న్యూఢిల్లీ: ఆళ్లగడ్డ శాసన సభ నియోజకవర్గం ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఆళ్లగడ్డ అభ్యర్థి శోభా నాగిరెడ్డికి అత్యధిక ఓట్లు వస్తే ఆమె గెలిచినట్టుగా ప్రకటిస్తామని ఈసీ స్పష్టం చేసింది. అలాంటి సందర్భంలో ఉప ఎన్నిక నిర్వహిస్తామని వివరణ ఇచ్చింది. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఈవీఎంలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి పేరు, ఫ్యాన్ గుర్తు ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. గత బుధవారం కర్నూలు జిల్లా నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డకు తిరిగి వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ శోభా నాగిరెడ్డిని తొలుత నంద్యాలలో చికిత్స చేయించి అనంతరం హైదరాబాద్ తరలించారు. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు.
కాగా గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థి ఎవరైనా మరణిస్తే అక్కడి ఎన్నికలను వాయిదా వేస్తారు. అయితే వైఎస్ఆర్సీపీ గుర్తింపు పొందిన పార్టీ కాకపోవడంతో ఆళ్లగడ్డ ఎన్నికలను వాయిదా వేయబోమని, శోభానాగిరెడ్డికి ఓట్లు వేసినా ఆ ఓట్లు లెక్కలోకి రావని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ ఇంతకుముందు ప్రకటించారు. ఆమెకు అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినా ఓట్లకు విలువ ఉండదని, నోటాగా పరిగణిస్తామని చెప్పారు. ఆ తరువాత పోటీలో ఉన్న వారిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వారే గెలిచినట్లు పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన వివరణ ఇచ్చింది.
Breadcrumb
మెజార్టీ ఓట్లు వస్తే శోభానాగిరెడ్డి గెలిచినట్టే
Published Mon, Apr 28 2014 4:21 PM
Related news
-
తెరపైకి తెలుగు కాంగ్రెస్!
సాక్షి ప్రతినిధి, కడప: సార్వత్రిక ఎన్నికల పర్వంలో రాజకీయ పక్షాల అపవిత్ర కలయికలు తెరపైకి వస్తున్నాయి. తాము గెలవడం కంటే తమ ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టడమే లక్ష్యంగా రాజకీయ పార్టీల మధ్య అవగాహన కుదురుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య కొనసాగుతున్న మైత్రి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. తాము ఎటూ గెలవలేం, వైఎస్సార్సీపీని నియంత్రించడమే లక్ష్యం కావాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ సద్వినియోగం చేసుకుంటోంది. వెరసి తెలుగు కాంగ్రెస్ రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి.ప్రజల ముంగిట్లోకి పాలన తీసుకువచ్చాం. క్షేత్రస్థాయిలో ఎంతో అభివృద్ధి చేశాం.. రాజకీయాలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాం. మరోమారు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను అభ్యర్థిస్తోంది. తమ పాలనలో లబ్ధి చేకూరి ఉంటేనే ఆశీర్వదించండని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం కోరుతున్నారు. చరిత్రలో తన వల్ల మేలు చేకూరి ఉంటే ఓట్లు వేయండనే రాజకీయ నేత ఇంతవరకూ ఎవరూ లేరని ప్రజలు కొనియాడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కుట్రలు, కుయుక్తులతో లబ్ధి పొందాలనే వైఖరిని తెలుగుదేశం పార్టీ అవలంబిస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీకి గణనీయంగా పట్టు ఉన్న ఓటర్లలో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధానంగా మైనార్టీ ఓట్లు చీల్చడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు.వ్యూహాత్మకంగానే అఫ్జల్ఖాన్ అభ్యర్థిత్వంజిల్లాలో వైఎస్ కుటుంబం అన్నా, వైఎస్సార్సీపీ అన్నా పార్టీలకు అతీతంగా ముస్లిం మైనారీ్టలు అండగా నిలుస్తూ వస్తున్నారు. గతంలో అనేక ఎన్నికల్లో ఆ విషయం తేటతెల్లమైంది. ఇప్పటికే కడపలో రెండు పర్యాయాలు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎస్బి అంజద్బాషా విజయకేతనం ఎగురవేశారు. ప్రస్తుతం మరోమారు తలపడుతున్నారు. ఈమారు వైఎస్సార్సీపీని ఎన్నికల్లో ఎలాగైనా నియంత్రించాలనే లక్ష్యంతో టీడీపీ కుయుక్తులు పన్నుతోంది. ఓవైపు విద్వేషాలు రెచ్చగొడుతూ కుట్ర రాజకీయాలు చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్తో చేతులు కలిపింది. వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న ముస్లిం మైనారీ్టల ఓట్లు చీల్చేందుకు శతవిధాలా ప్రయతి్నస్తోంది. ఆమేరకే కడపలో అఫ్జల్ఖాన్ను కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీలో దించారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అఫ్జల్ఖాన్ అభ్యర్థిత్వం ఎంచుకోవడం వెనుక కూడా కారణం లేకపోలేదు. ముస్లిం మైనార్టీలలో పఠాన్ తెగకు చెందిన వారిని తమ వైపు మరల్చుకోవాలనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఆర్థిక సహకారం అందించేందుకు రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కడప శివార్లలోని జయరాజ్ గార్డెన్లో తెలుగు కాంగ్రెస్ నేతలు సమావేశమై అఫ్జల్ఖాన్ అభ్యరి్థత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.కడప, ప్రొద్దుటూరు, రాయచోటిలలో ఎందుకంటే... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనారిలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ముస్లిం కుటుంబాలకు ఎంతో లబ్ధి చేకూరింది. తద్వారా వైఎస్ కుటుంబానికి అండగా ఉంటున్నారు. కడపలో ముస్లిం మైనార్టీ ఓటర్లు దాదాపు 90వేలు ఉన్నారు. వీరి మద్దతు ఏకపక్షంగా వైఎస్సార్సీపీకి కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ, జనసేనతో పొత్తు కారణంగా కూడా టీడీపీకి వ్యతిరేకంగా నిలవనున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారి ఓట్లలో చీలిక తీసుకువస్తే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందనే దిశగా టీడీపీ నాయకులు అడుగులు వేశారు. ఆ మేరకు కాంగ్రెస్ పారీ్టతో చేతులు కలిపి కడపలో అఫ్జల్ఖాన్ను కాంగ్రెస్అభ్యర్థిగా ఎంపిక చేయించారు. ప్రొద్దుటూరు, రాయచోటి నియోజకవర్గాల్లో కూడా ఇదే పంథాను కొనసాగించారు. ప్రొద్దుటూరులో దాదాపు 45వేలు ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరిలో భారీగా చీలికలు తీసుకురావాలనే ఉద్దేశంతో మహమ్మద్ నజీర్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాయచోటిలో కూడా అల్లాబ„Š ఎంపిక వెనుక కూడా టీడీపీకి లబ్ధి చేకూర్చడమే అసలు లక్ష్యమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో ఇలా అవసరమైన మేరకు సహకరించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో నిత్యం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్లో టచ్లో ఉన్నట్లు కూడా పలువురు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి జిల్లాలో తెలుగు కాంగ్రెస్ రాజకీయాలు తెర ముందుకు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
యూటర్న్ చంద్రబాబు బాగోతం ఇది
వలంటీర్లకు పది వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పడం ద్వారా మన పాలన గొప్పగా ఉందని ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు... ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్య.. రాష్ట్రం విధ్వంసం అయింది..జగన్ ఇంతకాలం ప్రజలకు కనిపించలేదు.. ఇప్పడు మళ్లీ జనంలోకి వస్తున్నారు. అది ఓట్ల మీద ప్రేమ.. జగన్ను ఎవరూ నమ్మవద్దు.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగంలో ఒక భాగం ఐదుకోట్ల మందికి ఏ ఒక్క నాయకుడో సరిపోరు. మూడు పార్టీల బలమైన నాయకత్వం కావాలి.కేంద్ర సహకారం, చంద్రబాబు అనుభవం, జనసేన పోరాట శక్తి కావాలి..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన కొత్త విషయం పవన్ శక్తి, చంద్రబాబు యుక్తి ,మోదీ సంకల్పం ..టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి బలం.. బీజేపీ ఎపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్య ఈ నలుగురు కొద్ది రోజుల క్రితం తణుకు వద్ద జరిగిన సభలో చేసిన ప్రసంగాలను విశ్లేషించండి. జగన్ తాను ఐదేళ్ల పాలన సమయంలో చేసిన వివిధ అబివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సాకల్యంగా వివరించడంతో పాటు, చంద్రబాబు వలంటీర్ల వ్యవస్థపై యూ టర్న్ తీసుకున్న తీరును సమర్ధంగా వివరించగలిగారు.అంతేకాక చంద్రబాబు 2014 లో ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలు, వాటిని అమలు చేయని వైనాన్ని విపులంగా ప్రజలకు తెలియచెప్పారు. జగన్ సభ ఒక ఖాళీ ప్రదేశంలో భారీ ఎత్తున జరిగితే, కూటమి సభ ఒక రోడ్డుమీద జరిపి జనం బాగా వచ్చారని సంతోషపడడం కూటమి నేతల వంతుగా మారింది. జగన్ ఎక్కడా ఎవరిని దూషించకుండా , ప్రత్యేకించి ఆయా నియోజకవర్గాలలో పోటీచేస్తున్న టీడీపీ ,ఇతర పార్టీల అభ్యర్దుల ప్రస్తావన తేకుండా ,తన పార్టీ అభ్యర్ధులను మాత్రం పరిచయం చేసి గెలిపించాలని కోరుతున్నారు. కాని కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎక్కడకు వెళితే అక్కడ ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్ధిపై తీవ్రమైన విమర్శలు, అడ్డగోలు ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించాలని యత్నించారు. జగన్ తన స్కీముల గురించి ప్రజలకు తెలియచెప్పి, తాను ప్రతి ఇంటికి మంచి చేశానని ధైర్యంగా చెబుతున్నారు. కాని చంద్రబాబు మాత్రం అలా చెప్పలేకపోతున్నారు.పైగా వలంటీర్ల వ్యవస్థపై ఆయన యుటర్న్ తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ పరువు పోయింది.ఇంతకాలం వలంటీర్లను బండబూతులు తిట్టిన టీడీపీ నేతలు తలలు పట్టుకుని కూర్చున్నారు. చంద్రబాబు మాదిరి ఎప్పటికప్పుడు నాలుక మడతపెట్టి మాట మార్చినట్లు ఎలా చేయాలో తెలియక సతమతమవుతున్నారు. వలంటీర్లు పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లకుండా చేసిన నేపద్యంలో టీడీపీకి అది పెద్ద ఇబ్బందిగా మారింది. దానిని జగన్ తన స్పీచ్లో క్యాష్ చేసుకుంటున్నారు. చంద్రబాబు తను కూడా అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి పదివేల వేతనం ఇస్తానని చెప్పడం ద్వారా తన పాలనకు సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పి విపక్షనేతను డిఫెన్స్ లో పడేశారు. అయితే చంద్రబాబు చేసే వాగ్ధానాలు ప్రజలను మోసం చేయడానికే కాని, అమలు చేయడానికి కాదని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు తీసుకుని ప్రజలతో అవునని చెప్పించారు. ఉదాహరణకు రుణమాఫీ,నిరుద్యోగ భృతి వంటివాటిలో చంద్రబాబు మాట తప్పిన వైనాన్ని జగన్ తెలియచెప్పారు.అలాగే తన ప్రభుత్వంలో పోర్టుల నిర్మాణం, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, పరిశ్రమలకు పునాది పడుతున్న తీరు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో గత మూడేళ్లుగా నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న వైనాన్ని జగన్ విరించారు. కాని అదే చంద్రబాబు,లేదా పవన్ కళ్యాణ్ లు తమ ప్రసంగాలలో ఎక్కడా స్పెసిఫిక్గా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములను విమర్శించలేకపోతున్నారు. పైగా వాటిని మరింతగా ఎక్కువ చేసి అమలు చేస్తామని చెప్పారు. మరి అలాంటప్పుడు రాష్ట్రం విధ్వంసం అయిందని ఆ నేతలు ఎలా చెబుతున్నారో అర్దం కాదు. మోడీ సంకల్పం ఉంది కనుక రాష్ట్రానికి ఉపయోగం అని అంటున్నారే తప్ప, కేంద్రం నుంచి ఏమి సాధిస్తామో చెప్పలేని దయనీయ స్థితి కూటమి నేతలకు ఏర్పడింది. ఉదాహరణకు ప్రత్యేక హోదా అంశాన్ని కూటమి నేతలు ప్రస్తావించలేకపోతున్నారు.ప్రత్యేక హోదా కాకుండా కేంద్రం నుంచి వీరు ఏమి సాధిస్తారో ఎవరికి వివరించలేకపోతున్నారు.రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం డ్రామాలు ఆడుతుండడం, విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ మొదలైన వాటి గురించి వీరు ఒక్క ముక్క మాట్లాడడం లేదు. గతంలో చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలని అన్నప్పుడు కేంద్ర నేతలతో పాటు బీజేపీ రాష్ట్ర నేత దగ్గుబాటి పురందేశ్వరి అది ముగిసిన అధ్యాయం అని అన్నారు. అందుకు చంద్రబాబు ఒప్పుకున్నట్లేనా?బీజేపీ ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ లను తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీనిపై చంద్రబాబు అభిప్రాయం ఏమిటి? ఇలాంటివాటిపై అటు చంద్రబాబు కాని, ఇటు పవన్ కళ్యాణ్ కాని మాట్లాడకుండా ఉమ్మడి ఎజెండాతో ,ప్రజా మానిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నామని చెబితే ఎవరు నమ్ముతారు? అసలు ఉద్యోగాలే రాలేదని ఒకసారి, సచివాలయాలలో కొత్తగా వచ్చిన లక్షన్నర మంది ఉద్యోగుల గురించి మరోసారి చంద్రబాబు మాట్లాడుతారు. వీటిలో ఏది విద్వంసం,ఏది నాశనమో చెప్పలేరు.అప్పుల గురించి మాట్లాడతారు.రాష్ట్రం అప్పులపాలైతే సూపర్ సిక్స్ పేరుతో ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాలకు ఎలా చంద్రబాబు ఖర్చు చేస్తారో వివరించరు. జగన్ అమలు చేసిన అమ్మ ఒడిని తల్లికి వందనం పేరుతో ఎందరు పిల్లలు ఉంటే అందరికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇస్తుంటారు.అది ఎలా సాధ్యమో ఆయన చెప్పరు. ఆ పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్,పురందేశ్వరిలు మాట్లాడరు.ఇవన్ని చూస్తుంటే వీళ్లకు ఒక ఎజెండా లేదు. ముగ్గురు కలిసి జనాన్ని ఎలా మభ్య పెట్టాలా అన్నదానపైనే దృష్టి పెడుతున్నట్లు అనిపిస్తుంది. అయితే జగన్ ను తిట్టడం, లేదంటే రాష్ట్రం విధ్వంసం అయిందని ఆరోపించడం,లేకుంటే జగన్ ఇచ్చిన స్కీములను మరింత ఎక్కువ ఇస్తామని బొల్లడం..జగన్ సభలకు, చంద్రబాబు సభలకు తేడా ఇంత స్పష్టంగా కనిపిస్తుంది.పురందేశ్వరి మాత్రం ఒక మాట చెప్పారు. పవర్ స్టార్ పవన్ శక్తి, చంద్రబాబు యుక్తి, మోడీ సంకల్పం రాష్ట్రానికి ఉపయోగపడతాయని అన్నారు. చంద్రబాబుదంతా కుయుక్తులేనని గతంలో ఈమె అన్నారు. ఇప్పుడేమో ఆ కుయుక్తే ఏమైనా తనకు ఎంపీ పదవి వచ్చేలా చేస్తుందేమోనన్న ఆశతో పురందేశ్వరి ఉన్నారు. పవన్ అయితే ఐదు కోట్ల మందికి ఒక్క నాయకుడు చాలడని అన్నారు. మూడుపార్టీల బలమైన నాయకత్వం కావాలి అని ఆయన చెబుతున్నారు. చంద్రబాబు అనుభవం, జనసేన పోరాట శక్తి కావాలట.కేంద్ర సహయం ఉండాలట. అంటే చంద్రబాబు ఒక్కడు ముఖ్యమంత్రిగా సరిపోడని పవన్ చెబుతున్నట్లే కదా! చంద్రబాబుకు అంత సామర్ధ్యం లేదనే కదా పవన్ ఉద్దేశం? అధికారం వచ్చాక ఈయన కూడా అందులో భాగస్వామి అవుతారా?అవ్వరా? ఎవరిమీద పోరాడుతారు?లేదంటే ఈయన బయట ఉండి మళ్లీ స్పీచ్ లు ఇస్తూ తిరుగుతారేమో తెలియదు.ఒకటి మాత్రం జనానికి చెప్పారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం సరిపోదని చెబుతున్నారని అర్ధం అవుతుంది.రాష్ట్రం కొన ఊపిరితో ఉందట ఎన్డీఏ కూటమి ఆక్సిజన్ అట. అలాగైతే ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోడీతో ఎందుకు చెప్పించలేకపోయారు.ఆయన అసలు రాష్ట్రానికి ఒక్క వరం అయినా ఇచ్చి వెళ్తారా?కేవలం తన కేసులకోసం, కొన ఊపిరితో ఉన్నటీడీపీని బతికించుకోవడం కోసం పొత్తు పెట్టుకుని అదేదో రాష్ట్రం కోసం అని చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినే రోజులు కావివి. వైఎస్సార్సీపీ విధ్వంసం చేస్తోందనే పొత్తు పెట్టుకున్నామని పవన్ అంటున్నారు. ఏమి విధ్వంసమో ఈ మూడు పార్టీల నేతలు చెప్పలేకపోతున్నారు. ఏదో పిచ్చి,పిచ్చి ప్రకటనలు చేసి, సినిమా డైలాగులు మాట్లాడి జనాన్ని బురిడి కొట్టించాలన్న ఉద్దేశం వారిలో కనిపిస్తోంది.తమ పార్టీలను బతికించుకోవడానికి, తాము గెలవలేమన్న భయంతో ఈ మూడు పార్టీలు కలిశాయి తప్ప ఇంకొకటి కాదు. ఓట్లు చీలకూడదని ఎప్పుడైతే అన్నారో, అప్పుడే వీరంతా ఓటమిని అంగీకరించిన్లే అనుకోవాలి.వైఎస్సార్సీపీ వెంటిలేటర్ పై ఉందని అంటున్న చంద్రబాబు దానిని నిజమని నమ్మి ఉంటే ఒంటరిగా పోటీచేసి సవాలు విసిరేవారు. ఇలా అధికారం కోసం జనసేన, బీజేపీ వంటి చిన్నపార్టీలను కాళ్లావేళ్లపడి ఎందుకు బతిమలాడుకుంటారు.ఢిల్లీ వెళ్లి పరువు పోగొట్టుకుని మరీ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు. జగన్ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరిల వద్ద సమాధానం లేదు. అందుకే వీరు ఇలా సోది ప్రసంగాలు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారనుకోవాలి. తాను గెలుస్తానన్న ధైర్యం ఉంది కనుక జగన్ ఒంటరిగా బరిలో దిగి ప్రత్యర్దులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ ప్రజలు ఈ కిచిడి కూటమి కావాలా? లేక జగన్ సాహసవంతమైన నాయకత్వం కావాలా? అన్నది తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి : మేమంతా సిద్ధం 7వ రోజు బుధవారం (ఏప్రిల్ 3) షెడ్యూల్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం విడుదల చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ మంగళవారం రాత్రి బస చేసిన అమ్మగారిపల్లె ప్రాంతం నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. సదుం, కల్లూరు, దామలచెరువు, తలుపులపల్లి మీదుగా తేనెపల్లి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం రంగంపేట క్రాస్ మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు పూతలపట్టు బైపాస్కు చేరుకుంటారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత పి.కొత్తకోట, పాకాల క్రాస్, గదంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్, రేణిగుంట మీదుగా గురువరాజుపల్లె రాత్రి బసకు చేరుకుంటారు. అన్నమయ్య జిల్లా సిద్ధమా? మేమంతా సిద్ధమంటూ బస్సుయాత్రకి ఆరవ రోజు అన్నమయ్య జిల్లా సిద్ధమా? అంటూ మంగళవారం సీఎం జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. మేమంతా సిద్ధమంటూ బస్సుయాత్రలో ముఖ్యమంత్రితో పాటు జనప్రభంజనం కదం తొక్కి ముందుకు సాగింది. –సాక్షి,అమరావతి -
యూటీలు ఎటో?
కేంద్రపాలిత ప్రాంతాల్లో (యూటీ) మొదటి నుంచీ జాతీయ పార్టీలదే ఆధిపత్యం! గత ఎన్నికల్లో యూటీల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న బీజేపీ ఈసారి మరిన్ని సీట్లపై కన్నేయగా, వాటిల్లో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది... 2019 లోక్సభ ఎన్నికల్లో యూటీలను బీజేపీ కొల్లగొట్టింది. ఢిల్లీలో మొత్తం 7 సీట్లనూ చేజక్కించుకుంది. జమ్ము కశ్మీర్, లద్దాఖ్ల్లో 3 సీట్లు నెగ్గింది. చండీగఢ్ ఎంపీ సీటును కాషాయ పార్టీ తరఫున ప్రముఖ నటి కిరణ్ అనుపమ్ ఖేర్ వరుసగా రెండోసారి గెలిచారు. అంతక్రితం ఈ సీటు కాంగ్రెస్ గుప్పిట్లో ఉండేది. డామన్ డయ్యు స్థానమూ బీజేపీ హస్తగతమైంది. 1987లో ఏర్పాటైన ఈ యూటీలో కాంగ్రెస్ 5 సార్లు, బీజేపీ 6 సార్లు నెగ్గాయి. అయితే 2009 నుంచీ ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. అండమాన్ నికోబార్లో మాత్రం బీజేపీ సీటును కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది! 2009, 2014ల్లో బీజేపీ గెలిచిన ఈ స్థానం 2019లో కాంగ్రెస్ పరమైంది. దాద్రానగర్ హవేలీ సీటును 2021 ఉప ఎన్నికల్లో శివసేన గెలుచుకుంది. ఇక్కడ పలు పార్టీల తరఫున ఏకంగా ఏడుసార్లు నెగ్గిన మోహన్భాయ్ సంజీభాయ్ దేల్కర్ 2019లో స్వతంత్రునిగా నెగ్గారు. 2021లో అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ఆయన భార్య కాలాబెన్ మోహన్భాయ్ దేల్కర్ శివసేన తరఫున పోటీ చేసి నెగ్గారు. ఇక లక్షద్వీప్లో కాంగ్రెస్ హవాకు 2019లో ఎన్సీపీ అడ్డుకట్ట వేసింది. ఇటీవల మాల్దీవులతో వివాదం నేపథ్యంలో లక్షదీ్వప్ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. మోదీ పర్యటన తర్వాత టూరిస్టుల తాకిడి కూడా పెరిగింది. పుదుచ్చేరిపై పార్టీల గురి పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీలైన ఎన్ఆర్ కాంగ్రెస్ (ఎన్ఆర్సీ), డీఎంకేతో పాటు కాంగ్రెస్ కూడా చక్రం తిప్పుతున్నాయి. ఈ ఎంపీ సీటును 2014 లోక్సభ ఎన్నికల్లో ఎన్ఆర్సీ గెలుచుకుంది. 2019లో దీన్ని కాంగ్రెస్ చేజిక్కించుకుని బీజేపీ, ఎన్ఆర్సీలతో కూడిన ఎన్డీఏ కూటమికి షాకిచి్చంది. ఎన్.రంగస్వామి కాంగ్రెస్ నుండి విడిపోయి ఎన్ఆర్ కాంగ్రెస్ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. నాటినుంచి ఇక్కడ కాంగ్రెస్ తేరుకోలేకపోతోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లలో ఎన్ఆర్సీ 10 చోట్ల గెలిచింది. బీజేపీకి 6 సీట్లు రావడంతో రంగస్వామి మళ్లీ సీఎంగా ఎన్డీఏ సర్కారు కొలువుదీరింది. పుదుచ్చేరి అసెంబ్లీలోని నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న యానాం కూడా ఉండటం విశేషం! కశ్మీర్..బీజేపీ బ్రహ్మాస్త్రం 2019లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నాటినుంచీ జమ్మూ కశ్మీర్పై మోదీ సర్కారు ఫోకస్ చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలి్పస్తున్న ఆర్టికల్ 370ను 2019 ఆగస్ట్ 5న రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో 6 లోక్సభ స్థానాలున్నాయి. 2019లో జమ్ము, లద్ధాఖ్లోని 3 సీట్లను బీజేపీ గెలుచుకుంది. కాశ్మీర్ లోయలోని 3 సీట్లను జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్సీ) చేజిక్కించుకుంది. 2014లో కూడా బీజేపీకి 3 సీట్లు రాగా పీడీపీకి 3 దక్కాయి. 2014 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 28 సీట్లు, బీజేపీ 25 సీట్లలో గెలిచి ముఫ్తీ మహమ్మద్ సయీద్ సీఎంగా సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశాయి. 2016లో ఆయన మరణించడంతో కుమార్తె మెహబూబా ముఫ్తీ సీఎం అయ్యారు. 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఈ ఏడాది సెపె్టంబర్ లోపు అక్కడ జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తర్వాత దానికి మళ్లీ రాష్ట్ర హోదా దక్కే అవకాశాలున్నాయి. గతంలో ఇక్కడ చక్రం తిప్పిన కాంగ్రెస్ గులాంనబీ ఆజాద్ రాజీనామాతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. సొంత పార్టీ పెట్టుకున్న ఆజాద్ చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇండియా కూటమి పక్షాలు కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. జమ్ములోని 2 సీట్లలో కాంగ్రెస్కు ఎన్సీ, పీడీపీ మద్దతివ్వనున్నాయి. కాశ్మీర్ లోయలోని 3 సీట్లపై మాత్రం పీటముడి పడింది. మూడింట్లోనూ పోటీ చేస్తామని ఎన్సీ ప్రకటించింది. పీడీపీ కూడా వెనక్కి తగ్గడం లేదు. సర్వేల అంచనాలు ఇలా... ఈసారి కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ బలం మరింత పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. ఢిల్లీలో మళ్లీ క్లీన్స్వీప్తో పాటు పుదుచ్చేరి, లద్దాఖ్, చండీగఢ్ ఆ పార్టీ పరం అవుతాయంటున్నాయి. జమ్ము కశ్మీర్లో 2, దాద్రానగర్, డామన్ డయ్యు, అండమాన్ సీటు కూడా బీజేపీవేనన్నది వాటి అంచనా. కాంగ్రెస్ లక్షదీ్వప్లో మాత్రం నెగ్గవచ్చని, కశ్మీర్లోని 3 సీట్లలో ఎన్సీ గెలుస్తుందని అన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లోకేష్ రెడ్ బుక్ కి గంగుల బ్రిజేంద్ర రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
లోకేష్ రెడ్ బుక్ కి గంగుల బ్రిజేంద్ర రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
Related News by category
-
భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
ఢిల్లీ: ఆప్ పార్టీ తరపున ఏప్రిల్ 27 నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ రోజు (ఆదివారం) పశ్చిమ ఢిల్లీ నియోజక వర్గంలో ఆప్ అభ్యర్థి మహాబల్ మిశ్రాకు మద్దతు కోరుతూ క్యాంపెయిన్ నిర్వహించారు.ఢిల్లీ రోడ్షోలో సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. భారతమాత కుమార్తెగా.. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన భర్త సింహం అని, ఆయన్ను ఎవరూ పడగొట్టలేరని అన్నారు. కారు సన్రూఫ్లోంచి నిల్చుని ఓటర్లకు అభివాదం చేశారు.పాఠశాలలు కట్టడం, ఉచిత విద్యుత్ అందించడం, మొహల్లా క్లినిక్లు ప్రారంభించి ప్రజలకు మంచి పనులు చేసినందుకే జైలుకెళ్లారని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఆయన (కేజ్రీవాల్) భరతమాత పుత్రుడు, నియంతృత్వానికి వ్యతిరేఖంగా ఓటు వేసి ప్రజాస్వామ్యం కాపాడుకోవడం మీ బాధ్యత. దయచేసి దీని విలువ అర్థం చేసుకోండి అని ఆమె అన్నారు.లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ఆప్' తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఇక ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, చాందినీ చౌక్ స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను నిలబెట్టింది.जनता के इस सैलाब के आगे,कोई तानाशाह टिक नहीं सकता 🔥अपने बेटे, अपने भाई केजरीवाल को आशीर्वाद देने सड़कों पर उमड़ी पश्चिमी दिल्ली की जनता 💯#KejriwalKoAshirwad pic.twitter.com/ZTPl8LrsaS— AAP (@AamAadmiParty) April 28, 2024 -
బీజేపీకి వచ్చే సీట్లు అవే: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీజేపీ కి రెండు వందల సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని, కేంద్రంలో హంగ్ వస్తే.. పార్లమెంట్లో బీఆర్ఎస్ కీలకం అవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బస్సు యాత్రలో భాగంగా హన్మకొండలో ఆదివారం( ఏప్రిల్ 28) జరిగిన రోడ్షోలో కేసీఆర్ మాట్లాడారు.‘ఓరుగల్లు చైతన్యం ఉన్న జిల్లా. చరిత్ర వైభవానికి ప్రతీక వరంగల్ జిల్లా. ఓరుగల్లు మట్టితో నాది విడదీయరాని బంధం. ఐదు మెడికల్ కాలేజీలు వరంగల్ ఉమ్మడి జిల్లాకు తెచ్చుకున్నాం. ఈ ముఖ్యమంత్రి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు. భూగోళం తెలియదు. ఏరి కోరి మొగుణ్ణి తెచ్చుకుంటే ఎగిరిఎగిరి తన్నట్లుంది తెలంగాణ పరిస్థితి. రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ఈ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దివాలా తీసింది. తెలంగాణ గొంతుకోసి మోదీ గోదావరి జలాలను తమిళనాడు కు తరలించే కుట్రలు చేస్తున్నాడు.మోదీ గోదావరిని ఎత్తుకు పోతా అంటుంటే ఈ ముఖ్యమంత్రి మూతి ముడుచుకొని కూర్చున్నాడు. . బీజేపీ చాలా ప్రమాద కరమైన పార్టీ. ప్రజల మధ్య పంచాయితీలు పెట్టడం తప్ప మరో ప్రణాళిక లేదు. బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉండవు. అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చేదిన్ వచ్చింది. రూపాయి విలువ పడిపోయింది. కడియం శ్రీహరి బీఆర్ఎస్కు చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకున్నాడు. మూడు నెలల్లో స్టేషన్ ఘన్పూర్కు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. రాజయ్య ఎమ్మెల్యే కాబోతున్నాడు. రాజయ్య చేతిలో కడియం ఓటమి ఖాయం.గోదావరి, కృష్ణా నదులను కాపాడుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి. రేవంత్ రెడ్డి నా గుడ్లు పీకి గోలీలు ఆడుకుంటాడట.. నా లాగు కూడా ఊడ తీస్తాడట. నన్ను చర్లపల్లి జైలులో వేస్తాడట. నీ జైళ్ళు, తోకమట్ట దెబ్బలకు కేసీఆర్ భయపడడు. ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో వరంగల్లో కట్టిన 24 అంతస్తుల ఆస్పత్రే నిదర్శనం’ అని కేసీఆర్ అన్నారు -
‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
ఒడిశాను ‘పాన్’ (పాండియన్, అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ, నవీన్ పట్నాయక్) పరిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బిజూ జనతాదళ్ ఒకరినొకరు పెళ్లి చేసుకున్నాయి అని అన్నారు. ఒడిశాలోని కేంద్రపరా ప్రాంతంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఒడిశాలో బీజేపీ-బీజేడీలు పెళ్లి చేసుకున్నాయి. వారు అందరికీ పాన్ ఇచ్చారు. పీఎం మోదీ 22-25 మంది కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అదే పద్ధతిలో నవీన్ పట్నాయక్ కూడా కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులకే అధికారం దక్కుతుంది. ఈ వ్యక్తులు మీ సంపదను దోచుకున్నారు. రైతుల భూములు లాక్కున్నారని ఆరోపించారు. మీరు (ప్రజలు) తగినంత పాన్ తిన్నారు. ఇప్పుడు ఒడిశాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఒడిశాలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి నాలుగు దశల్లో జరగనున్నాయి. మే 13న మొదటి దశ, మే 20న రెండో దశ, మే 25న మూడో దశ, జూన్ 1న చివరి దశ. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో, బిజూ జనతాదళ్ (బీజేడీ)కి అత్యధిక స్థానాలు (12), ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ (8), కాంగ్రెస్కు ఒక్కటే సీటుతో సరిపెట్టుకుంది. -
పులివెందులలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ప్రతి గ్రామంలో వైఎస్ భారతికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వన్స్మోర్ సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు.వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వైఎస్ భారతి అన్నారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు ఆమె వివరిస్తున్నారు. -
‘‘కేజ్రీవాల్ను చంపుతారా..?’’
న్యూఢిల్లీ: లిక్కర్స్కామ్ కేసులో జైలు పాలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలను ఆయన భార్య సునీత కేజ్రీవాల్ భుజానికెత్తుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి తానే స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం(ఏప్రిల్28) పశ్చిమ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి తరపున సునీత రోడ్షోలో పాల్గొన్నారు. దేశంలో నియంతృత్వాన్ని పారద్రోలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని రోడ్షోలో సునీత కోరారు. ప్రజల కోసం పనిచేసినందుకే తన భర్త కేజ్రీవాల్ను జైలుకు పంపించారన్నారు. తీహార్ జైలులో ఆయన సుగర్ వ్యాధికి సరైన చికిత్స అందించడం లేదన్నారు. అరవింద్ కేజ్రీవాల్ను చంపాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ఒక సింహం ఆయనను ఎవరూ ఏం చేయలేరన్నారు. సునీతా కేజ్రీవాల్కు ఇది రెండో షో. శనివామే సునీత తన రోడ్షోలు ప్రారంభించారు. తొలి రోడ్షో తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలోని కోండ్లిలో నిర్వహించారు. ఢిల్లీలో మే 25న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఎక్కడో కూర్చోని మాట్లాడతారు.. వారిని నేను పట్టించుకోను: కోహ్లి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement