Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా

Published Sun, Jul 5 2015 1:39 PM

child dies of checkdam

హయత్‌నగర్ (రంగారెడ్డి జిల్లా): స్నేహితులతో కలిసి ఈతకెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేట గ్రామంలో జరిగింది. వివరాలు..  గ్రామానికి చెందిన ఫయాజ్ (13) తన స్నేహితులతో కలిసి ఆదివారం ఈతకెళ్లాడు.

అయితే, ఈతకెళ్లిన ఫయాజ్ ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి మృతి చెందాడు. ఈ సమాచారాన్ని స్నేహితులు తల్లిదండ్రులకు అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని డ్యాంలో నుంచి వెలికితీశారు. అనంతరం పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement