కేకే.నగర్: తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ప్రీతికా యాషిని(హిజ్రా) దేశంలోనే మొట్టమొదటి సబ్ఇన్స్పెక్టర్గా ఎంపికై త్వరలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించనున్నారు. ధర్మపురిలో టౌన్లో ఆమెకు పోస్టింగ్ ఖరారుచేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు శనివారం ఆమె పోస్టింగ్ ఆర్డర్స్ అందుకున్నారు.
జీవితంలో అనేక ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కుని తోటి హిజ్రాలకు ఆదర్శంగా ప్రీతికా నిలిచింది. ఆమె ఎస్ఐ పదవికోసం ఎన్నోసార్లు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎలాంటి నిరాశకు లోను కాకుండా విజయం సాధించిన ప్రితికా ఇకపై తన జీవితాన్ని సమాజం కోసం అంకితం చేస్తానని ఆనందంగా చెప్పింది.
జీవితంలో అనేక ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కుని తోటి హిజ్రాలకు ఆదర్శంగా ప్రీతికా నిలిచింది. ఆమె ఎస్ఐ పదవికోసం ఎన్నోసార్లు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎలాంటి నిరాశకు లోను కాకుండా విజయం సాధించిన ప్రితికా ఇకపై తన జీవితాన్ని సమాజం కోసం అంకితం చేస్తానని ఆనందంగా చెప్పింది.