Sakshi News home page

బస్సులో పొగలు.. కిటికీ నుంచి దూకేశారు!

Published Tue, Nov 15 2016 7:00 AM

rtc bus got fire accident and passengers out of danger

కాకినాడ: ఆర్టీసీ బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. బస్సు కిటికీలోంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి వద్ద మంగళవారం వేకువజామున చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు కత్తిపూడి వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సు ఇంజిన్ నుంచి పొగలు వ్యాపించాయి.

దీంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు అగ్నిప్రమాదంలో దగ్దం అవుతుందేమోనని భావించిన కొందరు ప్రయాణికులు తమ సీటు పక్కే ఉన్న కిటికీ నుంచి బయటకు దూకేసి.. ప్రాణాలతో బయటపడ్డారు. కొందరు ప్రయాణికులు బస్సు డోర్ నుంచి త్వరగా దిగేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

What’s your opinion

Advertisement