Sakshi News home page

'తెలంగాణ వ్యాప్తంగా బలపడుతాం'

Published Fri, Dec 25 2015 4:21 PM

'తెలంగాణ వ్యాప్తంగా బలపడుతాం' - Sakshi

పులివెందుల: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆ పార్టీ ఖమ్మం జిల్లా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు సమావేశమయ్యారు. శుక్రవారం ఖమ్మం జిల్లా నేతలు వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ జగన్తో భేటీ అయ్యారు.

ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ సీపీని నిజాయితీగా ముందుకు తీసుకెళ్తున్నారని వైఎస్ జగన్ పార్టీ నేతలతో అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ ఖమ్మం జిల్లా నేతలను ఉద్దేశించి వైఎస్ జగన్ అన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement