సైదాబాద్: నగరంలో పోలీస్స్టేషన్లను దేవాలయాలుగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మోడల్ పోలీస్స్టేషన్ల ఏర్పాటులో భాగంగా గురువారం ఆయన సైదాబాద్ పోలీస్స్టేన్ నూతన భవనానికి నగర పోలీస్కమిషనర్ మహేందర్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో 23 పోలీస్స్టేషన్లను రూ.75 కోట్లతో మోడల్ పీఎస్లుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇందులో 16 శాంతిభద్రతలు, 6 ట్రాఫిక్, 1 మహిళా పోలీస్స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు. నేరాలపై కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు సమాచారం అందుతుందన్నారు. పోలీసులు ప్రజలకు చేరువైనప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమన్నారు.
ప్రజల పోలీస్స్టేషన్లు: కమిషనర్ మహేందర్రెడ్డి
ఇది మా పోలీస్స్టేషన్లు అని ప్రజలు చెప్పుకునేలా ప్రతి పోలీస్స్టేషన్ను తీర్చిదిద్దనున్నట్లు నగర పోలీస్కమిషనర్ మహేందర్రెడ్డి అన్నారు. పోలీస్స్టేషన్ను సర్వీస్ సెంటర్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు హైదరాబాద్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, నగరంలో చీటింగ్, డ్రగ్స్, కల్తీని రూపుమాపేందుకు కృషి చేస్తున్నామన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాల సహాయంతో నగరంలో ఎక్కడ ఎం జరుగుతుందో తెలుసుకుంటున్నామన్నారు నేరం చేస్తే పోలీసులకు దొరికిపోతామని భయం కల్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముంతాజ్ఖాన్, ఐజీలు మల్లారెడ్డి, శ్రీనివాస్, అధికారులు మురళీకృష్ణ, ప్రేమ్కుమార్, ఈస్ట్జోన్ డీసీపీ రవీందర్, ఏసీపీ సుధాకర్, కాట్న సత్తయ్య, డీఐ కోరుట్ల నాగేశ్వర్రావు, సిబ్బంది, కార్పొరేటర్లు సింగిరెడ్డి స్వర్ణలతరెడ్డి, సామ స్వప్నరెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
స్టేషన్ కు రూ.75 వేలు
కాచిగూడ: రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నామని హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి అన్నారు. గురువారం ఆయన కాచిగూడ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెలా పోలీస్ స్టేషన్లకు రూ.75వేలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నగరంలో దొంగతనాలు, క్రైమ్రేటు తగ్గిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎం.ఎస్. ప్రభాకర్, కార్పొరేటర్లు ఎక్కాల చైతన్య కన్నా, కాలేరు పద్మవెంకటేష్, గరిగంటి శ్రీదేవి రమేష్, పోలీస్ అధికారులు మల్లారెడ్డి, రవీందర్, లక్ష్మినారాయణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్లు ఆధునిక దేవాలయాలు
Published Thu, Dec 15 2016 11:33 PM
Advertisement
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
విల్ జాక్స్ విధ్వంసకర సెంచరీ.. 10 సిక్స్లతో! వీడియో వైరల్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
What’s your opinion
Advertisement