‘‘భగవాన్, ఇక నువ్వు మాకు లేకపోయినా ఫరవాలేదనుకుంటాను. ఎందుకంటే ఈ విషయం నీకు వదిలేయమని చెప్పగా, ‘అలా వదలను. నేను తేల్చుకుతీరాల్సిందే’ నంటున్నా డు ఈ సోదరుడు’అని నివేదించుకున్నాడు.
బాహ్యమైన పనులు చేసేప్పుడు కూడా ‘నీవెవరు’ అనే విచారణ కొనసాగించవచ్చునని ‘భగవాన్’ సలహా ఇచ్చారు. ‘భగవాన్, ఇక నువ్వు మాకు లేకపోయినా ఫరవాలేదనుకుంటా ను’ అనే స్థితికి ఒక భగవదన్వేషకుడు వచ్చాడు. ఆ సందర్భాలు చూడడం, వాటి ఆంతర్యాన్ని గమనించడం ఒక మంచి అనుభవం.
ఉన్నది విచారణే; కర్తలేడు
శ్రీమతి థార్: బాహ్యమైన పనులు చేసే ప్పుడు కూడా ‘నీవెవరు’ అనే విచారణ కొనసాగించవచ్చునని భగవాన్ సలహా ఇస్తారు. ఈ విచారణ పర్య వసానం ఆత్మసాక్షాత్కారం. అందుచేత ఉచ్ఛ్వాసనిశ్వాసలు ఆగాలి. శ్వాస ఆగిపోతే పని ఎట్లా కొనసాగుతుంది? మరోవిధంగా చెప్పాలంటే, పని చేస్తూ ఉన్నప్పుడు శ్వాస ఎలా ఆగు తుంది? రమణ మహర్షి: సాధన సాధ్యాల మధ్య గందరగోళపడుతున్నారు. విచారణ చేసే వాడెవరు? సాక్షాత్కారం కోరుతున్నవాడే కానీ, సిద్ధుడు కాడుగదా? విచారణ తన కన్నా భిన్నమైనదని అనుకుంటున్నవాడు విచారణ కర్త.
ఈ ద్వంద్వం ఉన్నంతకాలం విచారణ సాగించా ల్సిందే. ఆత్మ శాశ్వతమని కనుగొనే వరకూ, విచా రణా, విచారణకర్త, అన్నీ అందులో భాగమేనని, వ్యక్తి అనేవాడు లేనే లేడని తెలిసేవరకూ విచారణ సాగాలి. సత్యమేమిటంటే, ఆత్మనిత్యమైనటువంటిది. అది నిరంతరము ఎఱుకతోనే ఉంటుంది. విచారణ ఉద్దేశం, ఈ ఆత్మ నిజస్వభావం ‘ఎఱుక’ అని కనుగొ నడమే. ఆత్మ, ఎఱుక వేర్వేరుగా ఉన్నట్లు కనిపించి నంతవరకూ, విచారణ సలుపుతూ ఉండాల్సిందే.
దేవుడు అవసరమా?
ఒక భగవదన్వేషకుణ్ణి, మరో అన్వేషకుడు అవమాన పరిచాడు. అవమానితుడికి గుండె ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. ఒక సాధు పురుషుడి వద్దకొచ్చి జరి గిందంతా చెప్పి, ‘‘వాడు చేసిన ఈ పనికి వాడి మీద పగ సాధించి తీరతాను’’అని తన ఆగ్రహాన్ని ప్రద ర్శించాడు. మనుసును శాంతపరచుకోమనీ, జరిగిన సంఘ టనని భగవదర్పితం చేయమనీ సలహా ఇచ్చాడు సాధువు. అన్వేషకుడు ఆ మాట పట్టించుకోకుండా ‘వాడి సంగతి తేల్చుకు తీరుతాను’అన్నాడు.సాధువు లేచినుంచొని చేతులెత్తి నమస్కరిస్తూ భగవంతుణ్ణి ఇలా ప్రార్థించాడు. ‘‘భగవాన్, ఇక నువ్వు మాకు లేకపోయినా ఫరవాలేదనుకుంటాను. ఎందుకంటే ఈ విషయం నీకు వదిలేయమని చెప్పగా, ‘అలా వదలను. నేను తేల్చుకుతీరాల్సిందే’ నంటున్నా డు ఈ సోదరుడు’అని నివేదించుకున్నాడు. ఈ ప్రార్థనను వింటున్న అన్వేషకుడు తన పొర పాటు గ్రహించి, అవమానించినవాడిపై పగ విరమిం చానని సాధువుతో విన్నవించుకున్నాడు.
- నీలంరాజు లక్ష్మీప్రసాద్
Related news
-
భగవాన్ టీచరంటే ఎందుకంత ప్రేమ?
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు తిరువల్లూర్లోని వెలైగారం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు టీచర్గా పనిచేస్తున్న 28 ఏళ్ల భగవాన్ బదిలీపై మరో పాఠశాలకు వెళ్లడాన్ని తట్టుకోలేని ఆ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, ఆయన్ని వెళ్లద్దంటూ ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో తీవ్రంగా హల్చల్ చేస్తున్న విషయం తెల్సిందే. దీనిపై ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నటుడు హృతిక్ రోషన్లు, కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్లు కూడా తమదైన శైలిలో స్పందించారు. ఇలాంటి ‘గురుశిష్యుల’ అనుబంధం తానెక్కడా చూడల్లేదంటూ రెహమాన్ వ్యాఖ్యానించగా, వీరి అనుబంధం తన హృదయాన్ని ఎంతో హత్తుకుందని హృతిక్ రోషన్ వ్యాఖ్యానించారు. భగవాన్ లాంటి ఉపాధ్యాయులు తమకు ఎంతో మంది అవసరం అంటూ కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనిల్ వ్యాఖ్యానించారు. తాను ఇంతగా విద్యార్థినీ విద్యార్థులతో ఎలా అనుబంధాన్ని పెంచుకున్నారో భగవాన్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా విన్నవించారు. ‘నేను విద్యార్థులతో ఓ అనుబంధాన్ని ఏర్పరుచుకోవడంలో భాగంగా వారికి ఆసక్తికరమైన కథలను చెప్పేవాడిని. పాఠాలను కూడా అదే తరహాలో బోధించేందుకు ప్రయత్నించేవాడిని. వారి వారి కుటుంబాల నేపథ్యం గురించి విచారించే వాడిని. వారి భవిష్యత్ ప్రణాళికల గురించి గుచ్చి గుచ్చి అడిగి తెలుసుకునేవాడిని. వారి కుటుంబ నేపథ్యాలు, వారి భవిష్యత్తు కలలను దృష్టిలో పెట్టుకొని వారు భవిష్యత్తులో ఎంచుకోవాల్సిన మార్గాల గురించి సూచించే వాడిని’ అని చెప్పారు. భగవాన్ ఉదంతాన్ని పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్న రెండు ప్రధాన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భగవాన్ ఇంగ్లీషు టీచరు. అయినప్పటికీ ఆయన తప్పులు లేకుండా ఇంగ్లీషును మాట్లాడలేక పోతున్నారు. ఆయన సాదాసీదా అందరికి తెలిసిన సాధారణ పదాల్లోనే తన అభిప్రాయాలను చెబుతూ వచ్చారు. వాటిలోనూ వ్యాకరణ దోషాలు కనిపించాయి. ఆయన కూడా చదువుకున్నది ప్రస్తుత ప్రభుత్వ విద్యా విధానంలోనే కావడం వల్ల ఆయనకు కూడా భాష అంతగా అబ్బినట్లు లేదు. ఇది ప్రభుత్వ విద్యావిధానంలో ఉన్న ప్రధాన లోపాల్లో ఒకటి. ఇక రెండో లోపం కూడా విద్యార్థులతో ఆయన పెనవేసుకున్న బంధమే సూచిస్తోంది. ఏ ఉపాధ్యాయుడికైనా విద్యార్థులతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నప్పుడే విద్యారంగంలో గురుశిష్యులు రాణించగలరు. ఇలాంటి బంధాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విద్యా విధానాలు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం విద్యారంగాన్ని కూడా అన్ని ప్రభుత్వ విభాగాల్లాగే చూస్తోంది. ఉపాధ్యాయులను ఇతర విభాగాల గుమాస్తాలుగా పరిగణిస్తోంది. ఆ ధోరణి మారాలి. అవసరమైతే బదిలీ నిబంధనల్లో మార్పులు తీసుకరావాలి. వెలైగారంలో భగవాన్ టీచర్ బదిలీని ఆపాల్సిందిగా గ్రామస్థులు కూడా కోరగా అది తన చేతిలో లేదంటూ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చేతులెత్తేశారు. నచ్చిన టీచర్ను కాకుండా ఉత్తమ టీచరును రిటేన్ చేసుకునే అధికారం ప్రధానోపాధ్యాయుడికి ఉండాలి. విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే కనుక సామాజిక శాస్త్రంలో వారికి సరైన శిక్షణ ఉండాలి. విద్యార్థులకు కూడా చిన్పప్పటి నుంచే సమాజాన్ని అర్థం చేసుకునే పాఠ్యాంశాలు ఉండాలి. ఎందుకంటే భగవన్ను, విద్యార్థుల మధ్య బంధాన్ని పెంచిందీ ఈ అంశాలే. భగవాన్కు సంబంధించిన వీడియో వైరల్ కాగానే కొంత మంది సినీ నిర్మాతలు ఆయనపై సినిమా తీసేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. గురుశిష్యుల అనుబంధం గురించి చెప్పి నాలుగు డబ్బులు వెనకేసుకునే విధంగా ఆయనపై సినిమా ఉండకూడదు. ఆయన విద్యార్థులతో ఎందుకు అలాంటి అనుబంధాన్ని ఏర్పరుచుకోవాల్సి వచ్చిందో వివరణ ఉండాలి. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను పాలకుల దృష్టికి తీసుకెళ్లే విధంగానూ సినిమా ఉండాలి. -
ఆ ఉపాధ్యాయుడి నేపథ్యంపై సినిమా
పళ్లిపట్టు: ఉపాధ్యాయుడు భగవాన్పై విద్యార్థుల ప్రేమ పోరాటానికి సంబంధించి సినిమా తీసేందుకు వీలుగా సినీ డైరెక్టర్లు ఇద్దరు శుక్రవారం వెలిగరం పాఠశాల్లో భగవాన్ను కలిసి చర్చలు జరిపారు. అదే సమయంలో డీఈఓ విచారణ, తమ ఉపాధ్యాయుడిని బదిలీని నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులు విద్యాశాఖ మంత్రిని కలిసిందుకు నిర్ణయించుకోవడంతో వెలిగరం పాఠశాల్లో శుక్రవారం సైతం హడావుడి చోటుచేసుకుంది. పళ్లిపట్టు సమీపంలోని వెలిగరం పాఠశాల్లో ఆంగ్లం బీటీ టీచర్ భగవాన్ నాలుగేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఈ స్థితిలో పాఠశాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల ఉండేలా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం 35 మంది విద్యార్థులకు ఒక్క టీచర్ నిష్పత్తిలో ఉండాలి. అయితే వెలిగరం పాఠశాల్లో 280 మంది విద్యార్థులకు ప్రస్తుతం 19మంది టీచర్లు (తెలుగు మీడియం ఉపాధ్యాయులతో కలిపి) ఉన్నారు. వారిలో టీచర్ పోస్టులో ఉన్న జూనియర్లను స్థాన చలనం చేయాల్సి రావడంతో ఇద్దరు టీచర్లను వేర్వేరు పాఠశాలకు బదిలీ చేస్తూ కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగులు కేటాయించారు. అయితే భగవాన్ బదిలీ సమాచారంతో పాఠశాల విద్యార్థులు చలించి తరగతులు బహిష్కరించి ప్రేమ పోరాటం నిర్వహించిన విషయం తెలిసిందే. బదిలీ అయ్యేందుకు పాఠశాలకు వచ్చిన భగవాన్ను విద్యార్థులు చుట్టిముట్టి తమ పాఠశాలను వీడి వెళ్లరాదని బోరున విలపించడంతో విద్యార్థుల ప్రేమకు చలించిన టీచర్ సైతం విలపించారు. విద్యార్థులు గ్రామీణుల కోర్కె మేరకు కొద్ది రోజుల పాటు బదిలీ నిలిపివేస్తూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం భగవాన్ యథావిధిగా వెలిగరం పాఠశాలకు వెళ్లి విధులు నిర్వహించారు. ఈ స్థితిలో ఉదయం పది గంటల సమయంలో చెన్నైకు చెందిన సినిమా డైరెక్టర్లు ఇద్దరూ పాఠశాలకు వెళ్లి భగవాన్కు కలుసుకుని విద్యార్థులు, టీచర్ అనుబంధం మీద సినిమా తెరకెక్కించడంపై మంతనాలు జరిపారు. అదే సమయంలో పాఠశాలకు చేరుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి అరుల్సెల్వం ప్రధానోపాధ్యాయులు అరవింద్ సహా 18 మంది ఉపాధ్యయులతో సంఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు. విచారణ వివరాలను జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారికి సమర్పించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అదే సమయంలో మరో వారంలో భగవాన్ను మరో పాఠశాలకు బదిలీ చేయనుండడంతో, బదిలీని నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులు విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ డైరెక్టర్ను కలిసి వేడుకోవాలని నిర్ణయించారు. -
పోలీసుల మధ్య ఘర్షణ: ఎస్సైకి తీవ్రగాయాలు
విశాఖపట్నం : విశాఖపట్నం నగరంలో సీతమ్మధార తహశీల్దార్ కార్యాలయంలో ఇద్దరు పోలీసుల మధ్య గురువారం రాత్రి జరిగిన ఘర్షణలో ఓ ఎస్సైకు తీవ్ర గాయాలయ్యాయి. నగరంలో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భగవాన్తో కానిస్టేబుల్ అమ్మోరు డ్యూటీ విషయమై వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో ఇరువురు పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. కానిస్టేబుల్ అమ్మోరు తనను వెపన్తో కొట్టి గాయపరిచాడని ఎస్ఐ ఆరోపించాడు. అలాగే ఎస్ఐ భగవాన్ తనను కులం పేరుతో దూషించడమే కాకుండా తరచు వేధించాడని కానిస్టేబుల్ ఆరోపించాడు. అయితే అమ్మోరును నాలుగో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాయాలపాలైన ఎస్ఐ భగవాన్ను స్థానిక ఆసుపత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నారు. -
సర్వజ్ఞుడి తీర్పే మేలు
సాధ పురుషుడొకడు, ఓ సందులో, ఇళ్ల మధ్య నడిచి వెళ్తుంటే, ఎవరో పొయ్యి లోని బూడిద ఓ తట్టలోకి తీసి బయట పడేశారు. అది అతడి తల మీద పడింది. అందుకు సాధువు విచిత్రంగా స్పందించాడు. చేతులు జోడించి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ‘‘నిన్నేమని పొగడను దేవా! బూడిదకాక ముందు, ఆ పొయ్యిలో మండే బొగ్గులు నా తల మీద కుమ్మరించినా, చేసిన పాపాలకు అందుకు నేను అర్హుణ్నే. కానీ నీ అపారమైన దయ మూలంగా, అంతటి శిక్షను తగ్గించి, నిప్పులు బదులు, నేను ఓర్చుకోగలిగిన ఈ చల్లటి బూడిద పడేయించావు’’ అని విన్నవించుకున్నాడు. సాధుపురుషుడైనవాడే తాను ఒకప్పుడు - అది నిన్నగానీ, నిరుటేడు గానీ, ఈ జన్మలో గానీ, మరే జన్మలో గానీ - చేసిన కర్మకు ఫలితమునుభవిం చక తప్పదని తెలుసుకొని బ్రతుకుతుంటాడు. వర్తమా నంలో తానేదైనా ఇక్కట్టుకు గురైతే అది పూర్వజన్మ ఫలిత మని గ్రహించి, ఈ ఇక్కట్టును గానీ, దీనిని తనపై విధించిన విధాతను గానీ నిందించ కుండా, సంపూర్ణ సమ్మతితో అనుభవిస్తాడు. ఈ తెలివి లేనివాడు, ఈ కార్య కారణ సంబంధమెరుగనివాడు, ఆక్రోశపడుతూ దీని నుండి తప్పించుకోవడానికి పలు విఫలయత్నాలు చేసి అనుభవిస్తాడు. అనుభవమనేది ఇద్దరి విషయంలోనూ సమానమే. కానీ తెలివిగలవాడు ‘ప్రతిక్రియా’ భావం లేకుండా విధికి తల ఒగ్గాడు కాబట్టి, విధితో సహక రిస్తున్నాడు. కాబట్టి అతడి బాధ కాస్త ఉపశమిస్తుంది. తేలిగ్గా ఆ అనుభవం వెళ్లిపోతుంది. రెండోవానికి ఆ తెలివి, ఆ ఎరుక లేవు కాబట్టి ప్రతిక్రియా భావంతో పెనుగులాడి అనుభ వాన్ని మరింత కఠినంగా చేసు కుంటాడు. అవగాహన లేని మానవుడు రోదిస్తాడు. విసు గును ప్రదర్శిస్తాడు. కొత్త పాపం చేయకూడదనే గుణ పాఠం నేర్చుకోడు. జన్మ పరంపర కొనసాగుతుంది. ఎదురుగా ఉన్న వాస్తవం ‘భగవంతుడు’ అని అనుకుంటే (ట్రూత్ రియాలిటీ) ఈ ఎదురుగా ఉన్నది భగవదేచ్ఛ ప్రకారమే జరుగుతున్నదనుకోవాలి. భగవంతుడు సృష్టిస్తున్న కోటానుకోట్ల జీవరాశిలో మనం ఒకరం. మనం ఒకప్పుడు చేసిన కర్మలకి ఎలాంటి ఫలితమనుభవిం చాలో అతడికి తెలిసినంతగా మనకు తెలియదు. నీకు విధాయకంగా ఏది మేలు చేస్తుందో, దీర్ఘకాల భవి ష్యత్తును దృష్టిలో ఉంచుకొని దానినే విధి నిర్వర్తిస్తున్నది. ఇది నమ్మితే నీ సమస్య పరిష్కారమవుతుంది. నువ్వు నమ్మకపోయినా, జరిగేది అంతే జరుగుతుంది. నమ్మని వారు అంతఃసంఘర్షణ పడుతూ శక్తిని కోల్పోతుంటారు. ఎంతగట్టిగా అనుకున్నప్పటికీ ‘ఇదేమేలని’ ఖాయంగా చెప్పగలిగేది లేదు. మనకా సర్వజ్ఞత్వమెలావుంటుంది! ఆ సర్వజ్ఞుడికి తెలిసి ఉండవచ్చు. మన పరిమితమైన జ్ఞానాన్ని విశ్వసించడం బదులు, ఆ సర్వజ్ఞుడి తీర్పును శిరసావహించడం శ్రేయోదాయకమవచ్చు. - నీలంరాజు లక్ష్మీప్రసాద్
Related News by category
-
టెంక కాదు, టెక్నాలజీ ముఖ్యం
మామిడికాయ పచ్చళ్లకి సమయం ముంచు కొచ్చేసింది. తల్లులారా! మీరు టెక్నాలజీని వాడండి. నా మాట వినండి. ప్రపంచంలోనే మొదటిసారి మ్యాంగో పికిల్ యాప్ని ప్రారం భించనున్నారు. ఎందుకంటే ఇది మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు జాడీ. మన తెలుగింట ఆడపడుచులకు ఆవకాయల తయారీ కొట్టిన పిండి. దంచేయడం, పొడి చేయడం మన విద్య.ఈ సీజన్లో ఏపీలో కొన్ని వందల మెట్రిక్ టన్నుల మామిడి నిల్వ పచ్చళ్లని అమ్మలక్కలు జాడీలకెత్తుతారు. వీటి పాళాలు ఇంటికో తీరున, ఊరికో లెక్కన ఉంటాయ్. మన ఊళ్లలో ఆవకాయ పెద్దమ్మలు, మాగాయ మామ్మలు ఉంటారు. వాళ్లు మన ప్రాచీన ఋషుల్లా వారి అనుభవాలని క్రోడీకరించి ఫార్ము లాని ప్రచారంలోకి తెస్తారు. నమ్మిన వాళ్లు ఆచరిస్తారు. నమ్మనివాళ్లు నాస్తి కుల్లా మిగులుతారు.ఇందులో బ్రహ్మ విద్యలో ఉన్నట్లు రకరకాల వాదాలున్నాయ్. కొందరు టెంకవాదులు, మరికొందరు కండవాదులు, ఇంకొందరు టెంకండ వాదులు. అంటే రెండూ ముఖ్యమేనని విశ్వసించేవారు. పచ్చళ్లలో గ్లామర్ చింతకాయకి, గోంగూరకి లేదు. ఇది.బూర్జువా అభిరుచిగా అతి వాదులు ఆక్షేపిస్తూ ఉంటారు. ఆవకాయలో సామాజిక స్పృహమీద చర్చించడం ఆత్మలోకంలో దివాలా. కత్తిపీటల్లో ఆవకాయ కత్తిపీటలు వేరు. వూరికి రెండో మూడో ఉండేవి. ముందుగా వాటిని బుక్ చేసుకుని, తర్వాత కాయ తెచ్చు కునేవారు. ఆవకాయ ముక్క కొట్టడం ఒక విల క్షణమైన కళ. ఇది పరుష విద్య. కాయకే కాదు. ఈ పనికీ కండపుష్టి అవసరం. ప్రతి ముక్కకి అంతో ఇంతో టెంక పెచ్చు మనిషికి తత్వజ్ఞానంలా అతుక్కుని ఉండాలని శాస్త్రకారులు ఘోషిస్తున్నారు. అరిస్టాటిల్ హయాంలోనే ఈ ఆవకాయ సంప్రదాయం ఉన్నట్లు గ్రీక్ గ్రంథాలను జాగ్ర త్తగా పరిశీలిస్తే అవగతమవుతుంది. భాగవత పురాణంలో పోతన గోపాలకులు చద్దులారగించు వేళ మాగాయలాంటి నంజుళ్లని ఇష్టంగా తిన్నట్టు పేర్కొన్నారు. ఒక తెగ తెలుగువారు నూజివీడు చిన్న రసాలు, పెద్ద రసాలు ఆవకాయకి పెట్టింది పేరంటారు. ‘‘పీచు కావాలంటే హలో! నూజి వీడు రసాలకే చలో’’ అనే నినాదం ప్రచారంలో ఉంది. ప్రతి ఇంటా కారాలూ ఆవాలూ నూరే తరుణం ఇది. దినుసుల మీద కావల్సినంత గోష్టి నడుస్తుంది. ఈ రెండు నెలల్లోనే ఆవాలు, కారాలు, నూనెలు మీద జరిగే చర్చలకిగాను మొత్తంమీద రెండొం దల కోట్ల సెల్ బిల్ కాల్తుందని ఓ అంచనా. ఏ జిల్లా సంప్రదాయం ఆ జిల్లాదే. ఇప్పుడు చంద్రబాబు పూనుకుని, అందర్నీ ఓ జాడీ కిందికి తీసుకొచ్చి, అమరావతి ఆవకాయలుగా స్థిరీకరిస్తే బావుంటుందనిపిస్తోంది. ఈ వేసవిలో విదేశాలకు పంపే మామిడి పచ్చళ్లకి ప్రత్యేక కౌంటర్లు వెలుస్తాయ్. ఇండియాలో పెద్ద దిక్కు లేని వారికి, మేమున్నామంటూ కొన్ని సంస్థలు వచ్చాయ్. అన్నీ వాళ్లే చూస్తారు, ఎటొచ్చీ మనం డబ్బు చూడాలి. ఈ సీజన్లో అట్లాంటా నించి న్యూజెర్సీ నించీ, అమ్మా! హాయ్... సూపర్బ్, టిపికల్, వావ్ అంటూ లొట్టలు విని పించి, లక్షలాది తెలుగు ఇళ్లలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. దీనికి ఇంత సత్తా ఉందని తెలిస్తే, చంద్రబాబు ఊరుకోడు. ఓ ఉచిత సలహా కేంద్రం, పంపడానికి ఓ సేవా కేంద్రం స్వయంగా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించే అవకాశం ఉంది. ఆయనకి టెంక కంటే టెక్నాలజీయే ముఖ్యం! వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
సెప్టెంబర్ 17ను పండుగలా జరిపే రోజొస్తుంది!
సందర్భం తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబర్ 17న సంబరాలు అవసరం లేదని కేసీఆర్, ఆయన పార్టీ ఎంత ఘోషించినా ఆ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న డిమాండుకు తెలంగాణ యువత ముక్త కంఠంతో మద్దతు తెలిపింది. ఆ రోజున తెలంగాణలోని పట్టణాలు, పల్లెల్లోని ప్రతి వీధిలో మువ్వన్నెల జెండాలు ఎగురుతాయి. హైదరాబాద్ సంస్థాన విమోచన పోరు అంతగా పట్టించుకోదగినది కాదా? ఆ ఘట్టాన్ని ఒక రాజ్యవిలీనంగా, అధికార మార్పిడిలా మాత్రమే చూడాలా? ప్రాణాలు విడిచిన వేలాది మంది యోధుల త్యాగం గురించి మాట్లాడుకోవద్దా? రజాకార్ మూకలు చెరిచిన అసంఖ్యాక ఆడబిడ్డలకు జరిగిన అవమానం కూడా తేలికగా తీసుకోదగినదేనా? అధికారం కోసం ఏదైనా మాట్లాడొచ్చు, నాలుకను ఎన్నిసార్లు మడతవేసినా తప్పులేదనుకునే తెలంగాణ నయా నిజాం కేసీఆర్ చెబుతున్నదిదే. ఆయన పార్టీ నేతలు, మంత్రులు, సామంతులు నిజాంకు వ్యతిరేకంగా జరిగిన మహోజ్వల పోరును చిన్నదిగా చేసి చూపడాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకం గమనిస్తూనే ఉంది. ముందుతరం గోస గుర్తు చేసుకోదగిన చరిత్రే కాదంటున్న కేసీఆర్ ఎందుకలా అంటున్నారో తెలుసుకోలేని అమాయకులేం కాదు ప్రజలు. భారతదేశం బ్రిటిష్ పాలననుంచి స్వాతంత్య్రం పొందిన ఏడాదిదాకా ఇక్కడి భూభాగం ఎవరి పాలనలో ఉంది? సెప్టెంబర్ 17న విముక్తి పొందే దాక 13 నెలల పాటు తెలంగాణలో జరిగిన నరమేధం తేలికగా మర్చిపోగలిగేదేనా? మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (MఐM) మత సంస్థ పేరుతో ఖాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల సేన సాగించిన ఊచకోతల గాథలను తెలంగాణ లోని ప్రతి పల్లె జ్ఞాపకం పెట్టుకుంది. నాడు రజ్వీని ఉసిగొల్పిన నిజాంకు, నేడు ఒవైసీ కోసం తెలంగాణ చరిత్రనే మర్చిపోమంటున్న కేసీఆర్కు మధ్య ఎంత సారూప్యం ఉందో చూస్తున్నాం. అందుకే ఆయనను నయా నిజాం అనాల్సి వస్తోంది. ‘భారత్కు స్వాతంత్య్రం వస్తే ఏమిటి...నేను పాకిస్తాన్లో భాగంగా ఉంటా...లేదా హైదరాబాద్ దక్కన్ స్వతంత్ర దేశంగా కొనసాగుతుంది. మెజారిటీ ప్రజలు హిందువులు కావచ్చు...వాళ్లు భారత్లో కలవాలంటే నేను విలీనం చేయాలా? తిరుగుబాటు చేసే వారిని మా మిలటరీ, రజాకార్లు చూసుకుంటారు’, ఆగస్టు 15, 1947న యావద్దేశం స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటున్న వేళ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన సంస్థానంలోని ప్రముఖ్లతో అన్న పొగరుబోతు మాట లివి. మువ్వన్నెల జెండా ఎగరేసిన వారిని రజాకార్లు పిట్టల్లా కాల్చి చంపారు. లూటీలు, ఇళ్లు, ఆస్తుల దహనాలు, ఆడవాళ్లను చెరచడం, వివస్త్రలను చేసి బతుకమ్మలు ఆడిపించడం... సంస్థానమంతా ఒక అగ్నిగుండమైంది. తూర్పు పాకిస్తాన్ లాగా, దక్షిణ పాకిస్తాన్గా హైదరాబాద్ దక్కన్ను గుర్తించాలంటూ ఆఖరి గవర్నర్ జనరల్తో రాయబారాలు నడుపుతూనే, ఐక్య రాజ్య సమితికి వినతి పత్రాలు పంపించిన నక్క జిత్తుల నిజాం, ఆనాడు పన్నని కుయుక్తులు లేవు. కనీసం ప్రజా తిరుగుబాటు రాకుండా చూసుకుంటే భారత రిపబ్లిక్ నుంచి తనకు తక్షణ ముప్పు ఉండదని మిలటరీ, రజాకార్లను వదిలి పెట్టాడు. కోటి యాభైæ లక్షల మందిలో 13 శాతం మంది తన వాళ్లు తప్ప స్వాతంత్య్ర కాంక్షతో రగిలిన ప్రజలు నిజాం వదిలిన ముష్కరులకు భయపడకుండా ప్రాణాలకు తెగించి పోరాడేందుకు సిద్ధమయ్యారు. 1947 ఆగస్టు 15 తర్వాత విలీనమైన సంస్థానాల్లో ఎక్కడా ఇంత హింస, తిరుగుబాట్లు లేవు. పాలకులు ప్రజల ఆకాంక్షను మన్నించి రిపబ్లిక్లో కలపడానికి సిద్ధపడ్డారు. మరి నైజాం రాజు నేటి తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు వీరందరికి మించిన గొప్ప మానవతావాది ఎలా అయ్యోడో అర్థంకాదు. అధికారంలోకి రాకముందు విమోచన దినం జరపాలని డిమాండ్ చేసి, ఇప్పుడు ఈ సన్నాయి నొక్కులు ఎందుకు? నిజాం వార్షికాదాయం రూ. రెండున్నర కోట్లు. వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం నిల్వలు, అరుదైన వస్తువుల లెక్క ఎవరికీ తెలియదు. 50 లక్షల ఎకరాల భూమి ఆయన సొంతం. ఇది మొత్తం సంస్థానం భూమిలో పది శాతం. నిజాంకు ఏజెంట్లుగా ఉన్న దేశ్ముఖ్లు, ఆయన తాబేదారులు 1,100 మంది చేతిలో 30 శాతం సేద్యపు భూమి ఉంది. సంస్థానంలో 40 లక్షల మంది కౌలుదారులే. వారికి గుంట భూమి కూడా లేదు. నిజాం సంస్థానంలో అక్షరాస్యత 9 శాతమే. అది కూడా మెజారిటీ హిందువుల మాతృభాష తెలుగులో చదువుకునే వీలే లేదు. నిజాంసాగర్, డిండీ, మూసీ ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిర్మించడం వెనుక ప్రజా సంక్షేమం కన్నా నిజాం స్వార్థమే ఎక్కువ. కృష్ణా, తుంగభద్ర, గోదావరి నదులు హైదరాబాద్ సంస్థానంలో నుంచే ప్రవహించినా వాటిపై పెద్ద డ్యాములు, బ్యారేజీలు నిర్మించే ప్రయత్నం జరగలేదు. వీటిని కట్టాలంటే సిమెంటు, ఉక్కు అవసరం. ఖజానాలోని పైకం ఖర్చవుతుంది. అందుకే అణా, కాణీ ఇచ్చి బలవంతపు కూలితో పూర్తి చేయగలిగే మట్టికట్టలనే నిర్మించారు. సంవత్సరంలో నెలకు పైగా రాజు నిర్మించే రోడ్లు, చెరువు కట్టల నిర్మాణాలకు ‘బేగార్’పేరుతో ఉచితంగా కూలీ చేయాలి. మొత్తం మీద నిజాం పాలనలో ప్రజలు తమ ఇళ్లు, గ్రామాలు అనే బహిరంగ జైలులో ఉన్నట్టే ఉండేది. పండగలు చేసుకోవాలన్నా, పెళ్లి, మరే శుభ కార్యం చేసుకోవాలన్నా రుసుం చెల్లించాల్సిందే. ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. రెండొందల ఏళ్ల అసఫ్ జాహి, నిజాం పాలకుల పీడనలో హైదరాబాద్ సంస్థానం ప్రజల జన్యుపటమే మారిపోయింది. సర్కారు కొలువు దొరికితే తప్ప గౌరవంగా బతకలేని స్థితి. వ్యవసాయం చేసేవారు, కూలీ పనులతో బతుకీడ్చే వారు దుర్భర దారిద్య్రంలో కొట్టు మిట్టాడుతూ దినదిన గండంగా బతికేవారు. బానిసత్వంలో మగ్గేవారు దేని గురించి ఆలోచించలేని శూన్య స్థితిలో ఉంటారు. ఇది భౌతిక హింస కంటే దారుణమైనది. ఇక్కడి ప్రజలు వ్యవసాయం, వ్యాపార గుణాలను ఇంకొకరి నుంచి నేర్చు కోవాల్సిన అవశ్యకతను కల్పించింది. వజ్రాలు, బొగ్గు ఖనిజాలు అపారంగా దొరికే చోట ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి గోస కనిపించదు. మూడు పూటలా తిండి దొరకని, ఒంటి నిండా గుడ్డలు కప్పుకోలేని దయనీయ స్థితి. 86శాతం మంది హిందువులు మైనారిటీలుగా మనుగడ సాగించిన ఘోరం. 13 శాతం మంది ముస్లిములదే ఆధిపత్యం. తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబర్ 17న సంబరాలు అవసరం లేదని కేసీఆర్, ఆయన పార్టీ ఎంత ఘోషించినా ఆ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న డిమాండుకు తెలంగాణ యువత ముక్త కంఠంతో మద్దతు తెలిపింది. ఆ రోజున తెలంగాణలోని పట్టణాలు, పల్లెల్లోని ప్రతి వీధిలో మువ్వన్నెల జెండాలు ఎగురుతాయి. దీన్ని ఎవరూ ఆపలేరు. మీరు బతుకమ్మను జరుపుకోవడానికి ప్రభుత్వ నిధులు కేటాయించనపుడు, అధికారిక ఉత్సవంగా ప్రకటించకపోయినా ఆ పండుగను ప్రజలు జరుపుకోలేదా? ఇది ఐదేళ్లు పాలించడానికి ఎన్నికైన ప్రభుత్వాలు నిర్ణయిస్తే తప్ప జరగాల్సిన పర్వదినమేమీ కాదు. కాకపోతే ఆరోజు అన్న మాటలు ఇప్పుడెందుకు మర్చిపోయారని మాత్రమే అడుగుతున్నాం. ముందు తరాల వాళ్లు సెప్టెంబర్ 17 విముక్తి దినాన్ని ఒక దసరాలా, దీపావళిలా జరుపుకుంటారు. వ్యాసకర్త బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్ రెడ్డి మొబైల్ : 99490 99997 -
విద్యార్థులే ‘విమోచన’ సేనానులు
సందర్భం నిజాం నుంచి విముక్తి పొంది ఇండియన్ యూనియన్లో విలీనమయ్యే దిశగా సాగిన హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటంలో 1948వ సంవత్సరం అత్యంత విషాదకరమైన కాలం. భారత్ 1947 ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్య్రం పొందినప్పటికీ హైదరాబాద్ సంస్థానం మాత్రం ఇండియన్ యూనియన్ నుంచి స్వతంత్రంగా ఉండాలని భావించడంతో నిజాం నియంతృత్వ పాలనలోనే మగ్గుతుండేది. దీంతో నిజాం వ్యతిరేక పోరాటం మరింత విస్తృతి పొందింది. ఈ కాలం లోనే ప్రభుత్వాన్నే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్న చట్ట వ్యతిరేక మతోన్మాదుల కారణంగా సంస్థానంలో హింసాత్మకమైన, అసహనంతో కూడిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఆనాడు ప్రజలు ఈ ద్వంద్వపాలనను ఒక విచిత్ర పరిస్థితిలా చెప్పుకునేవారు. పగటిపూట ప్రభుత్వ పోలీసులు, ఎమ్ఐఎమ్ పాలన సాగుతుండగా, రాత్రిపూట మాత్రం కమ్యూనిస్టు పాలన సాగేది. ఈ అరాచక స్థితిలో బూర్గుల రామకృష్ణారావు, చెన్నారెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను నిబ్బరంగా ఎదుర్కోవాలంటూ ధైర్యం నూరిపోసేవారు. దీంతో మంచి రోజులు మరెంతో దూరంగా లేవని ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలి గింది. ఈ కాలంలోనే ప్రజల ప్రాణాలను, ఆత్మగౌరవాన్ని కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా న్యాయవాదులు కోర్టులను బహిష్కరించాల్సిందిగా స్టేట్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ప్రభుత్వం స్తంభించిపోయేలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలూ నిరసన తెలపాలని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సార్వత్రిక పిలుపునిచ్చింది. స్వాతంత్య్రోద్యమంలో విద్యార్థుల భాగస్వామ్యం కోసం ఈ రచయిత అధ్యక్షతనే విద్యార్థి కార్యాచరణ కమిటీ ఏర్పడింది. కళాశాలలను బాయ్కాట్ చేయాలని కోరుతూ హైదరాబాద్ స్టూడెంట్స్ కాంగ్రెస్ విద్యార్థులకు పిలుపునిచ్చింది. దీంతో దాదాపు 20 వేలమంది విద్యార్థులు కాలేజీలను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో స్టేట్ కాంగ్రెస్ నేషనల్ ఫ్లాగ్స్ పిలుపు మేరకు హైదరాబాద్ స్టూడెంట్స్ కాంగ్రెస్ 1948 ఆగస్టు 15న పతాకావిష్కరణ దినోత్సవాన్ని పాటించింది. పలు ప్రాంతాల్లో ప్రత్యేకించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భవనాలపై పతాకావిష్కరణ చేశారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో పతాకావిష్కరణ తర్వాత విశ్వవిద్యాలయం నుంచి, నిజాం కాలేజీతోపాటు ఇతర కాలేజీలనుంచి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిజాం కాలేజీలో ఈ రచయిత నేతృత్వంలో ఒక ప్రదర్శన జరిగింది. తర్వాత వివేక వర్ధిని నుంచి మరొక విద్యార్థి ప్రదర్శనపై పోలీసులు దాడి చేసి కాల్పులు జరపడంతో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. ఆ సాయంత్రం భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్ కేఎం మున్షీ పతాకావిష్కరణ కార్యక్రమానికి ప్రజలను, నాయకులను ఆహ్వానించారు. నేనూ, సంగం లక్ష్మీబాయి (తదనంతర కాలంలో మంత్రి అయ్యారు), ఇతర స్టేట్ యూత్ కాంగ్రెస్ నేతలు ఆ ఉత్సవంలో పాల్గొనడానికి వెళుతుండగా రజాకార్లు దాడి చేశారు. నా తలలోంచి రక్తం కారింది. అలాగే దక్షిణ సదన్ వెళ్లి పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాను. హాజరవుతున్న విద్యార్థులపై రజాకార్ల పాశవిక దాడిని కేఎం మున్షీ గర్హించారు. హైదరాబాద్ నిజాం భారత యూనియన్కు విధేయత ప్రకటించి సంస్థానాన్ని విలీనం చేశారు. అయితే నాటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్తో సుదీర్ఘ చర్చలు, భారత ప్రభుత్వ హోం శాఖతో సంప్రదింపులు జరిపాక, పోలీసు యాక్షన్ చేపట్టిన తర్వాతే నిజాం లొంగిపోయారు. హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వ బలగాలు 1948 సెప్టెంబర్ 3 వేకువజామున త్రిముఖ దాడి తలపెట్టాయి. కేంద్ర ప్రభుత్వ సైనిక బలగాలు సెప్టెంబర్ 17నాటికి హైదరాబాద్ చేరుకున్నాయి. స్వల్పమాత్రపు పసలేని ప్రతిఘటన తర్వాత నిజాం బలగాలు భారత సైన్యం ముందు లొంగిపోయాయి. తర్వాత మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నేతృత్వంలో సైనిక ప్రభుత్వం ఏర్పడింది. ఏడవ నిజాం నవాబ్ సర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ తాత్కాలికంగా హైదరాబాద్ రాజప్రముఖ్గా నియమితులయ్యారు. విమోచన పోరాట కాలంలో నేను హైదరాబాద్ స్టేట్ స్టూడెంట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అఖిల భారత విద్యార్థి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాను. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాను. కాంగ్రెస్, సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీ భేదాలు లేకుండా విద్యార్థులు హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించారు. గత కొన్నేళ్లుగా తెలంగాణ స్వతంత్ర సేనాని సమితి, ప్రీడమ్ ఫైటర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షుడిగా ఉంటూ ఇతర స్వాతంత్య్ర సమర వీరులతో కలిసి కోఠి బస్టాండ్, అమరవీరుల స్మారక స్థూపం వద్ద స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను నిర్వహిస్తున్నాను. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాము. నాటి హైదరాబాద్ విమోచన పోరాటంలో పాలుపంచుకున్న స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్ధం తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివాళి పలకటం సముచితంగా ఉంటుంది. వ్యాసకర్త అధ్యక్షుడు, తెలంగాణ స్వతంత్ర సేనాని సమితి, ఏపీపీఎస్సీ మాజీ సభ్యులు డాక్టర్ బాబూ రావ్ వర్మ మొబైల్ : 99637 07461 -
ఇది విలీనదినమే!
త్రికాలమ్ ఈరోజు తెలంగాణ చరిత్రలో అత్యంత ముఖ్యమైనది. సరిగ్గా 69 సంవత్సరాల కిందట హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన రోజు. విలీ నానికి ఒప్పుకోనంటూ హఠం చేసి స్వాతంత్య్రం ప్రకటించుకొని ఐక్యరాజ్య సమితి గడప ఎక్కిన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మెడలు వంచి భారత్లో అంతర్భాగం కావడానికి ఒప్పించిన సందర్భం. దీనిని విమోచన దినంగా జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోరుతున్నది. కాదు, విద్రోహదినంగా పరిగణిస్తామని మజ్లీస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ప్రకటించింది. విలీనదినంగా పాటిస్తే బాగుంటుందని సాధారణ ప్రజల అభిప్రాయం. ఇంతకీ నాడు జరిగింది విలీనమా, విద్రోహమా, విమోచనా? చరిత్రను అన్వయించేవారికి స్వప్రయోజనాలు ప్రధానం. వారి దృష్టికోణం నుంచే పరిణామాలను అర్థం చేసుకుంటారు. వారి లక్ష్యాలకు అనుగుణంగానే అన్వయిస్తారు. భాష్యం చెబుతారు. హైదరాబాద్ సంస్థానం విముక్తికి ప్రధాన కారకుడిగా నాటి ఉపప్రధాని, దేశీయాంగమంత్రి సర్దార్ పటేల్ను బీజేపీ కీర్తిస్తుంది. హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాలను ఇండియన్ యూనియన్లో విలీనం చేసే బాధ్యతను ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉపప్రధానికి అప్పగించారు. ఆ పని సర్దార్ సమర్థంగా చేశారు. విలీనానికి ససేమిరా అన్న మూడో సంస్థానం జమ్మూ–కశ్మీర్ వ్యవహారంలో నెహ్రూ జోక్యం చేసుకున్నాడు. తన పూర్వీకులు నివసించిన కశ్మీర్ను పాకిస్తాన్కు పోకుండా కాపాడుకోవాలన్న తాపత్రయం ఒకవైపూ, సిసలైన ప్రజాస్వామ్యవాదిగా తనకున్న అంతర్జాతీయ ప్రతిష్ఠకు భంగం కలగకుండా చూసుకోవాలన్న అభిలాష మరోవైపూ లాగి నెహ్రూని ఇబ్బంది పెట్టినమాట వాస్తవం. నెహ్రూ డోలాయమాన వైఖరి కారణంగా జమ్మూ–కశ్మీర్ వివాదం తెగకుండా ముడిపడకుండా దశాబ్దాలు గడిచిపోవడం, పాకిస్తాన్తో యుద్ధాలు చేయవలసిరావడం కూడా నిజమే. నెహ్రూ, షేక్ అబ్దుల్లాల పట్టింపు లేకపోతే 1947–48 లోనే కశ్మీర్ పాకిస్తాన్లో విలీనమయ్యేది. ఈ నేపథ్యంలో కశ్మీర్ సంక్షోభానికి నెహ్రూను నిందించడం బీజేపీ విధానం. మొత్తం 560 సంస్థానాలను స్వతంత్ర భారతంలో విలీనం చేసింది నెహ్రూ, పటేల్ అనేది చరిత్ర. పీవీ నరసింహారావుకు కీర్తి దక్కడం ఇష్టంలేని సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ నాయకులు 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన దార్శనికుడు నాటి ఆర్థికమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ అంటూ కీర్తించి తరిస్తున్నారు. మన్మోహన్సింగ్ను ఆర్థికమంత్రిగా నియమించిందీ, ఆర్థిక సంస్కరణలు అమలు జరపాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నదీ, ప్రతిపక్షాల విమర్శలకు తాళలేక రెండు విడతల రాజీనామా చేసిన మన్మోహన్ను అనునయించి నచ్చజెప్పిందీ, పరిశ్రమల శాఖను తన చెంతనే పెట్టుకొని విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానాన్ని ఒకేరోజు ఏకబిగిన సహాయ మంత్రి కురియన్ (ప్రస్తుత రాజ్యసభ ఉపాధ్యక్షుడు) చేత ప్రకటింపజేసిందీ పీవీ అనే విషయం కాంగ్రెస్ నాయకులు తెలిసినా చెప్పరు. మన్మోహన్ పీవీ నమ్మిన బంటుగా ఆర్థిక సంస్కరణలను మనస్ఫూర్తిగా అమలు చేసిన అమాత్యుడు అనడంలో ఎవరికీ సందేహం అక్కరలేదు. కాంగ్రె స్కి పీవీపైన ఉన్న ద్వేషం కంటే నెహ్రూపైన నేటి తరం బీజేపీకి గల ద్వేషం అధికం. అందుకే హైదరాబాద్ విముక్తికి సర్దార్ పటేల్ మాత్రమే కారణమని బీజేపీ వాదిస్తుంది. నెహ్రూ సమ్మతించి, సహకరించకపోతే పటేల్ లక్ష్యం నెరవేరేది కాదనేది వేరే విషయం. పైగా ఎన్ని విభేదాలు ఉన్నా అంతిమ శ్వాస వరకూ పటేల్ నెహ్రూతో స్నేహంగా ఉండేవారు. పరస్పరం గౌరవించుకునేవారు. గాంధీజీకి ఇద్దరూ రెండు కళ్ళుగా ఉండేవారు. వెలుగు చూడని హైదరాబాద్ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన పదమూడు నెలల వరకూ హైదరాబాద్లో నిజాం పాలనే కొనసాగింది. అంతకాలం నిజాం ధిక్కారం ప్రదర్శించాడు. ప్రైవేటు సైన్యంగా రజాకార్లను పెంచి పోషించాడు. దేశ్ముఖ్లనూ, భూస్వాములనూ కూడగట్టుకున్నాడు. భారతదేశంలో విలీనం కాబోనంటూ స్వతంత్రం ప్రకటించుకున్నాడు. పాకిస్తాన్ అధినేత మహమ్మదలీ జిన్నాతో రాయబారం నెరపాడు. ఐక్యరాజ్య సమితిలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు పెట్టాడు. ఇంత చేసిన నిజాంను లొంగిపోయిన తర్వాత బుట్టదాఖలు చేయకుండా ‘రాజ్ప్రముఖ్’ పదవి ఇచ్చి ఎందుకు గౌరవించారు? నిజాం కబంధ హస్తాలనుంచి హైదరాబాద్ ప్రజలకు విముక్తి కల్పించామని నెహ్రూ, పటేల్ భావించి ఉంటే విమోచన దినోత్సవాలు నిర్వహించేవారే. కానీ వారు ఆ విధంగా భావించలేదు. అన్ని సంస్థానాల పూర్వాధిపతులనూ సగౌరవంగా సాగనంపి వారి హోదాకు భంగం లేకుండా హంగులూ, నిధులూ ఏర్పాటు చేయడం నాటి ప్రభుత్వ విధానం. అదే విధంగా నిజాంకూ మర్యాదలు జరిగాయి. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఖాసీం రజ్వీని దేశం వదిలి వెళ్ళనిచ్చారు. ఘర్షణ వాతావరణం లేకుండా శాంతియుతంగా ప్రగతి యజ్ఞానికి శ్రీకారం చుట్టాలన్న సంకల్పం వారిది. అందుకే హైదరాబాద్ రాష్ట్రంలోని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం కానీ 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత సంజీవరెడ్డి, తదితర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్టి రామారావు, చంద్రబాబునాయుడు కానీ సెప్టెంబర్ 17న సంబరాలు జరుపుకోలేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రత్యేక తెలంగాణ ఉద్యమనాయకుడిగా ప్రతి సంవత్సరం ఈ ప్రస్తావన చేసేవారు. సెప్టెంబర్ 17 నాడు కర్ణాటక, మహారాష్ట్రలలో విలీనమైన పాత హైదరాబాద్ సంస్థానం ప్రాంతాలలో జరుపుకున్నట్టు హైదరాబాద్లో కూడా సంబురాలు జరిపించాలని డిమాండ్ చేశారు, ఆ పని చేయనందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులను తప్పుపట్టారు. అధికారంలోకి వచ్చాక ఆయన సైతం పాత ముఖ్యమంత్రుల బాటలోనే నడుస్తున్నారు. ఈ మౌనం వెనుక ముస్లింలను దూరం చేసుకోరాదనే విధానం కావచ్చు. పాత గాయాలను రేపడం ఎందుకన్న అభిప్రాయం కావచ్చు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చరిత్రాత్మకమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. సుమారు నాలుగు వేలమంది యోధులు నేలకొరిగారు. జాగీర్దారుల, దేశ్ముఖ్ల దురాగతాలను వ్యతిరేకిస్తూ వారి గూండాలపైనా, రజాకార్లపైనా జరిగిన పోరాటం నిజాం పాలనా వ్యవస్థను కుదిపేసింది. నిజాం దారికి వస్తాడేమోనని నెహ్రూ, పటేల్ పదమూడు మాసాలు వేచి చూశారు. చర్చలతో పరిష్కారం కాకపోతే బలప్రయోగం చేయవలసి ఉంటుం దని నిజాంను నెహ్రూ హెచ్చరించాడు. పటేల్ 36 వేల మంది సైనికులను జనరల్ జెఎన్ చౌధురి నాయకత్వంలో పంపించారు. రజాకార్లు ప్రతిఘటించలేక దాసోహమన్నారు. నిజాం లొంగుబాటు సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయాడు. ఐక్యరాజ్య సమితిలో పెట్టిన కేసు ఉపసంహరించుకున్నట్టు రేడియో ప్రసంగంలో నిజాం చెప్పాడు. అది ఒత్తిడిలో చేసిన ప్రకటన కనుక కేసు ఉపసంహరణను ఆమోదించేది లేదంటూ ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. ఆ కేసు ఇటీవలి వరకూ సమితి పరిశీలనలో ఉంది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 14 లోక్సభ స్థానాలలో పది స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రం మంజూరు చేయలేదు. ఇందుకు ఇందిరాగాంధీ చెన్నారెడ్డికి చూపించిన కారణం ఈ కేసు. అంతకుముందు హైదరాబాద్ను ఆంధ్రలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం వెనుక కూడా ఈ కేసు ఉన్నదని అంటారు. జనరల్ చౌధురి నిర్వహించిన సైనిక చర్యను పోలీసు చర్య అనీ, ఆపరేషన్ పోలో అనీ, ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అనీ పిలిచారు. వాస్తవంగా జరిగింది సైనిక చర్య. కానీ దానిని పోలీసు చర్య (పోలీస్ యాక్షన్)గా అభివర్ణించడంలోని ఆంతర్యం ఐక్యరాజ్యసమితిని చిరాకు పరచకూడదనే. సైనిక చర్య అంటే అది స్వతంత్రం ప్రకటించుకున్న రాజ్యంలో మరో దేశం జోక్యం చేసుకోవడంగా పరిగణించే ప్రమాదం ఉన్నదని భావించి ఉంటారు. సైన్యం నలుమూలల నుంచి హైదరాబాద్ను చుట్టుముట్టిన క్రమంలో హింసాకాండ జరిగిందని వార్తలు వచ్చాయి. నిజనిర్ధారణ కోసం నెహ్రూ పండిట్ సుందర్లాల్ నాయకత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. కాజీ అబ్దుల్ గఫర్, మౌలానా మిస్రీ ఈ కమిటీలో తక్కిన సభ్యులు. ఈ కమిటీ 1948 డిసెంబర్లో మూడు వారాలు హైదరాబాద్ సంస్థానం ప్రాంతంలో పర్యటించి ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక చూసి నిర్ఘాంతపోయిన నెహ్రూ, పటేల్ దానిని రహస్య పత్రంగా పరిగణించి ప్రజలకు అందుబాటులో లేకుండా దాచారు. 2013లో కేంబ్రిడ్జికి చెందిన చరిత్రకారుడు సునీల్ పురుషోత్తమ్, మరో చరిత్రకారుడు మహమ్మద్ సలీయుల్లా పూనిక ఫలితంగా ఈ నివేదిక వెలుగు చూసింది. నాందేడ్, షోలాపూర్ పట్టణాలతో సహా అనేక ప్రాంతాలలో స్థాని కులు పాత కక్షలు తీర్చుకునే క్రమంలో అనేక దాడులు చేశారనీ, కనీసం 27 వేలమంది ఈ దాడులలో మరణించి ఉంటారనీ, వారిలో అత్యధికులు ముస్లింలేననీ సుందర్లాల్ కమిటీ నివేదించింది. ‘మిమ్మల్ని హైదరాబాద్ ఎవరు వెళ్ళమన్నారు?’ అంటూ పటేల్ ఈ కమిటీ సభ్యులలో ఒకరైన గఫర్ను మందలించారట. ఈ విషయాలు బయటికి పొక్కితే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందనే భయంతో నివేదికను రహస్యపత్రంగా పరిగణించి ఉంటారు. బీజేపీ వ్యూహం బీజేపీకి మాత్రం ఈరోజు ఒక ముస్లిం రాజును గద్దె దింపిన రోజు. కనుక సంబరాలు జరుపుకోవలసిన సందర్భం. విమోచన సంబరాలు జరుపుకోవాలని నిరుడు వెంకయ్యనాయుడు కేసీఆర్ను కోరారు. ఆయన సానుకూలంగా స్పందించలేదు. నిజాం పాలనను మెచ్చుకునే కేసీఆర్ ఇలా చేయడంలో ఆశ్చర్యం లేదు. ఆఖరి శ్వాస వరకూ కాంగ్రెస్వాదిగానే కొనసాగిన సర్దార్ పటేల్ను తమ ఆదర్శపురుషుడుగా, అభిమాన నాయకుడిగా చిత్రించడం కోసం ఈ చారిత్రక పరిణామాన్ని వినియోగించుకోవాలన్నది బీజేపీ నాయకుల అభిమతం. రజాకార్ల వారసులే ఎంఐఎం నాయకులని వారి విమర్శ. విమోచన అంటే ముస్లింలు అభ్యంతరం చెబుతారు. అడ్డుకుంటారు. ఫలితంగా హిందువులు సంఘటితం అవుతారన్న ఆలోచన కావచ్చు. విమోచన అంటే ఎంఐఎం ఆగ్రహిస్తుందనీ, విద్రోహం అంటే బీజేపీ కోపగిస్తుందనీ భావించి ఈరోజుని ముఖ్యమైన సందర్భంగా పరిగణించకుండా వదిలేయడం చరిత్రను విస్మరించినట్టు అవుతుంది. తెలంగాణ ప్రజలకు ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ వారికి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లభించింది నిజంగా ఈరోజే. కనుక విలీనదినం వేడుకగా జరుపుకోవడం సమంజసం. అధికారంలో ఉన్న పార్టీలు సంకోచిస్తూ మౌనంగా ఉంటే దీన్ని రాజకీయ ప్రయోజనాలకు విని యోగించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. పటేల్ను ప్రభుత్వాలు స్మరించకపోతే ఆయనను పూర్తిగా సొంతం చేసుకునేందుకు బీజేపీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సెప్టెంబర్ 17ని హైదరాబాద్ విలీనదినంగా జరుపుకోవడానికి సంకోచించనక్కరలేదు. ప్రభుత్వ పూనికతో జరిగే ఈ వేడుకలో టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు పాల్గొనవచ్చు. బీజేపీ, ఎంఐఎం నాయకులూ, కార్యకర్తలూ కాలక్రమంలో రాజీపడి ఈ సంబరాలలో పాల్గొంటారు. చరిత్ర చేసిన గాయాన్ని మాన్పడానికీ, సర్దార్ పటేల్ వారసత్వాన్ని స్మరించుకోవడానికీ తెలంగాణ ప్రజలకు ఇది మంచి అవకాశం. కె. రామచంద్రమూర్తి -
కమల్ హాసన్ రాయని డైరీ
మాధవ్ శింగరాజు పాలిటిక్స్లోకి నేనింకా రాకుండానే పాలిటిక్స్లో నేనేం మాట్లాడినా అది పాయింట్ అవుతోంది! అంటే నాక్కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ కూడా ఉందన్నమాట! ‘‘మీరొస్తారా చెప్పండి, నేనొచ్చేస్తా మీతో..’’ అన్నాను రజనీతో. నేరుగా అనలేదు. ‘హిందూ’ తమిళ దినపత్రిక వాళ్లొస్తే వాళ్లతో అన్నాను. వాళ్లతో కూడా నేరుగా అనలేదు. ‘‘ముందు మీరేం క్వొశ్చన్స్ అడగదలచుకున్నారో ఆ క్వొశ్చన్స్ లిస్ట్ పంపండి. వాటిలో నాకు నచ్చినవి టిక్ పెట్టుకుని వాటికి సమాధానాలు రికార్డ్ చేసి పంపిస్తాను’’ అన్నాను. ‘అప్పుడది ఇంటర్వ్యూ ఎలా అవుతుంది’ అన్నాడట వాళ్ల ఎడిటర్. ‘‘ఇష్టమైతే పంపండి. లేకపోతే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రండి’’ అన్నాను. ‘‘ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టబోతున్నారు?’’ అని అడిగాడు ఆ కుర్రాడు. ‘‘పాలిటిక్స్లోకి వచ్చేముందు’’ అన్నాను. ‘‘ప్రెస్ మీట్ పెట్టి పాలిటిక్స్లో చేరబోతున్నట్లు ప్రకటిస్తారా? పాలిటిక్స్లో చేరాక ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు ప్రకటిస్తారా?’’ అన్నాడు. ‘‘పాలిటిక్స్లో చేరడం ఏంటి? పాలిటిక్స్లోకి రావడం..’’ అన్నాను. తికమక పెట్టి తప్పులు మాట్లాడించేస్తారు ఈ ప్రెస్ వాళ్లు. ‘పాలిటిక్స్లో చేరుతున్నాను’ అంటే డీఎంకేలోనో, సీపీఎంలోనో చేరుతున్నట్లు రాస్తారు. ‘పాలిటిక్స్లోకి వస్తున్నాను’ అంటే ఏ గొడవా ఉండదు. ‘‘అదే సర్, పాలిటిక్స్లోకి వచ్చాక ప్రెస్ మీట్ పెడతారా? ప్రెస్ మీట్ పెట్టి, పాలిటిక్స్లోకి వస్తారా?’’ అని అడిగాడు. ‘‘ఆ సంగతి ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను’’ అన్నాను. ‘‘ఏ సంగతి సార్’’ అన్నాడు! ‘‘అదేనయ్యా.. ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టేదీ, ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను’’ అన్నాను. ఆ కుర్రాడు వదలడం లేదు! ‘‘సార్.. చిన్న డౌటు’’ అన్నాడు. అడగమన్నాను. ‘‘సార్, మీరెందుకు అన్నాడీఎంకేలో చేరకూడదు? ఇప్పుడు పవర్లో ఉంది. మీరొచ్చాక ఇంకా పవర్ఫుల్ అవుతుంది కదా’’ అన్నాడు. ‘‘అన్నాడీఎంకేలో నేనెందుకు చేరాలయ్యా’’ అని అడిగాను. విసుగొస్తోంది నాకు. ‘‘పాలిటిక్స్లో మీరేం మాట్లాడినా అదొక పాయింట్ అవుతోంది సార్. మీరు అన్నట్లే పళనిస్వామి, పన్నీర్సెల్వం ఇద్దరూ కలసి శశికళను పార్టీ నుంచి గెంటేశారు. మీ మాటకు రెస్పెక్ట్ ఇచ్చిన పార్టీలో చేరితే మీకూ రెస్పెక్ట్ ఉంటుందనీ’’ అన్నాడు. ‘‘నేను చేరనయ్యా’’ అన్నాను. ‘‘మరి, సొంత పార్టీ పెడతారా సార్?’’ అని అడిగాడు. ఆ కుర్రాడి పట్టుదలకు ముచ్చటేసింది. పట్టు విడిపించుకోవాలంటే ఇంకొకర్ని పట్టివ్వాలి. వెంటనే రజనీ గుర్తుకొచ్చారు. ‘‘రజనీ సార్ ఎప్పుడొస్తే, నేనూ అప్పుడే ఆయనతోపాటు వచ్చేస్తా’’ అన్నాను. కుర్రాడు కదల్లేదు! ఏంటన్నట్లు చూశాను. ‘‘రజనీసార్ ఎప్పుడొస్తున్నారు సార్?’’ అన్నాడు!!
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement