ఓ అల్లరి కుర్రాడు అటు కళాశాలలోనూ, ఇటు కుటుంబంలోనూ అనుకోని దుర్ఘటనలను ఎదుర్కొంటాడు. ఈ ఘటనలు.. స్వాతంత్య్రానంతర చరిత్రను తాను అధ్యయనం చేయడానికి పురిగొల్పుతాయి. తన అధ్యయనం ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతలు, దోపిడీ రాజకీయ వ్యవస్థ, దానికి తోడైన అధికార వ్యవస్థలపై పూర్తిగా అవగాహన చేసుకొని ఓటర్లలో చైతన్యం తేవడానికి ప్రయత్నిస్తాడు. తదనంతరం తాను ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ప్రభం జనం’. ‘రంగం’ ఫేమ్ అజ్మల్ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని భాస్కరరావు వేండ్రాతి స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్లో రెండో షెడ్యూలు మొదలైంది.
ఈ సందర్భంగా భాస్కరరావు వేండ్రాతి మాట్లాడుతూ -‘‘నలుగురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కథ ఇది. సందేశంతో పాటు కావాల్సినంత వినోదం కూడా ఈ కథలో ఉంటుంది. ఇందులో మొత్తం 5 పాటలుంటాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. చాలా రోజుల విరామం తర్వాత ఆర్పీ పట్నాయక్ మా చిత్రానికి స్వరాలందించారు. డిసెంబర్ ద్వితీయార్ధంలో పాటలను, జనవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. సందేశ్, ఆరుషి,పంచి బొరా, నాజర్, నాగబాబు, కోట శ్రీనివాసరావు, గొల్లపూడి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేందర్రెడ్డి, నిర్మాణం: చైతన్య ఆర్ట్ క్రియేషన్స్.
# Tag
Related news
-
వ్యూహం ఫిక్స్
‘వ్యూహం’ సినిమా విడుదలకు రూట్ క్లియర్ అయింది. ఈ నెల 23న ఈ సినిమా విడుదల కానుంది. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘వ్యూహం’. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా తొలి భాగం గత ఏడాది నవంబరు 10న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను విడుదల చేసుకోవచ్చని సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వడంతో ఈ నెల 23న రిలీజ్ చేస్తున్నట్లు రామ్గోపాల్ వర్మ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం తర్వాత రాజకీయ పార్టీలు ఎలాంటి వ్యూహాలు పన్నాయి? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వంటి కథాంశంతో ‘వ్యూహం’ రూపొందింది. ఈ చిత్రంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ నటించారు. -
స్నేహానికి వ్యాపారాన్ని ముడిపెట్టలేను
పాయల్ రాజ్పుత్, అజ్మల్ అమర్ ప్రధాన పాత్రధారులుగా, నందితా శ్వేత, దివ్యా పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మంగళవారం’. అజయ్ భూపతికి చెందిన ‘ఏ’ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్పై స్వాతీరెడ్డి గునుపాటి (వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె), ఎం. సురేష్ వర్మ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ చిత్రనిర్మాతలు మాట్లాడారు. స్వాతీరెడ్డి గునుపాటి మాట్లాడుతూ – ‘‘అజయ్ భూపతిగారు చెప్పిన ‘మంగళవారం’ కథ విని, ఈ సినిమా చేస్తే బాగుంటుందనిపించి చేశాను. ఓ సెన్సిటివ్ ఇష్యూని ఆయన సందేశాత్మకంగా చెప్పిన విధానం నాకు నచ్చింది. పాయల్కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడింది. అజనీష్ మ్యూజిక్ బాగుంటుంది. ఇండస్ట్రీలో నాకు అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇలా అగ్రతారలతో పరిచయం ఉంది. నేను అడిగితే వారు నాతో సినిమాలు చేస్తారు. కానీ నిర్మాతగా ముందు నన్ను నేను నిరూపించుకోవాలి. వాళ్ల స్థాయికి తగ్గ సినిమాలను నిర్మించే అవకాశం ఉన్నప్పుడు వారితో నేను సినిమాలు చేస్తాను. ఎందుకంటే స్నేహాన్ని, వ్యాపారాన్ని ముడిపెట్టడం ఇష్టం లేదు’’ అన్నారు. మరో నిర్మాత సురేష్ వర్మ మాట్లాడుతూ– ‘‘మంగళవారం’ సినిమాలో లవ్, కామెడీ, యాక్షన్.. ఇలా అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయి. ఈ సినిమా తొలి రోజు నుంచే అల్లు అర్జున్గారు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక చిన్నతనం నుంచి చిరంజీవిగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన మా ట్రైలర్ను విడుదల చేయడం మర్చిపోలేని అనుభూతి’’ అన్నారు. -
నేను ఎవ్వరికి భయపడనని నీకు మట్టుకే తెలుసు: ఆర్జీవీ ట్వీట్ వైరల్!
అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం వ్యూహం. ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వ్యూహం చూసిన సెన్సార్ సభ్యులు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారని డైరెక్టర్ ఆర్జీవీ తెలిపారు. అయితే ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు చెప్పలేదని వెల్లడించారు. (ఇది చదవండి: నాకున్న జబ్బు ఇదే, ఎక్కువ రోజులు బతకనని చెప్పారు: నటి) ఇప్పటికే ఆర్జీవీ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 'అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఎన్ని వ్యూహాలు పన్నినా మా ‘వ్యూహం’ను ఆపలేరు అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప సినిమాలోని ఓ డైలాగ్తో ఆర్జీవీ ట్వీట్ చేశారు. అందులో అల్లు అర్జున్, సునీల్ మధ్య జరిగిన సీన్ మీమ్ను షేర్ చేశారు. అందులో పుష్ప క్యారెక్టర్లో ఆర్జీవీని చూపించారు. ఆర్జీవీ షేర్ చేసిన ట్వీట్లో.. 'శీనప్ప.. నేను ఎవ్వడికి భయపడనని నీకు మట్టుకే తెలుసు. కానీ మార్కెట్ మొత్తం తెలియాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా? అన్నో.. ఇది ఒకటి తలలో పెట్టుకో ఎప్పటికీ.. నేను నా వ్యూహంతో నీ కెరీర్ను గెలకడానికి రాలే. నా వ్యూహంతో నీ వ్యూహం బయటపెట్టడానికి వచ్చినా.. తగ్గేదేలే' అన్న డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. త్వరలోనే వ్యూహం మూవీ కొత్త రిలీజ్ డేట్ను ప్రకటిస్తామని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ వెల్లడించారు. (ఇది చదవండి: దయా వెబ్ సిరీస్ నటి.. మరి ఇంత బోల్డ్గా ఉందేంటి బ్రో!) pic.twitter.com/RehuN6PGPk — Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2023 -
వ్యూహం..
రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్న చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ నటిస్తున్నారు. ‘‘అహంకారానికి, ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో ‘వ్యూహం’ రూపొందుతోంది. ఇది బయోపిక్ కాదు.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్లో అబద్ధాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్లో నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయి’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
ఆగని బతుకు చక్రం
జీవితం ఎప్పుడూ పచ్చగా ఉండాలి. జీవితాన్ని మోడువార్చే వైపరీత్యాలు ఎన్ని ఎదురైనా వాటిని ఎదుర్కొని కొత్త దారులు వేసుకుంటూ ఎప్పటికప్పుడు జీవితాన్ని కొత్తగా చిగురింప చేసుకుంటూ ఉండాలి. కోవిడ్ 19 జీవితాలను అతలాకుతలం చేసింది. జీవికలనే ప్రశ్నార్థకం చేసింది. ఎన్ని ప్రశ్నార్థకాలు ఎదురైనా వెనుకడుగు వేయాల్సిన పని లేదని నిరూపిస్తున్నారు కేరళవాసులు. పనిని గౌరవించే సంస్కృతే వారిని నిలబెడుతోంది. ముందుంది మంచికాలం అజ్మల్కి 28 ఏళ్లు. అతడిది కేరళలోని కొట్టాయం. కోస్టా క్రూయిజ్లో షెఫ్గా ఉద్యోగం చేయాలనేది అతడి కల. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరినప్పటి నుంచి కన్న కల అది. అతడి ఫ్రెండ్స్కి అందులో ఉద్యోగం వచ్చింది. అజ్మల్కి రాలేదు. దాంతో కొట్టాయంలోనే ఒక స్టార్ హోటల్లో ఉద్యోగం చేస్తూ మళ్లీ ప్రయత్నించాడు. గత ఏడాది చివరిలో సెలెక్ట్ అయ్యాడు. కొట్టాయంలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ ఏడాది మార్చిలో విదేశాల బాట పట్టాల్సిన వాడు. ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కానీ కోవిడ్ మహమ్మారి అతడి రెక్కలను కట్టేసింది. కోస్టా కంపెనీ నుంచి ఈ మెయిల్ వచ్చింది. కోవిడ్ కారణంగా తలెత్తిన పరిస్థితిని వివరిస్తూ తమ నిస్సహాయతను వ్యక్తం చేసింది. కనీసం ఏడాదిపాటు ఎదురు చూడాలని సూచించింది కోస్టా క్రూయిజ్ కంపెనీ. ఖాళీగా ఉండడంతో పిచ్చిపట్టినట్లయిందతడికి. దాంతో కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాడు. తోపుడు బండి మీద కూరగాయలమ్ముతున్నాడు. ‘‘పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం ఉంది. అప్పటి వరకు ఊరికే ఉండకూడదు. ఏదో ఒక పని చేయాలి’’ అని ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతున్నాడు అజ్మల్. హాస్టల్కి లాక్డౌన్ కోళికోద్కు చెందిన ప్రీతి సంతోష్కి ఇది తొలి కష్టం కాదు. ఆమె భర్త ఐదేళ్ల కిందట యాక్సిడెంట్లో పోయాడు. అప్పటి నుంచి నలుగురున్న ఆ కుటుంబ భారం ఆమెదే. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పెట్టింది. తొంభై మందితో హాస్టల్ సజావుగానే నడుస్తోంది. జీవిత నావ కూడా ఒడిదొడుకులు లేకుండా నడుస్తుందనే నమ్మకం ఏర్పడింది ఆమెకి. ఇంతలో 2020 వచ్చింది, కోవిడ్ ఇండియాకి వచ్చి విస్తరించింది. లాక్డౌన్తో హాస్టల్కు లాక్ పడింది. ఏదో ఒకటి చేసి బతుకును కొనసాగించాలనుకున్నాడు. అప్పటికే రైతులు పండించిన కూరగాయలు పెద్ద మార్కెట్లకు తరలించడానికి వీలు లేకుండా రవాణా స్తంభించి పోయి ఉంది. అప్పుడు ప్రీతి తన ఇంటి ముందు కూరగాయల దుకాణం పెట్టింది. సమీపంలో ఉన్న రైతులు కూరగాయలను స్వయంగా తెచ్చి ఇస్తారు. ఆ తాజా కూరగాయలే ఆమె జీవితాన్ని చిగురింపచేస్తున్నాయి. ఏసీ షోరూమ్ల ధరలతో పోలిస్తే ప్రీతి దగ్గర కూరగాయల ధర బాగా తక్కువగా ఉండడంతో ఆమె వ్యాపారం బాగా సాగుతోంది. చేదెక్కిన దుబాయ్ కాఫీ కరీమ్ తన స్నేహితుడితో కలిసి 2019 మొదట్లో దుబాయ్లో చిన్న కాఫీ షాప్ పెట్టాడు. కొద్ది నెలల్లోనే కాఫీ వ్యాపారం గాడిన పడింది. ఒకసారి ఇండియాకి వచ్చి వెళ్దామనుకున్నాడు. గత ఏడాది చివర్లో ఇండియాకి వచ్చాడు. ఈ ఏడాది జనవరిలో తిరిగి వెళ్లాలనుకున్నాడు. కానీ అమ్మ అనారోగ్యం వల్ల మరికొన్నాళ్లు ఆగాల్సి వచ్చింది. ఇంతలో కోవిడ్ వచ్చింది. ఇక దుబాయ్కి వెళ్లేదెప్పుడో చెప్పగలిగిన వాళ్లెవరూ లేరిప్పుడు. కరీమ్ ఇప్పుడు చేపల వ్యాపారం చేస్తున్నాడు. బైక్ మీద చేపల ట్యాంక్ పెట్టుకుని వీథి వీథి తిరిగి తాజా చేపలను అమ్ముతున్నాడు. ఆదుకుంటున్న అప్పడాలు కృష్ణదాస్ ఎనిమిదేళ్లుగా కోళికోద్లో ఆటో నడిపేవాడు. లాక్డౌన్తో ఆటో ఆగిపోయింది. అతడు వెంటనే అప్పడాల తయారీ చేపట్టాడు. ఇప్పుడు రోజుకు ఐదు వందల అప్పడాలు అమ్ముతున్నాడు. లాక్డౌన్ సడలించిన తర్వాత తిరిగి ఆటో బయటకు తీశాడు. కానీ ఆటో ఎక్కేవాళ్లు లేక రోజుకు వంద రూపాయలు రావడమే గగనమైంది. దాంతో తిరిగి ఆటోను పక్కన పెట్టేశాడు. ఆటో చక్రం ఆగినా సరే బతుకు చక్రం ఆగకూడదు. ఒకదారి మూసుకుపోతే మరోదారిని వెతుక్కోవాలి. ఇప్పుడతడికి అప్పడాలే అన్నం పెడుతున్నాయి. దాంతో అప్పడాల తయారీని మరింతగా విస్తరించే ఆలోచనలో ఉన్నాడు కృష్ణదాస్.
Related News by category
-
తొమ్మిది నెలల కిందే బన్నీకి సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్..
జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్ను తొమ్మిది నెలల కిందే సాక్షి మీడియా గ్రూప్ ఎక్స్లెన్స్ అవార్డ్తో సత్కరించింది. పుష్ప సినిమాలో వినూత్నమైన నటనతో పాటు తెలుగు అభిమానులను అత్యద్భుతంగా అలరించినందుకు ఎక్స్లెన్స్ అవార్డ్తో గౌరవించింది. ఆ సందర్భంగా మాట్లాడిన స్టైలిష్ స్టార్.. సాక్షి మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఇంత మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్కు థ్యాంక్యూ చెప్పారు. సాక్షి ఇచ్చిన ఎక్స్లెన్స్ అవార్డ్ను మూవీ టీంకు డెడికేట్ చేస్తున్నట్లు చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించారు. ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్లో అల్లు అర్జున్కు మోస్ట్ పాపులర్ హీరో అవార్డ్.. -
Hello Meera Movie: హాలో మీరా.. దర్శకుడి గొప్ప ప్రయోగమిది!
రాతి పులుసు 'అనే యూరప్ జానపద కథ ఒకటి ఉన్నది. భలే చమత్కారమైన కథ. వీలయినంత గుర్తున్నది చెప్పడానికి ప్రయత్నిస్తా రండి.' ఒకానొక మనిషి కాలినడకన తోవ పట్టుకు పోతున్నాడు. ఎక్కడికో తెలీదు. నడిచీ నడిచీ కడుపులో దహించుకుపోయేంత ఆకలి. మనిషి మట్టి కొట్టుకు పోయి ఉన్నాడు. జేబులో నాలుగు డబ్బులు ఉండి ఉంటే ఏ బండి చక్రాన్నో పట్టుకునేవాడు. ఆ మాత్రం కూడా లేనట్టు ఉంది. నడవగా నడవగా ఒక ఊరు తగిలింది. మొదట కనపడిన ఇంటి తలుపు ముందు నిలబడి తినడానికి ఏమైనా ఉంటే కాస్త పెట్టమని అడిగాడు. ఇంట్లో ఏముందో ఏంలేదో తెలీదు. ఇతగాడి వాలకం చూస్తే మాత్రం ఏమీ పెట్టబుద్ది అయినట్లు లేదు. రెండో ఇల్లు అంతే, ఆ ఇంటి తరువాత ఒక నాలుగు గడపలు దాటి అడిగినా అయిదో ఇంట్లో కూడా అదే స్పందన. మన కథానాయకుడు ఎవరైనా కానీ, ఏమైనా కానీ చాలా తెలివైన వాడు. ప్రాధేయపడి అడిగాం ఫలితం లేదు ఈ ఊరిలో ఇది కాదు పద్దతి అనుకున్నాడు. ఈసారి తలుపు తట్టిన ఇంటి వారికి మాత్రం తినడానికి ఏమైనా ఇవ్వండి అని అడగలేదు. ఇప్పుడే ఇస్తా ఒక కుండ ఉంటే ఇవ్వమని అడిగాడు . కుండ ఇచ్చినావిడ తలుపుకానుకుని ఏం చేస్తాడా అని చూస్తుంది. కుండని అలా నేలమీద పెట్టి అటు ఇటూ కనపడిన మూడు రాళ్లని, కాసింత ఎండు కొమ్మలు, గడ్డి పోచలు పట్టుకు వచ్చి మూడు రాళ్ల పొయ్యిగా ఆమర్చి దానిపై కుండని పెట్టి పొయ్యి వెలిగించ బోతూ వెనక్కి తిరిగి, కాసిన్ని మంచి నీళ్లు దొరుకుతాయా అవి ఉంటే చాలు పని అయిపోతుంది అన్నాడు. ఆవిడ కుండ నిండా నీళ్లు తెచ్చి ఇచ్చి చోద్యం చూస్తుంది. మనవాడు కుండ కింద మంట పెట్టి జేబులో చేయి పెట్టి ఒక గులక రాయిని బయటకు తీశాడు, భక్తిగా కళ్లకద్దుకుని ఆ రాయిని కుండలో జార విడుస్తూ ఆవిడ కేసి చూసి నవ్వాడు మరేం లేదమ్మా పులుసు రాయి అంతే అన్నాడు. పులుసు రాయా, అదేంటి ఎప్పుడూ వినలేదే ? అని వింత పోయింది ఆవిడ. ఈ రాయి వేసి పులుసు కాస్తే ఉంటుంది , అబ్బా అని లొట్టలేసి చూస్తారుగా అంటూ ఒక కర్ర పుల్ల తీసుకుని కుండలో కలియతిప్పడం మొదలు పెట్టాడు. తిప్పి తిప్పి మరిగిన నీళ్లు కాసిన్ని నాలుక మీద వేసి రుచి చూసుకుని అహా అన్నట్టు కనుబొమలు ఎగరేసి వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికే ఈ రాయి చమత్కారం విని ఇరుగింటి ఆశమ్మ, పొరుగింటి పోశమ్మ, ఎదురింటి బూశమ్మ తతిమ్మా అమ్మలు కూడా చేరారు. పులుసు తయారీ దారు తనలో తాను అనుకున్నట్టుగా అంటూనే వారికి వినిపించేలా, బావుంది, చాలా బావుంది కానీ కాస్త చింతపండు, ఉప్పు, ఇంత జీలకర్ర ఉండి ఉంటే ఇంకా అద్భుతంగా తయారవుతుంది. ఈ మాటలు చెవిన పడ్డమే ఆలస్యం వెంటనే దినుసులు దిగి పోయాయి. చిరు నవ్వుతో వాటిని అందుకుని ఆ నీళ్లలోకి వంపాడు, పులుసు మరుగుతోంది, ఆవిరి తేలుతోంది. ఏం పర్లేదు కాస్త సమయం పడుతుంది. అన్నట్లూ మీరు పుట్టి బుద్ది ఎరిగిన దగ్గరి నుంచి ఈ ఊరు దాటి పొయిన వారిలా లేరు, ఇక్కడి నుండి దక్షిణం వైపుకు వంద మైళ్ల దూరంలో జింత్ర అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో పండుతాయండి క్యారెట్లు అబ్బో ఎంత రుచి అనుకున్నారు, ప్రపంచంలో అట్లాంటి కారెట్లు మరెక్కడా దొరకవు. వస్తున్నప్పుడు పాపం ఒక రెండు దుంపలు మీకోసం తేవాల్సింది. అన్నట్లూ మీ ఊర్లో క్యారెట్ ఎట్లా ఉంటాయి, పర్లేదా? అనే ప్రశ్న ముగిసి ముగియకమునుపే ఒకావిడ క్యారెట్ బుట్ట పట్టుకు వచ్చింది. ఆ బుట్టలోనే ఒక వైపు ఉర్లగడ్డలు కూడా ఉన్నాయి. పర్లేదే! చూడ్డానికి రంగు బాగా ఉన్నాయి, రుచి పరీక్షిస్తే పొలా అని ఒక చేత్తో నాలుగు కేరట్ దుంపలు ఇంకో చేత్తో ఆరు ఉర్లగడ్డలు ఆ మరుగు తున్న నీటిలో పడేసీ మళ్ళీ కబుర్లు మొదలు పెట్టాడు. ఉర్లగడ్డ పడిందిగా పులుసు చిక్కనయింది, ఘుమఘుమలు కూడా మొదలయ్యాయి. మళ్ళీ పుల్ల పట్టుకు తిప్పి రుచి చూడబోయాడు, ఈ సారి ఒక ఇల్లాలు చేయి చాపింది, పులుసు చుక్కలు ఆవిడ చేతిలో ఒంపాడు, ఆవిడ తన అరచేతిని నాకేసి తన్మయత్వంగా మొహం పెట్టింది, మరి ఇంట్లో తరిగిన క్యాబేజీ పోగులు ఉన్నాయి అవి కూడా వేద్దామా? అని అడిగింది. దానికేమమ్మా భాగ్యం? పులుసు రాయి దేనినయినా రుచితుల్యం చేస్తుంది పాపం వెళ్లి తెచ్చుకోండి అని ఉదారంగా అనుమతి ఇచ్చేశాడు. మొత్తానికి ఆసారి ఆయిన్ని, ఈసారి ఈయిన్ని దినుసులు చేరుతూనే ఉన్నాయి. ఇంతలో వేటకని అడివికి వెళ్లిన మగవాళ్లు పల్లెకు వచ్చేశారు. నలుగుడు ముక్క లేకుండా పులుసు ఏమిటి అని ఒక పెద్దాయన కోప్పడి తను వేటాడి తెచ్చిన కుందేళ్ల తాజా మాంసం ముక్కలు అందులో మరగనిచ్చాడు. పులుసు తయారు. అంతకన్నా అద్భుతమైన పులుసు ముందెన్నడూ తిని ఎరగలేదని తిన్నవాళ్లంతా ఏకగ్రీవపడ్డారు. తాను కూడా ఆ ఊరి అంత మంచివాళ్లని మునెపెన్నడూ ఎరిగి ఉండనని దానయ్య కూడా ప్రకటించి తన గుర్తుగా ఉంచుకొమ్మని కానుకగా ఆ పులుసు రాయిని వారికి ఇచ్చేసి తన దారి తాను చూసుకున్నాడు . ఈ కథని మా మిత్రుడు శ్రీనివాస్ చదివి కాని, విని కాని ఉంటారని నేను అనుకోవడం లేదు. ఆయనకు ఈ కథకు ఉన్న సంబంధం అల్లా, ఎట్లా అయితే ఆ కథలో కథానాయకుడు వనరులు ఏమీ లేని చోట, నలుగురూ నాలుగు చేతులు వేసినప్పుడు ఒక మహద్భుతం చేయవచ్చని నమ్మికతో నడుస్తున్నాడో , శ్రీనివాస్ ది అదే నమ్మిక. సినిమాలు తీయాలి. దాని కొరకు ముందుగా ఒక సినిమా అయినా తీయాలి అనేదే ఆయన లక్ష్యం. చేతిలో మ్యాజిక్ ఉంది. కాని చూసే వాడికి అవి ఖాళీ చేతుల్లా కనపడుతున్నాయే.. మరెలా అని కథ అనే గులకరాయిని పట్టుకుని ఆయన నడక మొదలెట్టాడు. పిడికిట్లో అది ఒదిగి ఉంది. నడక అనంతరం గుప్పిట విప్పి చూస్తే అది ముత్యంలా తయారయింది. ఒక పాతికేళ్ల అమ్మాయి, పేరు మీరా. రేపొక్క రోజు ఆగితే ఎల్లుండి తన పెళ్లి. బట్టలు తెచ్చుకోడానికి బయలు దేరిన అమ్మాయి సాయంత్రం అయిదు దాటింది.. ఆరు దాటింది.. ఏడయినా ఇల్లు చేరదే ! ఎక్కడా తప్పి పోయింది లేదు .. అమ్మ చేసినా.. నాన్న చేసినా , తమ్ముడు చేసినా.. కాబోయే శ్రీవారు, వారి అమ్మగారు, చిన్ననాటి మిత్రులు ఎవరు చేసినా ఫోన్ ఎత్తుతోంది .. వారితో మాట్లాడుతూనే ఉంది.. జవాబు చెబుతూనే ఉంది. పోని ఇదేమయినా ఇష్టం లేని పెళ్లా అంటే అదేం కాదు.. ప్రేమించిన అబ్బాయినే పెళ్లాడబోతుంది. మరేమిటి? ఇంటి నిండా బంధువులు, విడిదింట్లో మగపెళ్లి వారు, హోటల్ గదుల్లో మిత్రులు అంతా వచ్చి ఉన్నారు. టైలర్ షాపు నుంచి తిన్నగా ఇంటికి రావాల్సిన అమ్మాయి.. ఇంటి వైపు కాక ఊరిని వదిలి పెట్టి హైదరాబాదు నగరం వైపు.. నేషనల్ హైవే మీద ఒంటరిగా కారు నడుపుతూ వెళ్లావలసిన అవసరం ఏంటి? ఇదేం క్రైం థ్రిల్లర్ కాదు, యాక్షన్ ఓరియెంటెడ్ జానర్ అసలే కాదు. పూర్తిగా సంసార పక్ష సినిమా.. కుటుంబ గాథా చిత్రం. మనుషులు, అనుబంధాలు, నమ్మకాలు, ద్రోహాలు, కాసిన్ని కన్నీళ్లు, గోరంత దీపమంత ధైర్యం వెలుగులో కొండంత భయాన్ని ఎదుర్కొన్న ఒక ఆడపిల్ల కథ. సినిమా అంతా ఇందులో మీరా అన్న పాత్ర వహించిన గార్గేయి తప్పా మరో మనిషి మొహం కనపడదు. ఎన్నో గొంతులు వినపడతాయి. ఎన్నెన్నో భావనలు అర్థమవుతాయి. ఇందులో మనకు వినపడిన ప్రతి కరుకు గొంతు, ప్రతి మెత్తని పలుకు, ప్రతి కంగారు స్వరం ఆ మనిషి ఎలా ఉండి ఉంటారనేది మనకంటూ ఒక ఊహని కలుగ జేస్తుంది. మనం కళ్లతో సినిమా చూస్తూ.. ఊహల్లో సినిమాలోని పాత్రలని నిర్మించుకుంటాం. ఇంతకన్నా కథని ఏమి చెప్పలేను. ఇదంతా దర్శకత్వ ప్రతిభ . డైరెక్టర్ మూవీ ఇది. తెలుగులో గొప్ప ప్రయోగం ఇది. సగటు ప్రేక్షకుడి పైన ఉన్న నమ్మకం ఈ సినిమా . గర్వించే మన సినిమా ఇది. సినిమా చివరలో సుఖాంతంలో పెద్ద సమస్య నుంచి మీరా బయట పడుతుంది. ఆ మొహంలో, కళ్లల్లో, పెదవుల మీద గొప్ప రిలీఫ్ . ఆ సమయంలో ఏం చేయాలి? పిడుగును ఒడిసి పట్టి నలిపి పడేసినంత, కొండలని పిండి కొట్టి చెల్లా చెదురు చేసినంత గొప్ప ఫీల్ కావాలి. ఆ విజయాన్ని ఆస్వాదించాలి. కానీ ఆ అమ్మాయి చేసిన మొట్ట మొదటి పని తన తమ్ముడికి కాల్ కలిపి, బట్టలు కుట్టిన టైలర్కి చాలా అవసరంగా డబ్బులు కావాలి. అర్థ రాత్రి దాటి ఉన్నా పర్లేదు, ముందు ఆ అమ్మాయికి డబ్బులు అందించమంటుంది. సూది కుట్టంత చిన్న మనిషి, ఆవిడ అవసరం దగ్గర ఆపేసిన గొప్ప సినిమా ఇది. తప్పక చూడండి. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి -
పోస్టర్ బాగుంది – నాగార్జున
‘‘ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకునేలా బాగుంది. ఈ సినిమా హిట్ అయి, యూనిట్కి మంచి పేరు రావాలి’’ అన్నారు అక్కినేని నాగార్జున. బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో తేజ బొమ్మదేవర, రిషికా లోక్రే జంటగా బొమ్మదేవర రామచంద్ర రావు దర్శక–నిర్మాణ సారథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నాగార్జున రిలీజ్ చేశారు. ‘‘ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బాడిస, కెమెరా: వాసు. -
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న గాడ్ ఫాదర్.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పలు రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (చదవండి: బాలీవుడ్లో ‘గాడ్ ఫాదర్’ హవా.. 600 స్క్రీన్స్ పెంపు) గతంలో మెగాస్టార్ ఖైదీ నెం.150 మాత్రమే రూ.164 కోట్లతో ఆయన కెరీర్లో బెస్ట్గా నిలిచిందన్నారు. త్వరలోనే గాడ్ఫాదర్ ఈ రికార్డును అధిగమించనుందని ట్వీట్ చేశారు. గతంలో విడుదలైన ఆచార్య వసూళ్లను అధిగమించింది. గాడ్ ఫాదర్ 2019లో వచ్చిన మలయాళ చిత్రం లూసిఫర్కి తెలుగు రీమేక్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార, సత్యదేవ్ నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. #GodFather ENTERS ₹100 cr club at the WW Box Office. — Manobala Vijayabalan (@ManobalaV) October 8, 2022 -
25 ఏళ్లలోపు పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా ?
Heroines Who Married At Young Age: సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆసక్తికరంగా ఉండే టాపిక్లో పెళ్లి ఒకటి. మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలకు వివాబం ఎప్పుడు జరిపిస్తారు అని చుట్టుపక్కల వాళ్లు విసిగిస్తూనే ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి లొల్లి సెలబ్రిటీలను కూడా వెంటాడుతూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎప్పుడు వివాహమాడాతారు. పెళ్లికానీ ప్రసాద్ (హీరోలు)లు ఎంతమంది ఉన్నారు అని ఆసక్తి చూపుతారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే వారికి అవకాశాలు తగ్గిపోతాయనే భయం ఉంటుందని అంటారు. అందుకేనేమో 30 ఏళ్లు దాటినా కూడా తాళి కట్టించుకోని హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలాంటి సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా కథనాయికలు కూడా ఉన్నారు. పాతికేళ్లు కూడా దాటకుండానే కెరీర్ పీక్స్లో ఉండగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చిన హీరోయిన్లూ ఉన్నారు. పాతికేళ్లలోపు వయసుండి పెళ్లిపీటలు ఎక్కిన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందామా ! 1. సాయేషా సైగల్ అఖిల్, బందోబస్తు, టెడ్డీ, యువరత్న సినిమాలతో అలరించిన ముద్దుగుమ్మ సాయేషా సైగల్. ఈ హీరోయిన్ 2019లో హీరో ఆర్యను పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమెకు 22 ఏళ్లు. 2. నిషా అగర్వాల్ చందమామ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ సోలో, సుకుమారుడు, ఏమైంది ఈ వేళ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అక్టోబర్ 18, 1989లో పుట్టిన ఈ అమ్మడు 24 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంది. అక్క కాజల్ అగర్వాల్ కంటే ముందే డిసెంబర్ 28, 2013లో పెళ్లి పీటలు ఎక్కింది నిషా. 3. షాలినీ మాధవన్ సరసన నటించిన 'సఖి' చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఆ చిత్రం తర్వాత షాలినీ యూత్ గుండెల్లో సఖిగా కొలువైంది. షాలినీ 21 వయసులో హీరో అజిత్ను 2000లో వివాహమాడింది. 4. జెనీలియా జెనీలీయా బొమ్మరిల్లు సినిమాతో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా జెన్నీకి ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది. ఆగస్టు 5, 1987న పుట్టిన హాసిని 2012లో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ను వివాహం చేసుకుంది. అప్పుడు జెనీలియాకు 25 ఏళ్లు. 5. నజ్రియా నజీమ్ రాజారాణి, బెంగళూర్ డేస్, ట్రాన్స్ సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ నజ్రియా నజీమ్. ప్రముఖ మళయాల నటుడు ఫహద్ ఫాజిల్ భార్య నజ్రీయా నజీమ్. వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు నజ్రియాకు 20 ఏళ్లు. ఇది చదవండి: సమంత సరికొత్త ఫొటోలు.. నెట్టింట్లో వైరల్
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement