Sakshi News home page

యాక్షన్.. రొమాన్స్

Published Sun, May 22 2016 11:25 PM

యాక్షన్.. రొమాన్స్

రెండు దశాబ్దాల పాటు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న వేణు మూవీస్ సంస్థ అధినేత పసుపులేటి వేణుమాధవ్ తాజాగా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ‘అందాల రాక్షసి’, ‘త్రిపుర’, ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ ఫేం నవీన్ చంద్ర హీరోగా పసుపులేటి శ్రీనివాసరావు సమర్పణలో జి. గోపిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ చిత్రం నిర్మించనున్నారు. ఈ సందర్భంగా దర్శక- నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతాం. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం. హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే తెలియచేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత వి.కావేరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.శ్రీనివాస్.
 

Advertisement

What’s your opinion

Advertisement