Sakshi News home page

మెజారిటీ వస్తేనే సీఎంగా ఉంటా

Published Sat, May 10 2014 7:56 AM

మెజారిటీ వస్తేనే సీఎంగా ఉంటా - Sakshi


 సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజారిటీ వస్తేనే ముఖ్యమంత్రిగా ఉంటానని కేసీఆర్ తన సన్నిహితులకు వెల్లడించారు. అలాగాక ఇతర పార్టీల మద్దతు అవసరమయే పక్షంలో పార్టీ ముఖ్య నేతల్లో ఒకరిని సీఎం చేస్తే సరిపోతుందనే అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నట్టు ఆయన సన్నిహితులు శుక్రవారం తెలిపారు.

‘‘ఎన్నికలకు రెండు రోజులకు ముందు తెలంగాణవ్యాప్తంగా టీఆర్‌ఎస్ అనుకూల పవనాలు వీచినై. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిర్మాణం, వాళ్ల మేనేజ్‌మెంట్ వంటివి పని చేస్తాయని కొందరంటున్నరు. అదే నిజమై ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనంత మెజారిటీ రాకుంటె నేను ప్రత్యక్షంగా ఉండకపోవుడే మంచిది. సంకీర్ణ ప్రభుత్వంలో సరైన ఫలితాలను చూపించలేం. ఇతరుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సొస్తే పార్టీ ముఖ్యులలో ఒకరిని ముందు పెడుదం’’ అని సన్నిహితులతో కేసీఆర్ మనోగతాన్ని వెల్లడించారు.

Advertisement

What’s your opinion

Advertisement