సర్పాల్లో అరుదైన వైరాగినాగు శ్రీకాకుళం జిల్లా మందస మండలం లక్ష్మీనారాయణపురంలోని స్థానికుల చేతిలో హతమైంది. అరణ్యాల్లోను, పెద్ద పెద్ద కొండల్లో మాత్రమే సంచరించే ఈ పాము తోకను నేలపై ఉంచి తలతోపాటు శరీరం మొత్తం గాలిలో నిలబెడుతుంది. సుమారు 13 అడుగుల పొడవున్న ఈ వైరాగినాగు శుక్రవారం మందస మండలం లక్ష్మీనారాయణపురం గ్రామం వద్ద జనారణ్యంలోకి వచ్చింది. ఓ ఇంటిలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా కొంతమంది రైతులు ధైర్యం చేసి దానిని హతమార్చారు.
- మందస
# Tag
Related news
-
స్నేక్ ఎఫెక్ట్.. ఆలస్యమైన బుల్లెట్ రైలు
టోక్యో: జపాన్లో బుల్లెట్ రైలు 17 నిమిషాలు ఆలస్యమవడం హాట్టాపిక్గా మారింది. సాధారణంగా బుల్లెట్ రైళ్లు నిమిషం ఆలస్యం కాకుండా షెడ్యూల్ ప్రకారం నడుస్తుంటాయి. అయితే అనూహ్యంగా బుల్లెట్ రైలు ఆలస్యమవడానికి ఓ పాము కారణమైంది. పాము రైలుపైకి ఎలా వచ్చిందనేదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సాధారణంగా ఈ రైళ్లలో కొన్ని జంతువులను తీసుకెళ్లడానికి మాత్రం అనుమతి ఉంటుంది. పాములను మాత్రం అనుమతించరు. ప్రయాణికుల లగేజీని మాత్రం చెక్ చేసే నిబంధన లేదు. ఎవరైనా ప్రయాణికుల లగేజీలో పాము వచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. జపాన్లో బుల్లెట్ రైలు 1964 సంవత్సరంలోనే ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో బుల్లెట్ రైలు నెట్వర్క్ 2700కిలోమీటర్లుగా ఉంది. బుల్లెట్ రైళ్ల ఆలస్యం సగటున నిమిషానికంటే తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం బుల్లెట్ రైలు స్పీడు గంటకు 300 కిలో మీటర్లు. ఇదీ చదవండి.. జపాన్కు పోటెత్తిన పర్యాటకులు.. ఒక్క నెలలో రికార్డు -
గోల్డెన్ స్నేక్.. డైరెక్టుగా దుబాయ్ నుంచి..!
అతిపెద్ద పామును చూశాం.. రెండు తలల పామును చూశాం. అత్యంత విషపూరితమైన పాముల గురించి చాలా కథనాలు విన్నాం. తాజాగా బంగారు రంగు పాము ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎక్స్(ట్విటర్) యూజర్ సంతోష్ ఈ గోల్డెన్ స్నేక్ వీడియోని ఏప్రిల్ ఒకటో తేదీన షేర్ చేశారు. గోల్డెన్ స్నేక్ అనే క్యాప్షన్తో వచ్చిన ఈ వీడియో ఇప్పటికే 23 మిలియన్లకు పైగా వ్యూస్ను దక్కించుకుంది. బంగారురంగులో ఓ ఆరు అడుగుల పాము రోడ్డు దాటుతున్నట్టుగా వీడియో ఈ పోస్ట్లో ఉన్నాయి. పామును చూసిన స్థానికులు ఆశ్చర్యపోతూ రికార్డు చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు. బంగారు వర్ణంలో ధగ ధగ లాడుతూ అలా రోడ్డు అవతల ఉన్న గడ్డిలోకి జారిపోయింది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ముఖ్యంగా బంగారం ధర రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో ఎన్ని తులాలుంటుంది, దుబాయ్ నుంచి డైరెక్ట్గా వచ్చేసినట్టుంది అంటూన్న కామెంట్స్ మాత్రం చాలా స్పెషల్గా నిలిచాయి. అది ఎల్లో స్నేక్ అనీ అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటని మరొకరు వ్యాఖ్యానించారు. Golden snake 🐍 pic.twitter.com/kYnJ52gCEa — Shanthosh (@shanthosh) April 4, 2024 -
Cutest Snakes AI Photos: ఈ పాములు ఏంట్రా బాబు ఇంత ముద్దుగా ఉన్నాయ్ (ఏఐ ఫోటోలు)
-
అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!
మనం పాములను దేవతగా పూజిస్తాం. చంపేందుకు కూడా వెనకడతాం. ఎంతో పరిస్థితి సివియర్గా ఉంటేనే గానీ వాటి జోలికి వెళ్లం, హాని తలపెట్టం. అలాంటిది ఒక దేశంలో ఏకంగా వాటి రక్తాన్ని టీ, కాఫీలు తాగినట్టు తాగేస్తారట. పైగా ఎందుకుని ఇలా తాగుతారో వింటే గుండెఝల్లుమంటుంది. అందుకోసం వీటి రక్తాన్ని తాగాలా అని అసహ్యంచుకుంటారో కూడా. ఇంతకి ఎక్కడ ఇలా చేస్తారు? దేని కోసం అంటే. విష సర్పాన్ని చూసి అల్లంతా దూరానికి పరిగెడతాం. కానీ ఇండోనేషియన్ అమ్మాయిలు మాత్రం లొట్టలేసుకుంటూ వాటి రక్తాన్ని తాగేస్తారు. వాటి రక్తం తాగితే శరీరాన్ని ఫిట్గా అందంగా ఉంటుందని వారు ప్రగాఢం నమ్ముతారట. పాము రక్తం కోసం దుకాణాల్లో రద్దీ కూడా ఓ రేంజ్లో ఉంటుందట. ఇండోనేషియా రాజధాని జకర్తాలో పాము రక్తం తాగడం అనేది అత్యంత సాధారణ విషయం. ఎక్కడ చూసినా కాఫీ, టీ స్టాల్ మాదిరిగా పాము రక్తాన్ని విక్రయించడం విశేషం. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసినప్పుడు పాము రక్తాన్ని తప్పక తాగుతారట. అంతేకాదు జకర్తాలో ఈ పాము రక్తానికి మంచి డిమాండ్, ట్రెండ్ కూడా ఉంది. దీని కారణంగా ప్రతిరోజు వేలాది పాములను చంపుతారట ప్రజలు. అయితే ఈ రక్తాన్ని తాగిన తర్వాత సుమారు మూడు నుంచి నాలుగ గంటల వరకు టీ, కాఫీలను తాగకూడదట. అయితే ఎప్పుడు పడితే అప్పుడు మనం ఆఫీస్లు, కాలేజీల్లో టీ, కాఫీలు ఎలా తాగుతామో అలా అక్కడ పాము రక్తం తాగేస్తారట వాళ్లు. ఎందుకు తాగుతున్నారంటే.. ఇండోనేషియా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని.. ముఖ్యంగా అక్కడి స్త్రీలు తమ అందం పెంచుకునేందుకు తప్పనిసరిగా ఈ పాము రక్తం తాగుతారట. పాము రక్తం వల్ల చర్మం కాంతిమంతంగా ఉంటుందట. ఆరోగ్యం బాగుంటుందట. ఇలా పాము రక్తం తాగే సంప్రదాయం పురాతన కాలం నుంచి ఇండోనేషియన్ వాసులకు అనాదిగా వస్తుందట. అయితే వాళ్లు ఇలా పాము రక్తాన్ని తాగడమే కాదు వాటిని ఆహారంగా తింటారట కూడా. వాటిని చక్కగా నిమ్మగడ్డితో ఉడకబెట్టి వేయించి మరీ తింటారట. (చదవండి: అక్కడ పోలీసులు పెట్రోలింగ్కి గేదెలను ఉపయోగిస్తారట!) -
పాపికొండల్లో అరుదైన మిత్రుడు
కైకలూరు: పర్యావరణ మిత్రునిగా పిలిచే అరుదైన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ (గుడ్డి పాము) జాడ నిజమేనని మంచినీటి జీవశాస్త్ర ప్రాంతీయ కేంద్రమైన హైదరాబాద్లోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గుంటూరులోని బయోడైవర్సిటీ బోర్డు పాపికొండలు సమీపంలోని రంపచోడవరం జలపాతం వద్ద 2022 సెపె్టంబర్ 8న చనిపోయిన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ మృతదేహాన్ని కనుగొన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన శాస్త్రవేత్తలు దీపా జైస్వాల్, బి.భరత్, ఎం.కరుతాపాండి, శ్రీకాంత్ జాదవ్, కల్యాణి, కుంటేలు గుడ్డిపాము కళేబరాన్ని రసాయనాలతో హైదరాబాద్ జూలాజికల్ మ్యూజియంలో భద్రపరిచారు. అప్పటినుంచి పరిశోధనలు చేసి చివరకు డీఎన్ఏ పరీక్ష ద్వారా దీనిని అరుదైన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్గా నిర్ధారించారు. 1839లో జావా దీవుల్లో గుర్తింపు డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ను 1839లో ఇండోనేషియాలోని జావా దీవుల్లో తొలిసారిగా గుర్తించారు. ఫ్రెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త పియరి మోడర్డ్ డియార్డ్ గౌరవార్థం దీనికి డయార్ట్స్ అని నామకరణం చేశారు. ఆర్గిరోఫిస్ డయార్టి శాస్త్రీయ నామం కలిగిన ఇది టైఫ్లోపిడే కుటుంబంలో విషపూరితం కాని పాము జాతికి చెందినది. ఇవి అడుగు వరకు పొడవు పెరుగుతాయి. భారతదేశంలో ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ప్రదేశ్, అసోం, హరియాణా, బిహార్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో వీటి జాతి ఉంది. మొదటిసారి ఏపీలోని పాపికొండలు అభయారణ్య ప్రాంతమైన రంపచోడవరం జలపాతం వద్ద దీనిని కనుగొన్నారు. వానపాములు భూసారాన్ని పెంపొందించడంలో ఏ విధంగా సాయపడతాయో అంతకంటే ఎక్కువగా పర్యావరణాన్ని కాపాడటంలో గుడ్డిపాములు దోహదపడతాయి. ఐయూసీఎన్ ఆందోళన ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) తగ్గుతున్న జీవుల జాబితా అయిన రెడ్ లిస్ట్లో డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ను చేర్చింది. భారతీయ వన్యప్రాణి (రక్షణ) సవరణ చట్టంలో దీనిని చేర్చారు. చిత్తడిగా ఉండే అటవీ ప్రాంతం, పొదలు, గడ్డి భూముల్లో ఇవి నివసిస్తాయి. వీటితో పర్యావరణం పరిఢవిల్లుతుందని శాస్త్రవేత్తలు భావిస్తారు. తూర్పు కనుమల ప్రాంతమైన తమిళనాడు, ఏపీ, ఒడిశా ప్రాంతాల్లో కేవలం పాపికొండలు వద్ద ఈ జాతిని గుర్తించడంతో ఈ ప్రాంతాల్లో మరింతగా వీటి జాడ ఉండే అవకాశం ఉంది. విషపూరితమైనవి కావు డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ విషపూరితమైనవి కావు. క్రిమికీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. వానపాములు ఏ విధంగా సంతానోత్పత్తి చేస్తాయో అదేవిధంగా వీటి సంతతిని వృద్ధి చేసుకుంటాయి. పంట పొలాల్లో రసాయనాలు అధిక వినియోగం వల్ల వీటి సంతతి నశిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది. వీటిని పరిరక్షించుకోవాలి. – బి.భరత్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైదరాబాద్
Related News by category
-
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు త్వరితగతిన చెల్లించాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజులను త్వరితగతిన చెల్లించాలని, ఈనెల 24వ తేదీతో గడువు ముగుస్తుందని ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు తెలిపారు. ఇటీవలి వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన వారితో పాటు తమ మార్కులకు పెంచుకునేందుకు (ఇంప్రూవ్మెంట్/బెటర్మెంట్) ఆసక్తి చూపే విద్యార్థులు పరీక్ష ఫీజును ఈనెల 24 తేదీలోగా తమ కళాశాలల్లో చెల్లించాల్సి ఉంటుందన్నా రు. అలాగే ఇంటర్మీడియెట్ ఫలితాలపై సందేహాలున్న విద్యార్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 24వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్ఐఓ చెప్పారు. ఆన్లైన్ ద్వారా మాత్రమే నిర్దేశించిన ఫీజులను చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. ప్రాక్టికల్స్లో ఫెయిలైన విద్యార్థులకు మే ఒకటి నుంచి 4వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఏ ఫారం..బీ ఫారం అంటే..? హిరమండలం: నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. అభ్యర్థులు ‘ఏ’ ఫారం, ‘బీ’ ఫారం ప ట్టుకుని ఆర్ఓ ఆఫీసుకు వస్తారు. అసలు ఈ ఫారాలకు అర్థాలేంటో తెలుసా..? గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో తమ అభ్యర్థులను ప్రతిపాదిస్తూ ఇచ్చే పత్రాన్ని బీ ఫారం అంటారు. నామినేషన్ సమర్పించే సమయంలో అభ్యర్థులు తమ రాజకీయ పార్టీలు ఇచ్చిన బీఫారం దాఖలు చేయాలి. అప్పుడే ఆ అభ్యర్థికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ గుర్తు కేటాయిస్తారు. బీ ఫారంను పార్టీ అధ్యక్షుడు నిర్ణయించిన వ్యక్తి జారీ చేస్తారు. బీ ఫారం జారీచేసేందుకు సంబంధిత వ్యక్తికి పార్టీ అధ్యక్షుడు ఆమోదాన్ని తెలుపుతూ ఏ ఫారం అందజేస్తారు. ఏ ఫారం ఎవరి పేరు తో అధ్యక్షుడు ఇస్తారో ఆ వ్యక్తికి పోటీ చేసే అభ్యర్థులకు బీఫారం ఇచ్చే అధికారం ఉంటుంది. తన పేరు మీద అందజేసిన ఏ ఫారంను ఆయా నియోజకవర్గాల్లోని ఎన్నికల అధికారులకు పోటీ చేసే అభ్యర్థి అందజేయాల్సి ఉంటుంది. ‘అప్రమత్తత అవసరం’ ఇచ్ఛాపురం: నామినేషన్ల సమయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి స్పెష ల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ, జాయింట్ డైరెక్టర్ డి.గంగాధరం పోలీసు సిబ్బందికి సూచించారు. ఆయన గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయం గేట్ కి ఇరువైపులా 100 మీటర్ల వరకు గల కటాఫ్ పాయింట్లు ఉండేలా చూసుకోవాలని పోలీసులతో అన్నారు. నామినేషన్ల ప్రక్రియకు వచ్చిన అభ్యర్థుల వాహనాలను కటాఫ్ పాయింట్ల వద్ద నిలపాలని సూచించారు. అభ్యర్థితో పా టు నలుగురు వ్యక్తులు, మూడు వాహనాలకు మాత్రమే తహసీల్దార్ గేట్ వరకు అనుమతి ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఇ చ్ఛాపురం, సోంపేట సీఐలు ఇమ్మాన్యూయేల్ రాజు, మల్లేశ్వరరావు, ఇచ్ఛాపురం, కవిటి ఎస్ఐలు వి.సత్యన్నారాయణ, ఎన్.లక్ష్మణరావు, రాము పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘జోడీ’ పండు
ఎచ్చెర్ల మండలంలోని చినరావుపల్లిలో నంబాడ సూర్యనారాయణకు చెందిన జీడిమామిడి తోటలో మంగళవారం ఒకే జీడిపండుకు రెండు పిక్కలు కనిపించాయి. ఈ విషయమై ఎచ్చెర్ల వ్యవసాయాధికారి సురేష్ మాట్లాడుతూ జన్యులోపాల వల్ల ఇటువంటివి ఏర్పడతాయని చెప్పారు. – ఎచ్చెర్ల క్యాంపస్ వాసుదేవుని సన్నిధిలో మంత్రి సీదిరి కాశీబుగ్గ: రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి, పలాస నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సీదిరి అప్పలరాజు కుటుంబ సమేతంగా గురువారం మందసలోని వాసుదేవ పెరుమాళ్ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. నామినేషన్ వేయనున్న సందర్భంగా సంబంధిత పత్రాలను స్వామివారి పాదాల వద్ద పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అప్పలరాజు, శ్రీదేవి దంపతులు గోపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇరువర్గాల కొట్లాట ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని ఫరీదుపేటలో వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య గురువారం కొట్లా ట జరిగినట్లు ఎచ్చెర్ల ఎస్సై చిరంజీవి తెలిపా రు. శుభకార్యం వద్ద ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి దాడి చేసుకున్నారని, ఈ ఘటనలో కూన కిరణ్కుమార్కు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించామ ని చెప్పారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇటీవల సొంత బావపైన జరిగిన దాడి కేసులో కిరణ్కుమార్పై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు. భారతీయ వారసత్వ సంపద అమూల్యం శ్రీకాకుళం కల్చరల్: ఇంటాక్ శ్రీకాకుళం చాప్టర్ ఆధ్వర్యంలో గురువారం శ్రీకాకుళంలోని డచ్ భవనం వద్ద ప్రపంచ వారసత్వ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ భారతీయ వారసత్వ సంపదను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇంటాక్ కన్వీనర్ నూక సన్యాసిరావు మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం న్యూఢిల్లీ ఇంటాక్ సంస్థ పంపిన శాశ్వత సభ్యత్వాన్ని కన్వీనర్ చేతుల మీదుగా జగన్మోహనరావుకు అందించారు. కార్యక్రమంలో సహాయ ఇంటాక్ సహాయ కన్వీనర్ వి.జగన్నాథంనాయుడు, నటుకుల మోహన్, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న పాలనలోనే ప్రైవేటు బోధన సిబ్బందికి న్యాయం
ఆమదాలవలస: ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు వైఎస్సార్ సీపీ పాలనలోనే న్యాయం జరిగిందని పలువురు బోధన సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆమదాలవలస పట్టణంలోని స్పీకర్ క్యాంపు కార్యాలయం వద్ద కళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల రామారావు ఆధ్వర్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. ఈపీఎఫ్, ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పించేలా చొరవ తీసుకోవాలని విన్నవించారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాం, ఎంపీగా పేరాడ తిలక్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ను కలిసిన వ్యయ పరిశీలకుడు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ను వ్యయ పరిశీలకుడు నవీన్కుమార్ సోని గురువారం గౌరవ పూర్వకంగా కలిశారు. కలెక్టర్ కార్యాలయంలో కలిసి ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి చర్చించారు. అనంతరం వ్యయ పరిశీలకుల బృందంతో సమావేశమయ్యారు. -
బీసీ వర్గాల అభ్యున్నతికి కృషి
గార: వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో బీసీ వర్గాల అభ్యన్నతికి కృషి చేశామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార మండలం శిమ్మపేట జంక్షన్లోని కల్యాణ మండపంలో గురువారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో పేదలకు ఏ హామీలు ఇచ్చామని, వాటినే మేనిఫెస్టోలో రూపొందించి 99 శాతం అమలు చేశామని చెప్పారు. బీసీ వర్గాలకు రాజికీయంగా అనేక నామినేటడ్ పదవులు ఇవ్వడంతో పాటు పలు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. బీసీల ఓట్లు వేయించుకున్న టీడీపీ వారి అభ్యన్నతికి ఏం చేసిందని ప్రశ్నించారు. బీసీలను వాడుకొని వదిలేసిన మనస్తత్వం చంద్రబాబుదని ధ్వజమెత్తారు. ప్రజల్లో తారతమ్యాలు ఉండకూడదనే ఉద్దేశంతో విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. పిల్లల బాగు కోసం తల్లి, తండ్రి ఎలా ఆలోచిస్తున్నారో ఈ ప్రభుత్వం కూడా అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. జన్మభూమి కమిటీ అనే బ్రోకర్ల ప్రభుత్వం కావాలా.. పేదల సంక్షేమానికి కృషి చేసే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కావాలో మీరే నిర్ణయించుకోవాలన్నారు. చంద్రబాబు హామీలను నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో శ్రీశయన కార్పొరేషన్ చైర్మన్ డీపీ దేవ్, సర్పంచ్ గొలివి వెంకటరమణమూర్తి, అంబటి చినబాబు, ఎంపీపీ గొండు రఘురామ్, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, పార్టీ కన్వీనర్ పీస గోపి, ముంజేటి కృష్ణమూర్తి, అరవల రామకృష్ణ, బరాటం నాగేశ్వరరావు, శిమ్మ ధర్మరాజు, యాళ్ల నారాయణమూర్తి, కొయ్యాన చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
No Headline
అంకెల్లో అభివృద్ధిసచివాలయ సముదాయానికి ఖర్చుసుమారు రూ.కోటి డ్వాక్రా భవనం, డిజిటల్ లైబ్రరీరూ. 30 లక్షలు రూ.35 లక్షలు పాఠశాలలో నాడు–నేడు పనులురూ.12 లక్షలు ఇంటింటి కుళాయిలురూ.1.5లక్షలు అమ్మవారి గుడి కల్వర్టుపొడుగుపాడులో సీసీ రోడ్డురూ.5లక్షలు రూ.5 లక్షలు ఎస్సీవీధిలో సీసీ రోడ్డుసీసీ కాలువలురామచంద్రపురంలో సీసీ రోడ్డురూ.10లక్షలు రూ.20లక్షలు కుజ్జిపేటలో బీటీ రోడ్డురామచంద్రపురం గ్రావెల్ రోడ్డురూ.4లక్షలు రూ.8లక్షలు ఎర్రచెరువు, కుజ్జిపేట చెరువుల మదుముల నిర్మాణంరూ.50 వేలు పొడుగుపాడు– శ్రీజగన్నాధపురం వీధిలైట్లు
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
విల్ జాక్స్ విధ్వంసకర సెంచరీ.. 10 సిక్స్లతో! వీడియో వైరల్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement