సాక్షి, విజయనగరం/విజయనగరం కంటోన్మెంట్/విజయనగరం మున్సిపాల్టీ: ‘‘కడుపు నిండా దుఃఖాన్ని నింపుకొని ఉన్న మీరు మీ బాధలు చెప్పండి. మీ మాటలతోనైనా గుడ్డి ప్రభుత్వానికి చూపు తెప్పిద్దాం’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి భూసేకరణ చేస్తున్న గ్రామాల్లో ఆయన సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గూడెపువలస, కవులవాడ, ఎ.రావివలస గ్రామాల్లో నిర్వాసితులతో మాట్లాడారు. ‘‘ఇక్కడ జరుగుతున్న అన్యాయం, దౌర్జన్యం కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్రాలకు తెలియాలి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ విధంగా గడ్డి పెట్టాలో, ఎలా బుద్ధి చెప్పాలో మీ నోటితో మీరే చెప్పండి’’ అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగన్ ఎదుట పలువురు బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
ప్రాణాలైనా ఇస్తాం.. భూములు వదులుకోం
మాకు రెండెకరాల భూమి ఉంది. ఇద్దరం ఆడపిల్లలం, ఒక తమ్ముడు. ఎర్రబస్సు కూడా లేని ఈ ఊరిలో ఎయిర్పోర్టు ఎందుకు సార్? వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఇంటిలో బతుకుతున్నాం. ఇప్పుడు ఆ ఇల్లు కూడా లాక్కుంటే మేం ఎలా బతకాలి? మా పెళ్లిళ్లు ఎలా అవుతాయి? మాకు ఎయిర్పోర్టు వద్దు. మేం ప్రాణాలైనా ఇస్తాం కానీ మా భూములు మాత్రం ఇవ్వం.
- శిరాపు నర్సాయమ్మ, రెడ్డికంచేరు
మీ విమానం పెద్దల భూముల్లో ఎగరదా?
మాకు రెండెకరాల భూమి ఉంది. అది లాక్కుంటే కూలీలుగా మారిపోతాం. అయ్యా.. చంద్రబాబు గారూ మీ విమానం పెద్దల భూ ముల్లో ఎగరదా? పేదల భూముల్లోనే ఎగురుతుందా? మా భూములకోసం 30 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నాం. చంద్రబాబు మా భూములు లాక్కొని ముష్టి వేస్తామంటున్నారు. మీ ముష్టి మాకు వద్దు, మా భూములుంటే చాలు.
- కొండపు బుజ్జి, గూడెపువలస
అయ్యన్న, గంటా భూములెందుకు వదిలారు?
నిజంగా చంద్రబాబుకు అభివృద్ధి చేయాలనుకుంటే... అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్రావుల భూములను తీసుకొని మా భూము లు కూడా తీసుకుంటే ఇంతగా బాధపడకపోము. కానీ వాళ్ల భూములను వదిలి మావి లాక్కుంటారా? మాలాంటి పేదల కడుపు కొడతారా? ఇదేనా న్యాయం?
- వంశీరెడ్డి, రెడ్డి కంచేరు
అడవుల్లోకి పంపుతున్నారు
నాకు 80 సెంట్ల భూమి ఉంది. మహానుభావుడు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాగడానికి నీరు, తినడానికి తిండి, ఉపాధి పనులు ఇచ్చారు. ఇప్పుడొచ్చిన వారు ఎయిర్పోర్టులంటారు. ప్రజల భూములను లాక్కొని అన్యాయం చేయాలనుకుంటున్నారు. విమానాశ్రయం పేరుతో మమ్మల్ని అడవుల్లోకి పంపించేస్తున్నారు.
- జె.సన్నాసిరావు
శవాల మీద కడతారా?
మాకు అర ఎకరం భూమి ఉంది. కూలీ పనులు చేసుకొని బతుకుతున్నాం. అర ఎకరం భూమి లాక్కొని మమ్మల్ని ఎటో తగలెయ్యాలని చూస్తున్నారు. చంద్రబాబు మా శవాల మీద ఎయిర్పోర్టు కట్టాలనుకుంటున్నాడు. అలా కాకుండా ఓ బాంబు వేసి మమ్మల్ని చంపేసి అప్పుడు కట్టమనండి. మా భూముల్లోకి ఎవరు వస్తారో చూస్తాం.
- బి.నర్సయ్యమ్మ
ప్రభుత్వానికి చూపు తెప్పిద్దాం
Published Tue, Oct 6 2015 4:09 AM
Related news
-
అలా చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు?.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మలివిడత ఎన్నికల ప్రచార భేరి మోగించారు.ఇక సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడం.. బస్సు యాత్ర చరిత్ర సృష్టించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్, నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్లో ఆదివారం జరిగిన సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. మరోవైపు, ఎక్స్ (ట్విటర్) వేదికగా చంద్రబాబు మోసాలను సీఎం జగన్ ఎండగట్టారు.‘‘అయ్యా చంద్రబాబూ.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టావు 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు...? వచ్చే ఎన్నికల్లో మన వైసీపి అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. అయ్యా చంద్రబాబు.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టావు. 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం. మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా… pic.twitter.com/lSAAuOO7zw— YS Jagan Mohan Reddy (@ysjagan) April 28, 2024 -
ఎగ్గొట్టేందుకే చంద్రబాబు అడ్డగోలు హామీలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: తమ మేనిఫెస్టో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించేదిలా ఉండదని.. ప్రజలకు ఏం చేస్తామో అదే చెప్పామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాయిళాలు ప్రకటించి ఓట్లు వేయించుకునే ఆలోచనలు తమకు ఉండవని.. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని నాశనం చేశారని సజ్జల మండిపడ్డారు‘‘2014-19 మధ్య చంద్రబాబు తన విశ్వరూపం చూపించారు. చంద్రబాబువి సభ్యసమాజంలో ఉండగలిగే వ్యక్తి మాటలులాగా లేవు. రాళ్ల దాడి చేయమని గతంలో చంద్రబాబు అన్నాడు.. అన్నట్టుగానే రాళ్లతో దాడి చేయించాడు. మేనిఫెస్టో అంటే విశ్వసనీయత ఉండాలి. మీ కుటుంబంలో మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్ అంటున్నారు. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేనే అలా అడగగలరు. అలా చంద్రబాబు ఎందుకు ఓటు అడగలేకపోతున్నారు. సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాల్లో మేలు జరిగింది. ఈ పథకాలతో రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా? అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు అంతకంటే ఎక్కువ పథకాలు తెస్తానని ఎలా చెప్తున్నారు’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.‘‘అమలు చేసే వారెవరూ అడ్డగోలు హామీలు ఇవ్వరు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉన్న వారే చేయగలిగిన హామీలు ఇస్తారు. చంద్రబాబు వలన వాలంటీర్ల వ్యవస్థ ఆగిపోయింది. పెన్షన్ల పంపిణీకి ఆటంకం కలిగించారు. ఇప్పుడు మళ్లీ ఇంటింటికీ ఉద్యోగులను పంపించి పెన్షన్లు ఇవ్వమంటున్నారు. పేదలంతా తమ కాళ్ల మీద తాము నిలపడేలా చూడాలన్నది జగన్ ఇద్దేశం. 70 వేల కోట్లతో జగన్ తన సంక్షేమాన్ని అమలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఏకంగా లక్షన్నర కోట్లు చేస్తానంటూ మాట్లాడుతున్నారు. రాష్ట్ర బడ్జెట్తో సంబంధం లేకుండా చంద్రబాబు అబద్ధాల హామీలు ఇస్తున్నారు’’ అని సజ్జల మండిపడ్డారు.‘‘ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా జగన్ మేనిఫెస్టో ప్రకటించారు. చంద్రబాబు లాగా ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వమని కొంతమంది మాతో కూడా అన్నారు.కానీ జగన్ ఎప్పుడూ చేయలేని పని చెప్పరు. ఇచ్చిన హామీ నుంచి వెనక్కి పోరు. ఎగ్గొట్టాలనుకునే చంద్రబాబు అడ్డమైన హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఉన్న వ్యవస్థలన్నీ నాశనం అవుతాయి. జన్మభూమి కమిటీలు మళ్లీ వస్తాయి. చంద్రబాబుకు ఎవరైనా ఓటేస్తే తమ ఓటును తాము వృథా చేసుకున్నట్టే. చంద్రబాబు తన పాలనలో ఏం చేశారో ఇప్పటికీ ఎందుకు చెప్పలేకపోతున్నారు?’’ అంటూ సజ్జల నిలదీశారు.‘‘జగన్ పాలనలో ఏం జరిగిందో ఎవరైనా చెప్పగలరు. కుప్పంతో సహా ఎక్కడైనా చెక్ చేసేందుకు సిద్దమే. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఇరవై ఇళ్లకు వెళ్లి అడిగే ధైర్యం ఉందా?. పోలవరం పాపం చంద్రబాబుదే. లోకేష్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఎందుకు ప్రజలకు కనపడటం లేదు?. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడు. చంద్రబాబు మాటలే పవన్ కూడా మాట్లాడతారు. సెక్రటేరియట్ ని కూడా తాకట్టు పెట్టామని కూడా పవన్ అన్నారు. రాజధానిలోని పొలాలను తాకట్టు పెట్టిందే చంద్రబాబు’’ అంటూ సజ్జల దుయ్యబట్టారు. -
నాయకుడి రూపం...గారడీ వేషం
మాటలది ఏముంది..ఏమైనా చెప్పొచ్చు ఎన్నైనా చెప్పొచ్చు..మబ్బులు తెచ్చి ఒళ్ళో పోస్తాను అనొచ్చు.. జాబిల్లిని తెచ్చి చేతికి ఇస్తామనోచ్చు. కానీ నిజంగా ఆ మాట నిలుపుకున్నపుడు కదా ఆ మాటకు, ఇచ్చినవాడికి విలువ.. రాజకీయంగా చూస్తే చంద్రబాబు గత నలభయ్యేళ్లుగా ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదు... అసలు మేనిఫెస్టో అనేది ఆయనకు ఒక చిత్తుకాగితంతో సమానం. ఎన్నికలప్పుడు వెయ్యిమాటలు చెప్పడం.. ఒక్కటంటే ఒక్కటీ చేయకుండా..మాయమాటలతో పూటగడిపేయడం...మళ్ళీ అవే హామీలను ఇస్తూ మరో ఎన్నికకు సిద్ధం కావడం..అదే అయన కెరీర్ మొత్తం..సాగిపోయింది.2014 లో కూడా ఇలాగే రైతు రుణమాఫీ... డ్వాక్రా రుణ మాపీ....నిరుద్యోగ భృతి అంటూ వందలాది పథకాల పేర్లు చెప్పి ఓట్లేయించుకుని చివరకు మేనిఫెస్టో కూడా దొరక్కుండా దాచేసారు. మళ్ళీ ఇప్పుడు అదే హామీలు ఇస్తూ 2024 ఎన్నికలకు చంద్రబాబు.. జనసేనాని కలిపి సిద్ధం అవుతున్నారు. ఇక సీఎం వైఎస్ జగన్ ఐతే నవరత్నాలు అంటూ తాను అమలు చేయగలిగే హామీలు మాత్రమే జాబితాలో చేర్చి వాటిని తూచా తప్పకుండా అమలు చేసారు.. అమ్మఒడి, ఆసరా.. సున్నా వడ్డీ , రైతు భరోసా.. జగనన్న విద్యా దీవెన , విద్యా కనుక, ముప్పై లక్షలమందికి ఇళ్ళు, కాపునేస్తం...ఇలా జాబితాలో చేర్చినవన్నీ చేసుకుంటూ వెళ్లారు.. ఆర్థికంగా అది ఖజానాకు భారమే అయినా ప్రజలకు మాట ఇచ్చాము కాబట్టి ఎలాగైనా చేయాలన్న పట్టుదల, తలంపుతో రెండేళ్లు కోవిద్ కారణంగా ఖజానా వట్టిపోయినా జగన్ మాత్రం వెనక్కి తగ్గకుండా పథకాలు ఇచ్చారు.ఈ ఎన్నికలకు సైతం తాను చేయగలిగేవే చేస్తాను అంటూ ఇప్పుడున్న పథకాలను కొనసాగిస్తూనే అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ కానుకలను మాత్రం మరింతగా పెంపుదల చేస్తాను అని చెప్పారు. ఇక చంద్రబాబు మాత్రం ఎలాగూ అమలు చేయరు కాబట్టి... అలవిమాలిన హామీలన్నీ ఇస్తున్నారు...కానీ చేయి చాచి సాయం చేసేది ఎవరు... వట్టినే నోటితో మాటలు చెప్పి చేతల్లో సున్నా చుట్టేది ఎవరన్నది ప్రజలకు తెలుసు... చంద్రబాబును గత పదేళ్లుగా గమనిస్తున్న వాళ్లందరికీ అయన నిజరూపం ఏమిటన్నది తెలుసు..అందుకే అయన ఎన్ని హామీలిచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక జగన్ పథకాల పేరిట రాష్ట్రాన్ని అప్పులపాల్జేస్తున్నారు అని ఆరోపించేవాళ్లకు చంద్రబాబు ఇస్తున్న భారీ హామీలు కనిపించవా ? అయన లక్షలకోట్ల ఇచ్చుకుంటూ పొతే రాష్ట్రం మరింత కుదేలవదా అనే చర్చ కూడా మొదలైంది. ఈ క్రమంలో ఇప్పుడున్న పథకాలు ఇవ్వడమే గొప్ప... అది కూడా జగన్ ఒక్కడే చేస్తారు... వేరేవాళ్లకు సాధ్యం కాదని అవగతం చేసుకున్న ప్రజలు మళ్ళీ జగన్ మాత్రమే మనకు ఉండాలి అని నిర్ణయించుకున్నారు. -సిమ్మాదిరప్పన్న -
April 28th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 28th AP Elections 2024 News Political Updates...9:00 AM, Apr 28, 2024జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీఆయన పథకాలే వారి మేనిఫెస్టోలోనూ పెట్టారువలంటీర్ల వ్యవస్థ కొనసాగించి... ఎక్కువ వేతనం ఇస్తామంటున్నారుఅంటే అవన్నీ బాగున్నాయని చెబుతున్నట్టే కదాఈ ప్రభుత్వం తీసుకొచి్చన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బాగా నచ్చిందిమహిళలైతే ఎక్కువ మంది వైఎస్సార్సీపీ వైపేసాక్షి ఇంటర్వ్యూలో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ 8:30 AM, Apr 28, 2024ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సుచెప్పలేనన్ని నేరాలు.. విప్పలేనన్ని కేసులు..!అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యం విస్తరణ గ్రానైట్ మాఫియా, నిబంధనలకు పాతరతో ట్రావెల్స్ నిర్వహణ పదుల సంఖ్యలో గాలిలో కలిసిన ప్రాణాలు..?బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక శక్తులకు ఊతంపరిశ్రమలపై ఆధిపత్యం, అక్రమ వసూళ్లు 8:00 AM, Apr 28, 2024సైకిల్ ఎక్కేదిలేదు... ప్రచారం చేసేదిలేదుమమ్మల్ని కుక్కలు కంటే హీనంగా చూస్తున్నారుగంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్థికి మేం మద్దతు ఇవ్వంజనసేన, బీజేపీ నేతల తీర్మానం7:30 AM, Apr 28, 2024మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్సమరింత ప్రజోపయోగ, అభివృద్ధి కార్యక్రమాలతో 2024 మేనిఫెస్టోసంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ కల్పనపై ప్రధాన దృష్టిప్రపంచంలో మేటి నగరంగా విశాఖ అభివృద్ధిబాబులా అబద్దపు హామీలు ఇవ్వం7:00 AM, Apr 28, 2024ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్ జగన్14 ఏళ్లూ రెవెన్యూ లోటే ఉంటే బాబు సృష్టించిందేంటి?ఆయనకు ముందు, తర్వాత ‘మిగులు’ ఎలా వచ్చింది?ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్లే కదా!రాష్ట్రానికి ఎక్కువ అప్పులు తెచ్చింది కూడా చంద్రబాబేమూలధన వ్యయం ఎవరి హయాంలో ఎక్కువో తెలియదా?నాడు ఏటా రూ.15,227 కోట్లు ఖర్చుచేస్తే... ఇప్పుడది రూ.17,757 కోట్లుపోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు.. ‘నాడు–నేడు’ అన్నీ ఇప్పుడే..దేశ జీడీపీలో మన వాటా నాడు 4.47 శాతమైతే ఇప్పుతడు 4.83 శాతంఅడ్డంగా జనంపై పడి పన్నులు బాదేసింది కూడా బాబే..నాడు జీడీపీలో పన్నుల వాటా 6.57 శాతం... ఇప్పుడు 6.35 శాతమేగణాంకాలతో సహా వివరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్6:30 AM, Apr 28, 2024అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్సాధ్యం కాదని తెలిసీ అబద్ధాలకు రెక్కలు: సీఎం జగన్2014లోనూ జనసేన, బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలుఅధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారుఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్ సిక్స్.. సూపర్ టెన్ అంటున్నాడుఆ హామీలకు అయ్యే ఖర్చెంత? అమలు సాధ్యమేనా?ఇలా చేయడం దొంగతనం కన్నా దారుణం కాదా? 420.. చీటింగ్ కాదా?6:00 AM, Apr 28, 2024సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...తాడిపత్రి వైఎస్సార్ సర్కిల్లో ఉ.10 గంటలకు నిర్వహించే సభతో ప్రచార భేరిమధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరి త్రిభువని సర్కిల్లో..3 గంటలకు కందుకూరులో కేఎంసీ సర్కిల్లో సీఎం వైఎస్ జగన్ ప్రచార సభలురోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహణసిద్ధం సభలు, ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్తో వైఎస్సార్సీపీలో జోష్ -
తెరపైకి తెలుగు కాంగ్రెస్!
సాక్షి ప్రతినిధి, కడప: సార్వత్రిక ఎన్నికల పర్వంలో రాజకీయ పక్షాల అపవిత్ర కలయికలు తెరపైకి వస్తున్నాయి. తాము గెలవడం కంటే తమ ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టడమే లక్ష్యంగా రాజకీయ పార్టీల మధ్య అవగాహన కుదురుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య కొనసాగుతున్న మైత్రి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. తాము ఎటూ గెలవలేం, వైఎస్సార్సీపీని నియంత్రించడమే లక్ష్యం కావాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ సద్వినియోగం చేసుకుంటోంది. వెరసి తెలుగు కాంగ్రెస్ రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి.ప్రజల ముంగిట్లోకి పాలన తీసుకువచ్చాం. క్షేత్రస్థాయిలో ఎంతో అభివృద్ధి చేశాం.. రాజకీయాలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాం. మరోమారు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను అభ్యర్థిస్తోంది. తమ పాలనలో లబ్ధి చేకూరి ఉంటేనే ఆశీర్వదించండని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం కోరుతున్నారు. చరిత్రలో తన వల్ల మేలు చేకూరి ఉంటే ఓట్లు వేయండనే రాజకీయ నేత ఇంతవరకూ ఎవరూ లేరని ప్రజలు కొనియాడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కుట్రలు, కుయుక్తులతో లబ్ధి పొందాలనే వైఖరిని తెలుగుదేశం పార్టీ అవలంబిస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీకి గణనీయంగా పట్టు ఉన్న ఓటర్లలో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధానంగా మైనార్టీ ఓట్లు చీల్చడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు.వ్యూహాత్మకంగానే అఫ్జల్ఖాన్ అభ్యర్థిత్వంజిల్లాలో వైఎస్ కుటుంబం అన్నా, వైఎస్సార్సీపీ అన్నా పార్టీలకు అతీతంగా ముస్లిం మైనారీ్టలు అండగా నిలుస్తూ వస్తున్నారు. గతంలో అనేక ఎన్నికల్లో ఆ విషయం తేటతెల్లమైంది. ఇప్పటికే కడపలో రెండు పర్యాయాలు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎస్బి అంజద్బాషా విజయకేతనం ఎగురవేశారు. ప్రస్తుతం మరోమారు తలపడుతున్నారు. ఈమారు వైఎస్సార్సీపీని ఎన్నికల్లో ఎలాగైనా నియంత్రించాలనే లక్ష్యంతో టీడీపీ కుయుక్తులు పన్నుతోంది. ఓవైపు విద్వేషాలు రెచ్చగొడుతూ కుట్ర రాజకీయాలు చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్తో చేతులు కలిపింది. వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న ముస్లిం మైనారీ్టల ఓట్లు చీల్చేందుకు శతవిధాలా ప్రయతి్నస్తోంది. ఆమేరకే కడపలో అఫ్జల్ఖాన్ను కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీలో దించారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అఫ్జల్ఖాన్ అభ్యర్థిత్వం ఎంచుకోవడం వెనుక కూడా కారణం లేకపోలేదు. ముస్లిం మైనార్టీలలో పఠాన్ తెగకు చెందిన వారిని తమ వైపు మరల్చుకోవాలనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఆర్థిక సహకారం అందించేందుకు రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కడప శివార్లలోని జయరాజ్ గార్డెన్లో తెలుగు కాంగ్రెస్ నేతలు సమావేశమై అఫ్జల్ఖాన్ అభ్యరి్థత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.కడప, ప్రొద్దుటూరు, రాయచోటిలలో ఎందుకంటే... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనారిలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ముస్లిం కుటుంబాలకు ఎంతో లబ్ధి చేకూరింది. తద్వారా వైఎస్ కుటుంబానికి అండగా ఉంటున్నారు. కడపలో ముస్లిం మైనార్టీ ఓటర్లు దాదాపు 90వేలు ఉన్నారు. వీరి మద్దతు ఏకపక్షంగా వైఎస్సార్సీపీకి కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ, జనసేనతో పొత్తు కారణంగా కూడా టీడీపీకి వ్యతిరేకంగా నిలవనున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారి ఓట్లలో చీలిక తీసుకువస్తే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందనే దిశగా టీడీపీ నాయకులు అడుగులు వేశారు. ఆ మేరకు కాంగ్రెస్ పారీ్టతో చేతులు కలిపి కడపలో అఫ్జల్ఖాన్ను కాంగ్రెస్అభ్యర్థిగా ఎంపిక చేయించారు. ప్రొద్దుటూరు, రాయచోటి నియోజకవర్గాల్లో కూడా ఇదే పంథాను కొనసాగించారు. ప్రొద్దుటూరులో దాదాపు 45వేలు ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరిలో భారీగా చీలికలు తీసుకురావాలనే ఉద్దేశంతో మహమ్మద్ నజీర్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాయచోటిలో కూడా అల్లాబ„Š ఎంపిక వెనుక కూడా టీడీపీకి లబ్ధి చేకూర్చడమే అసలు లక్ష్యమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో ఇలా అవసరమైన మేరకు సహకరించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో నిత్యం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్లో టచ్లో ఉన్నట్లు కూడా పలువురు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి జిల్లాలో తెలుగు కాంగ్రెస్ రాజకీయాలు తెర ముందుకు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Related News by category
-
వాస్తవం ఇది..
ఆంధ్రప్రదేశ్ పునర్వభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వ మంజూరు చేసింది. ఈ యూనివర్సిటీని గిరిజన ప్రాంతం, రిజర్వ్డ్ అసంబ్లీ లేదా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నిర్మించాలి. దీనికోసం తొలివిడతగా రూ.834 కోట్లను కేటాయించి రూ.426 కోట్లను విడుదల చేసింది. దీంతో చంద్రబాబునాయుడు అండ్ కో చకచకా పావులు కదిపారు. యూనివర్సిటీ నిర్మాణ నిబంధనలను తుంగలో తొక్కేశారు. ముందుగా విశాఖకు అతి సమీపంలోని కొత్తవలస ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడం, వాటికి ఆనుకొనిఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం వంటి పనులు ప్రారంభించారు. ఈ ప్రాంతంలో అతి తక్కవ ధరకు వందల ఎకరాలను కూడబెట్టారు. ప్లాట్లు వేశారు. ఇదంతా చూసిన స్థానికులు వీరికేం పిచ్చి.. నివాసయోగ్యంకాని చోట ప్లాట్లు వేస్తున్నారని అనుకున్నారు. అప్పుడే మొదలైంది చంద్రబాబు డ్రామా. వారి రియల్ వ్యాపారానికి జాతీయ గిరిజన యూనివర్సిటీ పేరు పెట్టారు. నిబంధనలు దాచిపెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారు. 2017 సంవత్సరంలో కొత్తవలస మండ లం రెల్లి రెవెన్యూ గ్రామం అప్పన్న దొరపాలెం సమీపంలో నిర్మాణానికి ఏ మాత్రం అనువుగా లేని కొండ ప్రాంతంలో సర్వే నంబర్ 1–8లో 526.24 ఎకరాల భూమిని గుర్తించారు. ఇందులో కొంత కొండవాలు ప్రాంతంలో 180 మందికి ఇచ్చిన పట్టా భూమి 185 ఎకరాలను సైతం సేకరించారు. యూనివర్సిటీ నిర్మాణానికి భూసేకరణ పూర్తయిందంటూ కేంద్రానికి నివేదికలను పంపారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉండగా హడావిడిగా అప్పటి భూగర్భ గనులశాఖ మంత్రి సుజయకృష్ణరంగారావు చేతుల మీదుగా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సమక్షంలో 2017 డిసెంబర్ నెలలో శంకుస్థాపన చేశారు. ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వ అధికారులు పర్యటించి ఈ ప్రాంతం వర్సిటీ నిర్మాణానికి అనువుగా లేదని, ఈ ప్రాంతం ఎస్టీ సెగ్మెంట్లో లేదని వ్యతిరేకించారు. నివేదిక సైతం ఇచ్చారు. అయినా.. తమ రియల్ ఎస్టేట్వ్యాపారం పూర్తయ్యేవరకు చంద్రబాబు అండ్ కో ఈ నివేదికను బహిర్గతం చేయలేదు. తమ అనుకూల మీడియాతో ఈ ప్రాంతం ఆంధ్రాయూనివర్సిటీ పరి సరాల వలే అభివృద్ధి చెందుతుందని, వర్సిటీ ప్రహరీ పనులు ప్రారంభమైపోయాయంటూ ఊహాజనిత కథనాలతో ప్రచారం చేశారు. ఒక్క ప్రహరీతో కారుచౌకగా కొనుగోలు చేసిన భూ ములను వందలకోట్ల రూపాయలకు అమ్మేసి.. కొనుగోలుదారులకు పంగనామం పెట్టారు. -
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆత్మహత్య
లక్కవరపుకోట : మండలంలోని ఒక చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకలపాటి శ్రీనివాసరావు (47)గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఎస్ఐ ఆర్.గోపాలరావు తెలిపిన వివరాలు... నిందితుడు వారం రోజుల కిందట 8 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి యత్నించాడని బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆదివారం నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. కాగా అప్పటి నుంచి నిందితుడు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఆదివారం 10 గంటల ప్రాంతంలో ఎస్.కోట ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో పురుగులు మందు సేవించి అపస్మారక స్థితికి శ్రీనివాసరావు చేరుకోవడంతో స్థానికుల సహాయంతో ఎస్.కోట సీహెచ్సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆస్పత్రి సిబ్బంది కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో పోలీసులు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం మండల కేంద్రం కిత్తన్నకట్టు గెడ్డ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెళ్లి పరిశీలించగా మృతదేహం నిందితుడు శ్రీనివాసరాజుగా గుర్తించారు. ఈ మేరకు మృతుడు తల్లి, తమ్ముడులకు సమాచారం అందించగా మృతదేహాన్ని వారు వచ్చి పరిశీలించి శ్రీనివాసరాజు అని నిర్ధారించారు. మృతుడు తల్లి పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపాలరావు తెలిపారు. -
సైకిల్ మాకొద్దు బాబూ...
చీపురుపల్లి: రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పాలన చూసి టీడీపీ వర్గీయులు ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. సైకిల్ మాకొద్దు.. ఫ్యానే ముద్దు అంటూ వలసపోతున్నారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం పలు చేరికలు జరిగాయి. చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలోని ఆకులపేట గ్రామానికి చెందిన పిన్నింటి, కొండేటి, మీసాల, పతివాడ ఇంటి పేరుకు చెందిన 30 కుటుంబాలు టీడీపీను వీడి వైఎస్సార్ సీపీలో చేరాయి. ఇటీవల తమకు తెలియకుండానే టీడీపీ కండువాలు తమకు వేశారని, టీడీపీలో ఉండే పరిస్థితే లేదని వారంతా స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీలోకి వచ్చిన వీరికి ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పిలి అనంతం, జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మాజీ జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణలు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో మీసాల హరి, గవిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. 13వ వార్డు నుంచి చేరికలు ఇదిలా ఉండగా పట్టణంలోని జెడ్పీటీసీ వలిరెడ్డి శిరీష కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో చీపురుపల్లి మేజర్ పంచాయతీలోని 13వ వార్డు నుంచి పలువురు వైఎస్సార్ సీపీలో చేరారు. ఇటీవల టీడీపీలో చేరిన 13వ వార్డు మెంబరు తల్లి సంగంరెడ్డి కనకమ్మ, సంగంరెడ్డి శివ, వెలుసూరి వెంకటరమణ తదితరులకు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జుజ్జూరు వర్మ, కంచుపల్లి అశోక్, అడ్డూరి కృష్ణ, బుంగ కనకేశ్వరరావు తదితరులు ఉన్నారు. టీడీపీకి భారీ షాక్ రేగిడి : టీడీపీకి భారీ షాక్ తగిలింది. మండలంలో లక్ష్మీపురం గ్రామంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి చేరాయి. గురువారం ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైస్ ఎంపీపీ టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు వావిలపల్లి జగన్మోహనరావులు పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. టీడీపీకి చెందిన నేదూరి దుర్గయ్య, బొంతల సంగయ్య, మిరియాలు జప్పన్న, కాయల తవుడు, జోరీగల వెంకటి, కాయల రామారావు, బొంతల రామయ్య, బొంతల అప్పలరాం, నేదూరి అప్పలరాం, మిరియాల లోకేష్ తదితరులతో పాటు మరో 40కి పైగా కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనను ప్రజలు అంతా ఆహ్వానిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కెంబూరి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ ఎర్నేన అప్పలనాయుడు, అప్పాపురం సర్పంచ్ కరణం శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ బాలి తవిటినాయుడు, పాలవలస దవళేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీని వీడి.. వైఎస్సార్సీపీలోకి... ● పార్టీలోకి ఆహ్వానించిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని దువ్వాం పంచాయతీ నుంచి టీడీపీకి చెందిన 50 కుటుంబాలు గురువారం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీసివాసరావు సమక్షంలో పార్టీలో చేరారు. విజయనగరంలోని ఆయన నివాసం వద్ద టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోనికి వచ్చిన లారీ ఓనర్స్ అసోషియేషన్ ప్రతినిధి బాలి రామారావు, బాలి రమణ, బాలి కూర్మారావు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ పతివాడ తవిటినాయుడు, రెల్లి పైడినాయుడు, గొర్లె లోకేష్, గొర్లె చిన్న, బాలాజీ తదితర 50 కుటుంబాలకు చెందిన వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని, జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావటం ఖాయమని అన్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలన్నా, మంచి అభివృద్ధి కార్యక్రమాలు అమలు కావాలన్నా ప్రతీ ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఎమ్మెల్యే, ఎంపీ రెండు ఓట్లును వేసి ఎమ్మెల్యేగా బొత్స సత్యనారాయణను, ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ను గెలిపించి జగన్మోహన్రెడ్డిని సీఎంను చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ నేతేటి కృష్ణవేణి, స్థానిక నాయకుడు తోట రవి, ఏఎంసీ మాజీ చైర్మన్ మీసాల విశ్వేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు కొణిశ కృష్ణంనాయుడు, తాటిగూడ పీఏసీఎస్ అధ్యక్షుడు ఎడ్ల అప్పారావు, వలిరెడ్డి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలోకి వలసల జోరు -
అప్పుల భయంతో వ్యక్తి ఆత్మహత్య
బాడంగి: అప్పులు తీర్చలేనన్న భయంతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు... మండలంలోని చినభీమవరం గ్రామానికి చెందిన ఉయ్యాల నూకందొర అలియాస్ ఆది (45) విజయనగరంలోని సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్టు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. మృతుడు ఇంట్లో భార్యకు తెలియకుండా రూ.50వేల వరకు అప్పులు చేశాడు. ఈ మొత్తాన్ని ఎలా తీర్చాలో తెలియక ఆందోళనకు గురై బుధవారం ఉదయం అరటి తోట వద్ద పురుగుల మందు తాగి వాంతులు చేసుకొంటూ ఇంటికి చేరుకున్నాడు. భార్య పద్మ చూసి ఏమైందని ప్రశ్నించగా పురుగుల మందు తాగానని చెప్పాడు. దీంతో కుటుంబీకుల సహాయంతో 108 ద్వారా స్థానిక సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతునికి తల్లి అప్పలనర్సమ్మ, భార్య పద్మ ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఆర్.జయంతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యక్తిపై కత్తితో దాడి
వేపాడ: మండలంలోని వావిలపాడు గ్రామానికి చెందిన ఎం.సన్యాసిరావును అదే గ్రామానికి చెందిన ఆరిపాక సంతోష్ కత్తితో గాయపర్చి హత్యాయత్నానికి పాల్పడటంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. దీనికి సంబంధించి ఎస్ఐ అందించిన వివరాలు.. వావిలపాడుకు చెందిన ఆరిపాక సంతోష్ మద్యం సేవిస్తూ వుంటాడు. సన్యాసిరావుకు సంతోష్ వరుసకు కుమారుడు అవుతాడు. మద్యం సేవించడం మంచిది కాదని సంతోష్ను మందలిస్తూ వుండే వాడు. దీన్ని తట్టుకోలేని సంతోష్ గురువారం ఉదయం సన్యాసిరావు ఇంటికి వెళ్లి కత్తితో పీకపై గాయపర్చి హత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్ఐ తెలిపారు. దీంతో కుటుంబీకులు సమీపంలో వున్న ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సంతోష్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోలీస్ సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏఆర్ పోలీసులైన్స్లో నడపబడుతున్న పోలీస్ వెల్ఫేర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న మూడు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ఎస్పీ ఎం.దీపిక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో ఆరో తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మ్యాఽథ్స్, ఫిజిక్స్ బయాలజీతో పాటూ ఇంగ్లిష్ సబ్జెక్ట్ కూడా బోధించాల్సి ఉంటుందన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతను తెలిపే ఒరిజినల్ ధ్రువపత్రాలు, రెజ్యూమ్ తీసుకుని ఏప్రిల్ 26 ఉదయం 10 గంటలకు పాఠశాలలో నిర్వహించబోయే టీచింగ్ డెమో, మౌఖిక పరీక్షకు హాజరు కావాలన్నారు. ఉపాధ్యాయ పోస్టులకు బీఈడీ విద్యార్హతతో పాటూ అర్హతలు కలిగిన అభ్యర్థులు స్కూల్లో నిర్వహించే మౌఖిక పరీక్షకు ఆ రోజు హాజరు కావాలన్నారు. వివరాలకు 94917 99315, 91211 09485 సంప్రదించాలని కోరారు. వెబ్సైట్లో డీఎడ్ హాల్టికెట్లువిజయనగరం అర్బన్: ఈ నెల 22 నుంచి 27 వరకు జరిగే డీఎడ్ మూడవ సెమిస్టర్ (2022–24 బ్యాచ్ మరియు ఒన్స్ ఫైల్డ్), మొదటి సెమిస్టర్ (2023–25 బ్యాచ్ మరియు ఒన్స ఫైల్డ్) పరీక్షలకు హాజరగు విద్యార్థులకు హాల్ టికెట్లు వెబ్సైట్లో పొందుపరచామని డీఈఓ ఎన్.ప్రేమకుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ‘బీఎస్ఈ.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. బాలికపై లైంగిక దాడి డెంకాడ: మండలంలోని ఒక గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. దిశ పోలీసులు అందించిన వివరాలు.. బుధవారం ఏడేళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక విజయనగరంలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విజయనగరం దిశ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గడ్డివాములు, వాటర్ పైపులు దగ్ధం రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి పొనుగుటివలస గ్రామంలో మీసాల రమేష్కు చెందిన ఎకరన్నర గడ్డివాము, 80 నీటి పైపులు దగ్ధమయ్యాయి. గురువారం గడ్డివాము వద్ద ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి వెనువెంటనే ప్లాస్టిక్ పైపులకు మంటలు అంటుకుని కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న పొందూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు 2 లక్షల రూపాయలు మేర ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు లబోదిబోమంటున్నాడు. అలాగే సంతకవిటి మండలం తాలాడ గ్రామానికి చెందిన బెరవ అప్పలనాయుడు, బెవర రాజారావుల గడ్డివాములతో పాటు 20 బస్తాల ధాన్యం కాలిపోయాయి. రాజాం ఫైర్ స్టేసన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సారాతో వ్యక్తి అరెస్టు సీతానగరం: మండలంలోని బక్కుపేట గ్రామంలో ఎస్ఈబీ సీఐ జె.శ్రీనివాసరావు నేతృత్వంలో గురువారం తనిఖీలు చేపట్టిన సమయంలో 190 సారా ప్యాకెట్లతో ఓ వ్యక్తి పట్టుబడగా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ముందస్తు సమాచారం మేరకు గ్రామానికి చెందిన పి. లక్ష్మణదొర ఇంట్లో తనిఖీలు చేసి సారాను గుర్తించినట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై బి.రాజశేఖర్ పట్నాయక్, జె.జగన్నాథరావు, ఎం. శ్రీవాణి, హెచ్సీ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఎక్కడో కూర్చోని మాట్లాడతారు.. వారిని నేను పట్టించుకోను: కోహ్లి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement