* ‘హోదా’ విషయంలో టీడీపీది ద్వంద్వవైఖరి
* వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: నయీం చేసిన ఘోరాలపై విచారణ జరపడమే కాదు, ఆయన వెనకుండి ప్రోత్సహించిన వారి చిట్టాలనూ ప్రజలముందుంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నయీం మూలాలన్నీ టీడీపీ నేతల చుట్టే తిరుగుతూ ఉండటం దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు. టీడీపీవాళ్లు ఈ రకంగా కూడా రాజకీయాలు చేస్తున్నారా? అనే ఆందోళన కలుగుతోందన్నారు.
పత్రికల్లో వస్తున్న వార్తలు, టీఆర్ఎస్లోని కొందరు సీనియర్ నేతలు చెబుతున్న మాటల్నిబట్టి చూస్తే నయీంను గతంలో పెంచిపోషించింది ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలేననేది తెలిసిపోతోందన్నారు. నయీం కేసులో ఏ-1గా టీడీపీ మాజీమంత్రి ఒకరిని పెడుతున్నారని వార్తలొస్తున్నాయన్నారు. నయీం చేసిన నేరాలు ఎంత ఘోరమైనవో... అతన్ని పెంచి పోషించిన వారిదీ అంతే తప్పిదమన్నారు.
ఏపీలో ఎంతమంది నయీంలను పోషిస్తారో...
అధికారంకోసం రౌడీల్ని పెంచి పోషించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించే సంస్కృతి టీడీపీలో ఉండటం చూస్తే ఇక రాజధాని భూదందాలు, తీవ్రమైన కుంభకోణాలకు పాల్పడుతున్న టీడీపీ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది నయీంలను... పెంచిపోషిస్తుందోననే భయాందోళనలు కలుగుతున్నాయని అన్నారు. ప్రత్యేకహోదా కావాలనే సెంటిమెంట్ను జగన్ రెచ్చగొడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేశ్బాబు చెప్పడం ఆపార్టీ ద్వంద్వవైఖరికి, డ్రామాలకు నిదర్శనమని పార్థసారథి దుయ్యబట్టారు.
ప్రత్యేకహోదా ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని అన్నారు. ‘హోదా’ వస్తే సమస్యలన్నీ తీరిపోతాయని జగన్ చెబుతున్నారని లోకేశ్ విమర్శిస్తూ ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు ఎన్ని ఉద్యోగాలొచ్చాయి? సమస్యలన్నీ తీరిపోతాయా? అని చెప్పడంలో అర్థమేమిటన్నారు. హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, వద్దని లోకేశ్ ధైర్యంగా చెప్పగలరా? అని సవాలు విసిరారు.
'నయీంను పెంచి పోషించింది టీడీపీనే'
Published Fri, Aug 12 2016 4:11 AM
Related news
-
నాయకుడి రూపం...గారడీ వేషం
మాటలది ఏముంది..ఏమైనా చెప్పొచ్చు ఎన్నైనా చెప్పొచ్చు..మబ్బులు తెచ్చి ఒళ్ళో పోస్తాను అనొచ్చు.. జాబిల్లిని తెచ్చి చేతికి ఇస్తామనోచ్చు. కానీ నిజంగా ఆ మాట నిలుపుకున్నపుడు కదా ఆ మాటకు, ఇచ్చినవాడికి విలువ.. రాజకీయంగా చూస్తే చంద్రబాబు గత నలభయ్యేళ్లుగా ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదు... అసలు మేనిఫెస్టో అనేది ఆయనకు ఒక చిత్తుకాగితంతో సమానం. ఎన్నికలప్పుడు వెయ్యిమాటలు చెప్పడం.. ఒక్కటంటే ఒక్కటీ చేయకుండా..మాయమాటలతో పూటగడిపేయడం...మళ్ళీ అవే హామీలను ఇస్తూ మరో ఎన్నికకు సిద్ధం కావడం..అదే అయన కెరీర్ మొత్తం..సాగిపోయింది.2014 లో కూడా ఇలాగే రైతు రుణమాఫీ... డ్వాక్రా రుణ మాపీ....నిరుద్యోగ భృతి అంటూ వందలాది పథకాల పేర్లు చెప్పి ఓట్లేయించుకుని చివరకు మేనిఫెస్టో కూడా దొరక్కుండా దాచేసారు. మళ్ళీ ఇప్పుడు అదే హామీలు ఇస్తూ 2024 ఎన్నికలకు చంద్రబాబు.. జనసేనాని కలిపి సిద్ధం అవుతున్నారు. ఇక సీఎం వైఎస్ జగన్ ఐతే నవరత్నాలు అంటూ తాను అమలు చేయగలిగే హామీలు మాత్రమే జాబితాలో చేర్చి వాటిని తూచా తప్పకుండా అమలు చేసారు.. అమ్మఒడి, ఆసరా.. సున్నా వడ్డీ , రైతు భరోసా.. జగనన్న విద్యా దీవెన , విద్యా కనుక, ముప్పై లక్షలమందికి ఇళ్ళు, కాపునేస్తం...ఇలా జాబితాలో చేర్చినవన్నీ చేసుకుంటూ వెళ్లారు.. ఆర్థికంగా అది ఖజానాకు భారమే అయినా ప్రజలకు మాట ఇచ్చాము కాబట్టి ఎలాగైనా చేయాలన్న పట్టుదల, తలంపుతో రెండేళ్లు కోవిద్ కారణంగా ఖజానా వట్టిపోయినా జగన్ మాత్రం వెనక్కి తగ్గకుండా పథకాలు ఇచ్చారు.ఈ ఎన్నికలకు సైతం తాను చేయగలిగేవే చేస్తాను అంటూ ఇప్పుడున్న పథకాలను కొనసాగిస్తూనే అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ కానుకలను మాత్రం మరింతగా పెంపుదల చేస్తాను అని చెప్పారు. ఇక చంద్రబాబు మాత్రం ఎలాగూ అమలు చేయరు కాబట్టి... అలవిమాలిన హామీలన్నీ ఇస్తున్నారు...కానీ చేయి చాచి సాయం చేసేది ఎవరు... వట్టినే నోటితో మాటలు చెప్పి చేతల్లో సున్నా చుట్టేది ఎవరన్నది ప్రజలకు తెలుసు... చంద్రబాబును గత పదేళ్లుగా గమనిస్తున్న వాళ్లందరికీ అయన నిజరూపం ఏమిటన్నది తెలుసు..అందుకే అయన ఎన్ని హామీలిచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక జగన్ పథకాల పేరిట రాష్ట్రాన్ని అప్పులపాల్జేస్తున్నారు అని ఆరోపించేవాళ్లకు చంద్రబాబు ఇస్తున్న భారీ హామీలు కనిపించవా ? అయన లక్షలకోట్ల ఇచ్చుకుంటూ పొతే రాష్ట్రం మరింత కుదేలవదా అనే చర్చ కూడా మొదలైంది. ఈ క్రమంలో ఇప్పుడున్న పథకాలు ఇవ్వడమే గొప్ప... అది కూడా జగన్ ఒక్కడే చేస్తారు... వేరేవాళ్లకు సాధ్యం కాదని అవగతం చేసుకున్న ప్రజలు మళ్ళీ జగన్ మాత్రమే మనకు ఉండాలి అని నిర్ణయించుకున్నారు. -సిమ్మాదిరప్పన్న -
ప్రత్యర్థులను గుక్క తిప్పుకోనివ్వని సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి తక్కువోడు కాదు.. ప్రత్యర్దులను గుక్క తిప్పుకోకుండా చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల కోసం ప్రకటించిన తీరును గమనిస్తే ఆయనలో సాహసి కనిపిస్తారు. దాదాపు కొత్త స్కీములు లేకుండా, ఉన్నవాటిని యధాతధంగా కొనసాగిస్తూ తన నిజాయితిని రుజువు చేసుకున్నారు. ఒక టీచర్ మాదిరి తన గత మేనిఫెస్టోని,కొత్త మేనిఫెస్టోని చూపుతూ చేసిన స్పీచ్ ఆసక్తికరంగా ఉంది.జగన్ మేనిఫెస్టో తర్వాత చంద్రబాబు మరింత ఆత్మరక్షణలో పడతారు. తాను ఇచ్చిన సూపర్ సిక్స్ను ప్రజలు నమ్మరన్న సంగతి ఆయనకు అర్ధం అవుతుంది. అందుకోసం చంద్రబాబు కొత్త అబద్దాలను చెబుతారేమో చూడాలి. జగన్ మేనిఫెస్టో తీరు చూస్తే, 2009లో ఈయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మేనిఫెస్టోని ప్రకటించిన సందర్భం గుర్తుకు వస్తుంది.అప్పటికి ఐదేళ్లు పాలన పూర్తి చేసుకున్న వైఎస్ ఆర్ తాను కొత్త హామీలను ఏమీ ఇవ్వబోనని ప్రకటించారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ మరో రెండు గంటలు అదనంగా ఇవ్వడం వంటి ఒకటి రెండు హామీలు మినహాయించి కొత్తవి లేకుండా వైఎస్ మేనిఫెస్టోని ప్రకటించడం సాహసంగా అప్పట్లో అనుకున్నారు. అప్పుడు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా, టీడీపీ మేనిఫెస్టో నిండా వాగ్దానాల వరద పారించారు.ప్రతి ఇంటికి నేరుగా నగదు బదిలీ చేస్తామని అది ఒక్కొక్కరికి పదిహేనువందల నుంచి ఉంటుందని చెప్పారు. అదొక్కటే కాదు.. అనేక ప్రజాకర్షక హామీలను గుప్పించారు. అయినా వైఎస్ తొణకలేదు.తాను చేయగలిగినవే చేస్తానని చెప్పారు. దానినే ప్రజలు నమ్మారు.ఆయనను గెలిపించారు. మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కాని దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించారు.ఆ తర్వాత 2014లో వైఎస్ కుమారుడు జగన్ సొంత పార్టీ పెట్టుకుని ఎన్నికలలోకి వచ్చారు. ఆ సమయంలో చాలామంది రైతుల రుణమాఫీ హామీ ఇవ్వాలని ఆయనకు సూచించారు. కాని ఆయన అందుకు ఒప్పుకోలేదు.ఒకసారి ప్రకటించాక, ప్రభుత్వం వచ్చినా చేయలేకపోతే దెబ్బతింటామని అన్నారు. కాని అదే చంద్రబాబు నాయుడు మాత్రం ఆచరణసాధ్యం కాదని తెలిసినా లక్ష కోట్ల రూపాయల రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తామని,బ్యాంకులలో తాకట్టులో ఉన్న బంగారు నగలను విడిపిస్తామని హామీ ఇచ్చారు. అదే కాకుండా కొన్ని వందల హామీలను మేనిఫెస్టోలో పెట్టారు. అప్పటి పరిస్థితులలో టీడీపీ కూటమిని గెలిపించారు. ఆ తర్వాత చంద్రబాబు సినిమా చూపించడం ఆరంభించారు.రుణమాఫీ అని ఆశపడ్డవారికి చుక్కలు చూపించారు. రకరకాల విన్యాసాలు చేశారు. పైగా రైతులను ఆశపోతులని తూలనాడారు. కాపు రిజర్వేషన్ తదితర అనేక అంశాలలో అదే పరిస్థితి. సుమారు 400 వాగ్దానాలు చేసి చేతులెత్తేశారు. ఆ విషయం ప్రజలకు బాగా అర్దం అయింది. 2019 లో మళ్లీ జగన్ ,చంద్రబాబుల మధ్యే పోటీ సాగింది.ప్రజలంతా చంద్రబాబు తమను మోసం చేశారని భావించి జగన్ వైపు వచ్చి భారీ మెజార్టీతో గెలిపించారు. ఆ తర్వాత ఆయన తన మేనిఫెస్టోని ఎప్పుడూ లేని విధంగా సచివాలయంలో పెట్టి హామీల అమలుకు శ్రీకారం చుట్టారు.అలాగే ప్రతి ఏటా తన హామీల పరిస్థితిని ప్రజలకు వివరించారు.దాంతో ప్రజలకు ఆయనపై ఒక నమ్మకం ఏర్పడింది. 99 శాతం పైగా హామీలు నెరవేర్చి మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నట్లు ఆయన చెబుతున్నారు.దీనిని ఎవరూ కాదనలేని పరిస్థితి. పైగా జగన్ అమలు చేసిన స్కీములను తాము చేస్తామని అంత పెద్ద సీనియర్ చంద్రబాబు నాయుడు చెప్పే పరిస్థితిని జగన్ కల్పించారు.అదే జగన్ కు పెద్ద విజయం గా భావించాలి. ప్రత్యర్ధి తనను అనుసరిస్తున్నాడంటే ఆ కిక్కే వేరబ్బా అన్నట్లుగా చంద్రబాబు తీసుకునే యుటర్న్ లు జగన్ కు పెద్ద ప్లస్ పాయింట్లు అయ్యాయి. జగన్ వలంటీర్ల వ్యవస్తను పెట్టినప్పుడు ,ఆయా స్కీములు అమలు చేస్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటివారు చెప్పిన పిచ్చి సలహాలు నమ్మి ఏపీ శ్రీలంక అయిపోతుందని, నాశనం అవుతోందని చంద్రబాబు ప్రచారం చేశారు.తీరా ఎన్నికల సమయానికి జగన్ స్కీములను, తెలంగాణలో,కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కలిపి సూపర్ సిక్స్ అంటూ ఒక పత్రం తయారు చేసుకుని ప్రజల ముందుకు వచ్చారు. అది చూసి జనం అంతా ఆశ్చర్యపోయారు. జగన్ అమలు చేస్తే నాశనం అన్నారు. అంతకు మించిన వాగ్దానాలు చంద్రబాబు ఎలా ఇస్తారని విస్తుపోయారు.దాంతో చంద్రబాబు క్రెడిబిలిటి పోయింది. ఆయనను సమర్ధించుదామని అనుకున్నవారికి వాదన లేకుండా చేశారు.ఆ విషయాన్ని జగన్ ఇప్పుడు చాలా బాగా వాడుకుని తాను చేయలేనివి చెప్పనని, చంద్రబాబులా మోసం చేయబోనని ప్రజలకు పరిస్థితి విడమరిచి చెప్పారు. కేవలం వృద్దాప్య పెన్షన్ ను మరో ఐదు వందల రూపాయలు అది కూడా వచ్చే టరమ్ చివరి రెండేళ్లు పెంచుతానని,ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ ల ఏర్పాటు చేస్తానని, అమ్మ ఒడి కింద ఇచ్చే మొత్తాన్ని పదిహేనువేల నుంచి పదిహేడువేలు చేస్తామని జగన్ తాజా మేనిఫెస్టోలో తెలిపారు.అలాగే రైతు భరోసాను పదహారువేలు చేస్తామని తెలిపారు.ఆయా స్కీములను కొనసాగిస్తూ కొద్దిపాటి మార్పులు మాత్రం జగన్ ప్రతిపాదించారు. తాను అమలు చేస్తున్న స్కీములు, ఇవి కాకుండా తప్పనిసరిగా అమలు చేయవలసిన కార్యక్రమాలకు కలిపి డెబ్బైవే కోట్ల వ్యయం అవుతుందని, కాని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన స్కీములకు, ఎవరు ఉన్నా అమలు చేయవలసిన కార్యక్రమాలకు కలిపి లక్షన్నర కోట్ల వ్యయం అవుతుందని లెక్కలుగట్టి చెప్పారు. చంద్రబాబు మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తున్నారన్న విషయం అర్ధం అయ్యేలా జగన్ విడమరిచి చెప్పారు. చంద్రబాబు తాను సంపద సృష్టిస్తానని బొంకుతారని అంటూ ఆయన అధికారంలో ఉన్న పద్నాలుగేళ్లలో రాష్ట్రం ఎప్పుడూ రెవెన్యూ లోటులోనే ఉన్న విషయాన్ని బడ్జెట్ పుస్తకాల ఆధారంగా చెప్పారు.చంద్రబాబు దృష్టిలో సంపద అంటే రాజధాని గ్రామాలలో తనవారికి రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే బ్లాక్ మనీనే అనుకోవాలి. అందులో కూడా వారికి పన్ను రాయితీలు ఇప్పించారు. అంతే తప్ప మిగిలిన రాష్ట్రం అంతటిని గాలికి వదలివేశారు. పైగా రాష్ట్ర ప్రజలందరు పన్నులు రూపంలో కట్టిన డబ్బును రాజధాని గ్రామాలలో మాత్రమే వ్యయపరచడానికి సిద్దం అయ్యారు.దాంతో ప్రజలకు మండి ఆయనను ఘోరంగా ఓడించారు. అయినా ఇప్పుడు మళ్లీ అమరావతి అని చంద్రబాబు అంటున్నారు.కాని జగన్ మాత్రం చాలా ధైర్యంగా విశాఖ నుంచి పాలన చేస్తామని, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని, కర్నూలు న్యాయ రాజధాని అని మరోసారి స్పష్టం చేశారు. విశాఖను రాష్ట్రానికి ఉపయోగపడే గ్రోత్ ఇంజన్ గా మార్చాలన్నది జగన్ సంకల్పం అయితే, ఏపీ ప్రజలందరి సొమ్ము అమరావతి గ్రామాలలో ఖర్చు చేయాలన్నది చంద్రబాబు ఆలోచన.గతసారి ప్రజలు చంద్రబాబు ప్రతిపాదనను తిరస్కరించారు. ఇక అప్పుల విషయంలో కూడా తన ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న తేడాను గణాంకాలతో సహా జగన్ వివరించారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్,మోడీలు కలిసి 2014లో ఇచ్చిన హామీల పత్రం జగన్ కు ఆయుధంగా మారింది. అందులో పేర్కొన్న ఏ ఒక్కటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేయయలేకపోయారు. తాను అలా చేయబోనని, చేయగలిగే వాటినే హామీలు గా ఇస్తానని జగన్ అంటూ చంద్రబాబు సూపర్ సిక్స్ వంటి అసాధ్యమైన హామీలతో పోటీ పడలేదు. చంద్రబాబు చెప్పే అబద్దాలతో తాను పోటీ పడబోనని కూడా జగన్ ప్రకటించారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ ఒక ఉపాద్యాయుడు మాదిరి పలు అంశాలను వివరించిన తీరు ఆసక్తికరంగా ఉందని చెప్పాలి.ఆయా వర్గాలకు చేయదలచిన కార్యక్రమాలను వివరించడం, పరిశ్రమల పరంగా ,ప్రాజెక్టుల పరంగా ఏమి చేయదలించింది చెప్పే యత్నం చేశారు. సిద్దం సభల మాదిరే మేనిఫెస్టో విడుదల కు కూడా ఆయన పూర్తిగా సిద్దం అయి ప్రజలను కూడా మానసికంగా సిద్దం చేయడానికి వీలుగా ప్రసంగించారు. చంద్రబాబు కూటమి ఇచ్చే హామీలను నమ్మవద్దని, గతంలో మాదిరే మళ్లీ చంద్రబాబు మోసం చేయడం కోసమే అలాంటి హామీలను ఇస్తున్నారని సోదాహరణంగా జగన్ వివరించారు. జగన్ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణలో పడే పరిస్థితి ఏర్పడింది.తాను చెబుతున్న వాగ్దానాలకు అయ్యే ఖర్చు చెప్పలేరు. చెబితే ఆయనను నమ్మే పరిస్థితి ఉండదు. ఆ రకంగా చంద్రబాబు సూపర్ సిక్స్ కు జగన్ బ్రేక్ వేసినట్లయిందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ కు పెద్దగా పోయేది లేదు..వచ్చేది లేదు ..ఆయన పోటీచేసే స్థానాలు కూడా పట్టుమని పది లేవు.అందువల్ల ఆయన చంద్రబాబు చెప్పేవాటికి భజన చేయడం తప్ప సొంతంగా ఆలోచించవలసిన అవసరం లేదు. బిజెపి వారు ఇప్పటికే తాము ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని చెబుతున్నారు.దానిపై చంద్రబాబు ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయారు. బిజెపితో ఎందుకు కలిసింది?దానివల్ల ప్రత్యేక హోదా తెస్తారా?లేక విభజన హామీలన్నిటిని తీర్చగలుగుతారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతారా? మొదలైనవి ఏమీ లేకుండా చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చినా జనం నమ్మరు.జగన్ చెప్పినట్లు రాష్ట్ర ఆర్దిక వనరులను లెక్కలోకి తీసుకోకుండా ఏ హామీ పడితే అది ఇచ్చి ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు కూటమి ముందుకు వస్తోంది.ఉదాహరణకు వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని,ఆ వ్యవస్థపై పలుమార్లు విషం కక్కిన చంద్రబాబు,పవన్ కళ్యాణ్లు ఇప్పుడు దానిని కొనసాగిస్తామని, పైగా వారికి ఐదువేల రూపాయల బదులు పదివేల రూపాయలు ఇస్తామని చెబుతున్నారు.అందుకు ఎంత వ్యయం అవుతుందో వారు లెక్కగట్టకుండా గండం నుంచి బయటపడడానికి హామీ ఇచ్చారు. అందువల్లే దానిని ఆయన మాటలను ఎవరూ విశ్వసించడం లేదు. చంద్రబాబును నమ్మితే జగన్ పద్దతిగా ఇస్తున్న సంక్షేమ పధకాలను కూడా నష్టపోతామన్న భయం ప్రజలలో ఉంది. అందువల్లే జగన్ ధైర్యంగా కొత్త హామీలు ఏవీ ఇవ్వకుండా ప్రజల ముందుకు వచ్చారు. జగన్ చేసిన వాదనకు ఎలా సమాధానం ఇవ్వలో తెలియక చంద్రబాబు జుట్టు పీక్కునే పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
Watch Live: వెంకటగిరిలో సీఎం జగన్ బహిరంగ సభ
Watch Live: వెంకటగిరిలో సీఎం జగన్ బహిరంగ సభ -
మోసాల బాబు వద్దు.. జగన్ ముద్దంటున్న జనం
అది కాదురా అప్పలరాజు.. కంకర్రాళ్ళు గంపెడు ఎందుకురా.. పనికొచ్చే రత్నం ఒక్కటి ఉంటె సరిపోదేట్రా.. ఎదవ సంతానం పదిమందిని కంటే యేటి లాభం.. వజ్రంలాంటి కొడుకు ఒక్కడు ఉంటె సరిపోదేట్రా.. కాయలివ్వని చెట్లు వెయ్యి ఉంటె యేటి లాభం.. పళ్ళిచ్చే మొక్క ఒక్కటి సరిపోదేట్రా.. అంటున్నారు నారాయణ.. ఒరేయ్ బాబు నీ ఎగ్జామ్పుల్స్ ఆపురా నాయిన ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావ్... హాయిగా తాటిముంజెలు తిని ప్రశాంతంగా కూకోరా అన్నాడు... అప్పలరాజు... వెంటనే నారాయణ అందుకుని.... అదేరా.. నిన్న జగన్ మ్యానిఫెస్టో ఇచ్చాడు కదా... అదైతే నాకు నచ్చిందిరా... చక్కగా రైతులకు... మహిళలకు, చిరు ఉద్యోగులకు తాను ఏమి చేయగలడో అది క్లారిటీగా చెప్పేసాడు... చంద్రబాబు మాదిరి వంద మాటలు చెప్పి రెండు అమలు చేసి మిగతావి ఎగదొబ్బే రకం కాదని లచ్ఛమంది సమక్షంలో ఒప్పుకున్నాడు.తండ్రి మాదిరి మనిషిరా... ఎక్కడా మాయ మర్మం.. ఉండవు... చెప్పేదే చేస్తాడు..చేసేదే చెబుతాడు...అదన్నమాట... అన్నాడు నారాయణ... ఐతే ఇప్పుడేమంటావ్ రా బాబు అన్నాడు అప్పలరాజు... నేనేమీ అనడం లేదురా.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నాయకుడు మనకు ఉండాల... చంద్రబాబు మాదిరి వెయ్యి మాటలు చెప్పి... రెండో మూడో అమలు చేసి కాదన్నా మ్యానిఫెస్టోను దాచేసేవాడు మనకు వద్దురా బాబు... ఎంత చేయగలడో... అదే చెప్పాడు.. కాబట్టి నాకు మరొక్కసారి జగన్ నచ్చాడురా... అన్నాడు.. నారాయణ.. నువ్వన్నదీ నిజమేరా.. అలా నిజాయితీగా చేసేవాళ్ళు... చెప్పేవాళ్ళు లేరిప్పుడు... ఇక చంద్రబాబు ఐతే మొత్తం మాయ చేస్తాడు... అలాంటివాళ్లను ఇప్పటికే మూడుసార్లు నమ్మి మునిగిపోయాం చాలురా బాబూ... అనుకుంటూ తాటిముంజెలు తింటూ కూర్చున్నారు ఇద్దరు...అమలు చేయని హామీలు ఎన్ని ఇస్తే ఏమి లాభం... కదలని చెక్క గుర్రం ఎంత బావుంటే ఏమి లాభం.... పాలివ్వని ఆవు ఎంత అందంగా ఉంటె ఏమి లాభం... అలాగే అమలు చేయని మ్యానిఫెస్టోలో ఎన్ని పథకాలు ఎన్ని హామీలు ఉంటె ఏమి లాభం... అందుకే చెప్పేదే చేస్తాం... చేసేదే చెబుతాం .... విశ్వసనీయతే మా ప్రాణం... ఇచ్చిన మాట మీద నిలబడడమే మా విశ్వసనీయత అంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన మ్యానిఫెస్టో ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆకాశాన్నంటే హామీలు లేవు...ఇంటింటిలో బంగారం గుమ్మరిస్తాం అనే బొంకులు లేవు.. ఊరూవాడా పందిరివేస్తాం... రోజూ మీకు విందుభోజనాలు పెడతాం అనే మాయలు లేవు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ...ఎక్కడెక్కడ .. ఏఏవర్గాలకు ఏయే విధంగా మరింత మేలు చేయగలమో అక్కడక్కడా అలా చేస్తూ వెళతాం అంటూ హామీ ఇచ్చారు.. అమ్మఒడి .. రైతుభరోసా వంటివి ఆయావర్గాలకు మేలు చేస్తాయి.ఇక మిగతా పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నవి వాటిని యథాతథంగా కొనసాగిస్తారు... అన్నిటికీ మించి చంద్రబాబు మాదిరిగా నోటికొచ్చింది చెప్పడం, తరువాత మాట తప్పడం జగన్ వద్ద ఉండదు.. ఏది చెబుతారో అదే చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉండడంతో ఉన్నవి చాలు... ఈ మాత్రం సరిగ్గా అమలైతే ఇంకేం కావాలి... చంద్రబాబు వస్తే అవి కూడా ఇవ్వడు.. మాటలు చెప్పి ఓట్లేయించుకుని మోసం చేస్తాడు అని ప్రజలు తమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. జగన్ అన్న ఉంటే చాలు... ఉన్న పథకాలు అమలు చేస్తారు అనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది.AP people praising cm ys jagan manifesto 2024 for ap elections:::: సిమ్మాదిరప్పన్న -
Watch Live: తాడిపత్రిలో సీఎం జగన్ బహిరంగ సభ
Watch Live: తాడిపత్రిలో సీఎం జగన్ బహిరంగ సభ
Related News by category
-
భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
ఢిల్లీ: ఆప్ పార్టీ తరపున ఏప్రిల్ 27 నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ రోజు (ఆదివారం) పశ్చిమ ఢిల్లీ నియోజక వర్గంలో ఆప్ అభ్యర్థి మహాబల్ మిశ్రాకు మద్దతు కోరుతూ క్యాంపెయిన్ నిర్వహించారు.ఢిల్లీ రోడ్షోలో సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. భారతమాత కుమార్తెగా.. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన భర్త సింహం అని, ఆయన్ను ఎవరూ పడగొట్టలేరని అన్నారు. కారు సన్రూఫ్లోంచి నిల్చుని ఓటర్లకు అభివాదం చేశారు.పాఠశాలలు కట్టడం, ఉచిత విద్యుత్ అందించడం, మొహల్లా క్లినిక్లు ప్రారంభించి ప్రజలకు మంచి పనులు చేసినందుకే జైలుకెళ్లారని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఆయన (కేజ్రీవాల్) భరతమాత పుత్రుడు, నియంతృత్వానికి వ్యతిరేఖంగా ఓటు వేసి ప్రజాస్వామ్యం కాపాడుకోవడం మీ బాధ్యత. దయచేసి దీని విలువ అర్థం చేసుకోండి అని ఆమె అన్నారు.లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ఆప్' తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఇక ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, చాందినీ చౌక్ స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను నిలబెట్టింది.जनता के इस सैलाब के आगे,कोई तानाशाह टिक नहीं सकता 🔥अपने बेटे, अपने भाई केजरीवाल को आशीर्वाद देने सड़कों पर उमड़ी पश्चिमी दिल्ली की जनता 💯#KejriwalKoAshirwad pic.twitter.com/ZTPl8LrsaS— AAP (@AamAadmiParty) April 28, 2024 -
బీజేపీకి వచ్చే సీట్లు అవే: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీజేపీ కి రెండు వందల సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని, కేంద్రంలో హంగ్ వస్తే.. పార్లమెంట్లో బీఆర్ఎస్ కీలకం అవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బస్సు యాత్రలో భాగంగా హన్మకొండలో ఆదివారం( ఏప్రిల్ 28) జరిగిన రోడ్షోలో కేసీఆర్ మాట్లాడారు.‘ఓరుగల్లు చైతన్యం ఉన్న జిల్లా. చరిత్ర వైభవానికి ప్రతీక వరంగల్ జిల్లా. ఓరుగల్లు మట్టితో నాది విడదీయరాని బంధం. ఐదు మెడికల్ కాలేజీలు వరంగల్ ఉమ్మడి జిల్లాకు తెచ్చుకున్నాం. ఈ ముఖ్యమంత్రి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు. భూగోళం తెలియదు. ఏరి కోరి మొగుణ్ణి తెచ్చుకుంటే ఎగిరిఎగిరి తన్నట్లుంది తెలంగాణ పరిస్థితి. రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ఈ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దివాలా తీసింది. తెలంగాణ గొంతుకోసి మోదీ గోదావరి జలాలను తమిళనాడు కు తరలించే కుట్రలు చేస్తున్నాడు.మోదీ గోదావరిని ఎత్తుకు పోతా అంటుంటే ఈ ముఖ్యమంత్రి మూతి ముడుచుకొని కూర్చున్నాడు. . బీజేపీ చాలా ప్రమాద కరమైన పార్టీ. ప్రజల మధ్య పంచాయితీలు పెట్టడం తప్ప మరో ప్రణాళిక లేదు. బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉండవు. అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చేదిన్ వచ్చింది. రూపాయి విలువ పడిపోయింది. కడియం శ్రీహరి బీఆర్ఎస్కు చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకున్నాడు. మూడు నెలల్లో స్టేషన్ ఘన్పూర్కు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. రాజయ్య ఎమ్మెల్యే కాబోతున్నాడు. రాజయ్య చేతిలో కడియం ఓటమి ఖాయం.గోదావరి, కృష్ణా నదులను కాపాడుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి. రేవంత్ రెడ్డి నా గుడ్లు పీకి గోలీలు ఆడుకుంటాడట.. నా లాగు కూడా ఊడ తీస్తాడట. నన్ను చర్లపల్లి జైలులో వేస్తాడట. నీ జైళ్ళు, తోకమట్ట దెబ్బలకు కేసీఆర్ భయపడడు. ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో వరంగల్లో కట్టిన 24 అంతస్తుల ఆస్పత్రే నిదర్శనం’ అని కేసీఆర్ అన్నారు -
‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
ఒడిశాను ‘పాన్’ (పాండియన్, అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ, నవీన్ పట్నాయక్) పరిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బిజూ జనతాదళ్ ఒకరినొకరు పెళ్లి చేసుకున్నాయి అని అన్నారు. ఒడిశాలోని కేంద్రపరా ప్రాంతంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఒడిశాలో బీజేపీ-బీజేడీలు పెళ్లి చేసుకున్నాయి. వారు అందరికీ పాన్ ఇచ్చారు. పీఎం మోదీ 22-25 మంది కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అదే పద్ధతిలో నవీన్ పట్నాయక్ కూడా కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులకే అధికారం దక్కుతుంది. ఈ వ్యక్తులు మీ సంపదను దోచుకున్నారు. రైతుల భూములు లాక్కున్నారని ఆరోపించారు. మీరు (ప్రజలు) తగినంత పాన్ తిన్నారు. ఇప్పుడు ఒడిశాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఒడిశాలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి నాలుగు దశల్లో జరగనున్నాయి. మే 13న మొదటి దశ, మే 20న రెండో దశ, మే 25న మూడో దశ, జూన్ 1న చివరి దశ. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో, బిజూ జనతాదళ్ (బీజేడీ)కి అత్యధిక స్థానాలు (12), ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ (8), కాంగ్రెస్కు ఒక్కటే సీటుతో సరిపెట్టుకుంది. -
పులివెందులలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ప్రతి గ్రామంలో వైఎస్ భారతికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వన్స్మోర్ సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు.వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వైఎస్ భారతి అన్నారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు ఆమె వివరిస్తున్నారు. -
‘‘కేజ్రీవాల్ను చంపుతారా..?’’
న్యూఢిల్లీ: లిక్కర్స్కామ్ కేసులో జైలు పాలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలను ఆయన భార్య సునీత కేజ్రీవాల్ భుజానికెత్తుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి తానే స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం(ఏప్రిల్28) పశ్చిమ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి తరపున సునీత రోడ్షోలో పాల్గొన్నారు. దేశంలో నియంతృత్వాన్ని పారద్రోలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని రోడ్షోలో సునీత కోరారు. ప్రజల కోసం పనిచేసినందుకే తన భర్త కేజ్రీవాల్ను జైలుకు పంపించారన్నారు. తీహార్ జైలులో ఆయన సుగర్ వ్యాధికి సరైన చికిత్స అందించడం లేదన్నారు. అరవింద్ కేజ్రీవాల్ను చంపాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ఒక సింహం ఆయనను ఎవరూ ఏం చేయలేరన్నారు. సునీతా కేజ్రీవాల్కు ఇది రెండో షో. శనివామే సునీత తన రోడ్షోలు ప్రారంభించారు. తొలి రోడ్షో తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలోని కోండ్లిలో నిర్వహించారు. ఢిల్లీలో మే 25న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఎక్కడో కూర్చోని మాట్లాడతారు.. వారిని నేను పట్టించుకోను: కోహ్లి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement