Sakshi News home page

కవలల రిజల్ట్ చూస్తే షాక్!

Published Sat, May 13 2017 6:51 AM

మార్కుల్లోనూ అక్కాచెల్లెళ్లు కవలలే! - Sakshi

సేలం(చెన్నై): తమిళనాడులోని సేలం జిల్లా కొంగనాపురంలో కవలలైన ఇద్దరు విద్యార్థినులు ప్లస్‌ టూలో ఒకే మార్కులు సాధించి అందరినీ అశ్చర్యపరిచారు. సేలం జిల్లా కొంగనాపురానికి చెందిన శ్రీనివాసన్, శాంతి దంపతులకు కార్తీక, కీర్తిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కవలలైన వీరిద్దరు కొంగనాపురం సమీపంలోని ప్రైవేటు పాఠశాలలో ఇంటర్మీడియెట్ చదివారు. ఇటీవల పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం విడుదలైన ప్లస్‌ టూ ఫలితాల్లో వీరిద్దరు మార్కులు చూసుకున్నారు. ఇద్దరు మార్కులు చూసుకున్న తర్వాత వీరి ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. ఎందుకంటే 1,200 మార్కులకుగాను కార్తీక, కీర్తికలు సరిగ్గా 1,117 మార్కులు సాధించి కాలేజీ యాజమాన్యంతో పాటు స్నేహితులు, బంధువులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ సందర్భంగా కార్తిక, కీర్తికల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement