Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Published Sun, Sep 11 2016 12:09 AM

The person killed in road accident

మిర్యాలగూడ రూరల్‌ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన మండలంలోని వెంకటాద్రిపాలెం శివారులో శనివారం రాత్రి జరిగింది. రూరల్‌ ఎస్సై సర్దార్‌నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం అంజనపల్లి గ్రామానికి చెందిన నార్ల శ్రీనియ్య (40) గ్రామం నుంచి బైక్‌పై మిర్యాలగూడకు బయలు దేరాడు. ఈ క్రమంలో వెంకటాద్రిపాలెం శివారుకు రాగానే అదే మార్గంలో వస్తున్న లారీని క్రాస్‌ చేయబోయి లారీ ఢీకొట్టాడు. దీంతో త్రీగాయాలై శ్రీనియ్య అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృత దేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. 
 

Advertisement

What’s your opinion

Advertisement