Sakshi News home page

చిక్కుల్లో పడ్డ హీరో, హీరోయిన్

Published Sun, Oct 16 2016 1:22 PM

చిక్కుల్లో పడ్డ హీరో, హీరోయిన్

రాంచీ: బాలీవుడ్ నటులు గోవిందా, శిల్పాశెట్టి చిక్కుల్లో పడ్డారు. 20 ఏళ్ల క్రితం నమోదైన పరువు నష్టం కేసుకు సంబంధించి కోర్టులో హాజరుకావాల్సందిగా జార్ఖండ్లోని పాకూర్ కోర్టు ఆదేశించింది. ఈ నెల 18న ఇద్దరూ కోర్టుకు రావాలని ఆదేశాలు జారీ చేసింది.

1996లో విడుదలైన ఛోటే సర్కార్ సినిమాలో గోవిందా, శిల్పా నటించారు. బిహార్, ఉత్తరప్రదేశ్ను కించపరిచేవిధంగా ఈ సినిమాలో ఓ పాటను చిత్రీకరించారని ఆరోపిస్తూ స్థానిక న్యాయవాది ఒకరు కేసు వేశారు. గోవిందా, శిల్పాతో పాటు గాయకులు, దర్శకులపైనా కేసు పెట్టారు. అప్పుడు జార్ఖండ్.. బిహార్లో భాగంగా ఉండేది. ఆ తర్వాత జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. కోర్టు గతంలో పలుమార్లు ఆదేశించినా ఎవరూ విచారణకు హాజరుకాలేదు. దీంతో నటీనటులను కోర్టుకు తీసుకురావాల్సిందిగా ముంబై పోలీసులను ఆదేశించింది.

Advertisement

What’s your opinion

Advertisement