డెహ్రాడూన్: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది గల్లంతయిన విషాధకర సంఘటనను చూస్తుండగానే.. ఉత్తరాదిన మరో దుర్ఘటన సంభవించింది. హిమాచల్ పొరుగు రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో ఓ ప్రైవేట్ బస్సు నదిలోకి పడిపోయింది.
మంగళవారం మధ్యాహ్నం గంగోత్రి వెళ్తున్న బస్సు బాగీరథి నదిలో పడిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు రష్యన్లు మరణించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
నదిలో పడిన బస్సు:2 రష్యన్లు మృతి
Published Tue, Jun 10 2014 4:22 PM
# Tag
Related news
-
ఏప్రిల్లోనే ఎండిపోయిన నది.. 25 వేల జనాభా విలవిల!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వేసవి విజృంభిస్తోంది. ఛత్తీస్గఢ్లోని రామానుజ్గంజ్ ప్రాంతంలోని 25 వేల జనాభాకు నీటిని అందించే కన్హర్ నది ఏప్రిల్లోనే ఎండిపోయింది. దీంతో నదిలో ఒక పెద్ద గొయ్యి తవ్వి అక్కడి జనాభాకు నగర పంచాయతీ నీటిని అందిస్తోంది. రామానుజ్గంజ్ ప్రాంతానికి సరిపడా తాగునీటిని అందించేందుకు జలవనరుల శాఖ కోట్లాది రూపాయలతో నదిపై ఆనకట్టను నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. అయితే అధికారుల అవినీతి కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.ఎంతకాలం ఎదురు చూసినా ఆనకట్ట నిర్మాణానికి నోచుకోకపోవడంతో రామానుజ్గంజ్వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన ఆనకట్టను తొలగించి, నూతన నిర్మాణం చేపడితేనే నగరానికి సరిపడా నీరు అందుతుందని స్థానికులు అంటున్నారు.ఈ నది ఎండిపోవడంతో స్థానికులతో పాటు ఈ నదిపై ఆధారపడిన జంతువులు, పక్షులు సైతం విలవిలలాడిపోతున్నాయి. దీనిని గుర్తించిన జిల్లా యంత్రాంగం, నగరపంచాయతీ స్థానికులకు తాగు నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
దారుణం: ప్రియుడిపై మోజు.. భర్తను అంతమొందించిన భార్య!
సబ్బవరం: సాలాపువానిపాలెంలో ఓ యువకుడు శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ప్రియుడిపై మోజులో మరో ఇద్దరితో కలిసి కోడలే కడతేర్చిందని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఘటన మండలంలోని గోటివాడ శివారు సాలాపువానిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ పిన్నింటి రమణ శనివారం సాయంత్రం వెల్లడించిన వివరాల ప్రకారం... సాలాపు శ్రీనివాసరావు (32) దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం దువ్వాడ సమీపంలోని మంగళపాలెంకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మికి అదే గ్రామానికి చెందిన గళ్ల రవి (26)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతోపాటు పెద్దలు వద్ద పంచాయతీ నిర్వహించడం... అనంతరం కలిసి జీవించడం జరిగేది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో సాలాపు శ్రీనివాసరావు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ఇంటికి వస్తుండగా... అదే గ్రామానికి చెందిన గళ్ల రవి (26), గరికిపాటి శ్రీహరి (22) కలిసి శ్రీనివాసరావును అడ్డుకుని మంచం కోడితో తలపై దాడి చేశారు. దీంతో పెద్దగా కేకలు వేయడంతో శ్రీనివాసరావు తండ్రి అప్పారావుతోపాటు గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని చూడగా... శ్రీనివాసరావు తీవ్ర గాయాలతో పడి వున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు సబ్బవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే మృతి చెందినట్ల వైద్యులు నిర్ధారించారు. కోడలు భాగ్యలక్ష్మితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి తమ కుమారుడు శ్రీనివాసరావును హత్య చేశారని మృతుని తండ్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. శ్రీనివాసరావు తలపై మంచం కోడితో దాడి చేసిన తర్వాత... సుమారు 150 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యకు పాల్పడిన గళ్ల రవి (26), గరికిపాటి శ్రీహరిని(22) అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. భార్య భాగ్యలక్ష్మిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమణ తెలిపారు. -
Hyderabad: రోడ్డు ప్రమాదంలో నర్సు మృతి
మూసాపేట: ఆసుపత్రికి స్కూటీపై వెళుతున్న స్టాఫ్ నర్స్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. జగద్గిరిగుట్టకు చెందిన ప్రశాంతి (37) భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేపీహెచ్బీ కాలనీలోని రవి హాస్పిటల్స్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. శనివారం జగద్గిరిగుట్టలోని ఇంటి నుంచి ఆసుపత్రికి సౌత్ ఇండియా షాపింగ్మాల్ నుండి వెళుతోంది. నెక్సాస్ షోరూమ్ వద్ద మలుపు వద్ద కూకట్పల్లి వైపు వేగంగా వెళుతున్న వెనుకనుంచి వచి్చన డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
విశాఖపట్నం : వారు ప్రయాణిస్తున్న కారు యమదూతలా మారింది.. టైరు రూపంలో యమపాశం విసిరింది.. జాతీయ రహదారిపై వెదుళ్లపాలెం వద్ద జరిగిన ఘోర ప్రమాదం రెప్పపాటులో ముగ్గురి ప్రాణాలు హరించింది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. వివరాలివి. జీవీఎంసీ 91వ వార్డు గవరవీధి, ఎన్ఏడీ జంక్షన్, కూర్మనపాలెం ప్రాంతాలకు చెందిన నలుగురు కారులో శనివారం ఉదయం కాకినాడ బయలు దేరారు. శరగడం వెంకటలక్ష్మి (37) తన కొడుకు వికాస్, మేనమామ కొడుకు దాడి గగన్ (15)లతో కలిసి వ్యక్తిగత పనిమీద కారులో ప్రయాణమయ్యారు. వీరితో పాటు వికాస్ స్నేహితుడైన సుంకర మధుకర్(27) బయలుదేరాడు.పాయకరావుపేటలో వెంకటలక్ష్మి తల్లిని చూసి అక్కడ నుంచి కాకినాడ వెళ్లాలనుకున్నారు. కారు వెదుళ్లపాలెం జంక్షన్ వద్దకు చేరుకునే సరికి హఠాత్తుగా టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అవతల రూట్లోకి దూసుకుపోయింది. తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. ఈ ఘటనలో కారులో ఉన్న వెంకటలక్ష్మి, దాడి గగన్, సుంకర మధుకర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద తీవ్రతకు కారు టాప్ పైకి లేచిపోయింది. డోర్లు ఊడిపోయాయి. ప్రమాదంలో వికాస్ ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు నెలల్లో జర్మనీ వెళ్లాల్సి ఉండగా.... వికాస్ స్నేహితుడైన మధుకర్ విశాఖ స్టీల్ప్టాంట్లో మెకానికల్ విభాగంలో అప్రెంటీస్ చేస్తున్నట్టు తెలిసింది. తుని ప్రాంతానికి చెందిన అతడు ఎన్ఏడీ జంక్షన్లో ఉంటున్నాడు. అతడు రెండు నెలల్లో ఉన్నత చదువు, ఉద్యోగం కోసం జర్మనీ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించి అనంత లోకాలకు తీసుకెళ్లిపోయింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నక్కపల్లి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దుర్మరణం పాలవడంతో విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు సంఘటన స్దలానికి చేరుకుని రోదించారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం కోసం నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయ్కుమార్ తెలిపారు.గవరవీధిలో విషాదఛాయలు గోపాలపట్నం: వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో శరగడం వెంకటలక్ష్మి మృతి చెందగా ఆమె కుమారుడు వికాస్ గాయాలపాలవడంతో గవరవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గవరవీధిలో ఉంటున్న శరగడం నర్సింగరావు సప్లయర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో అతడి భార్య వెంకటలక్ష్మి మృతి చెందగా కుమారుడు వికాస్ గాయాలపాలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున ఇంటికి తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. వెంకటలక్ష్మి ఎప్పుడు నవ్వుతూ నవి్వస్తూ అందరితో కలివిడిగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన దాడి గగన్ది కూర్మన్నపాలెం కాగా.. శనివారం ఉదయం టోల్గేట్ వద్ద కారు ఎక్కాడు. -
ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు.. రంగంలోకి దిగిన ఆర్మీ
ఉత్తరాఖండ్లోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు నైనిటాల్ నగరం వరకు విస్తరిస్తోంది. మంటల కారణం పొగ కమ్ముకుంటుంది. ప్రస్తుతం మంటలు నైనిటాల్ హైకోర్టు కాలనీవైపు విస్తరిస్తున్నాయి. దీంతో అప్రత్తమైన ఉత్తరఖండ్ ప్రభుత్వం మంటలు ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయం కోరింది. దీంతో మంటలు ఆర్పడానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రంగంలో దిగింది. ఆర్మీ అధికారులు హెలికాప్టర్ల సాయంతో చెలరేగతున్న మంటలపై నీటిని వెదజల్లుతూ ఆర్పుతున్నారు. నైనిటాల్ లేక్లో బోటింగ్ సేవలు నిలిపిస్తున్నట్లు అధికారాలు ప్రకటన విడుదల చేశారు.‘ఇప్పటివరకు హైకోర్టు కాలనీకి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. కానీ మంటలు ప్రమాదకారంగా పలు భవనాలకు సమీపంగా చేరుకుంటుంది’ అని హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రాటర్ తెలిపారు. నైనిటాల్ జిల్లాలోని లారియా కాంటా అడవుల్లో కూడా మంటలు వ్యాపించగా.. అక్కడి ఐటీఐ భవనం పాక్షికంగా దెబ్బతింది. అడవులకు నిప్పు పెట్టారన్న అనుమానాలు ఉన్న ముగ్గురు వ్యక్తులను రుద్రప్రయాగ్లో అరెస్ట్ చేసినట్లు ఫారెస్ట్ డివిజినల్ అఫీసర్ అభిమాన్యూ తెలిపారు.ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అడవుల్లో చెలరేగిన మంటలపై శనివారం సమీక్ష నిర్వహించారు. మంటలు ఆర్పడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గడిచిన వారం రోజుల్లో అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సుమారు 31 కొత్త అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
Related News by category
-
భారీగా టీడీపీ మద్యం పట్టివేత
గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని మెట్లపల్లి శివారుల్లో టీడీపీ నేతలు ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన గోవా మద్యం నిల్వలను ఆదివారం పోలీస్, ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా మద్యం నిల్వచేసిన టీడీపీ నేతను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మెట్లపల్లి శివారులో గన్నవరం మాజీ సర్పంచి, టీడీపీ నేత గూడపాటి తులసీమోహన్ సోదరుడైన దుర్గాప్రసాద్కు చెందిన శ్రీనివాస గార్డెన్స్లో భారీగా మద్యం నిల్వచేసినట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వీరి ఆదేశాల మేరకు హనుమాన్జంక్షన్ సీఐ నరసింహమూర్తి, ఎక్సైజ్ స్క్వాడ్ ఎస్ఐ రామాంజనేయ, సెబ్ అధికారులు సంయుక్తంగా గార్డెన్స్లోని గెస్ట్హౌస్పై దాడిచేశారు. అక్కడ గోవా రాష్ట్రానికి చెందిన స్టీకర్స్తో మొత్తం 1,210 కేసుల్లో 58,032 క్వార్టర్ సీసాల మద్యం నిల్వల్ని గుర్తించి సీజ్ చేశారు. వీటివిలువ సుమారు రూ.75 లక్షలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. ఆత్కూరు ఎస్ఐ పైడిబాబు కేసు నమోదు చేశారు. అక్రమంగా మద్యం నిల్వచేసిన శ్రీనివాస గార్డెన్స్ యాజమాని, టీడీపీ నేత గూడపాటి దుర్గాప్రసాద్ను, వాచ్మెన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీస్, ఎక్సైజ్ అధికారులు తెలిపారు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ, నేతల్లో ఆందోళన ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు ఈ మద్యం కొనుగోలు చేసి ఇక్కడ నిల్వ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి గూడ్స్ వాహనంలో ఇక్కడికి తీసుకొచ్చి న ఈ మద్యాన్ని ఇక్కడినుంచి గ్రామాలకు పంపేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది.మద్యం పట్టుబడ్డడంతో యార్లగడ్డతో పాటు ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. అధికారులు దాడిచేసిన విషయం తెలుసుకున్న యార్లగడ్డ వర్గానికి చెందిన టీడీపీ నేతలు పొట్లూరి బసవరావు, జాస్తి శ్రీధర్బాబు, దొంతు చిన్నా, కేసరపల్లి ఎంపీటీసీ సభ్యుడు శొంఠి కిషోర్ గంటల వ్యవధిలోనే ఆ గ్రామానికి చేరుకున్నారు. -
అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
బెంగళూరు: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక జనతాదళ్ (సెక్యులర్) అగ్రనేత దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.లోక్సభ ఎన్నికల పోలింగ్కు ముందు ప్రజ్వల్కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణపై హాసన్ జిల్లా హోలెనరసిపూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఆ ఎఫ్ఐఆర్లో 2019, 2022 మధ్య కాలంలో తాను అనేకసార్లు లైంగిక వేధింపులకు గురైనట్ల బాధితురాలు ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు సిట్ బృందానికి సమాచారం అందించారు. కాగా, మరింత మంది మహిళలు కేసులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని ప్రజ్వల్ రేవన్న ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అశ్లీల వీడియోలు మార్ఫింగ్ చేసినవి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకర వీడియోల కేసు దుమారం రేగడంతో ప్రజ్వల్ రేవణ్ణ నిన్న ఉదయం జర్మనీ వెళ్లారు.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై స్పందిస్తూ నిజానిజాలు తేల్చేందుకు సిట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహిళపై లైంగిక వేధింపుల కోణాన్ని కూడా దీనిలో దర్యాప్తు చేస్తామన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ లోక్సభ నియోజకవర్గంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభ్యర్థిగా ఉన్నారు. ఏప్రిల్ 26న రెండో దశలో ఓటింగ్ జరిగింది. -
రూ. 600 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది అరెస్ట్
గుజరాత్లోని అరేబియా సముద్ర తీరంలో భారీస్థాయి మాదకద్రవ్యాల రాకెట్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఛేదించింది. భారత్లోకి అక్రమంగా మాదకద్రవ్యాలు చేరవేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రను భగ్నం చేసింది. ఎన్సీబీ, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), ఇండియన్ కోస్ట్గార్డ్ శనివారం రాత్రి సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో రూ.600 కోట్ల విలువైన 86 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోరుబందర్ సమీప తీరంలోని నౌక నుంచి వాటిని సీజ్ చేసి, పాకిస్థాన్కు చెందిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్లో భాగంగా పాక్ నౌకని నిలువరించేందుకు కోస్ట్గార్డ్ నౌకలు, విమానాలను మోహరించింది. ఈ ఆపరేషన్లో పాల్గొన్న కీలక నౌకల్లో కోస్ట్ గార్డ్ షిప్ రాజ్రతన్లో ఎన్సీబీ,ఏటీఎస్ అధికారులు దాడులు చేశారు. Anti #Narco #Operations @IndiaCoastGuard Ship Rajratan with #ATS #Gujarat & #NCB @narcoticsbureau in an overnight sea - air coordinated joint ops apprehends #Pakistani boat in Arabian Sea, West of #Porbandar with 14 Pak crew & @86 Kg contraband worth approx ₹ 600Cr in… pic.twitter.com/N49LfrYLzz— Indian Coast Guard (@IndiaCoastGuard) April 28, 2024 -
ఏప్రిల్లోనే ఎండిపోయిన నది.. 25 వేల జనాభా విలవిల!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వేసవి విజృంభిస్తోంది. ఛత్తీస్గఢ్లోని రామానుజ్గంజ్ ప్రాంతంలోని 25 వేల జనాభాకు నీటిని అందించే కన్హర్ నది ఏప్రిల్లోనే ఎండిపోయింది. దీంతో నదిలో ఒక పెద్ద గొయ్యి తవ్వి అక్కడి జనాభాకు నగర పంచాయతీ నీటిని అందిస్తోంది. రామానుజ్గంజ్ ప్రాంతానికి సరిపడా తాగునీటిని అందించేందుకు జలవనరుల శాఖ కోట్లాది రూపాయలతో నదిపై ఆనకట్టను నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. అయితే అధికారుల అవినీతి కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.ఎంతకాలం ఎదురు చూసినా ఆనకట్ట నిర్మాణానికి నోచుకోకపోవడంతో రామానుజ్గంజ్వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన ఆనకట్టను తొలగించి, నూతన నిర్మాణం చేపడితేనే నగరానికి సరిపడా నీరు అందుతుందని స్థానికులు అంటున్నారు.ఈ నది ఎండిపోవడంతో స్థానికులతో పాటు ఈ నదిపై ఆధారపడిన జంతువులు, పక్షులు సైతం విలవిలలాడిపోతున్నాయి. దీనిని గుర్తించిన జిల్లా యంత్రాంగం, నగరపంచాయతీ స్థానికులకు తాగు నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
గాజాలో శిథిలాల తొలగింపునకు 14 ఏళ్లు?
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై ఏడు నెలలవుతోంది. ఈ కాలంలో ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్పై బాంబులు వేసి, ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. దీంతో ఎక్కడ చూసినా శిథిల భవనాల కుప్పలే కనిపిస్తున్నాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి మైన్ యాక్షన్ సర్వీస్ (యూఎంఎన్ఏఎస్) సీనియర్ అధికారి పిహార్ లోధమ్మర్ మీడియాతో మాట్లాడుతూ గాజా స్ట్రిప్లో శిధిలాలను తొలగించడానికి సుమారు 14 ఏళ్లు పట్టవచ్చని ప్రకటించారు. జెనీవాలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన యుద్ధం కారణంగా 37 మిలియన్ టన్నుల శిథిలాలు పేరుకుపోయాయని తెలిపారు.ఏడు నెలలుగా నిరంతర ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లోని పలు భవనాలు నేలమట్టమయ్యాయని పేర్కొన్నారు. దాడిలో ఉపయోగించిన 10 శాతం షెల్స్ పేలి ఉండకపోవచ్చని, ఇవి భవిష్యత్తులో ముప్పుగా మారవచ్చని అన్నారు. ఈ షెల్స్ భవన శిథిలాల కింద కూరుకుపోయి ఉండవచ్చని పేర్కొన్నారు. గాజా స్ట్రిప్లో ప్రతిరోజు 100 ట్రక్కుల శిథిలాలను తరలిస్తున్నారని, ఇక్కడి ప్రతి చదరపు మీటరులో దాదాపు 200 కిలోల శిధిలాలు ఉన్నాయని వివరించారు.యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యుఏ) ఒక ప్రకటనలో గాజాలో జీవన పరిస్థితులు మరింతగా క్షీణిస్తున్నాయని, రాఫా నగరంలో అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత కారణంగా ప్రజల్లో అంటు వ్యాధులు ప్రభలుతున్నాయన్నారు. ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్పై జరిపిన దాడిలో 34 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. 77 వేల మంది గాయపడ్డారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement