న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బవానా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ బాణ సంచా కర్మాగారంలో శనివారం సాయంత్రం మంటలు ఎగిసిపడి 17 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో 10 మంది మహిళలు ఉన్నారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. ఊపిరాడక లేదా మంటల్లో సజీవంగా దహనమై వారు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన భవనం నుంచి 17 మృతదేహాలను వెలికితీశామని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.
సహాయక చర్యలకు 10 ఫైరింజన్లు...
బాణసంచా నిల్వ ఉంచిన గోదాములో మొదలైన మంటలు దాని పైఅంతస్తులో ఉన్న రబ్బరు ఫ్యాక్టరీలోకి విస్తరించినట్లు తెలిసింది. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. సహాయక చర్యలను ముమ్మరం చేసిన అగ్నిమాపక శాఖ సిబ్బంది కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులను బయటికి పంపించారు. ప్రస్తుతానికైతే మంటలను పూర్తిగా అదుపుచేశామని అగ్ని మాపక శాఖ అధికారులు తెలిపారు. బవానా పారిశ్రామిక ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు సాయంత్రం 6.20 గంటలకు తమకు సమాచారం అందిందని, వెంటనే సంఘటనా స్థలికి 10 ఫైరింజన్లను పంపినట్లు వెల్లడించారు.
మంటలను ఆర్పివేయడానికి సుమారు 3 గంటలు పట్టిందని పేర్కొన్నారు. ఆ భవనంలో సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, దానిపైన మరో రెండు అంతస్తులున్నాయి. సెల్లార్లో ఒక మృతదేహం, గ్రౌండ్ ఫ్లోర్లో మూడు, మొదటి అంతస్తులో 13 మృతదేహాలను కనుగొన్నట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జీసీ మిశ్రా వెల్లడించారు. మంటలు ఎగిసిపడిన సెక్టార్5 లోని ఎఫ్–83కి పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది, అంబులెన్స్లను తరలించామని, ప్రమాదానికి నిర్దిష్ట కారణం ఇంకా తెలియరాలేదని డీసీపీ రజనీశ్ గుప్తా తెలిపారు. ప్రాణాలు కాపాడుకోవడానికి రెండో అంతస్తు నుంచి దూకిన ఓ వ్యక్తి గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉత్తర ఢిల్లీ మేయర్ ప్రీతి అగర్వాల్ ప్రమాదం జరిగిన చోటును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
మోదీ, కేజ్రీవాల్ విచారం...
ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ..మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ప్రమాదంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటం దురదృష్టకరమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
17 మంది ఆహుతి
Published Sat, Jan 20 2018 8:33 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement