Sakshi News home page

'టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలి'

Published Mon, May 2 2016 2:12 PM

'టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలి' - Sakshi

విజయనగరం: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

కరువుపై వైఎస్సార్సీపీ పోరుబాటలో భాగంగా సోమవారం చీపురుపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ...టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయని పక్షంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులు బయటికి రావాలన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లు కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వముందని బొత్స అన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement