మంత్రి ఈటల రాజేందర్
క్వాలిటీ టీమ్ కాన్సెప్ట్కు అవార్డుల ప్రదానం
సనత్నగర్ : ఏరంగంలో రాణించాలన్నా సమర్థతే ప్రధానమని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపే వనరులకు ఇక్కడ కొదవ లేదని స్పష్టం చేశారు. క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా (క్యూసీఎఫ్ఐ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే 29వ చాప్టర్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కాన్సెప్ట్స్ సోమవారం బేగంపేట్లోని మ్యారీ గోల్డ్ హోటల్లో ప్రారంభమైంది. దీనికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత ప్రపంచంలో ప్రజలకు అవసరమయ్యే కొత్త ఉత్పత్తుల తయారీకి సృజనే ఆధారమని పేర్కొన్నారు.
నేడు ప్రపంచదేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నారని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మానవ సంపద, కరెంటు సరఫరాతో పాటు సేఫ్ జోన్గా భావిస్తున్నాయన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా- ఎ విజన్ థ్రూ క్వాలిటీ కాన్సెప్ట్స్’ అంశంపై క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సీహెచ్. బాలకృష్ణారావు అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. ఇందులో ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ వైస్ చైర్మన్ కె.మనోహర్ హెగ్డె, గౌరవ కార్యదర్శి విశాల్ కరణ్ తదితరులు పాల్గొన్నారు.
కాగా క్వాలిటీ టీమ్ కాన్సెప్ట్లో ప్రతిభ కనబరిచిన పలు సంస్థలకు క్యూసీఎఫ్ఐ అవార్డులను ప్రదానం చేశారు. బీహెచ్ఈఎల్, ఎన్ఎండీసీ, ఎన్టీపీసీ (రామగుండం), ఉషా ఇంటర్నేషనల్, అమరరాజా బ్యాటరీస్, రామ్కో సిమెంట్స్ లిమిటెడ్, టీఎస్ ఆర్టీసీ సంస్థల ప్రతినిధులు అవార్డులను అందుకున్నారు.
తెలంగాణలో వనరులకు కొదవలేదు
Published Tue, Sep 22 2015 1:46 AM
Related news
-
సొంత రాష్ట్రంలో కోట్లతో అభివృద్ధి
కొత్తపల్లి (కరీంనగర్): సమైక్య పాలనలో రూ.10 లక్షల నిధులకు పది వేలు ఖర్చు చేసి చెప్పులరిగేలా తిరిగామని..ఆనాడు నిధుల కోసం కాంగ్రెస్ మంత్రుల వద్ద ప్రాధేయపడ్డా ఫలితం లేదని.. అదే తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం పద్మనగర్ నుంచి ఒడ్యారం వరకు 14 కిలోమీటర్లు 4 లైన్ల రహదారి విస్తరణకు ఆర్రోజుల్లోనే రూ.88 కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ ఆదివారం ఎలగందుల వై జంక్షన్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. పద్మనగర్– ఒడ్యారం వరకు ఉన్న రహదారిని మరో రూ.70 కోట్లు మంజూరు చేసి సిరిసిల్ల వరకు 4 లైన్లు విస్తరిస్తామని వెల్లడించారు. రూ.500 కోట్లతో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్, రూ.60 కోట్లతో మానేరు వాగుపై నిర్మిస్తున్న వంతెన పూర్తయితే ఎలగందులకు కొత్త కళ వస్తుందన్నారు. -
అభివృద్ధికి నూతన ఒరవడి
∙ స్వాతంత్య్ర దినోత్సవంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ∙ అన్ని వర్గాల సంక్షేమమే సర్కారు ధ్యేయం ∙ రైతు సంక్షేమానికి పెద్దపీట ∙ అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం ∙ వచ్చే ఏడాది నుంచి పెట్టుబడి రాయితీ ∙ కులవృత్తిదారులకు ఆర్థిక తోడ్పాటు ∙ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం ∙ జిల్లాకు త్వరలోనే సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి ∙ హరితహారం లక్ష్యాన్ని చేరుకుంటాం ‘అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా నూతన ఒరవడితో అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం.. వ్యవసాయంలో రక్తాన్ని చెమటగా మార్చి రాష్ట్ర సౌభాగ్యం కోసం అన్నం పెట్టే రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం.. మానవతా కోణంలో రైతులకు వచ్చే ఏడాది నుంచి 2 పంటలకు 8 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని తప్పకుండా అమలు చేస్తాం.. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాం.. పాలకులు, అధికార యంత్రాంగంపై పూర్తి విశ్వాసం కలిగేలా ప్రజల మన్ననలు పొందేందుకు కృషి చేస్తాం’ అని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం కరీంనగర్ పోలీసు పరేడ్గ్రౌండ్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. – సాక్షి, కరీంనగర్ కరీంనగర్: పోలీసుల గౌరవవందనం స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రధాన లక్ష్యంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి.. స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,79, 581 కుటుంబాలకు గాను 1,76,083 కుటుంబాలకు రూ.48 కోట్లతో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో, దేశంలో 20వ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 98 శాతం కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకుని వాడుకుంటున్నాయని.. వచ్చే గాంధీ జయంతి నాటికి మిగితా 2 శాతం మరుగుదొడ్లు నిర్మించుకొని సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా మార్చాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జిల్లాలోనే ప్రారంభించి పిలుపునివ్వడంతో ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటివరకు 1.10 కోట్లకు గాను 35 లక్షలు నాటినట్లు తెలిపారు. వర్షాభావంతో మందగించినా లక్ష్యం మేరకు మొక్కలు నాటుతామని తెలిపారు. నాటిన మొక్కలను రక్షించడానికి అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది రైతులకు పెట్టుబడి.. అన్నం పెట్టే రైతులకు మానవీయ కోణంతో వచ్చే ఏడాది నుంచి రెండు పంటలకు గాను రూ.8 వేల పెట్టుబడి నగదు సహాయాన్ని తూచ తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైస్బోల్ ఆఫ్ తెలంగాణగా ప్రసిద్ధి చెందిందన్నారు. ఆహార ఉత్పత్తిలోనూ అగ్రగామిగా ఉందని, ఇదే స్ఫూర్తిని రైతులు కొనసాగించాలని కోరారు. వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిపే దృఢసంకల్పం తో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని ప్రాథమిక సహకార సంఘాలలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 2017–18 ఖరీఫ్ సీజన్కు రూ.763.67 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసి రైతులను అప్పుల ఊబి నుంచి తొలగించామన్నారు. రైతులు తక్కువ నీరు ఎక్కువ సాగు, అధిక దిగుబడులు వచ్చే బిందు తుంపర సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత.. ప్రభుత్వం సాగు, తాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. గోదావరి జలాలను మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని అన్నారు. కోటి ఎకరాలకు నీరందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్కు శ్రీకారం చుట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీని నీటిలో నింపేందుకు రూ.వెయ్యి కోట్లతో పోచంపాడు వద్ద ఇటీవల ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి శంకుస్థాపన చేశారని, దీంతో ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. మధ్య మానేరు ప్రాజెక్టులో ఈ ఏడాది 10 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నామన్నారు. ఉచిత విద్యుత్తు.. జిల్లాలో 1,02,696 వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. గత జూలై 18 నుంచి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.91 కోట్ల 66 లక్షల సబ్సిడీ భరిస్తోందని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో వ్యవసాయబావులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు 16, 33/11 కేవీ సబ్స్టేషన్లు కావాల్సి ఉండగా 5 సబ్స్టేషన్లు మంజూరయ్యాయని, మిగిలినవి కూడా త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నివాస గృహాలపై ఉన్న ప్రమాదకరమైన హైటెన్షన్ విద్యుత్ లైన్లు తొలగిస్తున్నామన్నారు. కరీంనగర్ సిటీ ఆధునికీకరణ కార్యక్రమంలో భాగంగా రూ.28.50 కోట్లతో 580 విద్యుత్ టవర్లను ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్లోగా ఇంటింటికీ నీరు.. తాగునీటికి మహిళలు పడుతున్న ఇబ్బందులను దూరం చేయడానికి ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి ఇంటికీ నల్లాకనెక్షన్ ద్వారా డిసెంబర్లోగా తాగునీటిని అందించనున్నామని తెలిపారు. జిల్లాలో రూ.1,492 కోట్లతో 2 సెగ్మెంట్లలో పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు. మిషన్కాకతీయ పథకం ద్వారా మొదటిదశలో రూ.88 కోట్లతో 223 చెరువులు మంజూరు చేసినట్లు తెలిపారు. 215 చెరువులలో పనులు పూర్తయ్యాయని, రెండో దశలో రూ.122.54 కోట్లతో 290 చెరువుల పనులను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అందులో 153 చెరువు పనులు పూర్తి చేశామని, మిగిలినవి ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. మూడో దశలో 299 చెరువులలో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. నాణ్యమైన విద్య, వైద్యం.. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటుకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 6 మైనార్టీ గురుకుల, 5 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభించామన్నారు. మూడేళ్లలో 504 గురుకుల పాఠశాలలు ప్రభుత్వం మంజూరు చేసి ప్రారంభించిందని పేర్కొన్నారు. ప్రతి పేద విద్యార్థిపై సంవత్సరానికి రూ.1.05 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు. అన్ని పాఠశాలలకు రూ.50 కోట్లతో ప్రహరీల నిర్మాణం, గేట్లు అమర్చేందుకు తదితర మౌలిక వసతులు కల్పించామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి ఉత్తమ వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రూ.20 కోట్లతో నిర్మించిన 150 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి సేవలందిస్తున్నామన్నారు. జిల్లాలో ఇంతవరకు 768 మందికి కేసీఆర్ కిట్లు పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఆడపిల్లల తల్లులకు రూ.13 వేలు, మగబిడ్డ తల్లులకు రూ.12 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు.. అన్ని వర్గాల సంక్షేమం.. ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన 5,284 డబుల్బెడ్రూం ఇళ్లలో 279 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలినవి అగ్రిమెంట్ దశలో, టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా ఆడపిల్లల వివాహాలకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలలో భాగంగా పేదకుటుంబాలకు రూ.75,116 చొప్పున ఆర్థిక సాయమందిస్తోందన్నారు. గొల్ల కుర్మలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తూ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నామన్నారు. జిల్లాలో 2,347 యూనిట్లు లక్ష్యం కాగా.. రూ.14 ,69 కోట్లతో 1,323 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశామని తెలిపారు. మత్స్యకారుల కోసం చేపల పెంపకానికయ్యే పెట్టుబడిని ప్రభుత్వమే భరించి, లాభాలను బెస్త, ముదిరాజ్ తదితర మత్స్యకారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చేనేత కార్మికులకు అవసరమయ్యే నూలు, రసాయనాలను 50 శాతం సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తోందన్నారు. నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. నవీన క్షౌ రశాలలు పెట్టుకునేందుకు నాయీ బ్రాహ్మణులకు రూ.లక్ష ఆర్థిక సహకారమందిస్తుందన్నారు. రజకులకు అధునాతన యంత్రాలనందించనుందన్నారు. విశ్వబ్రాహ్మణులకు ఆర్థిక తోడ్పాడునందించనుందన్నారు. ఏ ఆధారం లేని వృద్ధులు, వితంతువులు, వికలాంగులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఆసరా పథకంలో 1.15,160 మందికి జిల్లాలో పింఛన్లు అందుతున్నాయన్నారు. ∙ బ్యాంకు లింకేజీ కింద స్వశక్తి సంఘాలకు 2017–18 సంవత్సరంలో రూ.246 కోట్ల బ్యాంకు రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించి ఇంత వరకు రూ.50 కోట్ల రుణాలిప్పించామన్నారు. స్త్రీనిధి బ్యాంకు ద్వారా 2016–17 సంవత్సరంలో 80 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా ఇంతవరకు రూ.19 కోట్లు పంపిణీ చేశారని తెలిపారు. ∙ ఆర్అండ్బీ ద్వారా జిల్లాలో అన్ని రకాల రోడ్లను అభివృద్ధి చేసేందుకు, లింకు రోడ్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతుకు ప్రభుత్వం జిల్లాకు రూ.218 కోట్లు మంజూరు చేయగా పనులన్నీ ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. ∙ స్మార్ట్సిటీగా ఎంపికైన కరీంనగర్ను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఎల్ఎండీ దిగువన మానేరు రివర్ఫ్రంట్ను ఉత్తర తెలంగాణ మణిమకుటంగా సుందరంగా నిర్మించనున్నామని తెలిపారు. ఉజ్వలపార్కు వద్ద హరిత హోటల్ను నిర్మిస్తామని తెలిపారు. ∙ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు యంత్రాంగం కృషిని అభినందించారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించలేదని, ఉక్కుపాదం మోపడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బొడిగె శోభ, వొడితెల సతీష్బాబు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, నగరపాలక కమిషనర్ శశాంక, జేసీ బద్రి శ్రీనివాస్, ఆర్డీవో రాజాగౌడ్, ›ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రీయంగా బడ్జెట్ రూపకల్పన: ఈటల
సాక్షి, కరీంనగర్ : ‘పెద్దనోట్ల రద్దు తర్వాత ఉత్పన్నమైన పరిస్థితులు, జూలై 1 నుంచి వస్తు, సేవ పన్ను(జీఎస్టీ) అమలు నేపథ్యంలో శాస్త్రీయంగా వచ్చే ఏడాది బడ్జెట్ను రూపొందించనున్నాం’అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. శనివారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి పక్షాలు కాళ్లల్లో కట్టెపెట్టే కల్చర్ బంద్ చేసుకోవాలని, చావుకు, పెళ్లికి ఒకే డప్పు కొట్టే సంస్కృతి నుంచి బయటకు రావాలని హితవు పలికారు. ‘కాంగ్రెస్ పాల నలో రైతులు వంచనకు గురయ్యారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాల్వకు గండిపెట్టి చెరువులను నింపిన చరిత్ర మాది. ఏనాడైనా మీరు చెరువులు నింపారా’అని ప్రశ్నించారు. ఏప్రిల్ 1 నుంచి ఒంటరి మహిళలకు పింఛన్లు అందజేస్తామని పేర్కొన్నారు. -
సీఎం కేసీఆర్దే తుది నిర్ణయం
- నేను ఏ జిల్లాకు బాధ్యుడ్ని అవుతానో తెలియదు - మంత్రి ఈటల రాజేందర్ హన్మకొండ: తన ప్రాంతం వరంగల్ జిల్లాలో కలిసినా.. తాను ఈ ప్రాంతానికి వస్తానని... కాదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం హన్మకొండలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఏ జిల్లాకు ప్రాతినిధ్యం వహించాలో సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారన్నారు. 17 మంది మంత్రులుంటే 27 జిల్లాలు అవుతున్నాయని, ఈ క్రమంలో ఎవరికి ఏయే జిల్లాలు కేటాయిస్తారో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. కేసీఆర్ నిర్ణయం మేరకు నడుచుకుంటామన్నారు. ప్రజల అభీష్టం మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయన్నారు. -
అనర్హులను గుర్తించండి
రుణమాఫీపై బ్యాంకర్లకు మంత్రి ఈటల పిలుపు హైదరాబాద్: నకిలీ పాసు పుస్తకాలతో రుణమాఫీ పొందిన రైతులను గుర్తించడంలో ప్రభుత్వానికి బ్యాంకులు సహకరించాలని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. మొదటి, రెండో విడత రుణమాఫీ సొమ్ము అనేక మంది అనర్హులకు చేరిందని తమకు నివేదికలు వచ్చాయన్నారు. వచ్చే విడత రుణమాఫీ సొమ్ము అనర్హులైన రైతులకు చేరకుండా చూడాలని సూచించారు. ఈ ఏడాది రాష్ట్ర రుణ ప్రణాళికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) గురువారం విడుదల చేసింది. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ తమ సొమ్ము కాదని నకిలీ పాసు పుస్తకాల ద్వారా రుణమాఫీ పొందే వారి పట్ల బ్యాంకులు చూసీచూడనట్లుగా వ్యవహరించొద్దన్నారు. పేద పిల్లలు చదువుకోవడానికి విద్యా రుణాలు విరివిగా ఇవ్వాలన్నారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ... ఇప్పటికీ కొన్ని బ్యాంకులు రైతుల నుంచి రుణంపై వడ్డీ వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. వడ్డీల చెల్లింపు బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. రైతుల నుంచి వసూలు చేసిన పంటల బీమా ప్రీమియాన్ని కూడా చాలా బ్యాంకులు పూర్తిస్థాయిలో బీమా కంపెనీలకు పంపలేదని పేర్కొన్నారు. దీనివల్ల అనేక మంది రైతులు బీమా సొమ్ము రాక నష్టపోయారన్నారు. పత్తి పంట ప్రీమియం చెల్లింపునకు గడువును జూన్ 14గా కేంద్రం నిర్ణయించిందని, ఈ విషయంలో బ్యాంకులు వ్యవసాయశాఖకు సహకరించాలన్నారు. ఎస్బీహెచ్ ఎండీ సంతాను ముఖర్జీ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్థికశాఖ కార్యదర్శి నవీన్మిట్టల్, వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
Related News by category
-
నామినేషన్ల దాఖలు ఇలా
సార్వత్రిక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. 18వ లోక్సభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే నామినేషన్లు సైతం స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా...రాజకీయ పార్టీలు సైతం అభ్యర్థులను ప్రకటించి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీ వంటి అంశాలపై ఎన్నికల కమిషన్ గట్టి నిఘా చర్యలు చేపట్టింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. యువత, మహిళలు, వృద్ధులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తోంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రిటర్నింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కోసం ముహూర్తాలను అన్వేషిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో● అభ్యర్థులు నామినేషన్ ఫారం–2ఎను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చు. ● ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ● అభ్యర్థి వెంట మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతిస్తారు. ● జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఒక ఓటరు నామినేషన్ను ప్రతిపాదించాలి. అదే రిజిస్ట్రర్ రాజకీయ పార్టీలు/ స్వతంత్ర అభ్యర్థులకు పది మంది ఓటర్లు నామినేషన్ను ప్రతిపాదించాల్సి ఉంది. ● అభ్యర్థులు మూడు నెలల లోపు దిగిన ఒక పాస్పోర్ట్ సైజు ఫొటో అఫిడవిట్పై అతికించాలి. ● నామినేషన్ పత్రంపై స్టాంప్ సైజు ఫొటో అతికించాల్సి ఉంది. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేర్వే పార్లమెంట్ సెగ్మెంట్కు చెందిన వారైనచో విధిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ ఈఆర్ఓ నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. ● రిజస్టర్/ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఫారంలోని పార్ట్ –3లో సి కాలం ఎదురుగా ఎన్నికల సంఘం నిర్ధేశించిన గుర్తుల్లో ఏదైనా మూడు గుర్తులను ప్రాధాన్యతాక్రమంలో ఎంపిక చేసి, ఆ వివరాలను పొందుపర్చాల్సి ఉంది. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరవాల్సి ఉంది. ● అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. ● ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీల నిర్వహణ పక్కాగా నిర్వహించాలి. శుభ ముహూర్తాలు ఇవే.. ● 18 గురువారం దశమి, మగ నక్షత్రం మంచి రోజు కావడంతో అభ్యర్థులు సాదాసీదాగా వెళ్లి నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ● 19న శుక్రవారం, ఏకాదశి, ముఖ నక్షత్రం మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజే నామినేషన్లు వేసేందుకు మెజార్టీ అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. ● 22 సోమవారం చతుర్థశి, అష్టానక్షత్రం. నామినేషన్ల దాఖలు మంచి రోజు. ● 24న బుధవారం చైత్ర బహుళ పౌడ్యమితో పాటు స్వాతి నక్షత్రం, చాలా బాగుంది. ఈ రోజు నామినేషన్లు సమర్పిస్తే..అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. జాతకాలతో ముందుకు... ● నిజానికి 21న ఆదివారం త్రయోదశి, ఉత్తర నక్షత్రం..పై ముహూర్తాల కంటే ఇది మెరుగైనది. కానీ ఆ రోజు సెలవు కావడంతో అభ్యర్థులు ముందు రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి వస్తుంది. అభ్యర్థులు సూత్రప్రాయంగా శుభముహూర్తాలను ఖరారు చేసుకున్నా..మరొకసారి తమ జాతక బలానికి అనుగుణంగా నామినేషన్లను దాఖలు చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు రెండు, మూడు ముహూర్తాలను కూడా ఖరారు చేసుకున్నారు. వీటిలో ఏదో ఒక దానిపై తుది నిర్ణయం తీసుకునే వీలుంది. ఆ మేరకు తొలుత ఒక సెట్టు నామినేషన్ వేసే చాన్స్ ఉంది. ● గతంలో నామినేషన్ల కార్యక్రమం చాలా అట్టహాసంగా చేసే వారు. భారీగా జనాన్ని సమీకరించి, ఊరేగింపుగా నామినేషన్లు వేసే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎండలు భగ్గున మండుతుండటంతో పార్టీ శ్రేణులు కూడా బయటికి వెళ్లేందుకు భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరు సాదాసీదాగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ ఇలా ● నేడే లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్..ఆ వెంటనే నామినషన్ల స్వీకరణ ● 18, 19, 24 తేదీల్లో శుభ ముహూర్తాలు ● నామినేషన్లు వేసేందుకు అభ్యర్థుల ఏర్పాట్లు లోక్సభ స్థానం రిటర్నింగ్ సెంటర్ హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీసు, లక్డీకాపూల్ సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసు (సికింద్రాబాద్) మల్కాజ్గిరి మేడ్చల్ కలెక్టరేట్ చేవెళ్ల తహసీల్దార్ ఆఫీసు, రాజేంద్రనగర్ ● ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ● ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ● సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. ● ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ● ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా విడుదల ● మే 13న ఎన్నికల నిర్వహణ, జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ● జూన్ 6న ఎన్నికల ప్రకియ ముగింపు చేవెళ్ల లోక్సభ స్థానం పార్టీ అభ్యరి నామినేషన్ తేదీ బీజేపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి 22 బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ 19 కాంగ్రెస్ గడ్డం రంజిత్రెడ్డి 25 హైదరాబాద్ లోక్సభ స్థానం బీజేపీ మాధవీలత 24 బీఆర్ఎస్ జి.శ్రీనివాస్యాదవ్ 22 ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ 19సికింద్రాబాద్ లోక్సభ స్థానం పార్టీ అభ్యరి నామినేషన్ తేదీ బీజేపీ జి.కిషన్రెడ్డి ఏప్రిల్ 19 బీఆర్ఎస్ పద్మారావుగౌడ్ 19 కాంగ్రెస్ దానం నాగేందర్ 24 మల్కాజ్గిరి లోక్సభ స్థానం బీజేపీ ఈటల రాజేందర్ 18 బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి 22 కాంగ్రెస్ పట్నం సునీతారెడ్డి 22 కంటోన్మెంట్లోనూ... కంటోన్మెంట్: లోక్సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి కూడా గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. వెంటనే నామినేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి మధుకర్ నాయక్ తెలిపారు. కంటోన్మెంట్లో 113 ప్రాంతాల్లో 232 పోలింగ్ కేంద్రాలున్నాయని తెలిపారు. ఇక్కడ మొత్తం 2,51,370 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,25,735 మంది, మహిళలు 1,25,627 మంది, ఇతరులు 8 మంది, సర్వీసు ఓటర్లు 55 మంది ఉన్నారని చెప్పారు. నామినేషన్లను కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో గురువారం ఉదయం నుంచి స్వీకరిస్తారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఉపఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించారు. నామినేషన్ల తర్వాత ప్రచారం ఉధృతం చేసే అవకాశం ఉంది. -
సీతారామం
భాగ్యనగరం..పురానాపూల్ వద్ద శోభాయాత్రలో పాల్నొన్న భక్తులుజై శ్రీరామ్ నినాదాలతో నగరం మార్మోగింది. బుధవారం శ్రీరామనవమి వేడుకలు గ్రేటర్ వ్యాప్తంగా కన్నుల పండువగా జరిగాయి. అన్ని ప్రధాన ఆలయాల్లో రాములోరి పెళ్లి వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కల్యాణం తర్వాత అన్నిచోట్లా అన్నదానం చేశారు. ఇక భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరాముడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. చారిత్రాత్మక సీతారామ్బాగ్ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర భక్తుల నృత్యాలు, డప్పుచప్పుళ్లు, జెండాలు, ఆటపాటల కోలాహలం మధ్య కోఠి హనుమాన్ టేక్డి వరకు సాగింది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ధూల్పేట్ గంగాబౌలి, ఆకాష్పురి హనుమాన్ ఆలయం నుంచి, ఆనంద్సింగ్ ఆధ్వర్యంలో మంగళ్హాట్ మాగ్రా నుంచి కూడా శోభాయాత్రలు చేపట్టగా..ఇవి మూడు లక్షలాది మంది రామభక్తుల సందడి మధ్య హనుమాన్ టేక్డికి చేరుకున్నాయి. భారీ శ్రీరాముడు, హనుమాన్ విగ్రహాలు, కాషాయ రంగు జెండాలు, బైకులపై యువత విన్యాసాలతో శోభాయాత్ర ఆద్యంతం అత్యంత కోలాహలంగా జరిగింది. – అబిడ్స్ -
డోర్ నెంబర్లూ డొల్లే !
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లున్న చిత్రాలు తెలుసు. ఇది ఎలా సాధ్యం ? అంటే ఇష్టానుసారం డోర్నెంబర్లతో ఓటరు జాబితాలో పేరు చేరిపోవడం ఒక కారణం. ఒక ప్రాంతంలోని వారందరూ ఓటరుగా నమోదయ్యేటప్పుడు తమ సమీపంలోని వారు ఇచ్చిన డోర్నెంబర్తోనే తమ పేర్లు కూడా నమోదు చేసుకున్న వారున్నారు. ఒక పెద్ద భవనంలోని అద్దెదారులందరూ కూడా ఒకే డోర్నెంబర్తో ఓటర్లుగా నమోదైన వారున్నారు. అంతే కాదు ఇంకొందరైతే జీహెచ్ఎంసీ కేటాయించిన ఇంటినెంబరు కాకుండా తమ ఇష్టానుసారం డోర్ నెంబర్లను వేసిన వారున్నారు. ఒక ఇంటినెంబరుకే అదనంగా చివరన ఎ,బి,సిలు చేర్చడమో లేక బై నెంబర్లు వేయడమో చేసి ఆ ఇంటినెంబరుతోనే ఓటరుగా నమోదయ్యారు. సంబంధిత అధికార యంత్రాంగం సైతం ఆన్లైన్లోనమోదు చేసుకున్నప్పటికీ, ఆఫ్లైన్లో దరఖాస్తు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం కూడా ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన యంత్రాంగం గత రెండేళ్లుగా 2022 మార్చి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 1,81,405 మంది ఓటర్లు ఇలాంటి ఇంటినెంబర్లతో ఓటర్లుగా ఉన్నట్లు గుర్తించారు.వారిని స్టాండర్డ్ ఇంటినెంబర్లలో లేనివారుగా పేర్కొంటున్నారు. అలాంటి వారిని గుర్తించి సరిచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒకే కుటుంబం...పోలింగ్ కేంద్రాలెన్నో ! సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు వారిద్దరి పిల్లలకు ఓటు హక్కు ఉంది. అందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు అందరూ కలిసి వెళ్లవచ్చులే అనుకున్నారు.అందరూ ఒకేసారి వెళ్లి, రావచ్చుననుకున్నారు. అందుకు ఒక ఆటోలో వెళ్తే సరిపోతుంది అనుకుంది ఆ మధ్య తరగతి కుటుంబం. ఇంటింటికి వచ్చి ఇచ్చిన పోల్ స్లిప్ చూస్తే కుటుంబంలోని భర్తకు ఒక పోలింగ్ కేంద్రం, భార్యకు మరో పోలింగ్ కేంద్రంలో ఓటు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలిద్దరికీ ఒకే లొకేషన్ రావడం కొంతలో కొంత నయం. లొకేషన్ ఒకటే అయినా వారి పోలింగ్ కేంద్రాలు కూడా వేరే. దీంతో పిల్లలిద్దరు మాత్రం పోలింగ్ బూత్దాకా వెళ్లి ఓటేసినా.. భార్యాభర్తలకు చెరో చోట రావడంతో వారు వెళ్లలేదు.ఒక్కొక్కరు ఒక్కో వాహనం సమకూర్చుకోలేకపోవడంతోపాటు కలిసి వెళ్లలేక పోతున్నామనే తలంపుతోనూ వారు ఓటేసేందుకు ఉత్సాహం చూపలేదు. ఇది ఒక్క నియోజకవర్గంలోని ఒక్క కుటుంబం పరిస్థితి మాత్రమే కాదు. ఇలా ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు ఉంటోంది. నగరంలో పోలింగ్ శాతం తగ్గడానికి ఇదీ ఓ కారణం. ఇలా ఎందుకవుతుందో అంతుపట్టలేదు. పోలింగ్ శాతం తగ్గేందుకు ఇదీ ఓ కారణంగా గుర్తించిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే నుంచి నవంబర్ మధ్య ఇలా ఒకే కుటుంబానికి చెందినప్పటికీ వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న 3,60,849 మంది ఓటర్లను కుటుంబమంతటికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లుండే చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం ఈ ప్రక్రియను కొనసాగించింది. 2024 మార్చి నెలాఖరు వరకు అలా 17,864 మంది ఒకే కుటుంబ ఓటర్లకు ఒకే పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంది. వెరసి మొత్తం 3,78,713 మంది ఓటర్లకు ఒక కుటుంబంలోని వారు ఒకే చోట ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. డూప్లికేట్ ఔట్ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో వివిధ కేటగిరీల కింద 5,41,201 ఓట్లను అధికారులు తొలగించారు. జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 54,259 మంది డూప్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన ఓటర్లు, చిరునామా మారిన వారు వీరిలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ ప్రకటించారు. హైదరాబాద్ మహానగరంలో ఓటర్లకు మించి ఎక్కువ ఓట్లున్నట్లు ఎంతోకాలంగా విమర్శలున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లున్నవారితోపాటు వేర్వేరు నియోజకవర్గాల్లోనూ ఓట్లుండటాన్ని రాజకీయపార్టీలు పలు సందర్భాల్లో ప్రస్తావించాయి. ఇలాంటి డూప్లికేట్ ఓటర్ల గురించి ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా డూప్లికేట్ ఓటర్లను గుర్తించే చర్యలు చేపట్టిన జిల్లా ఎన్నికల యంత్రాంగం 2023 జనవరి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు గుర్తించిన డూప్లికేట్లను తొలగించింది. ఒకే నియోజకవర్గం పరిధిలో ఒకేవిధమైన ఫొటోలు, ఒకే విధమైన పేర్లతో ఒకటి కంటే ఎక్కువ చోట్ల జాబితాలో పేరున్న వారిని గుర్తించి తొలగించారు. అలా 54,259 మంది పేర్లు డూప్లికేట్గా ఉండటాన్ని గుర్తించి తొలగించినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది. వారితో పాటు చిరునామా మారినప్పటికీ, మరణించిన వ్యక్తుల పేర్లు కూడా జాబితాలో ఉండటాన్ని గుర్తించి అలాంటి వాటినీ తొలగించారు. వెరసి మొత్తంగా 5,41,201 ఓట్లు తొలగించారు. సాగర్లో ‘పంపింగ్’ ట్రయల్ రన్ షురూ.. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే నాగార్జున సాగర్ జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరడంతో అత్యవసర పంపింగ్ కోసం జలమండలి ట్రయల్రన్ను ప్రారంభించింది. బుధవారం పుట్టంగండి వద్ద సాగర్ వెనుక జలాల నుంచి నాలుగు ఎమర్జెన్సీ మోటర్ల ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 508 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుండి నగరానికి నిత్యం 270 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్నారు. సాగర్లోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పుట్టంగండి అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి పంప్హౌస్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. నీటి మట్టం డెడ్స్టోరేజీకి చేరుడంతో సరిగ్గా ఏడేళ్ల తర్వాత అత్యవసర పంపింగ్ చేపట్టారు. పుట్టంగండిలో అత్యవసర పంపింగ్ కోసం జలాశయంలో జీరో పాయింట్ వద్ద మొత్తం పది మోటర్లను ఏర్పాటు చేశారు. మొదటగా 60 క్యూసెక్కుల సామర్థ్యమున్న నాలుగు మోటార్లకు ట్రయల్ రన్ చేపట్టారు. మరో రెండు రోజుల్లో మిగిలిన మోటర్లను కూడా ప్రారంభించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. ● నగర ఓటరు జాబితాలో వింతలెన్నో ● రెండేళ్లుగా సరిదిద్దుతున్న యంత్రాంగం నగరంలో అయోమయ పరిస్థితి పోలింగ్ శాతం తగ్గుదలకు ఇదీ ఓ కారణం రెండు పేర్లు ఉన్నవారివి, చనిపోయిన, అడ్రస్ మారిన వారి ఓటరు కార్డుల గుర్తింపు హైదరాబాద్ జిల్లాలో 5.41 లక్షల ఓట్ల తొలగింపు మరణించిన వారు47,141చిరునామా మారిన వారు4,39,801డూప్లికేట్లు54,2595,41,201మొత్తం -
28 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం
ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల అరెస్ట్ గచ్చిబౌలి: మత్తుకు బానిసలైన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఎండీఎంఏ డ్రగ్తో పట్టుబడి కటకటాలపాలయ్యారు. మాదాపూర్ ఎస్ఓటీ, మాదాపూర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు దాడి చేసి ఇద్దరు స్నేహితులు ఏపీలోని రాజమండ్రి పట్టణం పాతపేటకు చెందిన కాటూరీ సూర్య కుమార్ (22), బాలాజీపేటకు చెందిన గుత్తుల శ్యామ్ బాబు (22)లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.4.2 లక్షల విలువైన 28 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. సూర్య కుమార్ 2023లో డ్రగ్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఇటీవలే జైలు నుంచి వచ్చినా అతను తీరు మారలేదు. రైల్వేలో సీనియర్ సూపరింటెండెంట్గా పని చేస్తున్న వ్యక్తి కుమారుడు సూర్య కుమార్ బెంగళూర్లోని జైన్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాడు. బెంగళూర్లో తన స్నేహితుడైన అభి ద్వారా డ్రగ్ స్మగ్లర్ నైజీరియన్ గాడ్ ఆఫ్ సాల్మన్ పరిచయమయ్యాడు. డ్రగ్స్కు అలవాటు పడి విలాసవంతమైన జీవితం కోసం డ్రగ్ పెడ్లర్గా మారాడు. అంతే కాకుండా తన స్నేహితుడైన శ్యామ్ బాబుకు మత్తు అలవాటు చేశాడు. ఈ నెల 14న బెంగళూర్ వెళ్లిన సూర్య కుమార్ గాడ్ ఆఫ్ సాల్మన్ వద్ద 30 గ్రాముల ఎండీఎంఏ కొనుగోలు చేశాడు. 16న తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. రెండు గ్రాములు ఇద్దరు స్నేహితులు సేవించారు. మిగిలిన 28 గ్రాములను రాజమండ్రిలోని విద్యార్థులకు విక్ర యించాలని ప్లాన్ వేశారు. పోలీసులకు సమాచారం అందడంతో మాదాపూర్లోని చందానాయక్ తండాలోని రాజా రెసిడెన్సీ సమీపంలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా ఎండీఎంఏ సరఫరా చేసిన గాడ్ ఆఫ్ సాల్మన్ పరారీలో ఉన్నాడు. 28 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్తో పాటు రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒక్కో గ్రాము ఎండీఎంఏను రూ.10 వేల నుంచి రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. మాదాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హోదా ఉన్నా.. నిఘా సున్నా!
టాస్క్ఫోర్స్ కార్యాలయంసాక్షి, సిటీబ్యూరో: నేరగాళ్ల కోసం దేశ వ్యాప్తంగా వేట.. నకిలీ కరెన్సీ కేసుల్లో సరిహద్దుల ఆవలి వరకు ప్రయాణం.. ఉగ్రవాద కేసుల్లో ఫీల్డ్ ఆపరేషన్లు.. కేవలం ఇవేనా..? నగర వ్యాప్తంగా ఎలాంటి సంచలనాత్మక నేరం చోటు చేసుకున్నా అందరికీ గుర్తొచ్చిన పేరు హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్ఫోర్స్. ఇలాంటి ఘన చరిత్ర ఉన్న ఈ విభాగం ప్రతిష్ట ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న వివాదాస్పద అంశాలతో మసకబారుతోంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్, బెదిరింపు వసూళ్లు, ఎన్నికల డబ్బు రవాణా, వ్యాపారుల కిడ్నాప్–బెదిరింపులు.. ఇలా అనేక వివాదాలు ఈ విభాగాన్ని చుట్టుముడుతున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా ఈ పరిస్థితుల నెలకొనడానికి నగరంలోని రెండు టాస్క్ఫోర్స్ కార్యాలయాల్లో సరైన నిఘా లేకపోవడమూ ఓ కారణంగా నిలుస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. కస్టోడియల్ మరణాలకు చెక్ చెప్పడం, మానవహక్కుల ఉల్లంఘనలు లేకుండా చూడటం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచడం, అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పోలీసింగ్లో పూర్తి పారదర్శకత కోసం ప్రతి పోలీసు స్టేషన్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సుప్పీం కోర్టు దాదాపు పదేళ్ల క్రితం ఆదేశాలు జారీ చేసింది. డీకే బసు వర్సస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో తీర్పు ఇస్తూ దీనికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. పలుమార్లు గడువు పెంచిన పోయిన సుప్రీం కోర్టు 2020 డిసెంబర్ను తుది గడువుగా నిర్దేశించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించింది. పని చేస్తున్నాయా? లేదా? అనేది పక్కన పెడితే నగరంలోని ప్రతి పోలీసుస్టేషన్లోనూ కనిష్టంగా 11 కెమెరాలు ఏర్పాటయ్యాయి. కేవలం పోలీసుస్టేషన్లో మాత్రమే కాదు.. ఠాణా హోదా ఉన్న సీసీఎస్, సైబర్ క్రైమ్ పీఎస్ల్లోనూ ఇవి ఉన్నాయి. 28 ఏళ్ల క్రితమే పోలీసుస్టేషన్ హోదా.. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అధీనంలో పని చేసే కమిషనర్స్ టాస్క్ఫోర్స్కు దశాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇది కేవలం యాంటీ గూండా స్క్వాడ్ మాదిరిగా కేవలం ఆపరేషనల్ విభాగంగా ఉండేది. కాలక్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు, పోస్టులు పొండటంలో, జీతభత్యాల విషయంలో వస్తున్న సాంకేతిక సమస్యల నేపథ్యంలో 1996లో అప్పటి పోలీసు శాఖ ప్రభుత్వానికి కీలక నివేదిక పంపింది. దీని ఆధారంగా సర్కారు కమిషనర్స్ టాస్క్ఫోర్స్కు సైతం పోలీసుస్టేషన్ హోదా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్లుగా నెల వారీ నిర్వహణ ఖర్చులు కూడా దీనికి వస్తున్నాయి. ఇలా దాదాపు 28 ఏళ్లుగా ఠాణా హోదా ఉన్న టాస్క్ఫోర్స్ కార్యాలయాలు (సికింద్రాబాద్లో ఒకటి, పాతబస్తీలో మరోటి) సీసీ కెమెరాలు లేకుండానే కాలం గడిపేస్తున్నాయి. అన్నింటిలోనూ ఏర్పాటు చేయకుండా ప్రతి పోలీసుస్టేషన్లోనూ సీసీ కెమెరాలు ఉన్నాయంటూ నివేదిక ఇవ్వడం కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.హైదరాబాద్ టాస్క్ఫోర్స్కు పోలీసుస్టేషన్ హోదా 1996లోనే జీవో జారీ చేసిన అప్పటి ప్రభుత్వం ‘సుప్రీం’ ఆదేశాల ప్రకారం ఠాణాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి ఇప్పటి వరకు ఈ విభాగంలో ఏర్పాటు చేయని అధికారులు ఫిర్యాదు చేసే విధానానికీ స్వస్తి.. టాస్క్ఫోర్స్ విభాగం కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తే దానిపై పని భారం పెరిగి, ఫలితాలు దెబ్బతింటాయనే వాదన ఉంది. దీన్ని అంగీకరించినప్పటికీ.. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఉన్న ఇబ్బందులు ఏంటనేది మాత్రం అంతు చిక్కట్లేదు. మరోపక్క టాస్క్ఫోర్స్ విభాగం పట్టుకునే నేరగాళ్లపై నమోదయ్యే వాటిలో అత్యధికం సుమోటో కేసులే. అంటే.. పోలీసులే ఫిర్యాదుదారుడిగా ఉంటారు. ఓ నేరగాడిపై సమాచారం అందుకుని, వలపన్ని పట్టుకున్న టాస్క్ఫోర్స్ అధికారే సంబంధిత పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తుండేవారు. దీనివల్ల భవిష్యత్తులో సాక్ష్యం చెప్పడం వంటివి తప్పనిసరి కావడంతో ఈ విభాగం అధికారుల్లో జవాబుదారీతనం ఉండేది. 2015 నుంచి ఈ విధానం పూర్తిస్థాయిలో, పక్కాగా అమలు కావట్లేదు. నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న వాటినీ స్థానిక పోలీసులకు అప్పగించి చేతులు దులుపుకొంటున్న సందర్భాలూ అనేకం ఉంటున్నాయి. ఈ కేసుల్లో ఆయా ఠాణాల అధికారులే ఫిర్యాదు చేస్తూ సుమోటో కేసులు నమోదు చేయిస్తున్నారు. ఈ కారణాలే టాస్క్ఫోర్స్ అభాసుపాలు కావడానికి మూలం అనే వాదన బలంగా వినిపిస్తోంది.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement