Sakshi News home page

కూకట్పల్లిలో వరుస చోరీలు

Published Sun, Jan 17 2016 4:24 PM

కూకట్పల్లిలో వరుస చోరీలు - Sakshi

కూకట్‌పల్లి: హైదరాబాద్లో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లలో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు. సుమారు 60 వేలు విలువైన బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండి సామగ్రి, రూ.25వేల నగదు చోరీకి గురైనట్టు బాధితులు చెప్పుతున్నారు. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement