ఆ జీవో కిందనే పట్టాలు ఇచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఇదే నియోజక వర్గంలో ఉంటున్న తాను అందరికీ చెల్లిగా అండగా ఉంటానన్నారు. సంపన్నులు, పేదలు సమాన సంఖ్యలో ఉన్న ప్రత్యేక నియోజక వర్గం ఖైరతాబాద్ అని అన్నారు. గత సర్కార్ ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రజల పక్షాన నిలబడ్డారన్నారు.
కొంత మంది హైటెక్ సిటీ కట్టించామని గొప్పలు చెప్పుకుంటారని అయితే ఆ చుట్టుపక్కల నీళ్లు, డ్రెయినేజీ, రోడ్ల సమస్య గాలికి వదిలేశారని ఇప్పుడు వాటిని పరిష్కరించే బాధ్యతను తాము తీసుకున్నట్లు తెలిపారు. గ్రేటర్లో ఆంధ్రోళ్లైనా, గుజరాతీలైనా, బిహారీలైనా అందరినీ తమ ప్రభుత్వం సమానంగా చూస్తోందనీ ఎవరిని వెళ్లగొట్టడం లేదన్నారు. గ్రేటర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ఖైరతాబాద్లో గోవర్దన్రెడ్డి, పి. విజయారెడ్డిల మధ్య మనస్పర్థలు ఉన్నాయని వాటిని పక్కనబెట్టి కార్పొరేటర్లందరినీ గెలిపించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్దన్రెడ్డి, పి. విజయారెడ్డి పాల్గొన్నారు.
రూ. 20 వేల కోట్ల ప్యాకేజీ తెస్తే..బీజేపీకే ఓటు వేస్తా
Published Tue, Jan 5 2016 7:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు..
కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement