రెండు రోజుల పాటు వేటు
⇒ మార్షల్స్ సాయంతో బయటకు
⇒ సస్పెండవడానికే వచ్చారు: హరీశ్
⇒ మాట్లాడితే బయటికి పంపుతారా?
⇒ జానారెడ్డి ధ్వజం... వాకౌట్
⇒ బీజేపీకి జానా మద్దతు బాధాకరం: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్ల వ్యతిరేక ధర్నాలో పాల్గొననివ్వకుండా బీజేపీ కార్యకర్త లను అరెస్టు చేయడంపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టిన ఆ పార్టీ సభ్యు లు రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ అయ్యారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడు తున్న బీజేపీ సభ్యులను శనివారం దాకా సస్పెండ్ చేయాలంటూ సభా వ్యవహారాల మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.
శుక్రవారం సభ ప్రారంభ మవగానే నల్లకండువాలతో సభకు వచ్చిన బీజేపీ సభ్యులు జి.కిషన్రెడ్డి, కె.లక్ష్మణ్, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజా సింగ్ తమ వాయిదా తీర్మానంపై చర్చకు పట్టు బట్టారు. పోడియం ముందు నిరసనకుదిగారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడంపై మాట్లాడే అవకాశమివ్వాలన్నారు. స్పీకర్ నిరాకరించడంతో ‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అక్రమ అరెస్టులు ఆపాలి’’ అంటూ నినదించారు. బీజేపీ సభ్యులు బయట ధర్నా పెట్టుకొని, సస్పెండయ్యే ఉద్దేశంతోనే వచ్చా రని హరీశ్ ఆక్షేపించారు. ఇది పద్ధతి కాదని, కూచోవాలని కోరారు. వారు నినాదాలు చేస్తూనే ఉండటంతో శనివారం దాకా సస్పెండ్ చేయాలంటూ తీర్మానం ప్రవేశపెట్టారు.
బీజేపీకి జానా మద్దతు
తమ ధర్నాను అడ్డుకున్నందుకు బీజేపీ సభ్యులు సభలో ఆందోళన చేస్తున్నారంటూ విపక్ష నేత జానారెడ్డి వారికి మద్దతుగా మాట్లా డారు. వాయిదా తీర్మానాలుంటే ప్రశ్నోత్తరాల తర్వాత మాట్లాడాలని బీఏసీలో నిర్ణయిం చామని హరీశ్ గుర్తు చేశారు. ధర్నా చౌక్ను ఇందిరా పార్కులోనే కొనసాగిస్తే చలో అసెంబ్లీ కార్యక్రమమే ఉండేది కాదుగా అని జానా అన్నారు. ధర్నా చౌక్ తరలింపును ఉపసంహ రించుకోవాలని, అరెస్టు చేసిన వారిని విడిచి పెట్టాలని కోరారు. ఈ సమయంలోనూ బీజేపీ సభ్యులు నినాదాలు చేయడంతో స్పీకర్ సస్పె న్షన్ తీర్మానం చదివారు. దాంతో వారు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు.
వైఎస్, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి హయాముల్లోనూ ఇంత దౌర్జన్యం లేదన్నారు. మార్షల్స్ వచ్చి బీజేపీ సభ్యలను బయటకు తీసుకెళ్లారు. మాట్లాడితే అణచేస్తాం, బయటకు పంపుతామంటే ప్రజాస్వామ్యానికి మంచిది కాదని జానా అసంతృప్తి వెలిబుచ్చారు. వారి సస్పెన్షన్కు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. సస్పెన్షన్ చేయించుకునేందుకే వచ్చిన బీజేపీ సభ్యులకు జానా మద్దతివ్వడం దురదృష్టకరం, బాధాకరం అని హరీశ్ అన్నారు. ‘‘ఏపీ సభలో విపక్ష నేత మైక్ గంటగంటకు కట్ చేస్తున్నారు. ఇక్కడలా చేయడం లేదు. అక్కడ 4 గంటలకోసారి సభ వాయిదా పడుతోంది.
ఇక్కడ ఎన్ని గంటలైనా చర్చ జరుగుతోంది. సంఖ్యాపరంగా తక్కువున్నా విపక్ష సభ్యులకే ఎక్కువ అవకాశమిచ్చాం. టీఆర్ఎస్ సభ్యులు 8.45 గంటలు మాట్లాడితే, కాంగ్రెస్ సభ్యులు 11.31 గంటలు, బీజేపీ 5.40 గంటలు, మజ్లిస్ 3.36 గంటలు, సీపీఎం 1.15 గంటలు, టీడీపీ 2.14 గంటలు మాట్లాడారు’’ అని వివరించారు. కాగా, ఇదే అంశంపై మండలిలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో ఆయన సభ నుంచి వాకౌట్ చేశారు.
బీజేపీ సభ్యుల సస్పెన్షన్
Published Sat, Mar 25 2017 3:31 AM
Advertisement
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
విద్యార్థుల్లారా.. రండి మాతృ దేశానికి సేవ చేయండి.. ఫిజిక్స్ వాలా పిలుపు
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
What’s your opinion
Advertisement