Sakshi News home page

మత్తు వదిలిస్తాం..!

Published Tue, Jul 4 2017 1:55 AM

మత్తు వదిలిస్తాం..! - Sakshi

ఉధృతమవుతున్న మద్యంపై మహిళల యుద్ధం..!
ఇళ్ల మధ్య దుకాణాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు
మద్యం సిండికేట్‌లకు వత్తాసు పలుకుతున్న ఎక్సైజ్, పోలీసులు
దుకాణాలు వెతుక్కునే పనిలో మద్యం వ్యాపారులు
జిల్లాలో 94 మద్యం దుకాణాలు, 18 బార్‌లకు మాత్రమే లైసెన్స్‌లు


మద్యం దుకాణాల ఏర్పాటులో పాలకులు, అధికారుల నిర్లక్ష్యపు కిక్కు దిగేదాకా..ఇళ్ల మధ్య నుంచి మహమ్మారి తరలిపోయేదాకా చేతబట్టిన ఉద్యమ జెండా దించబోమంటూ జిల్లాల్లో మహిళలు నినదించారు. ఇళ్ల మధ్యకొస్తున్న మద్యం దుకాణా లను తరిమికొడతామంటూ సోమవారం ఊరూవాడా రోడ్డెక్కారు. మాట వినకుంటే సీసా పగులుద్దంటూ ఇప్పటికే ఏర్పాటు చేసిన దుకాణాలపై దాడులు చేశారు. సిండికేట్లకు వత్తాసు పలుకుతూ తమకు అన్యాయం చేస్తే సహించ బోమని హెచ్చరించారు.

Advertisement

What’s your opinion

Advertisement