ముంబయి: తాను స్కూళ్లో చదివే రోజుల్లో చరిత్ర సబ్జెక్టులో ఫెయిల్ అయ్యానని.. కానీ, ఇప్పుడు మాత్రం బయటకు చెప్పని చరిత్రల గురించి దృశ్యరూపంలో చెప్పే అవకాశం వచ్చిందని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అశుతోష్ గౌరీకర్ అన్నారు. ‘నాకు ఎప్పుడూ తేదీలు గుర్తుండేవి కాదు. చరిత్ర సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను. జాగ్రఫీతో కూడా నాకు సంబంధం లేదు. అయితే, ఇప్పటి వరకు బయటకు ఎవరు చెప్పని కథల గురించి తెలుసుకునే ఆసక్తి మాత్రం తగ్గలేదు’ అని ఆయన అన్నారు.
తాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మొహంజదారో చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. సింధూ నాగరికత కాలంనాటి మొహంజదారో నగర విశిష్టతను దృశ్యరూపంగా ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. మొహంజదారో చరిత్ర గురించి చెప్పడం అంటే తనకు ఎప్పటికీ ఆసక్తే అని అన్నారు. ‘నేను ఈ చిత్రాన్ని తీసినందుకు సంతోషంగా ఉన్నాను. ఈ చిత్రానికి న్యాయం చేశానని అనుకుంటున్నాను. లగాన్, జోదా అక్బర్, నేడు మొహంజదారో వంటి చిత్రాలకు విడిది తీసుకోవడానికి గల కారణం తన పరిశోధనే అన్నారు. ఇవి ప్రత్యేకమైన చిత్రాలు అయినందున తాను అలా గ్యాప్ తీసుకుంటానని చెప్పారు.
‘చరిత్రలో ఫెయిలయ్యా.. కానీ చాలా ఇంట్రెస్ట్’
Published Wed, Jul 13 2016 11:11 AM
Related news
-
ఇవాళ హనుమాన్ జయంతినా? హనుమాన్ విజయోత్సవమా?
హనుమాన్ జయంతి ఎప్పుడనేది చాలామందికి ఎదురయ్యే ప్రశ్న. ఎందుకంటే దక్షిణాదిలో ఎక్కువగా వైశాఖ మాసంలో దశమి రోజు జరుపుకుంటే, ఉత్తరాది వారు చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఇంతకీ ఏది కరెక్ట్?. అదీగాక చాలామంది ఈ రోజును హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటారు. దీన్ని బట్టి చూస్తే హనుమాన్ జయంతి చైత్రమాసంలోనా? వైశాఖంలోనా ? అంటే..! పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు. అయితే కొన్ని ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మ తిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆంజనేయస్వామి వారి నిలువెత్తు విగ్రహం దగ్గర దగ్గరగా 60 అడుగుల శోభా యాత్రగా ఊరేగిస్తారు. చైత్ర పూర్ణిమ హనుమత్ విజయోత్సవం నుంచి నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు. వైశాఖ బహుళ దశమినే ఎందుకు.. హనుమంతుని జన్మ తిథి వైశాఖ బహుళ దశమినాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం వుంది. "కలౌ పరాశర స్మృతి:" అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ క్రింది శ్లోకంలో వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే || అని చెప్పబడింది. దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుని జన్మ తిథి జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ చాలీసా , ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. విజయోత్సవంగా చెప్పడానికి రీజన్.. చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు. శ్రీ రాముడి సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక, లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమయేనని రాముడు ప్రకటించి, చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట. (చదవండి: థాయిలాండ్లో ఉన్న మరో "అయోధ్య" గురించి తెలుసా..!) -
Sri Rama Navami 2024: శ్రీరామనవమి ముహూర్తం, ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. శ్రీమహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామ నవమిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో రాముణ్ని పూజిస్తారు. సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. శ్రీరామనవమి విషిష్టత ఏంటో తెలుసుకుందాం. అయోధ్య రాజు దశరథ మహారాజు రాణి కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించిన శుభ సందర్భమే శ్రీరామ నవమి. త్రేతా యుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల పుట్టాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ,పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 2024లో రామ నవమి ఎప్పుడు? చైత్ర నవరాత్రులు ఈ సంవత్సరం ఏప్రిల్ 9, మంగళవారం ప్రారంభమయ్యాయి.ఏప్రిల్ 17 న రామ నవమి పండుగతో ముగుస్తాయి. రామ నవమి శుభ ముహూర్తం రామ నవమి, ఏప్రిల్ 17,బుధవారం. ముహూర్తం - ఉదయం 11:03 -మధ్యాహ్నం 01:38 వరకువ్యవధి - 02 గంటల 35 నిమిషాలు అని పండితులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా రామనవమిని ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రామజన్మభూమిగా భావించే అయోధ్యలో, శ్రీరాముని జన్మదినోత్స వేడుకలు కోలాహలంగా ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు అయోధ్యకు వస్తారు.ఈ ఏడాది ప్రాణ ప్రతిష్ట చేసుకున్న రామజన్మభూమి దేవాలయంలో రామ్ లల్లా తొలి వేడుకులు ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. సీతారామకళ్యాణం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ శ్రీరామ కల్యాణ ఉత్సవాలను నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు అయిన శ్రీరాముడికి - అందాల సీతమ్మకు ఈ రోజునే పెళ్లి జరిగింట. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని ప్రతి రాముడి ఆలయంలోనూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలాగే పద్నాలుగేళ్లు అరణ్యవాసం తరువాత శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదేనని భక్తుల విశ్వాసం. చాలామంది ఆ రోజు ఉపవాసం ఉంటారు. రామ భక్తులు రామాయణం భాగవత గ్రంథాలను పఠిస్తారు. సీతారామ లక్ష్మణులతోపాటు హనుమంతుడిని కూడా పూజిస్తారు. వడపప్పు, పానకం పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైందట. అందుకే శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెడతారు. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేదం చెపుతుంది. -
అంబేద్కర్ సాధించిన అద్భుత విజయాలు
నేడు అంబేద్కర్ జయంతి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న రాజ్యంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. అంబేద్కర్ను భారత రాజ్యాంగ పితామహుడు అని కూడా అంటారు. అంబేద్కర్ 1891, ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మోవ్లో ఒక దళిత మహర్ కుటుంబంలో జన్మించారు. స్వాతంత్ర్యం తరువాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లడంలో అంబేద్కర్ కీలకపాత్ర పోషించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను తెలుసుకుందాం. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బి ఆర్ అంబేద్కర్ దేశానికి తొలి న్యాయ మంత్రి అయ్యారు. తన పదవీకాలంలో సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వివిధ చట్టాలు, సంస్కరణలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీకి అధ్యక్షునిగా డాక్టర్ అంబేద్కర్ నియమితులయ్యారు. కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యత ఈ కమిటీదే. నిజానికి అంబేద్కర్ ఇంటిపేరు అంబావ్డేకర్ (మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ఆయన స్వగ్రామం ‘అంబవాడే’ పేరు నుండి వచ్చింది). అయితే అతని గురువు మహదేవ్ అంబేద్కర్ ఇంటిపేరును ‘అంబావ్డేకర్’ నుండి ‘అంబేద్కర్’గా పాఠశాల రికార్డులలో మార్చారు. అంబేద్కర్ మన దేశంలో కార్మిక చట్టాలకు సంబంధించి అనేక మార్పులు చేశారు. 1942లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 7వ సెషన్లో పనివేళలను 12 గంటల నుంచి 8 గంటలకు తీసుకొచ్చారు. బాబా సాహెబ్ విదేశాల్లో ఎకనామిక్స్లో డాక్టరేట్ పట్టా పొందిన మొదటి భారతీయుడు. అలాగే దక్షిణాసియాలో ఎకనామిక్స్లో తొలి డబుల్ డాక్టరేట్ హోల్డర్ కూడా. అతని తరంలో అత్యంత విద్యావంతులైన భారతీయులలో ఒకనిగా పేరుగాంచారు. పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లు కోసం అంబేద్కర్ పోరాటం సాగించారు. వివాహం, వారసత్వ విషయాలలో మహిళలకు సమాన హక్కులు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం. బిల్లు ఆమోదం పొందకపోవడంతో న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. కొలంబియా యూనివర్శిటీలో ఉన్న మూడేళ్లలో, అంబేద్కర్ ఆర్థికశాస్త్రంలో 29, చరిత్రలో 11, సోషియాలజీలో ఆరు, ఫిలాసఫీలో ఐదు, హ్యుమానిటీస్లో నాలుగు, పాలిటిక్స్లో మూడు, ఎలిమెంటరీ ఫ్రెంచ్, జర్మన్లలో ఒక్కొక్కటి చొప్పున కోర్సులు అభ్యసించారు. 1995లో అంబేద్కర్ రాసిన ‘థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్’ పుస్తకంలో ఆయన మధ్యప్రదేశ్, బీహార్లను విభజించాలని సూచించారు. ఈ పుస్తకాన్ని రాసిన దాదాపు 45 సంవత్సరాల తరువాత 2000లో ఈ ప్రాంతాల విభజన జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64 సబ్జెక్టులలో మాస్టర్. హిందీ, పాళీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, గుజరాతీ తదితన తొమ్మిది భాషల్లో అంబేద్కర్కు పరిజ్ఞానం ఉంది. ఇంతేకాదు ఆయన సుమారు 21 సంవత్సరాల పాటు ప్రపంచంలోని అన్ని మతాలను తులనాత్మక అధ్యయనం చేశాడు. బుద్ధ భగవానుడు కళ్లు తెరిచి చూస్తున్న మొదటి చిత్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించారు. అంతకు ముందు బుద్ధ భగవానునికి చెందిన పలు చిత్రాలు కళ్లు మూసుకున్న తీరులో ఉండేవి. -
నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే 2024 : ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ప్రతీ ఏడాది ఏప్రిల్ 11న జాతీయ మాతృత్వ దినోత్సవాన్ని(NSMD) జరుపుకుంటారు. ఇది మాతృత్వాన్ని గౌరవించే రోజు. కాబోయే తల్లులకు, పుట్టబోయే బిడ్డలకు సరైన ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి సేవల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి దేశంలో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని జరుపు కుంటారు. మహిళ ఒక బిడ్డకు జన్మనివ్వడంలో సమాజ బాధ్యతపై అవగాహన కల్పించేందుకు ఏర్పరచుకున్న ఒక రోజు. అన్నీ సవ్యంగా జరిగితే నిజంగా అదొక అద్భుతం. మరపురాని మధుర జ్ఞాపకంగా మిగిలిపోయే రోజు. కానీ మన దేశంలో ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోతున్న స్త్రీలు ఇంకా చాలామందే ఉన్నారు. గర్భధారణ సమయంలో, ఆ తర్వాత కూడా పోషకాహార లోపంతో మహిళలు బాధపడుతున్నారు. ఫలితంగా ముందస్తు ప్రసవాలు, శిశువుల్లో శారీరక లోపాలు లాంటి సమస్యలు తలెత్తు తున్నాయి. ఈనేపథ్యంలో మహిళలకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల, ఆరోగ్యవంతమైన శిశవులు జననంపై అవగాహన కల్పించేందుకే ఈ జాతీయ మాతృత్వ దినోత్సవం. తద్వారా మాతాశిశు మరణాల రేటును తగ్గించడంలో పురోగతి సాధించగలం. 2024 థీమ్: ఈ సంవత్సరం ప్రినేటల్ కేర్ (గర్భంధ రించిన తర్వాత గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు) స్కిల్డ్ బర్త్ అటెండెంట్లు, ప్రసవానంతర సహాయాన్ని మెరుగు పరచడంపై దృష్టి పెడుతుంది. పోషకాహారం, రెగ్యులర్ చెకప్లు , గర్భిణీ స్త్రీలకు అవసరమైన సమాచారాన్ని పొందాల్సిన ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది. ప్రతి స్త్రీకి మాతృత్వాన్ని సురక్షితమైన, సంతోషకరమైన అనుభవంగా మార్చడానికి కృషి చేద్దాం. కాబోయే తల్లి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తామని , ప్రతి తల్లికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రతిజ్ఞ చేద్దాం. తల్లీబిడ్డలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందేలా పాటుపడదాం. సురక్షిత మాతృత్వ దినోత్సవ శుభాకాంక్షలు! -
Ugadi 2024: ఈ పండుగకి 'ఉగాది' అనే పేరు ఎలా వచ్చిందంటే..?
తెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిళ్లలో క్రోధి నామ సంవత్సరం సందడి మొదలైంది. ఉగాది అంటే ప్రతీ ఒక్కరికి గుర్తుకొచ్చేది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనమే పండుగ ప్రత్యేకత. జీవితంలో వచ్చే కష్టసుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేసేదే పచ్చడి. హిందూ పురాణాల ప్రకారం, ఉగాదిలో ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం.. ఈ గమనానికి ఆది ఉగాది.. అంటే సృష్టి ఉగాది రోజు నుంచే ప్రారంభమైందని అర్థం. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాఢ్యమి తిథి రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు ‘గుడిపడ్వా’గా, తమిళులు ‘పుత్తాండు’, మలయాళీలు ‘విషు’, సిక్కులు ‘వైశాఖీ’, బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’గా జరుపుకుంటారు. ఈ సమయంలో ప్రముఖ ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం పఠిస్తారు. ఈ నేపథ్యంలో క్రోధి నామ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాం. ఇవి చదవండి: చైత్ర మాసం విశిష్టత? వసంత నవరాత్రులు ఎందుకు చేస్తారు?
Related News by category
-
ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరో గుర్తు పట్టగలరా..?!
న్యూఢిల్లీ: మనం చిన్నప్పటి ఫోటోలను మన స్నేహితులకు చూపించి ఈ ఫోటోలో ఉంది ఎవరో చెప్పు అని అడుగుతాం. కానీ వాళ్లు మనమే అని కూడా సరిగా గుర్తు పట్టలేరు కదా. ఎందుకంటే వయసు పెరుగుతుంటే కొంచెం కొంచెంగా శరీరంలో మార్పులు సంతరించుకోవడంతే కొంచెం పోల్చుకోవడం కష్టం అనిపిస్తోంది. మరికొంత మందిని ఈజీగా గుర్తుపట్టేయగలం. (చదవండి: ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి) ఏంటి సోదీ అనుకోకండి ఇక్కడ ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడయోలో పోస్టు చేసి ఇతనెవరో గెస్ చేయండి ప్లీజ్ అంటు కామెంట్ జోడించి పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడూ ఏదో ఒకటి పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచే మిలిందా ఈసారి తన చిన్ననాటి స్మృతులను తన అభిమానులతో పంచుకున్నాడు. ఇది తాను ఆరేళ్ల వయసులో ఉండగా తీసిన పోటో అంటూ చెప్పుకొచ్చాడు. పైగా తాను ఆ వయసులో మంచి రైతు అవ్వాలని అనుకున్నాడట. కానీ ఇప్పుడు ఈ 50 ఏళ్ల వయసులో కృత్రిమంగా కూరగాయాలు ఎలా పండించాలో తెలుసుకుంటున్నాను అంటున్నాడు. ప్రస్తుతం మిలింద్ సోమన్ మలైకా అరోరా అనూష దండేకర్తో కలిసి టీవీ రియాలిటీ షో సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ రెండవ సీజన్కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: టైంకి ఎయిర్పోర్ట్కి చేరాలంటే ట్రాక్టర్పై వెళ్లక తప్పదు) -
Shabana Azmi birthday special: వన్ అండ్ ఓన్లీ మాస్టర్ పీస్
సాక్షి, హైదరాబాద్: వెండితెరకు హైదరాబాద్ అందించిన గోల్కొండ వజ్రం. ముందుతరం నటీ నటులకు ఆమె ఒక నిఘంటువు. ఒక చిన్న ముఖ కవళిక, అంతకుమించిన విషాదపు విరుపు, కంటినుంచి జారీ జారని నీటి చుక్క.. ఒకపంటి మెరుపు ఇవి చాలు నటనకు అని చాటిచెప్పిన గొప్ప నటి షబానా అజ్మీ. ఏకకాలంలో 12 చిత్రాలలో పని చేసిన ఘనత ఆమె సొంతం. మన హైదరాబాదీ నటి షబానా 72వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా స్పెషల్ స్టోరీ షూటింగ్ సమయంలో గంటల తరబడి వేచి చూడటం అంటే తనకు ఎపుడూ ఇబ్బంది కాలేదనీ ఎందుకంటే నిర్మాతలకు మనం ఒక ఎసెట్గా ఉండాలి తప్ప, భారంగా ఉండకూడదనేది తల్లి ఫౌకత్నుంచినేర్చుకున్న గొప్పపాఠం అంటారామె. తానొక గొప్పనటిగా చెప్పుకోను, సరైన సమయంలో సరైన అవకాశాలు దొరకడం తన అదృష్టం. ఈ ఘనత అంతా తనకు లభించిన చక్కటి శిక్షణ, స్క్రిప్ట్, గొప్ప దర్శకులకే దక్కుతుందన్నారు. సినిమా అనేది సంయుక్త కృషి అసలు సినిమా కథకు మించి ఏ యాక్టర్ ఎదగలేడంటూ స్క్రిప్ట్కు పెద్ద పీట వేశారామె. అలాగే సద్విమర్శలను జాగ్రత్తగా గమనించడంతోపాటు తనన పనిని తాను నిజాయితీగా అంచనా వేసుకుంటానంటారు షబానా. సాధించినదానికి పొంగిపోకుండా ఉండాలని ఎప్పటికే భావిస్తున్నాను ఎందుకుంటే నటన అంటే ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడమే అంటారు. యువతకు స్వేచ్ఛ నివ్వాలని, వారి అభిపప్రాయాలను గౌరవించాలంటారు. తమ తల్లిదండ్రులు తనకు, తనసోదరుడు బాబా (సినిమాటోగ్రాఫర్, బాబా అజ్మీ) అలాగే పెరిగామని, అడగకుండా ఎపుడూ ఎలాంటి సలహా ఇవ్వలేదని ఇపుడు తానూ అదేఆచరిస్తున్నానన్నారు. యువత నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందని తానునమ్ముతానన్నారు. సైకాలజీని అవపోసన పట్టిన షబానా పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకోవడం ఈజీ అయింది. బార్బరా స్ట్రీసాండ్ ఏ స్టార్ ఈజ్ బోర్న్లో చెప్పినట్లుగా నాకు పెద్దగా కోరికలు లేవు....కానీ ఇంకా చాలా కావాలి. పాడతా.. అన్నీ కావాలి..భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్ను సాగిస్తున్న షబానా అజ్మీ తొలి వెబ్ సిరీస్ ‘ది ఎంపైర్’ ఓటీటీలో సందడి చేస్తోంది. -
నేను సచిన్ పోస్టర్లు చించితే.. అతను అఫ్రిది ఫోటోలను చించాడు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్, హీరో రితేశ్ దేశ్ముఖ్ హోస్ట్లుగా వ్యవహరిస్తున్న "యారోంకి బారాత్" అనే చాట్ షోలో బాలీవుడ్ ముద్దుగుమ్మ హ్యూమా ఖురేషి.. తన చిన్నతనంలో జరిగిన ఆసక్తికర సంఘటనను వెల్లడించింది. తన సోదరుడు, బాలీవుడ్ నటుడు సకీబ్ సలీంకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే ప్రాణమని, ఓ సందర్భంలో అతనితో గొడవ పడ్డప్పుడు కోపంలో అతని ఆరాధ్య దైవమైన సచిన్ పోస్టర్లను చించేశానని పేర్కొంది. దీనికి బదులుగా అతను తన ఫేవరెట్ క్రికెటర్ అయిన షాహిద్ అఫ్రిది ఫోటోలను చించేశాడని వివరించింది. అయితే షో హోస్ట్లు.. నువ్వు సచిన్ పోస్టర్లను చించావా అని ప్రశ్నించడంతో ఆమె చాలా ఇబ్బంది పడింది. తను కూడా సచిన్ వీరాభిమానినేనని.. చిన్నతనంలో అన్న చెల్లెల్ల మధ్య ఇటువంటి సంఘటనలు తరుచూ జరుగుతుంటాయని కవర్ చేసుకుంది. తను క్రికెట్ను ఫాలో అవుతున్న రోజుల్లో పాక్ ఆటగాడు అఫ్రిది అరంగేట్రం చేశాడని, అతని దూకుడైన ఆటతీరు, అతని హెయిర్ స్టైల్ తనను బాగా ఇంప్రెస్ చేశాయని చెప్పుకొచ్చింది. 90వ దశకంలో ఆఖర్లో అఫ్రిదికి అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేదని, కాబట్టి తాను కూడా అతనికి అకర్షితురాలినయ్యానని తెలిపింది. కాగా, హ్యూమా ఖురేషి 2012లో విడుదలైన "గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్" సినిమా ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. చదవండి: ఆర్సీబీ అభిమానినే కానీ, కోహ్లి నా ఫేవరెట్ క్రికెటర్ కాదు: రష్మిక -
ఐ లవ్ యూ ప్రియాంక..స్పెషల్ విషెస్
ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ తమ రెండవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రెండేళ్ల క్రితం ఇదే రోజున జోధ్పూర్లోని ఉమైద్ భవన్ ప్యాలెస్లో ఒకటయ్యారు ఈ జంట. క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకున్న ఫోటోలను షేర్ చేసి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా భార్య ప్రియాంకకు సోషల్మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశాడు పాప్స్టార్. దీనిపై ప్రియాంక స్పందించిన తీరు అభిమానుల హృదయాలను దోచుకుంది. అద్భుతమైన, అందమైన స్త్రీని వివాహమాడి సరిగ్గా రెండేళ్లు అయ్యిందని, 'హ్యాపి వెడ్డింగ్ అనివర్సరీ ఐ లవ్ యూ ప్రియాంక' అని నిక్ చేసిన పోస్ట్ పై ప్రియాంక స్పందించింది. (చదవండి: లాక్డౌన్పై కాజోల్ క్రేజీ క్యాప్షన్) 'నువ్వే నా బలం, బలహీనత, ఎల్లప్పుడూ నా వెంటే ఉండే నా ధైర్యం.. ఐ లవ్ యూ నిక్' అంటూ ప్రియాంక సోషల్ మీడియా వేదికగా భర్తకు శుభాకాంక్షలు తెలిపింది. 2018 డిసెంబర్ 1న క్రైస్తవ పద్ధతిలో ఒకటైన ఈ జంట డిసెంబర్ 2వ తేదీన హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఢిల్లీ, ముంబైలలో గ్రాండ్గా రెండుసార్లు రిసెప్షన్ చేసుకున్నారీ జంట. కుటుంబ సభ్యులు, బాలీవుడ్ నటీనటులు, పలువురు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రియాంక చోప్రా ఇటీవల జర్మనీ యాక్టర్ కియానో రీవ్స్తో కలిసి షూటింగ్ ముగించింది. తరువాత నెట్ఫ్లిక్స్లో రానున్న 'ది వైట్ టైగర్'లో కనిపించనుంది. ఈ సినిమా 'అరవింద్ అడిగా' అనే బుక్ ఆధారంగా తెరకెక్కనుంది. రాజ్కుమార్రావ్, ఆదర్ష్ గౌరవ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. హాలీవుడ్లో 'వి కెన్ బీ హీరోస్'లో కూడా ప్రియాంక కనిపించనుంది. ఈ సినిమాను రాబర్ట్ రోడ్రిక్వేజ్ నిర్మించనున్నారు. -
దర్శకుడిగా మారనున్న హీరో..
సాక్షి,ముంబై: ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం నటనకు స్వస్తి చెప్పినా.. త్వరలోనే దర్శకత్వంలోకి రాబోతున్నాడని ఒక ఇంటర్వ్యూలో అతని స్నేహితుడు అక్షయ్ ఒబెరాయ్ చెప్పారు. ఇమ్రాన్ 2008లో ‘జానే తు ... యా జానే నా’... చిత్రంతో మొదటిసారిగా హీరోగా నటించారు. అతని చివరి సినిమా ‘కట్టీ బట్టీ’ 2015లో విడుదలయ్యింది. ఇద్దరం కలిసి ఒకే దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నామని అక్షయ్ తెలిపారు. గుర్గావ్, కలకండి వంటి చిత్రాల్లో అక్షయ్ నటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘బాలీవుడ్లో నా బెస్ట్ ఫ్రెండ్ ఇమ్రాన్ ఖాన్. నాకు ప్రాణ స్నేహితుడు.. నేను అతనికి తెల్లవారుజామున 4 గంటలకు కాల్ చేయగలను. నేను,ఇమ్రాన్ దాదాపు 18 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం. మేము అంధేరి వెస్ట్లోని కిషోర్ యాక్టింగ్ స్కూల్లో కలిసి యాక్టింగ్ నేర్చుకున్నాము.’ అని తెలిపారు. (చదవండి: ప్రేమ విషయాన్ని దాచలేదు: హీరో కూతురు) ‘‘ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతానికి నటనను విడిచిపెట్టారు. నాకు తెలిసినంతవరకు తనలో మంచి రచయిత, దర్శకుడు ఉన్నారు. ఆయన ఎప్పుడు డైరెక్షన్ చేస్తారో నాకు తెలియదు. కానీ ఓ స్నేహితుడిగా నేను ఎటువంటి ఒత్తిడి చేయను. ఆయన అద్భుతమైన చిత్రం చేస్తాడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే సినిమాపై అతనికీ చాలా అవగాహన ఉంది” అని అక్షయ్ ఒబెరాయ్ తెలిపారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement