Sakshi News home page

కేబీఆర్ పార్క్ వద్ద దొంగల హల్చల్

Published Sun, Feb 14 2016 10:17 PM

theft at hyderabad kbr park

హైదరాబాద్ :హైదరాబాద్లో దోపిడీ దొంగలు హల్చల్ సృష్టించారు.  ఎప్పుడూ రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ వద్ద దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ప్రేమికుల దినోత్సవం కావడంతో పార్కు వద్ద ఆదివారం హడావుడి నెలకొంది.

ఈ క్రమంలో నగరానికి చెందిన ప్రేమికుల కారు అద్దాలు ధ్వంసం చేసిన దుండగులు కారులో ఉంచిన 15 తులాల బంగారాన్ని దొంగలు దోచుకుపోయారు. దీనిపై బాధితులు స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాహనాన్ని ధ్వంసం చేయడంతో తోటి వాకర్స్ ఆందోళన చెందుతున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement