Sakshi News home page

నాకు ముడుపులిస్తామన్నారు: జడ్జి సంచలన వ్యాఖ్యలు

Published Mon, Jun 1 2015 1:53 PM

నాకు ముడుపులిస్తామన్నారు: జడ్జి సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణం కేసులో ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితులకు అనుకూలంగా ఉండాలంటూ కొంతమంది న్యాయవాదులు తనను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిందితుడి తరపు న్యాయవాది తనను సంప్రదించాడని,  తీర్పు అనుకూలంగా ఇస్తే ముడుపులు ఇస్తామన్నారని ఆయన తెలిపారు. ఇలాంటి మభ్యపెట్టే మాటలు మరోసారి నాదృష్టికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న.. జడ్జి వ్యాఖ్యలతో ఖంగుతిన్న న్యాయవాది, కోర్టు హాలులోనే క్షమాపణలు కోరారు. అయితే ఆ న్యాయవాది పేరుని మాత్రం జడ్జి బయటికి చెప్పలేదు.

Advertisement

What’s your opinion

Advertisement